-
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
-
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించారు. బుధవారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరి తుపాన్ ఇన్నింగ్స్ల ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా కేవలం 9.4 ఓవర్లలో చేధించింది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆజేయంగా నిలిచి సన్రైజర్స్కు రికార్డు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో వీరిద్దరి బ్యాటింగ్కు సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం సైతం ఫిదా అయిపోయాడు. ఎక్స్ వేదికగా ఈ ఓపెనింగ్ జోడీపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఉప్పల్లో ఈ రోజు విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని చూశాం. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే.. తప్పకుండా ‘300’ స్కోరు చూసేవాళ్లమే’’ అని సచిన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ఈ విధ్వంసకర జోడీను ప్రశంసిస్తూ భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్లో హెడ్, అభిషేక్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఎంత చెప్పుకున్న తక్కువే. అదే జోరులో 300 పరుగులైనా ఛేజ్ చేసేవాళ్లు అని ఎక్స్లో మిథాలీ రాసుకొచ్చింది. -
బర్త్డే స్పెషల్.. చిన్నారులతో ఫుట్ బాల్ ఆడిన సచిన్! వీడియో వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఓజా వంటి మాజీ క్రికెటర్లు సచిన్కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్కు ఎక్స్ వేదిగా స్పెషల్ విషెస్ తెలియజేసింది. కాగా సచిన్ తన బర్త్డే సెలబ్రేషన్స్ను సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ టెండ్కూల్కర్ ఫౌండేషన్’లో జరపునకున్నాడు. చాలా సమయం పాటు అక్కడ ఉన్న చిన్నారులతో సచిన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన విషయాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు."ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకోవడం చాల సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సాయంతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో ఫుట్బాల్ ఆడటం, నా స్టోరీలను పంచుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్ అనుకుంటాను. ఈ మూమెంట్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని" తన బర్త్డే వేడుకల సంబంధించిన వీడియో క్లిప్ను సచిన్ ఎక్స్లో షేర్ చేశాడు. Happy birthday paaji! 🎉 From smashing bowlers on the field to smashing life goals, you're the reason I learned to aim higher in life (and sometimes on the field too 🤪) Here's wishing you loads of love, good health and happiness always 🤗❤️@sachin_rt #HappyBirthdaySachin pic.twitter.com/t6qFKgKJmZ— Yuvraj Singh (@YUVSTRONG12) April 24, 2024 -
క్రికెట్ గాడ్ సచిన్కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా?
క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ను 24 ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలి క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి లెజెండ్గా ఎదిగిన సచిన్ రమేశ్ టెండూల్కర్ పుట్టినరోజు ( ఏప్రిల్, 24) ఈ రోజు. ఈ సందర్భంగా ఒక విషయం ఫ్యాన్స్ మధ్య ఆసక్తికరంగా మారింది.ఒక ఇంటర్వ్యూలో మీరు సొంతంచేసుకున్న దాంట్లో దేన్ని మీరు ఉన్నతంగా భావిస్తారు అని అడిగినపుడు సచిన్ సమాధానం తెలుస్తే క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవాల్సిందే. మహ్మద్ అలీ సంతకం చేసిన బాక్సింగ్ గ్లోవ్స్, డైర్ స్ట్రెయిట్స్ మార్క్ నాప్ఫ్లెర్ సంతకం చేసిన గిటార్, సర్ డాన్ బ్రాడ్మాన్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ వీటిల్లో ఏది అపురూపంగా అనిపిస్తుంది అని అడిగినపుడు "నా కోచ్ అచ్రేకర్ సార్ నుండి పొందిన 13 నాణేలు నాకు చాలా ముఖ్యమైన జ్ఞాపకాలు’’ అని సమాధాన మిచ్చాడట సచిన్. ఇంతకీ ఆ నాణేల కథ ఏంటి అంటే.‘క్రికెట్ దేవుడు'గా అవతరించిన సచిన్ టెండూల్కర్ ప్రయాణంలో ఎత్తుపల్లాలుకూడా ఉన్నాయి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రాటుదేలేలా కీలక పాత్ర పోషించిన గురువు రమాకాంత్ అచ్రేకర్. శివాజీ పార్క్ జింఖానా మైదానంలోట్రైనింగ్ సెషన్లో కోచ్ అచ్రేకర్ అద్భుతమైన శిక్షణలో సచిన్ రాటు దేలాడు. ఆయన శిక్షణలో ఉన్నప్పుడు సచిన్ అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా అచ్రేకర్ ఒక ట్రిక్ వాడేవారట. క్రికెట్ స్టంప్ పైన ఒక రూపాయి నాణెం ఉంచేవారట. ఆ నాణెం గెలవాలంటే సచిన్ టెండూల్కర్ను అవుట్ చేయమని బౌలర్లను సవాలు చేశాడు. బౌలర్లు అతనిని అవుట్ చేయడంలో విఫలమైతే, అచ్రేకర్ సచిన్కు నాణెం ఇచ్చేవాడు. అలాగే ఆ నాణెం దక్కించు కోవాలంటే.. అవుట్ కాకుండా ఆడాలని సచిన్కు సవాల్ విసిరే వారట. అలా అటు బౌలర్లకూ ఇటు తనకూ ఇద్దరికీ ప్రేరణగా నిలిచేదనీ, ఇది భవిష్యత్తులో తన ఆటకు చాలా ఉపయోగపడిందని ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు సచిన్.'ద్రోణాచార్య' లేకపోతే నేను లేను2023, జనవరిలో సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా కోచ్ అచ్రేకర్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన్ని 'ద్రోణాచార్య' అభివర్ణించాడు. తనను ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎలా మార్చాడో కూడా పంచుకున్నాడు. ‘‘టెక్నిక్, క్రమశిక్షణ, ముఖ్యంగా ఆటను గౌరవించడం నేర్పించారాయన. నేను ప్రతిరోజూ ఆయన గురించే ఆలోచిస్తాను. ఈ రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా, నా జీవితంలోని ద్రోణాచార్యుడికి వందనం చేస్తున్నాను. ఆయన లేకపోతే. క్రికెటర్గా నేను లేను’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సచిన్.He taught me technique, discipline and most importantly, to respect the game.I think of him every day. Today, on his death anniversary, I salute the Dronacharya of my life. Without him, I wouldn’t have been the same cricketer. pic.twitter.com/JQ8uijHD9Y— Sachin Tendulkar (@sachin_rt) January 2, 2023కాగా సచిన్ టెండూల్కర్కు తొలుత టెన్నిస్పై ఆసక్తి ఉండేది. లెజెండరీ టెన్నిస్ ఆటగాడు జాన్ మెకెన్రోకి పెద్ద ఫ్యాన్ కూడా అయితే, తరువాతి కాలంలో సచిన్ సోదరుడు, అజిత్ టెండూల్కర్ అతనిని క్రికెట్కు పరిచయం చేయడంతో క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు. దీంతో అజిత్ ప్రఖ్యాత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ వద్దకు సచిన్ను తీసుకెళ్లాడు. సచిన్ ఆటతీరు చేసిన అచ్రేకర్ అకాడమీకి ఎంపిక చేశాడు. లేదంటే క్రికెట్ ప్రపంచం, ఒక లెజెండ్ను మిస్ అయ్యేదేమో! -
మోదీపై పోటీకి సచిన్కు కాంగ్రెస్ ఆఫర్?
