SPSR Nellore District News
-
వీఎస్యూలో అంతర్జాతీయ సదస్సు
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో బ్లూ రెవల్యూషన్ ఇన్నోవేషన్స్ ఇన్ మైరెన్ సిస్టమ్స్ (బీఆర్ఐఎంఎస్ – 2025) అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్లూ ఎకానమీ అభివృద్ధికి దోహదం చేసే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సముద్ర పరిశోధన, మత్స్య పరిశ్రమ, బ్లూ ఎకానమీ అభివృద్ధిలో విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం అవసరమని తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఇన్ బ్లూ ఎకానమీ, ఎక్స్పర్టైజ్ ఫ్రాన్స్ ప్రొఫెసర్ మానెల్ జఖారియా, ఎన్ఐఓటీ సభ్యుడు డాక్టర్ ఎన్వీ వినీత్కుమార్ తదితరులు సముద్ర సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా బ్లూ ఎకానమీ అభివృద్ధికి కొత్త అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజనులకు న్యాయం చేస్తాం
● సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఉలవపాడు: గిరిజనులకు సాగుబడి హక్కులు కల్పి ంచడంలో చట్టప్రకారం న్యాయం చేస్తామని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వీరేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. భూములపై గిరిజనులకు సాగుబడి హక్కు కల్పించడానికి అటవీ శాఖ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2005 గిరిజన చట్టానికి ముందు నుంచి అటవీ భూములు సాగు చేసుకుంటున్నారా? లేక తర్వాత చేపట్టారా? అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పంటలు వేస్తున్నారని వారిని అడిగారు. వీరేపల్లి పరిధిలో 74 మందిని అర్హులుగా గుర్తించినట్లు ఆమెకు రెవెన్యూ సిబ్బంది తెలియజేశారు. మిగిలిన వారు తమ సాగుబడి గురించి ఆమెకు వినతిపత్రాలు అందించారు. వీరేపల్లి చెరువులో నీరు తాగి గొర్రెలు చనిపోయాయని కొందరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని, తాగునీటికి పనికిరావని దండోరా వేశారని గ్రామ మాజీ సర్పంచ్ నన్నం పోతురాజు సబ్కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్ర విచారణ చేయించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఐటీడీఏ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
నెల్లూరు(క్రైమ్): బాత్రూమ్లో జారిపడి గాయాలపాలైన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు శెట్టిగుంటరోడ్డులో కె.కోటేశ్వరరావు (65) కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. సోమవారం తన ఇంట్లోని బాత్రూమ్లో జారిపడి గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు జీజీహెచ్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి కోటేశ్వరరావు మృతిచెందాడు. మృతుడి కుమారుడు శివ మంగళవారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలునెల్లూరు రూరల్: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కె.కార్తీక్ తెలిపారు. మంగళవారం 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు రూ.96.61 కోట్లను రైతులకు చెల్లించినట్లు తెలియజేశారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.75 సన్నవి : రూ.55 పండ్లు : రూ.30 -
ధాన్యం కొనండి మహాప్రభో..
పొదలకూరు: రోజూ ఇంత మొత్తంలో ధాన్యం కొనుగోలు చేశామని అధికారులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇందుకు ఈ రైతు పడుతున్న ఆవేదనే ఉదాహరణ. మండలంలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన రైతు అరెద్దుల విజయ్కుమార్ రబీలో 10.30 ఎకరాల్లో బీపీటీ 5204 రకం వరిసాగు చేపట్టాడు. కోతల అనంతరం ధాన్యాన్ని కల్లాల వద్ద ఆరబెట్టాడు. తాటిపర్తి కేంద్రం వద్దకు వెళ్లి కొనుగోలు చేయాల్సిందిగా కోరాడు. గోతాలు లేవని, ట్రక్ షీట్ ఇచ్చేందుకు మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీ లేదని అక్కడి వారు సాకులు చెబుతున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆరబెట్టిన ధాన్యాన్ని ఎక్కువ రోజులు ఉంచుకుంటే ధరలు పతనమవుతాయని నేరుగా నెల్లూరుకు సమీపంలోని శ్రీలక్ష్మి రైస్మిల్లు వద్దకు వెళ్లాడు. వారు తేమ శాతం సమస్య చెప్పి తీసుకోవడం కుదరదని వెల్లడించారు. దీంతో దిక్కుతోచక రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు. అటు దళారులకు అమ్ముకోలేక, ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించలేక ఇబ్బందులు పడుతున్నాడు. అకాల వర్షం వస్తే ధాన్యాన్ని దాచుకునే వీలు కూడా లేదని ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంతా బాగుందని చెప్పుకొంటోంది. -
28, 29 తేదీల్లో అభ్యర్థులకు పరీక్ష
నెల్లూరు(టౌన్): కస్తూరిదేవి ఎయిడెడ్ బాలికల హైస్కూల్, శ్రీపొట్టి శ్రీరాములు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 28, 29 తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని కస్తూరిదేవి బాలికల హైస్కూల్లో ఎస్ఏ మ్యాథ్స్ – 2, ఎస్ఏ బీఎస్ – 1, ఎస్ఏ పీఎస్ – 1, ఎస్జీటీ – 2, ఎస్ఏ హిందీ – 1, గూడూరులోని శ్రీపొట్టి శ్రీరాములు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ – 1, ఎల్పీ హిందీ – 1, ఎల్పీ తెలుగు – 1 పోస్టులు ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్టికెట్లను https://cse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పాఠశాల యాజమాన్యాలకు ఆఫ్లైన్లో దరఖాస్తులు ఇచ్చిన వారు తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తే జిల్లా విద్యాశాఖ వారు హాల్టికెట్ జారీ చేస్తారన్నారు. నెల్లూరులో ఆర్పీఎఫ్ ఐజీనెల్లూరు(క్రైమ్): వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమా సింగ్ నెల్లూరు రైల్వేస్టేషన్కు వచ్చారు. స్థానిక ఆర్పీ ఎఫ్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆమె సిబ్బందికి సూచించారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ట్రాక్టర్ ట్రక్కు కింద సేద తీరుతుండగా.. ● ఒక్కసారిగా వాహనం తీసిన డ్రైవర్ ● ఓ మహిళ మృతి, మరొకరికి గాయాలుబుచ్చిరెడ్డిపాళెం: ఆ మహిళలు ట్రాక్టర్ ట్రక్కు కింద సేద తీరుతున్నారు. దీనిని గుర్తించకుండా ఒక్కసారిగా వాహనాన్ని డ్రైవర్ తీశాడు. దీంతో ఒక మహిళ మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని పంచేడు గ్రామానికి చెందిన పొలాల్లో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. భాస్కర్ అనే వ్యక్తి తన పొలంలో మెషీన్ ద్వారా వరికోతలు చేయిస్తున్నాడు. ధాన్యాన్ని మెషీన్ వద్ద నుంచి బాటపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్ను కొద్దిసేపు డ్రైవర్ పక్కన నిలిపాడు. గెనాలకు గడ్డి కోసేందుకు నాగూరు ప్రమీలమ్మ (48), మరో మహిళ వచ్చారు. ఎండ అధికంగా ఉండటంతో వీరు సేద తీరేందుకు ట్రాక్టర్ ట్రక్కు కింద కూర్చొన్నారు. ఈ సమయంలో వరికోత మెషీన్ ఆపరేటర్ ట్రాక్టర్ డ్రైవర్ను పిలిచి వాహనాన్ని తీసుకురమ్మన్నాడు. డ్రైవర్ ట్రాక్టర్ను తిప్పే క్రమంలో మహిళలను గుర్తించకుండా వారిపైకి ఎక్కించి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ప్రమీలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మరో మహిళ గాయపడి పెద్దగా కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి ఆమెను బుచ్చిరెడ్డిపాళెం వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యవెంకటాచలం: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అనికేపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అనికేపల్లి గ్రామానికి చెందిన వాసిలి కొండస్వామి (46)కి భార్య వెంకట సురేఖ, ఒక కుమారుడు ఉన్నారు. కొండస్వామి మద్యానికి బానిసయ్యాడు. అతను కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొండస్వామి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.నూతన కార్యవర్గ ఎన్నికనెల్లూరు(పొగతోట): పశు సంవర్థక శాఖ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం నెల్లూరులో కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఐ.కృష్ణమౌర్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డి.మాధవిలత, ఉపాధ్యక్షులుగా మాలకొండయ్య, శశిధర్, సంయుక్త కార్యదర్శులుగా సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్రెడ్డి, కోశాధికారిగా డాక్టర్ జె.చైతన్య కిశోర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ బి.మురళీకృష్ణ, డాక్టర్ జె.యశోధ, డాక్టర్ బి.సురేష్, డాక్టర్ కె.సురేష్, డాక్టర్ వైవీ కామేశ్వరరావు, డాక్టర్ సీహెచ్ లక్ష్మీశైలజ వ్యవహరిస్తారు. -
కాకాణి ఇంటి వద్దకు నాయకులు, కార్యకర్తలు
నెల్లూరు (పొగతోట): మాజీమంత్రి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఇంటి వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా మోహరించారు. పార్టీ జిల్లా కార్యాలయం కాకాణి నివాసానికి సమీపంలో ఉండడంతో కార్యాలయం చుట్టూ, కాకాణి ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీలోని రుస్తుం మైన్లో గత ప్రభుత్వంలో అక్రమంగా తెల్ల రాయిని తరలించారని ఫిబ్రవరిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో కాకాణిని ఏ–4గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి కాకాణిని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పోలీసులు మఫ్టీలో తిరుగుతూ కాకాణి నివాసం వద్ద పరిస్థితిని తెలుసుకుంటున్నారు. -
28లోపు సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28వ తేదీ లోపు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్సైట్, నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పేరు, హోదా, సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ జరిగిందో సంబంధిత ఆధారాలతో చూపించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా శ్రీనివాసులు నెల్లూరు (స్టోన్హౌస్పేట): జిల్లా ఎస్సీ కార్పొరేషన్ పూర్తి అదనపు బాధ్యతల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాలసాని శ్రీనివాసులు మంగళవారం దర్గామిట్టలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాసులు, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ పథకాలను లబ్ధిదారులకు సత్వరమే చేరవేసేందుకు కృషి చేస్తామన్నారు. పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అర్హులు వినియోగించుకునేలా చేస్తామన్నారు. ఐసీడీఎస్ పీడీ బాధ్యతల స్వీకరణ నెల్లూరు (పొగతోట): ఐసీడీఎస్ పీడీ (ఎఫ్ఏసీ)గా నిర్మలారెడ్డిని నియమించారు. ఆమె మంగళవారం ఐసీడీఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నిర్మలారెడ్డి ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెను ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూగజీవాలపై దూసుకెళ్లిన భారీ వాహనం ● 11 గొర్రెలు మృతి, కాపరులకు తీవ్రగాయాలు మర్రిపాడు: మండలంలోని పొంగూరు కండ్రిక సమీపంలో అచ్చమాంబ ఆలయ సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం ఓ గొర్రెల మందపైకి ఓ భారీ వాహనం దూసుకెళ్లింది. మేత కోసం ఇర్లపాడు నుంచి వెంగంపల్లి సిరివెళ్ల గ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 11 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరి నాగయ్యకు తీవ్రగాయాలు కాగా సన్ను రమణయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీపల్లిలో 461 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 461 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 503 బేళ్లు రాగా 461 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.260 లభించింది. సగటు ధర రూ.278.17 నమోదైంది. వేలంలో 61,006 కిలోల పొగాకును విక్రయించగా రూ.169,70,309 వ్యాపారం జరిగింది. వేలంలో 8 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. -
