దూసుకొచ్చిన మృత్యువు
● కారు ఢీకొని ఇద్దరి మృతి
● రాపూరులో విషాదం
రాపూరు: కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. ఈ ఘటన రాపూరులో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. రాపూరుకు చెందిన గంధం సరస్వతమ్మ (46) సోమవారం తమ తోట వద్ద వదిలిపెట్టాలని గార్లపాటి సురేష్ (26)ను కోరింది. దీంతో ఇద్దరూ మోటార్బైక్పై తోట వద్దకు వెళ్లారు. అక్కడ బైక్ దిగుతుండగా కారు వేగంగా వచ్చి వెనుక నుంచి వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో పారిపోతుండగా స్థానికులు పట్టుకుని అప్పగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. వారిని రాజంపేట విద్యానగర్కు చెందిన రామచంద్ర, మల్లికార్జునగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకట్రాజేష్ తెలిపారు.
దూసుకొచ్చిన మృత్యువు