ఈరోజు (ఏప్రిల్ 24) క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బర్త్డే. ఈయనకు రాజకీయాలతోనూ అనుబంధం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో సచిన్తో ముడిపడిన ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. యూపీలోని వారణాసి స్థానం నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగిన సందర్భంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి అత్యంత ఆదరణ కలిగిన సెలబ్రిటీని రంగంలోకి దించాలని భావించింది. అయితే నాడు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇంతకీ నాటి ఎన్నికల్లో ఏం జరిగింది?మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం 2014 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ వారణాసి అభ్యర్థిగా ఎవరిని నిలపాలనే దానిపై లోతుగా అధ్యయనం చేసింది. ఇందుకోసం పలు దఫాలుగా అనేక సమావేశాలు నిర్వహించింది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్..మోదీకి దీటైన అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను సంప్రదించింది. అయితే సచిన్.. మోదీపై పోటీ చేసేందుకు నిరాకరించారు. సచిన్ అప్పటికే రాజ్యసభకు నామినేటెడ్ సభ్యునిగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా తమ పార్టీ తరపున వారణాసి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సచిన్ను కోరారు. అయితే సచిన్ తాను నాటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ ఆనాటి లోక్సభ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే అజయ్రాజ్ను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీకి నిలిపింది. 2004 లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో కాంగ్రెస్ విజయం సాధించింది. నాడు కాంగ్రెస్కు చెందిన రాజేష్ కుమార్ మిశ్రా రెండు లక్షల ఓట్లతో గెలిచి, పార్లమెంటుకు చేరుకున్నారు. అయితే 2009లో వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థి మిశ్రా నాలుగో స్థానానికి పడిపోయారు. ఆ సమయంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ మూడో స్థానంలో నిలిచారు. -
ముంబై విజయంలో అదే హైలైట్.. సచిన్ ట్వీట్ వైరల్
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ పరాజయాల అనంతరం ముంబై ఇండియన్స్ కోలుకున్న తీరుపై ఆ జట్టు మెంటార్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్లో సమిష్టి రాణించి గెలుపొందిన తీరు అమోఘమని కొనియాడాడు. ఆర్సీబీతో మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడన్న సచిన్.. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడైన షాట్లతో విరుచుకుపడ్డారని ప్రశంసించాడు. ఇక గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బాల్ను హిట్ చేస్తున్న తీరు చూసి ముచ్చటేసిందని ఈ టీమిండియా దిగ్గజం ‘స్కై’ని ఆకాశానికెత్తాడు. 𝘼 𝙎𝙆𝙔 𝙛𝙪𝙡𝙡 𝙤𝙛 s̶t̶a̶r̶s̶ 𝙨𝙞𝙭𝙚𝙨 🤩#MIvRCB #TATAIPL #IPLonJioCinema #IPLinMarathi pic.twitter.com/WUlm5lJPzL — JioCinema (@JioCinema) April 11, 2024 అదే విధంగా ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్సర్ బాది మ్యాచ్ను ముగించడం కన్నుల పండుగ చేసిందని సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ సారథిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు.. ‘‘వరుస ఓటముల తర్వాత.. వరుసగా రెండు విజయాలు.. జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో ఏమాత్రం భయపడకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి గొప్ప ఆరంభం అందించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ గాయం తర్వాత తిరిగి వచ్చి ఈ విధంగా హిట్టింగ్ చేయడం సంతోషాన్నిచ్చింది. హార్దిక్ పాండ్యా మ్యాచ్ను ఫినిష్ చేసిన తీరు అన్నిటికంటే మరింత గొప్పగా అనిపించింది’’ అని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేయగా సోషల్ మీడియలో వైరల్గా మారింది. కాగా వాంఖడే ఆర్సీబీతో మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రధాన పేసర్,‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బుమ్రా(5/21) ఐదు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అయితే, మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించిన నేపథ్యంలో.. పరిస్థితులకు తగ్గట్లుగా ముంబై బ్యాటర్లు బ్యాట్ ఝులిపించారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 34 బంతుల్లోనే 69, రోహిత్ శర్మ 24 బంతుల్లో 38 పరుగులతో దంచికొట్టారు. ఇక వన్డౌన్లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ పవరేంటో చూపించాడు. కేవలం 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు. ఇక హార్దిక్ పాండ్యా కేవలం ఆరు బంతుల్లోనే 21 పరుగులతో అదరగొట్టాడు. స్ట్రైక్రేటు 350గా నమోదు చేసిన ఈ ఆల్రౌండర్ సిక్స్ బాది ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మ 10 బంతుల్లో 16 రన్స్ చేసి పాండ్యాతో కలిసి ఆఖరి వరకు అజేయంగా ఉన్నాడు. A @Jaspritbumrah93 special with the ball backed 🆙 by a power packed batting performance help @mipaltan win ✌ in ✌ 💙 Scorecard ▶️ https://t.co/Xzvt86cbvi#TATAIPL | #MIvRCB pic.twitter.com/ro7TeupAQj — IndianPremierLeague (@IPL) April 11, 2024 ఫలితంగా 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐపీఎల్-2024లో ముంబైకి ఇది రెండో గెలుపు. తొలి మూడు మ్యాచ్లలో ఓడిన పాండ్యా సేన.. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: Jasprit Bumrah: కెనడా క్రికెట్ జట్టులో చేరాలనుకున్న బుమ్రా.. సంచలన విషయం వెల్లడి 𝗜𝗡 comes Hardik Pandya, and 𝗢𝗨𝗧 goes the ball 💫#MIvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/ufHR4tyY2u — JioCinema (@JioCinema) April 11, 2024 Two wins on the trot now for @mipaltan after a tricky start to the tournament. @Jaspritbumrah93 was sensational, once again proving why he's the best in the business. @ImRo45 and @ishankishan51's fearless batting during the powerplay overs effectively reduced the required run… pic.twitter.com/khxtvuEVAJ — Sachin Tendulkar (@sachin_rt) April 11, 2024 -