కూటమి టార్గెట్ కాకాణి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆ పార్టీ వైఫల్యాలను, తప్పుడు ప్రచారాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కట్టడి చేయాలని ఉద్దేశంతో తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తోంది. కాకాణిపై ఎప్పుడెప్పుడు కేసులు ● గతేడాది గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ సెంట్రల్ కార్యాలయంలో ప్రెస్మీట్ పెడితే ఆ వార్తను ‘సాక్షి’ కవర్ చేసింది. ఆ పేపర్ కటింగ్ను తన వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశాడని వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ● వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్మీట్ పెడితే ఆ వీడియో కాకాణి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశాడని మరో కేసు పెట్టారు. ● స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టాడని ముత్తుకూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయించారు. ● గతేడాది అక్టోబర్లో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయకపోవడంతో భవన కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన్రెడ్డి వారికి సంఘీభావంగా వెళ్లి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ● గతేడాది డిసెంబర్లో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. పోలీసుల తీరుపై కాకాణి గోవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంకటాచలానికి చెందిన టీడీపీ కార్యకర్త నెల్లూరు వేదాయపాళెం పోలీసులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు. ● కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం కోళ్లదిన్నెలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. గాయపడిన వారిని పరామర్శించిన కాకాణి అక్కడ మీడియాతో మాట్లా డుతూ పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టి తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించిందని టీడీపీ కార్యకర్త కావలి వన్టౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ● తాజాగా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్లో గత ప్రభుత్వ హయాంలో అనధికారికంగా మైనింగ్ చేసి క్వార్ట్ ్జ మెటల్ను తరలించారని, అందుకు కాకాణి తన అనుచరులకు సహకరించారనే కారణం చూపి ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి రిమాండ్ రిపోర్టులో ఎక్కడా కూడా కాకాణి పాత్ర ఉన్నట్లు ధ్రువపరచలేదు. తాము ఆయన అనుచరులమని, మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తామని చెప్పడంతోనే అక్రమ మైనింగ్ చేసినట్లు చూపి నాన్బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా పోలీసుల కల్పితమే కానీ, ఎక్కడా వీరి పాత్ర కానీ, కాకాణి పాత్ర ఎక్కడా లేకపోవడం గమనార్హం. ఎవరో ఫిర్యాదు ఇస్తే కేసులా? మాజీ మంత్రి కాకాణి ప్రతి నిత్యం ప్రభుత్వ వైఫల్యాలపైన, సర్వేపల్లిలో జరిగే అవినీతి, అక్రమాలను ఎండ గడుతున్నారు. ఇది రుచించని ప్రభుత్వ పెద్దలతోపాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తమ అనుచర వర్గాలతో ఫిర్యాదులు చేయిస్తూ కేసులు నమోదు చేయిస్తున్నారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు సైతం ఫిర్యాదు వచ్చిందే తడువుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఏ కేసులో కూడా బాధిత వర్గాలు ఫిర్యాదులు చేయలేదు. టీడీపీ కార్యకర్తలు ఇచ్చే ఫిర్యాదే ప్రామాణికంగా తీసుకుని ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 16 విచారణలు గత ప్రభుత్వ హయాంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు విజిలెన్స్ విచారణలు చేయించారు. ఇప్పటికి 16 పర్యాయాలు విజిలెన్స్ అధికారులు విచారణ చేసి అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు. దీంతో ఎలాగైనా కాకాణిని జైలుకు పంపేలా ప్రభుత్వ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా ఒంగోలుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేసి విచారణలు చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు అక్రమ మైనింగ్కు సహకరించారని తాజాగా కేసు ఇప్పటికే 16 విచారణలు.. 8 కేసులు అవినీతి జరగలేదని తేల్చి చెప్పిన విజిలెన్స్ అయినా సిట్ వేసి అక్రమ కేసులతో వేధింపులు నాన్బెయిలబుల్ సెక్షన్లతో అరెస్ట్కు రంగం సిద్ధం ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదంటున్న కాకాణి నెల్లూరు పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని రెడ్బుక్ కుట్రలో భాగంగా జైలుకు పంపేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని ‘రుస్తుం మైన్స్లో’ అక్రమ మైనింగ్ జరిగిందంటూ అందులో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, వారికి ఆయన సహకరించారంటూ నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలోనే స్థానిక ఎమ్మెల్యే చేసిన ఆరోపణలతో చేపట్టిన విజిలెన్స్ విచారణలో అసలు అక్కడ మైనింగే జరగలేదంటూ నివేదిక ఇచ్చినా.. తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. తాను కేసులకు భయపడి ప్రశ్నించే విధానాన్ని మాత్రం మానుకోను. ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎండగడుతూనే ఉంటా. కూటమి ప్రభుత్వ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేశారు. క్వార్ట్ ్జ కేసులో నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. నన్ను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం పశ్నిస్తూనే ఉంటా. సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిని బయట పెడుతూనే ఉంటా. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించను. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో మా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం. అందుకే ఎన్ని కేసులు నమోదైనా జంకే ప్రసక్తేలేదు. – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి -
● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం
పనికి పోతేనే ఇల్లు జరిగేది మాది పేద కుటుంబం. అందరూ ఏదో ఒక పని చేసుకుంటేనే ఇల్లు జరుగుబాటు ఉంటుంది. పొదుపు సంఘంలో 20 ఏళ్లుగా ఉంటున్నా. పొదుపు ద్వారా కుటుంబం జరుగుబాటు కావడానికి ఎలాంటి జీవనోపాధి సమకూరలేదు. అందుకే బతకడానికి కూలి పనులు చేసుకుంటున్నాను. – పానబోయిన శేషమ్మ, అమ్మవారిపాళెం, గుడ్లూరు మండలం ● దశాబ్దాలుగా ఇప్పటికీ కూలీలుగానే.. ● గత ప్రభుత్వంలో వ్యాపారులుగా రాణించిన మహిళలు ● డ్వాక్రా సంఘాలతో సూపర్ మార్ట్ల ఏర్పాటు ● కూటమి ప్రభుత్వం రాగానే కుప్ప కూల్చేసిన వైనం ● రుణాలు లేవు.. ఆర్థిక సాయం లేదు.. పారిశ్రామికవేత్తలు ఎలా..! ● ఈ ఫొటోలో ఉన్న పొదుపు మహిళ పేరు డేగా శాంతమ్మ. కావలి మండలం చలంచర్ల పంచాయతీ పెద్దారం గ్రామం. డ్వాక్రా సంఘాల్లో 15 ఏళ్లుగా సభ్యురాలుగా ఉంది. జీవనోపాధి కోసం కూలి పనులు చేసుకుంటోంది. తమ గ్రామానికి 10 కి.మీ. దూరంలో ఉన్న కొత్తపల్లి గ్రామానికి వచ్చి కూలి పనులు చేస్తోంది. కావలి: ‘‘పొదుపు చేయడంలో మహిళలే మహారాణులు. పొదుపు అనే ఆర్థిక ఉద్యమంలో పేద మహిళలు చైతన్య వంతులైతే వారు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పొదుపు మహిళలను తమ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం.’’ – ఇటీవల డీఆర్డీఏ పీడీల సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలివి. ఇలాంటి మాటలు వినడానికి బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూతనందించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల సృష్టికి తానే ఆద్యుడనని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఆ డ్వాక్రా మహిళల ఎదుగుదలకు ప్రణాళికాబద్ధంగా ఏనాడు చిత్తశుద్ధిగా వ్యవహరించడలేదు. వీరిని దాదాపు 30 ఏళ్లుగా తన ప్రచార సభల్లో జనసమీకరణకు వాడుకున్నారే తప్ప.. వారి అభివృద్ధికి పాటుపడిన చరిత్ర లేదు. పొదుపు మహిళలకు అరకొరగా రుణాలిచ్చి.. వాటిని ఇంటి ఖర్చులకు వాడుకునేలా చేస్తూ.. జీవితాంతం అప్పులు తీర్చుకునే విధంగా వారిని ఆ చట్రంలో బిగించారు. 2014 ఎన్నికల్లో ప్రతి డ్వాక్రా మహిళ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి.. చివరకు పదివేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆనాడు చంద్రబాబు మాటలు విని అప్పులు కట్టకుండా ఉండిపోయి డీఫా ల్టర్లు అయ్యారు. చివరకు వడ్డీలకు చక్రవడ్డీల లెక్కన అప్పులు కట్టారు. నాలుగుసార్లు అధికారంలో ఉండి.. టీడీపీ ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. గతంలో పద్నాలుగేళ్లుగా.. తాజాగా పది నెలలుగా ఎంత మంది మహిళలను పారిశ్రామివేత్తలుగా నిలబెట్టిందో ఈ ప్రభుత్వం చెప్పగలదా?. అధికారం కోసం అమాయక డ్వాక్రా మహిళలను ఆశల పల్లకీల్లో ఊగిసలాడించి పబ్బం గడుపుకోవడం టీడీపీ నైజంగా మారింది. నాలుగు దశాబ్దాల కిందటి నుంచి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటవుతున్నాయి. లక్షలాది మంది మహిళలు ఆయా గ్రూపుల్లో సభ్యులుగా ఉండి ప్రభుత్వం నుంచి రుణ సాయం పొందుతున్నారు. కొన్ని గ్రూపుల వారు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ ఎంత మంది డ్వాక్రా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు అని ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం సరే.. ఆచరణే కార్యరూపం దాల్చడం లేదు. పొదుపు గ్రూపుల పర్యవేక్షకులు లంచాల దోపిడీతో మహిళలు అనుకున్న స్థాయిలో ఆర్థిక ప్రగతి సాధించలేపోయారనేది జగద్విదితమే. మంత్రి ప్రకటనపై విస్మయం అయితే పాలకులు మాత్రం పొదుపు గ్రూపుల్లో ఉన్న పేద మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామని ప్రకటిస్తుండటం విస్మయ పరుస్తోంది. వాస్తవంగా పొదుపు గ్రూపులో ఉన్న మహిళలు పొదుపు సంఘాలు ద్వారా సమకూరుతున్న అరకొర నగదుతో కొత్తగా వ్యాపారాలు చేయడానికి సాధ్యపడటం లేదు. అప్పటికే కుటుంబం చిరు వ్యాపారాలు, చిరు అమ్మకాలు చేస్తుంటే పొదుపు సంఘాలు ద్వారా వచ్చే నగదును అందులో పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు. అలా చేస్తున్న వారినే అధికారులు కూడా పొదుపు మహిళలు ఉపాధి పొందుతున్నారంటూ ఊదరగొడుతున్నారు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు కుటుంబానికి స్థోమత ఉంటే గృహిణులుగా స్థిరపడుతున్నారు. కుటుంబానికి స్థోమత లేకపోతే కుటుంబ పోషణ కోసం కూలీలుగా పనులకు కూడా పోతున్నారు.● ఈ ఫొటోలో ఉన్న మహిళ ఆదెమ్మ. ఈమె శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణం నుంచి కావలి పట్టణానికి వచ్చి రోడ్డు మార్జిన్లో కూర్చొని జీడిపప్పు అమ్మకాలు చేస్తోంది. పలాసలోని జీడిపప్పు వ్యాపారులు ఆమెకు రోజుకు రూ.150 కూలి ఇస్తారు. గడిచిన 20 ఏళ్ల నుంచి ఈమె పొదుపు సంఘాల్లో సభ్యురాలిగా ఉంది. కానీ జీవనోపాధి కోసం సొంతూరు నుంచి 700 కి.మీ. దూరంలో ఉన్న కావలికి వచ్చి కూలి పని చేస్తోంది. ● ఈ మహిళ పేరు కాకు పద్మమ్మ. కావలి మండలం పెద్దారం గ్రామం. పొదుపు గ్రూపులో 15 ఏళ్ల నుంచి ఉంటోంది. కుటుంబ జీవనం కోసం కూలి పనులు చేస్తోంది. పొదుపు గ్రూపు ద్వారా ఈమెకు జీవనోపాధి సమకూరలేదు. పొదుపు గ్రూపు మహిళల సమావేశం ధాన్యం ఆరబోసే పనిలో కూలీలుగా పొదుపు మహిళలు వైఎస్సార్సీపీ పాలనలోనే ఆర్థిక స్వావలంబన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేశారు. ఎంతో మంది మహిళలు కుటీర పరిశ్రమల నుంచి చిన్న వ్యాపారులుగా స్వయం ఉపాధిలో ఎదిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదుపుల మహిళ రుణాలను మాఫీ చేసి నాలుగు దఫాలుగా చెల్లించారు. ఈ డబ్బులతోపాటు వైఎస్సార్ చేయూత పథకం, డ్వాక్రా రుణాలు కల్పించి ఈ మొత్తాలకు బ్యాంక్ల ద్వారా అదనపు రుణాలు అందించి వారి ఆర్థిక ప్రగతి బాటలు వేశారు. నగరాలు, పట్టణాల్లో డ్వాకా గ్రూపులను సమీకృతం చేసి వారితో సూపర్ మార్టులు ఏర్పాటు చేయించి మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి, వింజమూరు, కందుకూరుల్లోని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన మార్టులు మూతపడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం మహిళలను ఏ విధంగా అభివృద్ధి చేస్తోందో తేటతెల్లమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సభ్యులు – 4,00,064 మంది గ్రామీణ ప్రాంతాల్లో గ్రూపులు – 39,249 పారిశ్రామిక, వ్యాపారవేత్తలు – 0 కూలి పనులకు పోతుంటా నేను 25 ఏళ్ల నుంచి పొదుపు గ్రూపులో ఉన్నా. పొదుపు సంఘం ద్వారా నాకు జీవనోపాధి ఏమీ కలగలేదు. కొద్దిగా డబ్బు చేతికందితే అరకొర ఖర్చులకు సరిపోతోంది. మళ్లీ రుణం చెల్లించాలి కాబట్టి కుటుంబ పోషణకు కూలి పనులకు పోతుంటాను. – ఏకుల రమణమ్మ, పొదుపు మహిళ, అల్లూరు మండలం కష్టం చేసుకొని బతకాలి కష్టం చేసి బతుకుతున్నా. పొదుపు గ్రూపులో 16 సంవత్సరాలు నుంచి ఉన్నా. పొదుపు సంఘం ద్వారా బతకడానికి ఎలాంటి అవకాశాలు రాలేదు. ఎక్కడ కూలి పనులు దొరికితే అక్కడికి వెళ్లి కూలి పనులు చేస్తాను. అలా చేసుకుంటేనే ఇల్లు జరుగుతుంది. – మనెమ్మ, పొదుపు మహిళ, చింతగుంట, అల్లూరు మండలం పట్టణ పొదుపు గ్రూపులు – 15,209 జిల్లాలో మొత్తం సభ్యులు – 5,51,166 మంది పాతికేళ్లుగా టీడీపీ ఇదే చెబుతోంది పొదుపు మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తానని టీడీపీ పాతికేళ్లుగా ఇదే చెబుతోంది. పొదుపు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటుతో పేద వర్గాల మహిళలు ఆర్థికంగా కొద్దిగా ఎదగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాని పొదుపు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కాదు. – సి.శారద, సామాజిక కార్యకర్త, కావలి పట్టణ గ్రూపుల్లోని సభ్యులు – 1,51,102 -
మా బతుకులు అన్నింటికి చెడ్డ రేవడిలా
నెల్లూరురూరల్: ‘సార్ మేము ఇక్కడికి వస్తున్నాము.. మీరు మా అర్జీలను కింద స్థాయి అధికారులకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్తే సమాధానం కూడా చెప్పడంలేదు. మీ దగ్గరకు వస్తేనే మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్లాలి. కొంచెం మా పై దయచూపి పరిష్కారం అయ్యేలా చూడండి’ అంటూ బాధితులు కలెక్టరేట్ అధికారులను గద్గద స్వరంలో కన్నీటి పర్యంతమయ్యారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. వినతులు పరిష్కరించాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు. జేసీ కె.కార్తీక్, డీఆర్ఓ ఉదయభాస్కర్రావు, డీపీఓ శ్రీధర్రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఊటుకూరు దళితులకు భూములు అప్పగించాలి ● ఎస్. మల్లి, న్యాయవాది, దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు విడవలూరు మండలం ఊటుకూరులో దళితుల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని వారి భూములు వారికి అప్పగించాలని న్యాయవాది, దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి జేసీకి వినతిపత్రం అందజేశారు. ఎస్.మల్లి మాట్లాడుతూ 2018లో ఊటుకూరుకు చెందిన పలువురు దళితులకు ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు పథకం ద్వారా సర్వే నంబరు 1288 నుంచి 1294 వరకు 90.26 ఎకరాలు కొని ఇచ్చారని తెలిపారు. రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదన్నారు. స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్ రెండో సారి కూడా అక్కడే పోస్టింగ్ వేయించుకుని భూములను దళితులకు దక్కనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 50 ఎకరాలు భూ కబ్జాదారులు ఆక్రమించుకుని పంటలు పండించుకుంటున్నారన్నారు. అద్దంకి కార్తీక్, పీ పాపయ్య మాట్లాడుతూ దాదాపు రూ.8 కోట్ల విలువైన భూములు 8 ఏళ్లుగా సాగుబడి చేసుకుని లబ్ధిపొందుతున్నారని తెలిపారు. తక్షణం జోక్యం చేసుకుని సర్వే చేసి, హద్దులు చూపించి సాగు చేపట్టేందుకు వీలు కల్పించాలని కోరారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జేసీ కార్తీక్ దళిత నేతలకు హామీ ఇచ్చారు. ఆత్మకూరు కొండయ్య, ఇమ్మానియల్, శివాజీ, జెడ్డా వాసు తదితరులు ఉన్నారు. రాయితీలు త్వరగా ఇవ్వండి అట్రాసిటీకి గురైన బాధితులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు త్వరగా ఇవ్వాలని రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహబూబ్ సోమవారం జేసీకికు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి జిల్లాలో అట్రాసిటీకి గురైన బాధితులకు ఇంత వరకు రాయితీలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బత్తల మధుసూదన్, అరికొండ సురేష్, నిమ్మల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అర్జీలు సకాలంలో పరిష్కరించండి కలెక్టరేట్కు 309 ప్రజావిజ్ఞప్తులు ప్రతి వారం వందల సంఖ్యలో అర్జీలు పరిష్కారం కావడం లేదని కన్నీటి పర్యంతరం – జేసీ కార్తీక్ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం 309 అర్జీలు ప్రజల నుంచి వచ్చాయి. ఇందులో అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 138, మున్సిపల్ శాఖవి 33, సర్వేకు 30, పంచాయతీరాజ్ శాఖ 21, స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 9 అర్జీలు అందాయన్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ అధికారులను ఆదేశించారు. నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమణలు కొత్తూరు బిట్–2 సర్వే నంబరు 21, 73, 21, 74లో కండలేరు జలాశయం ముంపు బాధితుల పునరావాస ఆర్అండ్ఆర్ కాలనీలో కె కాంతారావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని స్థానికుడు వి.రమేష్రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 2021లో 150 మందికి పట్టాలు మంజూరు చేసిందన్నారు. ప్రతి 20 కుటుంబాలకు తాగునీటికి ఒక బావి నిర్మించిందన్నారు. కొందరు ఆ బావులను ధ్వంసం చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా బతుకులు అన్నింటికి చెడ్డ రేవడిలా మారాయని డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నామన్నారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నా తమ కేడర్ తెలియక, కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తింపు లేక ఆరోగ్య మిత్రులు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీసు అసోసియేట్లు తదితరులు ఇబ్బంది పడుతున్నామన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వారికి ఎలాంటి బెనిఫిట్లు రావడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ లేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవన్నారు. ప్రభుత్వ సైట్లలో ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఉండడం వల్ల సంక్షేమ పథకాలు రావడం లేదన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులకు వినితిపత్రం అందజేశారు. పొలం ఆక్రమించారు నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరులో తనకు రావాల్సిన పొలాన్ని తన మరిది చిరంజీవి ఆక్రమించుకున్నాడని తాడిపర్తి రజనిమ్మ అనే మహిళ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జేసీకి వినతిపత్రం అందజేసింది. తన భర్త చనిపోయిన తర్వాత తన పేరుతో ఉన్న పట్టా భూమిని తనకు తెలియకుండానే వీఆర్ఓతో కలిసి అతని పేరు మీదకు 1బీ, అడంగళ్లో ఎక్కించుకున్నారని వాపోయారు. నా కూతురు చదువుకునే స్కూల్ దగ్గరకు వెళ్లి బెదిరిస్తున్నాడని తెలిపారు. నాకు ఏమైనా జరిగితే అతనిదే బాధ్యత అని కన్నీటి పర్యంతయ్యారు. -
నా మద్యం షాపును హ్యాండోవర్ చేసుకోండి