సచిన్ షాట్ను కాపీ కొట్టిన శుబ్మన్ గిల్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 44 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 2 సిక్స్లతో 72 పరుగులు చేశాడు. అయితే గిల్ తన ఇన్నింగ్స్లో కొట్టిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచాడు. గిల్ తన షాట్తో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను గుర్తు చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్లో నాలుగో బంతిని శుబ్మన్ అద్భుతమైన ఆన్-డ్రైవ్ షాట్ ఆడి సిక్స్గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్ వాట్ఏ షాట్ అంటూ కామెట్లు చేస్తున్నారు. కాగా 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సచిన్ ఈ తరహా షాట్లతో అభిమానులతో అలరించాడు. అనాటి మ్యాచ్లో సచిన్ విధ్వంసం సృష్టించాడు. సచిన్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో ఏకంగా 143 పరుగులు చేశాడు. pic.twitter.com/a5MwVJaChL — Sitaraman (@Sitaraman112971) April 10, 2024 -
'సచిన్, లారా కాదు.. నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ ప్లేయర్ అతడే'
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్లు మూడింట విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. అయితే లక్నో విజయాల వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. అతడే లక్నో హెడ్ కోచ్, ఆసీస్ లెజెండరీ క్రికెటర్ జస్టిన్ లాంగర్. ఈ ఏడాది సీజన్తో లక్నో హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన లాంగర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అయితే లాంగర్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన లైఫ్లో చూసిన అద్బుతమైన క్రికెటర్లు గురించి లాంగర్ చర్చించాడు. "ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన బెస్ట్ ఆటగాడు విరాట్ కోహ్లినే. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు పబ్లిక్గా చెప్పాను. నాకు లెజండరీ క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, అలన్ బోర్డర్, మార్టిన్ క్రోవ్లు అంటే కూడా నాకు ఇష్టం. మార్టిన్ క్రోవ్కు ప్రత్యర్ధిగా కూడా నేను ఆడాను. అదేవిధంగా బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ కూడా గొప్ప ఆటగాళ్లు. కానీ విరాట్ ఎనర్జీ వీరిందరి కంటే అద్భుతం. అతడు చాలా ఫిట్గా ఉన్నాడు. విరాట్ మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడం, ఫీల్డింగ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి అతని ఆట చూడటం నాకు చాలా ఇష్టం. మాతో మ్యాచ్లో కోహ్లిని తొందరగా ఔట్ చేయడం ఔట్ చేయడం చాలా సంతోషంగా అన్పించిందని" లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. -
బుల్లి క్రికెట్ స్టార్ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్తో సచిన్ ఫిదా
క్రికెట్పై అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి మహిళా క్రికెట్పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది. తొమ్మిదేళ్లకే అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది.Always good to see young girls playing cricket. Watching videos like these brings a smile to my face. https://t.co/LaQv9ymWRx— Sachin Tendulkar (@sachin_rt) March 30, 2024 ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్గా రాణించాలని కలలు కంటోంది. కశ్మీర్లోని సోపోర్కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్. సాధారణ డ్రైవర్ కుమార్తె. బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు. యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం తనకు చాలా సంతోషానిస్తోందంటూ టూ ట్వీట్చేశారు. దీంతో మరింత వైరల్ అయింది. పలువురు ఆమె టాటెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా?
సచిన్ టెండుల్కర్.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అరుదైన ఘనతలెన్నో సాధించి క్రికెట్ దేవుడిగా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. నభూతో న భవిష్యతి అన్న రీతిలో అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు సాధించి శిఖరాగ్రాన నిలిచాడు. అయితే, సచిన్ వ్యక్తిగతంగా లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టినా ఒక్కటంటే ఒక్క వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తాను భాగమైన భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంతో సచిన్ టెండుల్కర్ చిరకాల కల నెరవేరింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్ టెండుల్కర్ అప్పట్లో తనలో స్ఫూర్తిని నింపాడంటూ తాజాగా గుర్తుచేసుకున్నాడు.. నాటి అరంగేట్ర, ‘యువ’ బౌలర్. ‘‘ఆరోజు మేము వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. వికెట్ ఫ్లాట్గా ఉంది. వెస్టిండీస్ స్కోరు అప్పటి బహుశా 500/4 అనుకుంటా. నాలో.. వికెట్ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిపోతోంది. అప్పటికి నా వయసు 21 ఏళ్లు. ఇరవై ఒక్క ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోవడం అదే మొదటిసారి. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ మిడాఫ్లో తన ఫీల్డింగ్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు. నన్ను చూసి... ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘పాజజీ.. నా బౌలింగ్లో ఇప్పటివరకు 21 ఓవర్లు అయినా వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా?.. అలాంటిది అరంగేట్రంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని వాపోయాను. అప్పుడు వెంటనే.. ఓవర్ మధ్యలోనే.. నన్ను తన దగ్గరికి రమ్మని పిలిచి.. ‘నీకు తెలుసా.. నేను తొలి వరల్డ్కప్ అందుకోవడానికి 22 ఏళ్ల పాటు ఎదురుచూశాను. మరి నువ్వు నీ తొలి వికెట్ కోసం కనీసం 21 ఓవర్లపాటు వెయిట్ చేయలేవా? అంతగా నిరాశపడొద్దు. గతంలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఏం చేయగలవో ఆలోచించు’ అన్నాడు. అవును.. కదా పాజీ చెప్పింది నిజమే కదా అనిపించింది. ఆ మరుసటి బంతికే నేను డారెన్ బ్రావో(166)ను అవుట్ చేసి తొలి వికెట్ అందుకున్నా. ఆ తర్వాత కార్ల్టన్, డారెన్ సామీ వికెట్లు తీశాను. నా అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. బీసీసీఐ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకుంటూ.. మన ఆలోచనా విధానాన్ని, అంతకు ముందున్న పరిస్థితులను మార్చడానికి ఒక్క మాట చాలని తనకు ఆరోజు తెలిసిందన్నాడు. సచిన్ టెండుల్కర్ చెప్పిన ఆ స్పూర్తిదాయక మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ పేరు చెప్పలేదు కదూ! వరుణ్ ఆరోన్.. జంషెడ్పూర్కు చెందిన 34 ఏళ్ల రైటార్మ్ పేసర్. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే.. -
ధోని, సచిన్ ఒకేలా.. నేను హెడ్కోచ్గా ఉన్నపుడు: భారత మాజీ స్పిన్నర్
‘‘ఐపీఎల్లో నేను ఎంఎస్ ధోనితో కలిసి ఎన్నడూ ఆడలేదు. అయితే, టీమిండియాలో ఉన్నపుడు మాత్రం మేము సహచర ఆటగాళ్లం. సెలబ్రేషన్స్ సమయంలో నన్ను ఎత్తుకోగల ఆటగాళ్లలో ధోని ముందు వరుసలో ఉండే వాడు. ఎంత బరువైనా సరే అతడు అలవోకగా ఎత్తగలడు. ఇక నేను హెడ్కోచ్గా ఉన్నపుడు ధోని కెప్టెన్గా ఉండేవాడు. ఓసారి మేము వన్డే మ్యాచ్ కోసం రాంచికి వెళ్లాము. అక్కడ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యాను. నిజానికి రాంచి అతడి స్వస్థలం. ఆప్షనల్ ప్రాక్టీస్కు రాకుండా తను ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ.. అతడు గ్రౌండ్కు వచ్చేశాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించి.. ‘ఇక్కడేం చేస్తున్నావు? తదుపరి మ్యాచ్కు మనకు ఇంకా రెండ్రోజుల సమయం ఉంది. ఎందుకు వచ్చావు?’ అని అడిగాను. అందుకు బదులుగా.. ‘లేదు.. లేదు.. నేను తప్పకుండా ఇక్కడ ఉండాల్సిందే’ అని ధోని జవాబు ఇచ్చాడు. సచిన్ కూడా అచ్చం ఇలాగే! నేను ముంబై ఇండియన్స్తో ఉన్నపుడు.. సచిన్ కూడా ఆన్షనల్ ప్రాక్టీస్ సెషన్ సమయంలో సచినే ముందు బస్సెక్కడం గమనించా. 25 నుంచి 26 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న సమయంలోనూ అదే అంకితభావం. ఈ విషయంలో వీరిద్దరూ వాళ్లకు వాళ్లే సాటి. వాళ్లకు బ్రేక్ అవసరం లేదనుకుంటారు. ఇంకొన్ని ఏళ్లపాటు ఎంఎస్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్లో ఆటగాడిగా కొనసాగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆట పట్ల అతడికి ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే ఎప్పుడూ జట్టుకు అందుబాటులో ఉండాలనే ఆలోచిస్తూ ఉంటాడు’’ అని టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నడుమ.. కుంబ్లే జియో సినిమా షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ విషయంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, ధోని ఆలోచనలు, అంకితభావం ఒకే విధంగా ఉంటాయని వారితో తనకున్న అనుభవాలు పంచుకున్నాడు. ధోనికి ఐపీఎల్-2024 చివరి సీజన్ కాబోదని.. మరికొన్నేళ్లపాటు అతడికి లీగ్లో కొనసాగే సత్తా ఉందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పట్లో అలసిపోడంటూ 42 ఏళ్ల ధోనిని ఉద్దేశించి ప్రశంసలు కురిపించాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం కానుంది. సీఎస్కే- ఆర్సీబీ మధ్య చెపాక్లో తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: అతడితో పోలికా?.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్ -
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు.. సచిన్ రికార్డు బద్దలు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభం నుంచి అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్.. ఇప్పుడు ఫైనల్లో కూడా అదరగొట్టాడు. వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 6 పరుగులు చేసి నిరాశపరిచిన ముషీర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం శతకంతో మెరిశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. ముషీర్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్స్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ముంబై ఆటగాడిగా ముషీర్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల 14 రోజుల వయస్సులో ముషీర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1994-95 రంజీ సీజన్ ఫైనల్లో 21 ఏళ్ల 11 నెలల వయసులో సచిన్ సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్తో 29 ఏళ్ల సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్ లో నుంచి వీక్షిస్తున్న సమయంలోనే ముషీర్ ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు వాంఖడేకు వెళ్లారు. ఇక ఈ ఏడాది సీజన్లో కేవలం మూడు మ్యాచ్లు ఆడిన ముషీర్.. 108.25 సగటుతో 433 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్బ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. -
మరిచిపోలేని క్షణాలు.. సచిన్ ఎమోషనల్ పోస్ట్! ఎవరీ జసింత?