నెల్లూరు(అర్బన్): ఆమె టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. లాటరీలో ఆమెకు మద్యం దుకాణం వచ్చింది. ఎకై ్సజ్ సీఐ లైసెన్సు ఇవ్వకుండా సొంత పార్టీ వారే అడ్డుకున్నారు. తీవ్ర ఇబ్బందులుకు గురి చేస్తున్నారు. ఆమె తీవ్రంగా నష్టపోయింది. అప్పులు తీర్చే క్రమంలో తాళిబొట్టు అమ్ముకుంది. చివరికి మద్యం షాపు తనకు వద్దు ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకుని విముక్తి చేయాలని ప్రాధేయపడుతోంది. ఆమె పేరు కడియపు లక్ష్మి. పొదలకూరు మండలంలోని తాటిపర్తి వాసి. సోమవారం కలెక్టరేట్లో జెడ్పీ సీఈఓకి వినతిపత్రం ఇచ్చింది. వివరాలల్లోకి వెళితే.. లక్ష్మి ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విజయానికి పనిచేశారు. గత సంవత్సరం మద్యం షాపులకు తీసిన లాటరీలోకి ఆమెకు 154 నంబర్ షాపు దక్కింది. పొదలకూరులో దుకాణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తుమ్మల శ్రీనివాసులు అనే వ్యక్తి షాపును అద్దెకు తీసుకుని అడ్వాన్స్ కింద రూ.లక్ష చెల్లించింది. అగ్రిమెంట్ రాసుకున్నాను. అయితే ఎకై ్సజ్ సీఐ, సూపరింటెండెంట్లు లైసెన్సు ఇవ్వలేదు. పైగా అద్దెకు షాపు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాసులును ఆర్అండ్బీ అధికారుల ద్వారా రోడ్డులోకి జరిగి షాపు కట్టావంటూ అధికారపార్టీ నాయకులు బెదిరించారు. ముగ్గురి వద్ద షాపులు అద్దెకు తీసుకుని అడ్వాన్స్లు చెల్లించింది. వారిని అలాగే బెదిరించారు. అడ్వాన్స్ రూపంలో చెల్లించిన రూ.3 లక్షలు నగదు కూడా ఇంకా ఆమెకు రాలేదు. లైసెన్సు కోసం ఎకై ్సజ్ కార్యాలయం చుట్టూ తిరిగా.. ఆడ మనిషి అని కూడా చూడకుండా సీఐ ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో నిలబెట్టారు. చివరికి ఆమెకు వ్యాపారం జరగని సూరాయపాళెం గ్రామంలో ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చారు. అక్కడ వద్దని ఎంత చెప్పినా భయపెట్టారు. లక్ష్మి రెండు నెలలకు మద్యం దుకాణానికి ప్రభుత్వానికి ఫీజు కింద రూ.10,83,330 చెల్లించాల్సి ఉంది. ఆమెకు రెండు నెలలకు రూ.3 లక్షలు మాత్రమే వస్తోంది. ప్రభుత్వానికి నగదు ఎలా చెల్లించాలని అడుగుతోంది. ఎకై ్సజ్ సీఐకు చెబితే నేనేమి చేయలేను. అధికారపార్టీ ఒత్తిళ్లు ఉన్నాయని చెబుతున్నాడని ఆమె వాపోతోంది. అప్పులు తీర్చేదానికి తాళిబొట్టు కూడా అమ్మేశాను. ఇప్పటికే రూ.14 లక్షలు నష్టపోయాను. మా పార్టీ వారి వల్లనే ఇలా జరిగింది. అందువల్ల ప్రభుత్వం నా దుకాణాన్ని హ్యాండోవర్ చేసుకోవాలి. లేదంటే పొదలకూరులో లైసెన్స్ ఇవ్వాలి. అలా చేయకపోతే నాకు పురుగు మందే దిక్కు అని వాపోయింది. లైసెన్స్ ఇవ్వకుండా సొంత పార్టీ వారే అడ్డుకున్నారు రూ.14 లక్షలు నష్టపోయా సీఈఓకి టీడీపీ కార్యకర్త కడియపు లక్ష్మి విన్నపం -
మా బిడ్డ ఎప్పుడొస్తుందో..?
● తల్లిదండ్రుల ఆవేదన ● పక్షం రోజులుగా ఆచూకీ లేని మహిళ ఉలవపాడు: దా దాపు 15 రోజుల క్రితం తప్పిపో యిన వివాహిత ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. కుమార్తె ఆచూకీ లేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పోలీసు శాఖ కేసు నమోదు చేసినా ఇంత వరకు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామంలో ఈ నెల 7వ తేదీన ఈ సంఘటన జరిగింది. వీరేపల్లి అంబేడ్కర్ నగర్కు చెందిన చొప్పర వెంకట రమణకు (31) వివాహమైంది. భర్త మరణించడంతో తల్లిదండ్రులు చొప్పర శ్రీను, వరలక్ష్మి వద్ద ఉంటోంది. ప్రతి రోజూ వీరేపల్లి నుంచి ప్రకాశం జిల్లా శింగరాయకొండలోని దేవి సీఫుడ్స్లోకి పనికి బస్లో వెళ్లి వస్తుంది. 7వ తేదీ తెల్లవారుజామున గ్రామంలో ఓ వివాహం జరుగుతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. తరువాత నుంచి ఇంటికి రాలేదు. ఇంటి దగ్గర లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు వెతుకులాడారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 8న మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు కొంత విచారణ జరిపినా ఫలితం లేకుండా పోయింది. నేటికీ ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు పెళ్లి జరుగుతున్న సమయంలో ఉన్న కొందరిని విచారించారు. ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి విచారించి వచ్చినా ఫలితం లేదు. పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుపై మరింత దృష్టి సారించి తమ కుమార్తె ఆచూకీ తెలపాలని బాధితులు కోరుతున్నారు. -
సహనాన్ని చేతికానితనం అనుకోవద్దు
● తిరగబడే రోజు వస్తుంది ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి, రూరల్ సమన్వయకర్త ఆనం ● కూటమి ప్రభుత్వ అరాచకాలపై ఏఎస్పీకి వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు నెల్లూరు సిటీ: టీడీపీ నాయకులు తమ సహనాన్ని చేతకాని తనం అనుకోవద్దని, తిరగబడే రోజు వస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, రూరల్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డిలు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్పై స్పష్టమైన ఆధారాలు లేకుండా అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులతో భయపెట్టాలని అధికార పార్టీ యోచిస్తోందని తెలిపారు. వైకాపా మహిళా విభాగం నేత రమాదేవి ఇంటి మీదకు వెళ్లి టీడీపీ నేతలు దాడి చేస్తే, ఇంత వరకు కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. వారి కుటుంబంపై దాడికి సంబంధించిన వీడియోలు బయటపెట్టినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసు యంత్రాంగం విఫలం అయిందన్నారు. అధికార పార్టీ పెడుతున్న కేసులకు భయపడి, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొంటామని తాము కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ తమ సహనాన్ని చేతికాని తనం అనుకోవద్దని, త్వరలో తిరగబడే రోజు వస్తుందని పేర్కొన్నారు. నగరంలోని పోలీసు గ్రీవెన్స్లో సోమవారం ఏఎస్పీ సౌజన్యకు కాకాణి, ఆనం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో రౌడీయిజం ఎక్కువైంది. మాట వినకపోతే దాడులు లేదంటే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసి వారి మీదే కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. రూరల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. -
మా గోడు విని ఆదుకోండి
● పోలీసు గ్రీవెన్స్లో 86 ఫిర్యాదులు నెల్లూరు సిటీ: హనీ ట్రాప్తో వేధిస్తునారు.. స్వామీజీ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.. వివాహం చేసుకుంటానని ఓ మహిళ మోసగించిందని, నకిలీ పత్రాలతో స్థలాన్ని కాజేస్తున్నాడంటూ ఇలా.. పలువురు తమ గోడును జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి 86 మంది తామెదుర్కొంటున్న సమస్యలను వివరించి ఆదుకోవాలని కోరారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని సంబంధిత ప్రాంతాల పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరురూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఉమెన్ పీఎస్ డీఎస్పీ సీహెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు. హనీట్రాప్లో రూ.18 లక్షలు తీసుకున్నారు ఆన్లైన్ ద్వారా పరిచయమైన దుర్గాభవాని అనే మహిళ తన స్నేహితులతో కలిసి హనీట్రాప్ చేసి తన నుంచి రూ.18 లక్షలు తీసుకుంది. తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నారని వీకేపాడుకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. నా స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించారు నెల్లూరురూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రాంరాజ్ కంపెనీ పేరుతో సతీష్, సురేష్ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తనను నమ్మించారు. 67 అంకణాల తన స్థలాన్ని ముత్తుకూరుకు చెందిన శకుంతలమ్మ అనే మహిళకు నకిలీ పత్రాల ద్వారా అమ్మేశారు. తన స్థలంలో గోడ కూడా కట్టారని, విచారించి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. స్వామీజీ పేరుతో వేధిస్తున్నారు కావలి మండలం పూలదొరువులో శక్తి పూజలు చేస్తానని పవన్కుమార్, అతని భార్య రజిని కలిసి తనన్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తాము చెప్పింది చేయకపోతే నీ భర్తకు హాని కలిగేలా చేస్తానని బెదిరిస్తున్నారని తెలిపారు. తన నుంచి రక్షించి న్యాయం చేయాలని కోరారు. పెళ్లి చేసుకుంటానని రూ.4.50 లక్షలు తీసుకుంది వేదాయపాళెం పరిధికి చెందిన వ్యక్తి తన భార్య కోవిడ్లో మరణించగా, జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమోనియల్ సైట్లో నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో నంద్యాలకు చెందిన కౌసల్య అనే మహిళ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి అవసరాలకు రూ.4.50 లక్షలు తీసుకొని మోసం చేసిందని, విచారించి న్యాయం చేయాలని కోరారు. ఫిలిప్పిన్స్లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని మోసం టీపీగూడూరుకు చెందిన వ్యక్తి తన బిడ్డకు ఫిలిప్పిన్స్లో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తానని, ఏజెంట్ రవితేజ తనను నమ్మించి రూ.21లక్షలు నగదు తీసుకొని, కాలేజీలో అసలు ఫీజు కట్టలేదని, మోసపోయామని, విచారించి న్యాయం చేయాలని కోరారు. -
ఉమ్మడి జిల్లాలో గూడూరు, నెల్లూరులో ఖాళీ ఎయిడెడ్ పోస్టులు
● 10 టీచర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు ● ఇప్పటికే పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలవసూలు ● ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు ● ఆఫ్లైన్లో నిర్వహించాలని కోర్టుకు వెళ్లిన అసోసియేషన్ నేతలు ● ఈ వారంలో ఎయిడెడ్ పోస్టులకు పరీక్ష జరిగే అవకాశం నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు ఆయా యాజమాన్యాలు భారీ మొత్తంలో బేరం పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ పోస్టుల కోసం కొంతమంది వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. అయితే నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ వారంలో పరీక్ష నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి ఆయా అభ్యర్ధుల నుంచి పోస్టును బట్టి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తే తమ అభ్యర్థులకు పోస్టులు దక్కే అవకాశం ఉండదేమన్న అనుమానంతో ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలని కొన్ని యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. జిల్లాలో 25 ఎయిడెడ్ పాఠశాలలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 23, కందుకూరు డివిజన్లో 3 ఎయిడెడ్ పాఠశాలలు జిల్లా విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. కావలిలోని ఎలిమెంటరీ స్కూల్, డీఆర్ఎల్కేఆర్ వీబీ హైస్కూల్, సమి శేషాచలంశెట్టి విశ్వోదయ గర్ల్స్ హైస్కూల్, అల్లూరులోని ఎఫ్బీసీ యూపీ స్కూల్, రామకృష్ణ జూనియర్ కళాశాల, తలమంచిలోని వీపీసీ యూపీఎస్, నార్తు రాజుపాళెంలోని ఆర్సీసీ ఎలిమెంటరీ స్కూల్, బుచ్చిరెడ్డిపాళెంలోని శ్రీహరనాథ ఎలిమెంటరీ స్కూల్, ఉయ్యాలపల్లిలోని ఎస్ఎంఎస్ ఎలిమెంటరీ స్కూల్, నెల్లూరులోని వేద సంస్కృత హైస్కూల్, వేద సంస్కృత ఎలిమెంటరీ స్కూల్, ఏబీఎం ప్రైమరీ స్కూల్, ఎస్కేడీసీ ఈఎల్ఈ స్కూల్, వెంకటేశ్వరపురంలోని జీఎంఎం ఈఎల్ఈ, సెయింట్ జోసెఫ్స్ బాలికల ఈఎల్ఈ స్కూల్, శ్రీకస్తూరిదేవి బాలికల హైస్కూల్, సెయింట్ జోసెఫ్స్ బాలికల హైస్కూల్, లేగుంటపాడులోని ఎయిడెడ్ ఈఎల్ఈ స్కూల్, గూడూరులోని రాణిపేట్ ఈఎల్ఈ స్కూల్, జీఎం యూపీ స్కూల్, శ్రీ పొట్టి శ్రీరాములు యూపీ స్కూల్, వెంకటగిరిలోని ఆర్వీఎం హైస్కూల్, సూళ్లూరుపేటలోని ఎన్ఎంసీ ఈఎల్ఈ స్కూల్, కందుకూరు డివిజన్ కరేడులోని జీఎస్ఎస్టీ ప్రైమరీ, హైస్కూల్స్ ఉన్నాయి. 10 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచరు పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయా ఎయిడెడ్ పాఠశాలల్లో 20 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. మిగులు ఉపాధ్యాయులను కొరత ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు ఆయా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో నెల్లూరులోని కస్తూరిదేవి బాలికల హైస్కూల్, గూడూరులోని శ్రీ పొట్టిశ్రీరాములు ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కస్తూరిదేవి బాలికల హైస్కూల్లో 7 పోస్టులు, శ్రీ పొట్టిశ్రీరాములు స్కూల్లో 3 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. కస్కూరిదేవి స్కూల్లో పోస్టులకు ఆన్లైన్లో 509, ఆఫ్లైన్లో 287, ఏడాది క్రితం వచ్చిన దరఖాస్తులు 396 కలిపి మొత్తం 1192 దరఖాస్తులు వచ్చాయి. శ్రీ పొట్టిశ్రీరాములు స్కూల్లో 3 పోస్టులకు ఆన్లైన్లో 337, ఆఫ్లైన్లో 79 కలిపి మొత్తం 416 దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష ఎపుడంటే.. కస్తూరిదేవి, శ్రీ పొట్టిశ్రీరాములు స్కూల్స్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే కస్తూరిదేవి స్కూల్ యాజమాన్యానికి ఆఫ్లైన్ లో వచ్చిన 287 దరఖాస్తులను రిక్రూట్మెంట్ అధికా రి నెల్లూరు డిప్యూటీ డీఈఓకు పంపించాల్సి ఉంది. ఎన్నిసార్లు కబుర్లు పంపినా ఆ దరఖాస్తులు ఇ చ్చేందుకు యాజమాన్యం అంగీకరించలేదని తెలిసింది.యాజమాన్యంఅభ్యర్థులుఈ వారంలో పరీక్ష ఉండే అవకాశం ఎయిడెడ్ స్కూల్స్ల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ వారంలో పరీక్ష ఉండే అవకాశం ఉంది. పరీక్షకు సంబంధించి అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను అప్లోడ్ చేసే పనిలో ఉన్నాం. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పరీక్ష నిర్వహిస్తాం. – ఆర్.బాలాజీరావు, డీఈఓ -
మేజర్ మినరల్కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
నెల్లూరు (టౌన్): జిల్లాలోని మైనింగ్ లీజుదారులు మైనర్ నుంచి మేజర్ మినరల్కు మారేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ సీనియర్ జియాలజిస్టు కార్తికేయన్ తెలిపారు. సోమవారం స్థానిక ఆటోనగర్లోని జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో మైనింగ్ లీజుదార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్ నుంచి మేజర్కు మారేందుకు కావాల్సిన పత్రాలపై లీజుదార్లకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మైనింగ్ లీజుదారుల అసోసియేషన్ అధ్యక్షులు ద్వారకానాథ్రెడ్డి, మైనింగ్ డీడీ బాలాజీనాయక్ తదితరులు పాల్గొన్నారు. డీసీపల్లి వేలం కేంద్రంలో 545 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో సోమవారం 545 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 565 బేళ్లు రాగా వాటిలో 545 బేళ్లను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.260 లభించింది. సగటు ధర రూ.274.82గా నమోదైంది. వేలంలో 71,698 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,97,04,072 వ్యాపారం జరిగింది. వేలంలో 8 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి నెల్లూరు రూరల్: జిల్లాలో జరిగే ఏపీపీఎస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్రావు తెలిపారు. ఈ నెల 25 నుండి 27 వరకు జరిగే పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డీఆర్ఓ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్లోని ఆయాన్ డిజిటల్ సెంటర్, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, కావలిలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల, ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ ప్రతినిఽధి గిరిజారాణి, పరీక్షా కేంద్రాల కళాశాలల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాల్పుల కలకలంలో నిందితుల అరెస్ట్ నెల్లూరు సిటీ: ఆస్తి వివాదం నేపథ్యంలో తన తండ్రి ఇంటికి వెళ్లి తండ్రి, సోదరుడిపై గన్తో కాల్చిన ఘటనలో నిందితులను చిన్నబజారు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానిక ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు సమాచారం మేరకు.. నగరంలోని రావూరివారివీధిలో రాజమాల్ జైన్కు ఆయన రెండో కుమారుడు హితేష్జైన్ మధ్య ఆస్తి విభేదాలున్నాయి. 22వ తేదీ అర్ధరాత్రి హితేష్ తన స్నేహితులైన గాంధీనగర్కు చెందిన వంశీ, మూలాపేటకు చెందిన భరత్, పొదలకూరురోడ్డుకు చెందిన రాజశేఖర్రెడ్డి, కోనేటిమిట్టకు చెందిన శేఖర్ సందీప్ అలియాస్ శ్రీనివాస్శేఖర్, కిశోర్తో కలిసి తండ్రి ఇంటికి వెళ్లి హితేజ్ తన వద్ద ఉన్న పిస్టోల్తో తలుపుపై కాల్పులు జరిపిన విషయం విదితమే. రాజమల్ జైన్ పెద్ద కుమారుడు దిలీప్కుమార్ జైన్ ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి పిస్టోల్తోపాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఇన్స్పెక్టర్, క్రైమ్ పార్టీ ఏఎస్ఐ శ్రీహరి, రవిప్రసాద్, హెచ్సీలు సురేష్, నజ్మల్, కానిస్టేబుల్స్ శ్యామ్, సుబ్బారావు, వర్ధన్లను ఎస్పీ అభినందించారు. -
పోస్టును బట్టి నగదు వసూలు
కస్తూరిదేవి బాలికల హైస్కూల్లో ఆ యాజమాన్యం పోస్టును బట్టి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. నిర్వహించే పరీక్ష నామమాత్రంగానే ఉంటుందని పోస్టింగ్ ఇచ్చే బాధ్యత తమదని చెప్పి ముందే కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారన్న ప్రచారం ఉంది. సెకండరీ గ్రేడు టీచరుకు రూ.15 లక్షలు, స్కూల్ అసిస్టెంట్కు రూ.25 లక్షలు, పీఈటీకి రూ.10 లక్షలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తే తాము డబ్బులు తీసుకున్న వారికి పోస్టు రాకపోతే పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ఆ యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది. ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించేలా ఎయిడెడ్ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. -
టీడీపీ నాయకుల గుండాగిరి
● వైఎస్సార్సీపీ మహిళా నేత కుటుంబంపై దాడి ● కర్రలు, రాళ్లతో స్వైరవిహారం ● భయంతో ఇంట్లో తలదాచుకున్న బాధితులు ● దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ ● స్థల వివాదం ముసుగులో కక్షసాధింపు చర్య ● వేదాయపాళెం పోలీసులకు బాధితుల ఫిర్యాదునెల్లూరు సిటీ: జిల్లాలో అధికార అండతో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో పోతురాజు మురళి, రమాదేవి దంపతులు నివసిస్తున్నారు. వారికి ఆకాష్, లక్ష్మీదేవి సంతానం. రమాదేవి వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. వీరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేశారు. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు పోతురాజు రవి, అతని అనుచరులు వారిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వనంతోపు సెంటర్కు సమీపంలో ఓ స్థలానికి సంబంధించి పోతురాజు గంగయ్య, సునీతలు కొలతలు వేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న టీడీపీ నేత పోతరాజు రవి, అతని బంధువులు గంగమ్మ, రమ, ఓబిలి సుజాత, విజయసారథి, రాజేష్, మురళి, శిరీషలు ఆ స్థలంపై తమకూ హక్కు ఉందంటూ కొలతలు ఆపాలని వారిని అడ్డుకున్నారు. అక్కడ వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న వైఎస్సార్సీపీ నేత పోతురాజు మురళి దంపతులు గంగయ్యకు మద్దతుగా వచ్చారు. దాంతో టీడీపీ నేత పోతురాజు రవి, అతని వర్గీయులు మురళి కుటుంబంపై దాడికి దిగారు. దాదాపు 20 మంది ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డంతో మురళి, రమదేవిలు గాయపడ్డారు. భయంతో వెంటనే తమ పిల్లలతో సహా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని తలదాచుకున్నారు. దాడి చేసిన వారు వెళ్లిపోయిన తరువాత బాధితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వేదాయపాళెం పోలీసులకు ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శ వైఎస్సార్సీపీ నేత మురళి దంపతులపై టీడీపీ నాయకుల దాడిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, రూరల్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డిలు ఖండించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏఎస్పీ సౌజన్యను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. దాడికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
మద్యంలో సరికొత్త డీల్
కందుకూరు: కందుకూరులో మద్యం వ్యాపారం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఆదాయమే పరామావధిగా మందుబాటుల జేబులు గుల్లచేసే సరికొత్త విధానానికి మద్యం వ్యాపారులు తెరతీశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న సామెతగా మద్యంషాపుల యజమానులు, బార్ల యజమానులు ఓ అవగాహనకు వచ్చి భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. దీంతో మందుబాబులు నిలువుదోపిడీకి గురౌతున్నారు. కందుకూరు పట్టణంలో అమలవుతున్న ఈ సరికొత్త విధానంపై మందుబాబు ఇదేం దోపిడీ అంటూ లబోదిబోమంటున్నారు. ఇదీ ఒప్పందం కందుకూరు నియోజకవర్గంలో మొత్తం 21 ప్రైవేట్ మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో 17షాపులు మద్యం వ్యాపారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే, మరో 4 షాపులు గౌడ కులస్తులకు కేటాయించినవి. అయితే గౌడ కులస్తుల షాపులను కూడా సిండికేట్ వ్యాపారులు స్వాధీనం చేసుకుని నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రధానంగా కందుకూరు పట్టణంలో 7 మద్యం షాపులు ఏర్పాటు చేశారు. మరో మూడు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. మద్యం షాపులకు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే సిండికేట్గా ఏర్పడి దక్కించుకుని నిర్వహించుకుంటున్నారు. నిన్నటి వరకు వేళాపాళా లేకుండా ఇష్టం వచ్చినట్లు మద్యంషాపులు నిర్వహించుకుంటూ దోపీడీ చేస్తూ వస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు లూజ్ సేల్స్ చేయడంతో పాటు, సిట్టింగ్ రూమ్లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు, షాపుల యజమానుల మధ్య కొంత వివాదం నడుస్తోంది. అదే సమయంలో మద్యం షాపుల్లో విచ్చలవిడి అమ్మకాల