International Women’s Day: గత కొన్నేళ్లుగా క్రీడా రంగంలో మహిళల ప్రాతినిథ్యం పెరగడం హర్షణీయమని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ అన్నాడు. వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే క్రీడలకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ రాణించగలరని పేర్కొన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తన కెరీర్లోని ప్రత్యేక క్షణాలను పంచుకుంటూ సచిన్ టెండుల్కర్ ఈ మేరకు ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశాడు. ‘‘గడిచిన కొన్నేళ్లలో భారత్, ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది. 2008లో.. 26/11 (ముంబై పేలుళ్ల) ఘటన తర్వాత ఇంగ్లండ్తో మ్యాచ్లో ఇండియా గెలిచింది. జాతి మొత్తానికి అదో భావోద్వేగపూరిత సందర్భం. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ మెంబర్స్లో ఒకరైన మహిళ నా దగ్గరకు వచ్చి అందరి తరపునా శుభాకాంక్షలు తెలిపి.. తన ఆనందాన్ని పంచుకున్నారు. నా జీవితంలో అదొక మరుపురాని అనుభూతి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 2024లో.. జసింత కళ్యాణ్ ఇండియాలో మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్గా అవతరించారు. ఆమె ఒక అడుగు ముందుకు వేశారు. భవిష్యత్తులో మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అడ్డంకులు అధిగమించి.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఇలాంటి రోల్ మోడల్స్ను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ప్రశంసించుకుందాం’’ అని సచిన్ టెండుల్కర్ వుమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. ఎవరీ జసింత కళ్యాణ్? కర్ణాటకకు చెందిన జసింత బెంగళూరులోని హరొబెల్ అనే గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి రైతు. ఇక చిన్నతనం నుంచే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడ్డ జసింత.. ఉపాధి కోసం బెంగళూరులో అడుగుపెట్టారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లో రిసెప్షనిస్ట్గా చేరి.. అనంతరం అడ్మినిస్ట్రేటర్గా విధులు నిర్వర్తించే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆట కంటే పిచ్పైనే ఎక్కువగా దృష్టి సారించిన జిసింత అభిరుచిని గమనించిన అసోసియేషన్ కార్యదర్శి బ్రిజేష్.. స్టేడియంలో పనిచేసే మాలీలపై బాస్గా బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలో పిచ్ క్యూరేటర్ ప్రశాంత్రావు జసింత ఆసక్తిని గమనించి పిచ్ తయారీలో మెళకువలు నేర్పాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి అనుభవం గడించిన జసింత.. భారత దేశంలోనే మొదటి మహిళా క్యూరేటర్గా పేరు తెచ్చుకున్నారు. మహిళా ప్రీమియర్ లీగ్లో భాగంగా బెంగళూరు పిచ్ల తయారీని ఆమె పర్యవేక్షిస్తున్నారు. Over the years, the rise of women in sport, in India and across the world, has been very encouraging. In 2008, in the aftermath of 26/11, India won the match against England, and it was an emotional moment for the entire nation. One of the first people with whom I was able to… pic.twitter.com/lw0lbRT5hy — Sachin Tendulkar (@sachin_rt) March 8, 2024 -
Ind vs Eng: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్
Ind vs Eng 5th Test- Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పరుగుల వరద పారిస్తున్నాడు. సొంతగడ్డపై ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్.. ధర్మశాలలో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ తనదైన షాట్లతో అలరిస్తున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ బ్యాట్తో వీరవిహారం చేస్తున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో తాజా టెస్టులో.. భారత ఇన్నింగ్స్లో తొమ్మిదవ ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ మూడు సిక్స్లు కొట్టాడు. తద్వారా ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్గా జైస్వాల్ అవతరించాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టి గతంలో సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద 25 సిక్సులు కొట్టగా.. జైస్వాల్ తాజాగా ఇంగ్లండ్పై 26వ సిక్సర్ను బాది.. అతడిని అధిగమించాడు. ఇక సచిన్కు ఇందుకోసం 74 ఇన్నింగ్స్ అవసరం కాగా.. జైస్వాల్ కేవలం 9 ఇన్నింగ్స్లోనే ఈ సిక్సర్ల రికార్డు క్రియేట్ చేయడం విశేషం. కాగా ధర్మశాల మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. షోయబ్ బషీర్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్లు 26* - యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్ మీద(9 ఇన్నింగ్స్) 25- సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద(74 ఇన్నింగ్స్) 22- రోహిత్ శర్మ సౌతాఫ్రికా మీద(20 ఇన్నింగ్స్) 21- కపిల్ దేవ్ ఇంగ్లండ్ మీద(39 ఇన్నింగ్స్) 21- రిషభ్ పంత్ ఇంగ్లండ్ మీద (21 ఇన్నింగ్స్). Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
Viral Video: అక్షయ్ కుమార్ బౌలింగ్లో సిక్సర్ బాదిన సచిన్ టెండూల్కర్
లోకల్ టాలెంట్ను వెలికి తీసి సాన పెట్టడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ (ఐఎస్పీఎల్) ఇవాళ (మార్చి 6) ప్రారంభమైంది. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. ఈ జట్లను టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. Sachin & Raina in the frame in ISPL. - The iconic duo of 2011 World Cup. pic.twitter.com/bArjQcB0a4 — Johns. (@CricCrazyJohns) March 6, 2024 మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. .@sachin_rt x @AlwaysRamCharan ft. Naatu Naatu.pic.twitter.com/2OeKsz0HcN — CricTracker (@Cricketracker) March 6, 2024 ఐఎస్పీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్, సూర్య, అక్షయ్ కుమార్లతో కలిసి హైదరాబాద్ జట్టు ఓనర్ రామ్చరణ్ సందడి చేశారు.చెర్రీ వీరందరితో ట్రిపుల్ ఆర్ ఫేమ్ నాటు నాటు పాటకు స్టెప్పులేయించాడు. Sachin Tendulkar in action. 😍pic.twitter.com/a4cZsm2qof — Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024 Suriya in action! 🔥 pic.twitter.com/OB9kj4IiZ6 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024 అనంతరం సచిన్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో సచిన్.. అమిర్ హుసేన్ అనే దివ్యాంగ క్రికెటర్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అక్షయ్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే సచిన్ భారీ సిక్సర్ బాదాడు. Kareena Kapoor and Saif Ali Khan at the ISPL inauguration. pic.twitter.com/BuH2koP5zo — Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024 దీనికి సంబంధించిన వీడయో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, ఈ ప్రాకీస్ మ్యాచ్ అనంతరం లీగ్ తొలి మ్యాచ్ మొదలైంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో అమితాబ్ జట్టు మఝీ ముంబై.. అక్షయ్ కుమార్ జట్టైన శ్రీనగర్ వీర్తో తలపడుతుంది. Suriya hugging Sachin Tendulkar. - A beautiful moment in ISPL. pic.twitter.com/U5b8ThihXb — Johns. (@CricCrazyJohns) March 6, 2024 SACHIN TENDULKAR LEAD TEAM WON THE ISPL FRIENDLY MATCH.....!!! 👌 pic.twitter.com/JZLtOHfIyr — Johns. (@CricCrazyJohns) March 6, 2024 -
ఇషాన్, శ్రేయస్ల కాంట్రాక్ట్ రద్దు: సచిన్ రియాక్షన్ వైరల్