వల్ల పట్టణంలోని బార్ల యజమానులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో మద్యంషాపుల యజమానులు, బార్ల యజమానులు కలిసి ఓ అవగాహనకు వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా మద్యంషాపుల్లో లూజ్ సేల్ విక్రయించకూడదు, అదనపు సిట్టింగ్ రూమ్లను ఎత్తివేయాలి వంటి షరతులు ఉన్నాయి. బార్ల యజమానులు చేసిన ప్రతిపాదనకు మద్యంషాపుల యజమానులు అంగీకరించారు. దీనికి ప్రతిఫలంగా బార్లలో మద్యం బాటిల్స్ రేట్లను ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఉదాహరణకు క్వార్టర్ బాటిల్పై రూ.60 అదనంగా బార్ యజమానులు వసూల్ చేస్తారు. ఇలా క్వార్టర్ బాటిల్పై అదనంగా వసూల్ చేసిన 60 రూపాయల్లో రూ.30 మద్యంషాపుల యజమానులకు ఇచ్చేటట్లు, రూ.30 బార్ల యజమానులు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని గత వారం రోజులుగా పట్టణంలో అమలు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం మద్యంషాపులో లూజ్సేల్ అమ్మకాలు, అదనపు రూమ్లను తీసివేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మందుబాబులు కచ్చితంగా బార్లకు వెళ్లాల్సి వస్తోంది. బార్లకు వెళ్లి క్వార్టర్ బాటిల్పై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ.60 చెల్లించాల్సి వస్తోంది. ఇలా ప్రతి రోజు పట్టణంలోని మూడు బార్లలో 2వేల క్వార్టర్ బాటిళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. అంటే బార్ యజమానులు ఒక రోజు అదనపు దోపిడీ రూ.1.20 లక్షలు. దీనిలో రూ.60 వేలు మద్యంషాపుల యజమానులకు ఇస్తే, మిగిలిన రూ.60 వేలు బార్ యజమానులకు దక్కుతుంది. అంత ఇచ్చుకోలేం సార్ అదే సందర్భంలో మద్యంషాపుల యజమానులు, ఎకై ్సజ్, పోలీస్శాఖల అధికారుల మధ్య కూడా మామూళ్ల విషయంలో పొత్తు కుదరడం లేదని సమాచారం. అధికారులు అడిగినంత ఇచ్చుకోలేక నిబంధనల మేరకు షాపులు నిర్వహించుకునేందుకు మద్యంషాపుల యజమానులు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. నిన్న, మొన్నటి వరకు అదనపు సిట్టింగ్ రూమ్లతో పాటు, రాత్రి, పగలు అన్న తేడా లేకుండా అమ్మకాలు సాగించిన పట్టణంలోని మద్యంషాపులు సడన్గా రూటుమార్చాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10గంటల వరకు అమ్మకాలు సాగిస్తూ, లూజ్సేల్స్, అదనపు రూమ్లను పూర్తిగా రద్దు చేశారు. దీనికి ప్రధాన కారణం అధికారులకు ఇచ్చే మామూళ్ల విషయంలో అంగీకారం కుదరలేదని ప్రచారం సాగుతుంది. అధికారులు అడిగినంత ఇచ్చేందుకు షాపుల యజమానులు ససేమిరా అంగీకరించడం లేదు. ఒక్కో షాపుకు నెలకు రూ.25 వేలు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తుండగా, షాపుల యజమానులు మాత్రం రూ.15వేలు ఇస్తామంటూ మొండికేస్తున్నారు. ఈ మామూళ్ల విషయంలో ఇరువర్గాల మధ్య రాజీకుదరకపోవడంతో నిబంధనల ప్రకారం షాపులు నిర్వహించుకునేందుకు పట్టణంలోని మద్యంషాపుల యజమానులు సిద్ధమయ్యారు. అయితే దీనికి బదులుగా బార్ల యజమానుతో కొత్త ఒప్పందం చేసుకుని సరికొత్త దోపీడీకి స్కెచ్ వేశారు. అయితే మొత్తం వ్యవహారంలో మందుబాబులే జేబులు గుల్లచేసుకుంటున్నారు. వందలకొద్దీ బెల్టుషాపులు అయితే కందుకూరు పట్టణం మినహా ఇతర ప్రాంతాల్లోని మద్యంషాపుల్లో ఇష్టం వచ్చినట్లు బెల్టుషాపులు నిర్వహించుకుంటున్నారు. మద్యంషాపుల నుంచే నేరుగా బెల్టుషాపులకు ఆటోలు, కార్ల ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రతి గ్రామంలో నాలుగు వరకు బెల్టుషాపులు నిర్వహిస్తూ దోపీడీకి పాల్పడుతున్నారు. గుడ్లూరులో రెండు మద్యంషాపులు ఉండగా వీటిలో ఒకటి కేవలం బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసేందుకు కేటాయించినట్లు సమాచారం. ఈ విధానం ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గంలో బెల్టుషాపు లేని గ్రామం లేదంలే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఎకై ్సజ్ అధికారులుగాని, పోలీస్శాఖ అధికారులు గాని ఈ బెల్టుషాపుల జోలికి మాత్రం పోవడం లేదు. దుకాణాలు, బార్ల యజమానుల మధ్య కొత్త ఒప్పందం బార్లో క్వార్టర్ బాటిల్పై రూ.60 అదనంగా పెంచి విక్రయాలు వచ్చిన ఆదాయంలో చెరిసగం పంచుకునేలా అవగాహన ఇదేం దోపిడీరా బాబూ అంటున్న మందుబాబులు -
డాక్టర్ శ్రావణికి ప్రతిష్టాత్మక అవకాశం
వెంకటాచలం: వీఎస్యూ పూర్వవిద్యార్థి ని డాక్టర్ బతినపట్ల శ్రావణి ప్రతిష్టాత్మక 74వ లిండౌ నోబెల్ లారియట్ సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కడంతో వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. శ్రావణి వీఎస్యూలో ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేసి కడపలోని యోగివేమన వర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంకే పోస్ట్– డాక్టోరల్ ఫెలోగా పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29 నుంచి జూలై 4 తేదీ వరకు జర్మనీలోని లిండౌ నగరంలో జరగనున్న 74వ లిండౌ నోబెల్ లారియట్ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనే 600 మంది యువ శాస్త్రవేత్తల్లో ఒకరిగా డాక్టర్ శ్రావణి ఎంపికై ంది. -
మైనార్టీల సంక్షేమమే జగన్ ధ్యేయం
ముత్తుకూరు: ముస్లింల సంక్షేమానికి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముత్తుకూరులోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలను ఆదివారం ఆయన నిర్వహించారు. మైనార్టీ నేత అబ్దుల్ రహీమ్, ఎంపీటీసీ సభ్యుడు నవీద్బాషా, బడాభాయ్ తదితరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన కాకాణి మాట్లాడారు. ముస్లింలకు అండగా ఉంటామన్నారు. తొలుత కాకాణికి ఘన స్వాగతం పలికారు. పార్టీ మండలాధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, నెల్లూరు శివప్రసాద్, సీపారెడ్డి రామ్మోహన్రెడ్డి, దువ్వూరు కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఇఫ్తార్ విందుకు హాజరు -
పాలనలో కూటమి ప్రభుత్వం విఫలం
ఉదయగిరి: టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసీరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఉదయగిరిలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. సూపర్సిక్స్ పేరిట హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్, గంజాయి ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కువ అప్పులు చేస్తోందని మండిపడ్డారు. నేతలు అనిల్కుమార్రెడ్డి, మద్దూరు రాజగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖోఖోలో చిచ్చర పిడుగులు
● కష్టాలను అధిగమించి.. రాణిస్తూ ● జాతీయ పోటీలకు ఎంపిక తమ ఆశయానికి కష్టాలు ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించారు బీవీనగర్కు చెందిన రమ్య, భార్గవి. తల్లిదండ్రులు రోజు వారీ కూలీలైనా.. ఆర్థిక కష్టాలను అధిగమించి ఖోఖోలో రాణిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. స్టేడియం వద్దకు ఉదయం, సాయంత్రం వేళ క్రమం తప్పకుండా వచ్చి సాధన చేశారు. జిల్లా, రాష్ట్ర, సీనియర్స్ జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను మెరుగుపర్చుకున్నారు. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తున్నారు. – నెల్లూరు(స్టోన్హౌస్పేట) -
నిబద్ధతతో వ్యవహరించండి
నెల్లూరు సిటీ: డాక్యుమెంట్ రైటర్లు నిబద్ధతతో వ్యవహరించి రిజిస్ట్రేషన్లు చేయించాలని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకటసుబ్బారావు పేర్కొన్నారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం తెలిస్తే మీడియా లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్లు ఉన్నప్పుడు ఈ సమస్యే ఉండేది కాదని, అయితే ఇప్పుడు ఎవరుపడితే వారు ముందుకొస్తున్నారని చెప్పారు. ఐకమత్యంతో ఉంటేనే రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానంలో సబ్ రిజిస్ట్రార్ ఓకే చేసే ప్రక్రియకు స్వస్తి పలికేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు పట్నం దుర్గేష్బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు సీతాపతిరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిబద్ధతతో వ్యవహరించండి
నెల్లూరు సిటీ: డాక్యుమెంట్ రైటర్లు నిబద్ధతతో వ్యవహరించి రిజిస్ట్రేషన్లు చేయించాలని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకటసుబ్బారావు పేర్కొన్నారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం తెలిస్తే మీడియా లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్లు ఉన్నప్పుడు ఈ సమస్యే ఉండేది కాదని, అయితే ఇప్పుడు ఎవరుపడితే వారు ముందుకొస్తున్నారని చెప్పారు. ఐకమత్యంతో ఉంటేనే రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానంలో సబ్ రిజిస్ట్రార్ ఓకే చేసే ప్రక్రియకు స్వస్తి పలికేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు పట్నం దుర్గేష్బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు సీతాపతిరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన లారీ
● తప్పిన ఘోర ప్రమాదం సంగం: పెట్రోల్ బంకులోకి లారీ దూసుకెళ్లిన ఘటన సంగం కొండ కూడలి వద్ద గల జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కొండ పైనుంచి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో బంకు ముందున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లు నుజ్జునుజ్జయ్యాయి. వరికోత యంత్రాలు, బంకు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నాయి. పెను ప్రమాదం తప్పడంతో పలువురు ఊపిరిపీల్చుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని వివరాలను పోలీసులు సేకరించారు. సుమారు రూ.మూడు లక్షల మేర నష్టం వాటిల్లింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొనడంతో వాహనచోదకుడి దుర్మరణం వెంకటాచలం: కారు ఢీకొనడంతో వాహనచోదకుడు మృతి చెందిన ఘటన మండలంలోని గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్పై 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే క్షయ.. క్షోభే