దేశవాళీ క్రికెట్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ల్క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ముంబై తరఫున ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూసే వాడినని సచిన్ టెండుల్కర్ గుర్తు చేసుకున్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్(ఫస్ట్క్లాస్) ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ఇబ్బందిపడే వారు మినహా ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువ ఆటగాళ్లు రంజీ బరిలో దిగాల్సిందేనని బోర్డు ఆటగాళ్లకు ఆదేశాలిచ్చింది. హెడ్కోచ్, కెప్టెన్, సెలక్టర్లు చెప్పినపుడు ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023-24 ఏడాదికిగానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులలో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్లకు మొండిచేయి చూపింది. రంజీ బరిలో దిగాలన్న కోచ్ ఆదేశాలను పెడచెవిన పెట్టారనే కారణంతో వారిద్దరిపై వేటు పడినట్లు తెలిసింది. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా రంజీ ట్రోఫీ ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘తాజా రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముంబై జట్టు పడిలేచిన కెరటంలా ఫైనల్కు దూసుకువచ్చింది. మరో సెమీస్ మ్యాచ్లో చివరి రోజు వరకు ఆట కొనసాగుతున్న వైనం ముచ్చటగా ఉంది. ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ విజయానికి 90కి పైగా పరుగులు, విదర్భకు నాలుగు వికెట్లు కావాలి. నిజానికి నా కెరీర్ ఆసాంతం ఎప్పుడు ముంబైకి ఆడే అవకాశం వచ్చినా కచ్చితంగా బరిలో దిగే వాడిని. అక్కడి డ్రెస్సింగ్ రూంలో దాదాపు 7-8 మంది టీమిండియా ఆటగాళ్లు ఉండేవారు. వారితో కలిసి అక్కడ రూం షేర్ చేసుకోవడం మరింత సరదాగా ఉండేది. టీమిండియా తరఫున టాప్ ప్లేయర్లుగా ఉన్నవాళ్లు దేశవాళీ క్రికెట్లో వారి వారి జట్లకు ఆడితే ఆదరణ పెరుగుతుంది. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అంతేకాదు ఫామ్లేమితో ఇబ్బంది పడేవాళ్లు తిరిగి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పొరపాట్లను సరిచేసుకునే అవకాశం దొరుకుతుంది. స్టార్ క్రికెటర్లు డొమెస్టిక్ టోర్నీల్లో ఆడితే క్రమక్రమంగా అభిమానులు కూడా దేశవాళీ జట్లకు మద్దతుగా నిలుస్తారు. నిజంగా దేశవాళీ క్రికెట్కు కూడా బీసీసీఐ సమాన ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. కాగా సచిన్ టెండుల్కర్ మంగళవారం ఈ మేరకు పోస్ట్ చేయగా.. బుధవారం నాటి ఆటలో భాగంగా రంజీ సెమీస్లో మధ్యప్రదేశ్పై విదర్భ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. The Ranji Trophy semi-finals have been riveting! @MumbaiCricAssoc’s march into the finals was aided by a brilliant batting recovery, while the other semi-final hangs in the balance going into the last day - Madhya Pradesh need 90+ runs to win, Vidarbha need 4 wickets.… — Sachin Tendulkar (@sachin_rt) March 5, 2024 -
LBW అంటూ సచిన్ విషెస్.. ముద్ద మందారంలా సారా
కాబోయే వధూవరులు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్లకు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. అందమైన జంట విషయంలో 'LBW' అంటే వేరే అర్థం ఉందంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. కాగా భారత కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికను పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంబానీల స్వస్థలం గుజరాత్లోని జామ్నగర్లో ముందుస్తు పెళ్లి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మార్చి 1-3 వరకు మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వ్యాపార దిగ్గజాలు సహా సినీ, క్రీడా ప్రముఖులంతా విచ్చేశారు. సచిన్ టెండుల్కర్ సైతం సతీమణి అంజలి, కుమార్తె సారాతో కలిసి ఈ సెలబ్రేషన్స్లో పాలు పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ‘‘అనంత్, రాధిక విషయంలో ‘LBW’ అంటే ప్రేమ(Love), ఆశీర్వాదాలు(Blessings), అభినందనలు(Wishes). అందమైన జంటకు శుభాకాంక్షలు’’ అని సచిన్ టెండుల్కర్ కాబోయే జంట ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి విషెస్ తెలిపాడు. అన్నట్లు క్రికెట్ పరిభాషలో.. LBW అంటే లెగ్ బిఫోర్ వికెట్. బ్యాటర్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బౌలర్ సంధించే బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ల ముందే అతడికి దొరికి పోయి పెవిలియన్ చేరాల్సిందే! స్పెషల్ అట్రాక్షన్గా సారా అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ముఖ్యంగా ఎరుపు వర్ణం లెహంగాలో ముద్ద మందారంలా చక్కగా కనిపించింది. ఆ ఫొటోలను సారా ఇన్స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! The 'LBW' here stands for Love, Blessings, and Wishes for Anant and Radhika! Best wishes to the beautiful couple. pic.twitter.com/L14RvNefXH — Sachin Tendulkar (@sachin_rt) March 4, 2024 -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు తరలివస్తున్న స్టార్ క్రికెటర్లు
వ్యాపార దిగ్గజం, రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్కు అన్ని రంగాలకు చెందిన సెలబ్రిటీలు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. ఇవాల్టి నుంచి (మార్చి 1) మూడు రోజుల పాటు జరిగే ఈ ముందస్తు పెళ్లి వేడకల్లో సినీ, క్రీడారంగాలకు చెందిన స్టార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరిలో మరి ముఖ్యంగా క్రికెటర్లు హైలైట్ కానున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) MS Dhoni on his way to attend Anant Ambani and Radhika Merchant pre-wedding. - The evergreen Thala...!!! 😍🔥 pic.twitter.com/33siMgvZd0 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 అంబానీ గ్రూప్ అధినేతకు క్రికెట్ సంబంధిత వ్యాపారాల్లో నేరుగా పెట్టుబడులు ఉండటంతో దేశ విదేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు ఈ ఈవెంట్కు హాజరవుతున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని సతీసమేతంగా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ప్రస్తుత టీమిండియా సభ్యులు రోహిత్ శర్మ, పాండ్యా బ్రదర్స్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఈ వేడుకల్లో పాల్గొనేందుకు స్వస్థలాల నుంచి బయల్దేరారు. మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, విదేశీ ఆటగాళ్లు డ్వేన్ బ్రేవో, ట్రెంట్ బౌల్ట్, సామ్ కర్రన్, రషీద్ ఖాన్, పూరన్ ఇదివరకే వేడుక జరుగనున్న జామ్ నగర్కు చేరుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు 1000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు సమాచారం. Rohit Sharma on his way to attend the Pre-wedding of Anant Ambani. [Manav Manglani Instagram] pic.twitter.com/jwUMfMPGVd — Johns. (@CricCrazyJohns) March 1, 2024 Cricketers attending the Pre-wedding of Anand Ambani: Sachin, Dhoni, Rohit, Zaheer, Bravo, Hardik, Ishan, Surya, Krunal, Rashid, Sam Curran, Graeme Smith. pic.twitter.com/lUOVIrRhgW — Johns. (@CricCrazyJohns) March 1, 2024 Ishan Kishan has left for Anant and Radhika pre-wedding in Jamnagar. pic.twitter.com/4yhSRLvmdT — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 Dwayne Bravo, Ishan Kishan, and Nicholas Pooran strike a pose in Mumbai ahead of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. 📸: Dwayne Bravo pic.twitter.com/SWmY6aDn6u — CricTracker (@Cricketracker) March 1, 2024 -
Sara Tendulkar Photos: మచ్చలేని అందం సారా.. సంగీత్కు రెడీ అంటున్న సచిన్ తనయ (ఫొటోలు)
-
మాట నిలబెట్టుకున్న సచిన్..!