ఆరోగ్యం బేజారయ్యే అవకాశం శారీరకంగా, ఆర్థికంగా కుంగుబాటునెల్లూరు(అర్బన్): క్షయతో ఆరోగ్యం గుల్లవుతుంది. చాపకింద నీరులా జిల్లాలో ఇది వ్యాపిస్తుండటం కలవరానికి గురిచేస్తోంది. తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లు పక్కవారిపై పడితే అందులోని సూక్ష్మజీవుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. శరీరంలోని ఏ భాగానికై నా ఇది రావొచ్చు. జిల్లాలో 16 వేల మంది వరకు రోగులున్నారని ఐఎంఏ లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల ద్వారా గుర్తించిన కేసులే వైద్యశాఖ రికార్డుల్లో ఉంటున్నాయి. అదే ప్రైవేట్ హాస్పిటళ్లలో గుర్తించే కేసుల వివరాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. వ్యాధి విషయాన్ని తెలియకుండా చూడాలని పలువురు రోగులు కోరుతుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. వ్యాధి బారినపడి ఏటా 80 నుంచి 100 మంది వరకు మృత్యువాత పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మొదటికి టీబీ సోకిన వారు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు మందులను వినియోగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటే వ్యాధి తగ్గుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. కొంతకాలం మందులు వాడి ఆపేసినా మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. తదుపరి టీబీ ముదిరి, ఏడాది నుంచి రెండేళ్ల పాటు మందులను వాడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అధికారిక లెక్కల మేరకు ప్రస్తుతం 24 మందికి ఇలా మారిందని సమాచారం. ఐదేళ్లలోపు పిల్లలకు సోకితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రోగులకు భరోసాగా.. టీబీ సోకిన వారికి జిల్లా టీబీ నివారణ శాఖ ఆధ్వర్యంలో ఖరీదైన మందులను ప్రతి నెలా క్రమం తప్పకుండా అందజేయడంతో పాటు మింగిస్తున్నారు. వ్యాధికి గురైన వారు పనులకు దూరంగా ఉండాల్సిన తరుణంలో పౌష్టికాహారం కోసం రూ.వెయ్యిని వారి ఖాతాలో ప్రభుత్వం జమచేస్తోంది. రోగిని ప్రైవేట్ డాక్టర్లు గుర్తించి సమాచారమందిస్తే సదరు వైద్యుడికి ప్రోత్సాహకంగా రూ.500ను అందజేస్తున్నారు. చికిత్స పూర్తయ్యాక మరో రూ.500, డాట్ పద్ధతిన రోగితో మందులు మింగించినందుకు ఆరోగ్య కార్యకర్తలకూ ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న రోగులు టీబీ యూనిట్లు 13 గళ్ల పరీక్ష కేంద్రాలు 92 ఇవీ లక్షణాలు.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం రావడం, గళ్ల పడటం, అందులో రక్తపు ఛారలుండటం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలుంటే టీబీగా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి. మెడ, గొంతు, చెంపపై చెవి కింద, చర్మంలోపల గడ్డలుంటే వ్యాధిగా అనుమానించాలి. ఇంట్లో ఎవరికై నా వస్తే, మరొకరికి సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.వ్యాధికి ప్రధాన కారణాలు.. టీబీని మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే సూక్ష్మజీవి కలిగిస్తోంది. హెచ్ఐవీ, ఎయిడ్స్తో బాధపడేవారు, పౌష్టికాహార లోపంతో బలహీనంగా ఉండే వారు, వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే స్టెరాయిడ్స్ను వినియోగించే వారికి ఇది సోకుతోంది. ఊపిరితిత్తులకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. మద్యం, ధూమపానం అలావాటుండే వారు, షుగర్ వ్యాధిగ్రస్తులకు త్వరగా వచ్చే అవకాశం ఉంది. సీబీనాట్ / జీన్ ఎక్స్పర్ట్ కేంద్రం 1ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం నేడు జిల్లాలో గతంలో తగ్గుముఖం పట్టిన క్షయ (టీబీ) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆహార లోపంతో బాధపడేవారు, మురికివాడల్లో ఉండే పేదలకు ఈ వ్యాధి వేగంగా సోకుతోంది. ఓ వ్యక్తి నుంచి మరొకరికి అంటువ్యాధిగానూ వ్యాపిస్తోంది. దీని బారినపడిన వారికి రోజూ బలవర్థకమైన ఆహారాన్ని అందించాల్సి ఉండటంతో ఆ కుటుంబంపై ఆర్థిక భారమూ పడుతోంది. ఖరీదైన మందులను ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు క్రమం తప్పకుండా వినియోగించాలి. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, అది ప్రాణాంతకమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిపినవి 13,550 2024లో నిర్వహించిన పరీక్షలు 83,381 పెరుగుతున్న కేసులు జిల్లాలో సుమారు 16 వేల మంది రోగులు ఏటా 80 నుంచి 100 మంది మృతి నాణ్యమైన వైద్యసేవలు టీబీని నివారించడమే లక్ష్యంగా నాణ్యమైన సేవలను ప్రభుత్వం అందిస్తోంది. ఖరీదైన మందులను ఇంటి వద్దే రోగికి అందేలా చూస్తున్నాం. అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. – ఖాదర్వలీ, జిల్లా టీబీ నియంత్రణాధికారి జాగ్రత్తలు తప్పనిసరి టీబీపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. నాట్ వంటి కొత్త పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ప్రైవేల్ ఆస్పత్రుల్లో కఫం పరీక్షలు చేస్తున్నారు. వ్యాధిగా నిర్ధారణైతే జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడితే నయం చేయొచ్చు. – గౌరీనాథ్, పల్మనాలజిస్ట్, ఎనెల్ స్పెషాల్టీ ఆస్పత్రి, నెల్లూరు -
కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
● 6, ఇంటర్ తరగతులకు దరఖాస్తులు దుత్తలూరు: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయింది. 2025–26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి జిల్లా సమగ్ర శిక్షా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తులు చేసుకుని అర్హులైన బాలికలు ఆరో తరగతి, ఇంటర్లో ప్రవేశం పొందవచ్చు. జిల్లాలో 12 కేజీబీవీల్లో ఆంగ్ల మాధ్యమంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లు భర్తీ చేయనున్నారు. ఒక్కొక్క కేజీబీవీకి ఒక ఇంటర్ కోర్సును కేటాయించి 40 సీట్లు కేటాయించారు. జిల్లాలోని ఉలవపాడు, కందుకూరు, వలేటివారిపాళెం, సీతారామపురం, కొండాపురం, కావలి కేజీబీవీల్లో ఎంపీసీ గ్రూపు, నందిపాడు, ఏఎస్పేట, గుడ్లూరు, లింగసమద్రం కేజీబీవీల్లో బైపీసీ, కలిగిరి, మర్రిపాడు కేజీబీల్లో ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. సమష్టి కృషితోనే వెలుగొండ జలాలు సాధ్యం ఉదయగిరి: నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల ప్రజలు ఉద్యమిస్తేనే వెలుగొండ జలాశయం పూర్తయి సాగు, తాగునీరు అందుతాయని వెలుగొండ ప్రాజెక్ట్ జలాల సాధన సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. స్థానిక షాదీ మంజిల్లో ఆదివారం వెలుగొండ ప్రాజెక్టు జలాల సాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వెలుగొండ జలాశయం పూర్తయితే మూడు జిల్లాల్లోని 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతాయన్నారు. 29 ఏళ్ల క్రితం పనులు ప్రారంభమైనా ఇంకా కొనసాగుతుండడం చూస్తే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతోందన్నారు. ఏపీ అంటే ఒక అమరావతో, ఒక పోలవరమో కాదని, అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.7 వేల కోట్లు అవసరం కాగా, ఈ ప్రభుత్వం కేవలం రూ.309 కోట్లు ప్రస్తుత బడ్జెట్లో కేటాయించడం దారుణమన్నారు. కేవలం ఏడు వేల కోట్లతో వెలుగొండ ద్వారా మూడు జిల్లాల మెట్ట ప్రాంతాలకు జలాలు అందించే అవకాశం ఉంటే.. రూ.80 వేల కోట్లు పెట్టి గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు తీసుకొస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం రాజకీయ నేతలు, మేధావులు, రైతులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకతపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసీరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్, ఎం.రమేష్, దామా అంకయ్య, అజయ్కుమార్, బసిరెడ్డి మాలకొండారెడ్డి, దస్తగిరి అహ్మద్, ఫడ్స్ రమణయ్య, కామేపల్లి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి నెల్లూరు సిటీ: అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి తన ఇంట్లోనే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం నగరంలోని భగత్సింగ్ కాలనీలో టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్లో జరిగింది. పోలీసులకు సమాచారం మేరకు.. బ్లాక్ నంబర్ సీ 28లో సర్దార్ బాషా (32) ఒంటరిగా నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన సర్దార్ బాషా శనివారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఆదివారం పక్క ఫ్లాట్లోని వ్యక్తి వచ్చి ఎన్నిసార్లు తలుపుతట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే బాషా నోట్లో నుంచి నురగ వచ్చి మృతి చెందాడు. నవాబుపేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలో పునరుద్ధరించే యత్నం
వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో షుగర్ ఫ్యాక్టరీపై ఆశలు చిగురించాయి. అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రాధాన్యతను, రైతులు, ఉద్యోగుల బకాయిల విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి వివరించారు. దీంతో ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నాహాలు చేశారు. అందులో భాగంగా ఫ్యాక్టరీ స్థితిగతులు తెలుసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఫ్యాక్టరీలోని యంత్రాలను పరిశీలించింది. 2013 నుంచి ఫ్యాక్టరీ మూతపడిపోవడంతో యంత్రాలు వినియోగపడవని నిర్ధారించింది. ఫ్యాక్టరీ పునః ప్రారంభించడం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వందల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని కమిటీ స్పష్టం చేసింది. -
వీనులవిందుగా గాత్రకచేరి
నెల్లూరు(బృందావనం): పురమందిర ప్రాంగణంలో త్యాగరాజ స్మరణోత్సవాలను భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహిస్తున్నారు. స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో ఆదివారం దర్శనమిచ్చారు. కేరళకు చెందిన విష్ణుదేవ్ నంబూద్రి గాత్రకచేరి వీనులవిందుగా సాగింది. 120 మందికిపైగా స్థానిక ఔత్సాహిక కళాకారులతో గాత్ర, వీణకచేరీలు మధురంగా సాగాయి. స్మరణోత్సవ సభ కమిటీ శాశ్వత కార్యదర్శి యనమండ్ర నాగదేవీప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి ఉదయగిరి: కుక్కలు దాడి చేయడంతో తాగునీటి కోసం జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన మండలంలోని మాసాయిపేటలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి చుక్కల దుప్పి రావడంతో కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు గమనించి దుప్పిని రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశీలించగా, దుప్పి అప్పటికే మృతి చెందిందని గుర్తించారు. అనంతరం గండిపాళెం పశువైద్యశాలకు తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. గన్నేపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో దుప్పిని ఖననం చేశారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో.. ముత్తుకూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ముత్తుకూరు – నెల్లూరు రోడ్డులోని తాళ్లపూడి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకొని వెళ్తుండగా, వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. మృతుడికి 50 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పూటుగా మద్యం సేవించి.. నిద్రలోనే కన్నుమూసి నెల్లూరు సిటీ: పూటుగా మద్యం సేవించి నిద్రలోనే వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రామచంద్రాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. రామచంద్రాపురంలో సాయి అనసూయమ్మ ఇంట్లో ఓ గదిని బాడుగకు తీసుకొని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పెద్దబ్బాయి (65) పది నెలలుగా నివాసం ఉంటున్నారు. నగరంలో కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి తన గదిలో శనివారం నిద్రించారు. ఈ తరుణంలో తలుపును యజమాని తట్టగా, తీయకపోవడంతో అనుమానం వచ్చి పగలగొట్టి చూడగా పెద్దబ్బాయి విగతజీవిగా పడి ఉన్నారు. మద్యాన్ని అధిక మొత్తంలో సేవించి అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నవాబుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 49.74 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 7800, లోలెవల్ కాలువకు 30, హైలెవల్ కాలువకు 120, మొదటి బ్రాంచ్ కాలువకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు. నిమ్మ ధరలు పొదలకూరు (కిలో) పెద్దవి: రూ.75 సన్నవి: రూ.55 పండ్లు: రూ.30 -