-
రియల్ హీరోకు సచిన్ బహుమతి.. ఎమోషనల్ వీడియో వైరల్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. భూతల స్వర్గంలో గల్లీ క్రికెట్ ఆడుతూ, జవాన్లను పలకరిస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నాడు. Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV — Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024 కుటుంబంతో కలిసి కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండుల్కర్ తాజాగా షేర్ చేసిన వీడియో అభిమానుల హృదయాలను తాకింది. ఇంతకీ అందులో ఏముంది?!... జమ్మూ కశ్మీర్కు చెందిన అమిర్ హుసేన్ లోనీ అనే దివ్యాంగ క్రికెటర్ పేరు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న అమిర్.. దురదృష్టవశాత్తూ ఎనిమిదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ ధైర్యం కూడదీసుకుని.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను దాటుకుంటూ.. రాష్ట్ర పారా క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎదిగాడు. రెండు చేతులు లేకున్నా తన మెడ భాగం, భుజం మధ్య బ్యాట్ పెట్టకుని క్రికెట్ ఆడే అమిర్.. కాళ్లతో బౌలింగ్ చేయగలడు. And Amir has made the impossible possible. I am so touched watching this! Shows how much love and dedication he has for the game. Hope I get to meet him one day and get a jersey with his name. Well done for inspiring millions who are passionate about playing the sport. https://t.co/s5avOPXwYT — Sachin Tendulkar (@sachin_rt) January 12, 2024 ఈ క్రమంలో అమిర్ హుసేన్ గురించి తెలుసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ఆట పట్ల అతడి అంకిత భావానికి ఫిదా అయ్యాడు. అమిర్ను కలిసే అవకాశం వస్తే.. అతడి పేరుతో ఉన్న జెర్సీని అడిగి మరీ బహుమతిగా అందుకుంటానని సచిన్ పేర్కొన్నాడు. తాజాగా తన పర్యటనలో భాగంగా అమిర్ హుసేన్ను కలిశాడు సచిన్. తన సంతకంతో కూడిన బ్యాట్ను అతడికి గిఫ్టుగా ఇచ్చాడు. అంతేకాదు.. అమిర్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో అడిగి మరీ మెళకువలు నేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. ‘‘అమిర్ నిజమైన హీరో.. నువ్విలాగే ఎల్లప్పుడూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నిన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని సచిన్ టెండుల్కర్ క్యాప్షన్ జతచేశాడు. ఈ నేపథ్యంలో అమిర్ హుసేన్తో పాటు అతడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న సచిన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి! To Amir, the real hero. Keep inspiring! It was a pleasure meeting you. pic.twitter.com/oouk55lDkw — Sachin Tendulkar (@sachin_rt) February 24, 2024 -
Sachin Tendulkar: సచిన్ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా. . వీడియో వైరల్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కోసం విమానమే మినీ స్టేడియంలా మారిపోయింది. ఫ్లైట్లో క్రికెట్ గాడ్ను చూడగానే అభిమానులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. సచిన్ నామస్మరణతో విమానంలో కేరింతలు కొట్టారు. దిగ్గజ ఆటగాడు సామాన్యుడిలా ఎకానమీ క్లాస్లో ప్రయాణించడం చూసి అతడి నిరాడంబరతకు ఫిదా అయ్యారు. సచిన్ టెండుల్కర్ సైతం తనను విష్ చేసిన వారికి నమస్కరిస్తూ హుందాతనాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం ట్రావెల్ మూడ్లో ఉన్నాడు. కుటుంబంతో కలిసి కశ్మీర్ సందర్శనకు వెళ్లినట్లు ఆయన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘భూతల స్వర్గం కశ్మీర్’’ అంటూ విమానం నుంచి కశ్మీర్ అందాలు వీక్షిస్తున్న వీడియోను సచిన్ పంచుకున్నాడు. కాగా భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న క్రికెటర్ సచిన్ టెండుల్కర్. అంతర్జాతీయ క్రికెట్లో శతకాల సెంచరీ కొట్టిన ఏకైక బ్యాటర్గా రికార్డు సాధించిన టెండుల్కర్.. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మరెన్నో ఘనతలు సాధించాడు. టీమిండియా తరఫున మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 664 మ్యాచ్లు ఆడి.. 34, 357 పరుగులు సాధించాడు. ఇందులో 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే శతకాలు ఉన్నాయి. ఇలాంటి అరుదైన ఘనతలు సాధించి ఆధునిక తరం క్రికెటర్లలో ఎవరూ కూడా తనను అందుకోలేనంత ఎత్తులో నిలిచి క్రికెట్గాడ్గా పేరొందాడు సచిన్. ఇక సచిన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అతడి కుమారుడు అర్జున్.. ఆల్రౌండర్గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లి 50వ శతకం నమోదు చేసి సచిన్ వన్డే సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. The closest thing to heaven on earth is Kashmir. 🏔️ pic.twitter.com/kSsNEQxxW1 — Sachin Tendulkar (@sachin_rt) February 20, 2024 ‘Sachin Sachin’ Chant in the Flight 😍 pic.twitter.com/AltxQVhvLH — Cricketopia (@CricketopiaCom) February 20, 2024 -
Virat Kohli: ఇక ఇండియా హాయిగా నిద్రపోతుంది!
Virat Kohli And Anushka Sharma Son Akaay: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు వచ్చాడు. తమ గారాలపట్టి వామికకు చిట్టి తమ్ముడినిచ్చింది విరుష్క జంట. ఈ నేపథ్యంలో క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘అకాయ్.. మీ అందమైన కుటుంబంలో అడుగుపెట్టిన అత్యంత విలువైన వ్యక్తి. శుభాకాంక్షలు విరాట్, అనుష్క. ప్రకాశించే చంద్రుడన్న అర్థం గల తన పేరు లాగే అతడు.. మీ ప్రపంచాన్ని సంతోషం, అందమైన జ్ఞాపకాలతో నింపేయాలి. లిటిల్ చాంప్.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం’’ అని విరుష్కను విష్ చేశాడు. ఇండియా హాయిగా నిద్రపోతుంది ఇక కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇప్పుడు నలుగురు సభ్యులు.. అనుష్క, విరాట్లకు కంగ్రాట్స్. ఆర్సీబీ కుటుంబంలోకి అకాయ్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అత్యంత సంతోషకరమైన వార్త ఇది. ఈరోజు ఇండియా మొత్తం హాయిగా నిద్రపోతుంది’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. అదే విధంగా ముంబై ఇండియన్స్ సహా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ తదితరులు విరుష్కను విష్ చేశారు. ఫిబ్రవరి 15న జననం కాగా గత గురువారమే తన భార్య అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు, కుమారుడికి ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు కోహ్లి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘ఫిబ్రవరి 15న మా జీవితాల్లోకి వామిక సోదరుడు అకాయ్ వచ్చాడు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాం. ఈ ఆనందకర క్షణాల్లో మీ దీవెనలు మాకు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించండి’ అని కోహ్లి విజ్ఞప్తి చేశాడు. కోహ్లి, అనుష్కకు 2017 డిసెంబర్లో వివాహం కాగా... 2021 జనవరిలో కూతురు వామిక పుట్టింది. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, సిరీస్కు దూరంగా ఉండటానికి గల అసలు కారణం వెల్లడికాకపోవడంతో విరాట్ తల్లికి అనారోగ్యం, అనుష్క ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు అంటూ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఈమేరకు ట్వీట్ చేయడం గమనార్హం. చదవండి: Shoaib Malik’s 3rd wife: షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం Congratulations to Virat and Anushka on the arrival of Akaay, a precious addition to your beautiful family! Just like his name lights up the room, may he fill your world with endless joy and laughter. Here's to the adventures and memories you'll cherish forever. Welcome to the… https://t.co/kjuoUtQ5WB — Sachin Tendulkar (@sachin_rt) February 20, 2024 ❤️ pic.twitter.com/BgpfycayI4 — Virat Kohli (@imVkohli) February 20, 2024 -
సంచలన శతకం.. సచిన్ రికార్డు బ్రేక్.. కానీ!
శ్రీలంకతో వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో అఫ్గనిస్తాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆతిథ్య లంక విధించిన 382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. 55 పరుగులకే అఫ్గన్ ఐదు వికెట్లు కోల్పోయిన వేళ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఒంటరి పోరాటం చేస్తున్న ఐదో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(149- నాటౌట్)కు తోడైన నబీ.. తన వన్డే కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. 130 బంతులు ఎదుర్కొన్న అతడు 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు సాధించాడు. ఒమర్జాయ్తో కలిసి అరుదైన రికార్డు ఈ క్రమంలో ఒమర్జాయ్తో కలిసి అరుదైన ఘనత సాధించిన నబీ.. తన అద్భుత శతకంతో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డునూ బద్దలు కొట్టాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్లో అజ్మతుల్లా ఒమర్జాయ్- మహ్మద్ నబీ కలిసి 242 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అఫ్గనిస్తాన్ తరఫున ఆరో వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. సచిన్కు ఎంతో ప్రత్యేకం ఆ సెంచరీ ఇక మహ్మద్ నబీ 39 ఏళ్ల 39 రోజుల వయసులో ఈ వన్డే సెంచరీ సాధించాడు. తద్వారా.. అత్యధిక వయసులో వన్డేల్లో శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో సచిన్ను అధిగమించాడు. 2012లో బంగ్లాదేశ్తో మిర్పూర్ వన్డేలో.. 38 ఏళ్ల 327 రోజుల వయసులో సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. అతడి అంతర్జాతీయ కెరీర్లో అదే వందో శతకం కావడం విశేషం. జాబితాలో ముందున్నది వీళ్లే ఇదిలా ఉంటే.. అత్యధిక వయసులో వన్డే శతకం సాధించిన జాబితాలో ఖుర్రం ఖాన్(132 రన్స్- యూఏఈ- 43 ఏళ్ల 162 రోజులు), సనత్ జయసూర్య(107 రన్స్- శ్రీలంక- 39 ఏళ్ల 212 రోజులు), క్రిస్ గేల్(162 రన్స్- 39 ఏళ్ల 159 రోజులు), ఎడ్ జోయిస్(116 రన్స్- 39 ఏళ్ల 111 రోజులు), జెఫ్రీ బాయ్కాట్(105- రన్స్- 39 ఏళ్ల 51 రోజులు) నబీ కంటే ముందున్నారు. కాగా శ్రీలంకతో తొలి వన్డేలో ఒమర్జాయ్, నబీ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 42 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. -
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న విలియమ్సన్.. పలు రికార్డులు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో టాప్ రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కేన్.. తాజాగా మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు (118, 109) చేసిన కేన్.. ఈ ఘనత (ట్విన్ సెంచరీలు) సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. సెకెండ్ ఇన్నింగ్స్ సెంచరీతో టెస్ట్ సెంచరీల సంఖ్యను 31కి పెంచుకున్న కేన్.. అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో కలిపి 44 సెంచరీలు) చేసిన యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (80 సెంచరీలు) టాప్లో ఉండగా.. డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. కేన్ (44).. స్మిత్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. తాజా సెంచరీతో కేన్ మరో రికార్డు కూడా సాధించాడు. టెస్ట్ల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు (170 ఇన్నింగ్స్ల్లో) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో (165 ఇన్నింగ్స్ల్లో) ఉండగా.. స్టీవ్ స్మిత్, విలియమ్సన్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. కేన్ గత 10 ఇన్నింగ్స్ల్లో స్కోర్లు ఇలా ఉన్నాయి. 132, 1, 121*, 215, 104, 11, 13, 11, 118, 109. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్ల్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్లో న్యూజిలాండ్ గెలుపు దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ప్రత్యర్ధి సౌతాఫ్రికా గెలవలేదు. కేన్ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి న్యూజిలాండ్ గెలుపుకు పునాది వేయగా.. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (240) చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 511 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది. భారీ లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
Advertisement