ఖోఖోలో చిచ్చర పిడుగులు
● కష్టాలను అధిగమించి.. రాణిస్తూ ● జాతీయ పోటీలకు ఎంపిక తమ ఆశయానికి కష్టాలు ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించారు బీవీనగర్కు చెందిన రమ్య, భార్గవి. తల్లిదండ్రులు రోజు వారీ కూలీలైనా.. ఆర్థిక కష్టాలను అధిగమించి ఖోఖోలో రాణిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. స్టేడియం వద్దకు ఉదయం, సాయంత్రం వేళ క్రమం తప్పకుండా వచ్చి సాధన చేశారు. జిల్లా, రాష్ట్ర, సీనియర్స్ జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను మెరుగుపర్చుకున్నారు. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తున్నారు. – నెల్లూరు(స్టోన్హౌస్పేట) -
హామీలు మరిచి అవాస్తవాల ప్రచారం
● కూటమి సర్కార్పై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ధ్వజం నెల్లూరు(బారకాసు): ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా, టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. ఆదివారం నగరంలోని రాంజీనగర్లో ఉన్న సిటీ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 17 మంది వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించి తొలగించిందన్నారు. ఈ విషయంపై తాము ఆధారాలు బయటపెడితే విచారణ జరుపుతామని చెప్పిన మంత్రి లోకేశ్ ఇప్పటికీ విచారణ జరపకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2023–24 సంబంధించి మూడు క్వార్టర్స్ 2024–25 ఏడాదికి సంబంధించి మూడు క్వార్టర్స్ మొత్తం ఆరు క్వార్టర్స్ బకాయిలు రూ.5,252 కోట్లు టీడీపీ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. అలాగే వసతి దీవెనకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందన్నారు. ఈ బకాయిలన్నీ విడుదల చేయకుండా జగన్మోహన్రెడ్డి మీద అవాస్తవాలు మాట్లాడుతూ కాలయాపన చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ప్రవేశపెట్టి 45 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి భృతి అందిస్తామని చెప్పి ఇప్పుడు వారిని నిలువునా దగా చేసిందన్నారు. పూర్తిగా ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రోడ్డు పాలు చేశారన్నారు. టీడీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, మరలా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత
● ఉద్యోగులు, కార్మికులు, రైతులకు రూ.కోట్లలో బకాయిలు ● 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలో అన్ని బకాయిలు చెల్లింపు ● ఫ్యాక్టరీని పునః ప్రారంభించిన వైనం ● 2013లో మళ్లీ మూతపడిన పరిస్థితి ● ఫ్యాక్టరీని తెరిపిస్తానని యువగళం పాదయాత్రలో లోకేశ్ హామీ ● అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఆ ఊసే లేదు కోవూరు: జిల్లాలో డెల్టా ప్రాంతమైన కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంలో 1979 ఫిబ్రవరిలో 124 ఎకరాల విస్తీర్ణంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. రోజుకు 1,250 మెట్రిక్ టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ప్రారంభించిన ఫ్యాక్టరీ.. కాలక్రమంలో చెరకు సాగు విస్తీర్ణం పెరగడంతో రోజుకు 2,500 మెట్రిక్ టన్నుల క్రషింగ్ సామర్థ్యానికి చేరింది. జిల్లాలో కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెంతోపాటు పొదలకూరు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో సుమారు 10 వేల మంది రైతులు చెరకు సాగు చేపట్టారు. వందలాది మంది కార్మికులతో రేయింబవళ్లు ఫ్యాక్టరీ వైభవంగా నడిచేది. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ రంగంలోని షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేయాలనే జపంతో వాటి మనుగడను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే 1999లో కోవూరు షుగర్ ఫ్యాక్టరీని మూసివేశారు. అప్పటికే ఫ్యాక్టరీకి చెరకు తొలిన రైతులకు కోట్లాది రూపా యల బకాయిలు పెండింగ్లో ఉన్నా.. రూపాయి చెల్లించకుండా మూతవేశారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ లో శాశ్వత, క్యాజువల్ ఉద్యోగులు, కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. కనీసం వారికి పరిహారం కూడా ఇవ్వకపోడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2004లో పునఃప్రారంభించిన వైఎస్సార్ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితిని తెలుసుకున్న వైఎస్ రాజశేఖర్రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే 2004లో క్రషింగ్ సీజన్కు ముందే రైతులు, ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించారు. ఫ్యాక్టరీ మెషినరీ తుప్పు పట్టిపోవడంతో నిధులు కేటాయించి పునరుద్ధరణ చేశారు. అప్పటి నుంచి సజావుగా నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీ వైఎస్సార్ అకాల మరణంతో ఒడిదొడుకులకు గురైంది. నష్టాలో ఊబిలో కూరుకుపోవడంతో 2013లో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి హయాంలో అర్ధాంతరంగా మూత పడింది. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం 2014 ఎన్నికల ప్రచారంలో కోవూరుకు వచ్చిన చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీని తాను తిరిగి పునరుద్ధరించి రైతులకు, కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీ విషయాన్ని విస్మరించారు. కమిటీల పేరుతో రైతులు, ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లూ కాలయాపన చేశారు. చెరకు సాగు నిలిచిపోవడంతో.. దాదాపు ఏడెనిమిదేళ్లుగా ఫ్యాక్టరీ మూతపడిపోవడంతో జిల్లాలో చెరకు సాగును రైతులు పూర్తిగా మానే శారు. తిరిగి ఫ్యాక్టరీ ప్రారంభించినా చెరకు పంట అందుబాటులో లేని కారణంగా క్రషింగ్ అసాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన నిపుణల కమిటీ నివేదికలో పేర్కొంది. గతంలో చెరకు సాగు చేసిన భూముల్లో ప్రత్యామ్నాయంగా వరి సాగు చేస్తుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేసినా మళ్లీ మూతపడే పరిస్థితి అనివార్యమవుతుందని కమిటీ స్పష్టం చేసింది. యువగళంలో లోకేశ్ హామీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి తిరిగి పూర్వ వైభవాన్ని తెస్తానని లోకేశ్ ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని, ఉద్యోగులు, కార్మికుల వేతనాల బకాయిలు చెల్లిస్తామని గొప్పలు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఆ ఊసేలేదు. తాజాగా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఫ్యాక్టరీ మూత పడడానికి తాను అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే కారణమని తెలుసుకోకుండా, అధికారంలో ఉండి పది నెలలుగా అసమర్థత ప్రదర్శిస్తూ గత ప్రభుత్వం, పాలకులపై నెపం నెట్టి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోవూరు షుగర్ ఫ్యాక్టరీజిల్లాకే తలమానికంగా కో–ఆపరేటివ్ రంగంలో ఏర్పాటైన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ టీడీపీ హయాంలో చంద్రబాబు అందుకున్న ప్రైవేటీకరణ జపంతో మూత పడింది. దీంతో వందలాది ఉద్యోగ, కార్మిక కుటుంబాలు, వేలాది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ వాగ్దానాలు చేశారే తప్ప పట్టించుకోలేదు. తాజాగా అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఆ ఊసే లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు షుగర్ ఫ్యాక్టరీపై అసత్యాలు మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ధాన్యం కొను‘గోల్’ తంతు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రైతులకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి సివిల్ సప్లయీస్, కో–ఆపరేటివ్ మార్కెటింగ్ శాఖల ద్వారా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికార యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటించింది. అధికార యంత్రాంగం, మిల్లర్లు మిలాఖత్ అయి నిత్యం పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలు లక్ష్యం ఒక తంతుగా మార్చేశారు. దళారుల ద్వారా మిల్లర్ కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం పీపీసీల లెక్కల్లో వేసి రైతులను దగా చేస్తున్నారు. పీపీసీల ద్వారా ధాన్యం విక్రయించినట్లు నమోదైన రైతులకు మద్దతు ధర ప్రకారం పుట్టికి రూ.19,600 అందించామని అధికారులు నిజాయితీగా గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా?. నిరూపించగలరా?. అంటే ఏదీ చెప్పలేరు. దిగుబడి ఎంత.. కొన్నది ఎంత.. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరం చేశామని నిత్యం ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్కు సంబంధించి సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని వీరే చెబుతున్నారు. కానీ శనివారం నాటికి 33,275 మెట్రిక్ టన్నుల ధాన్యం పీపీసీల ద్వారా కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 60 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. అంటే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. ఇందులో పీసీసీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం 5 శాతం కూడా లేదని అధికారుల ప్రకటన ద్వారానే అర్థమవుతోంది. దిగుబడి వచ్చిన 95 శాతం ధాన్యం నేరుగా మిల్లర్లకు దళారుల ద్వారా విక్రయిస్తున్నారనేది వాస్తవం. అధికార యంత్రాంగం 300 పీపీసీలు ఏర్పాటు చేసినట్లు ఆర్భాటంగా చెబుతున్నా.. జిల్లాలో ఒక్క రైతుకు కూడా న్యాయం జరగడం లేదనేది ఈ లెక్కలే చెబుతున్నాయి. పీపీసీల ద్వారా దళారులే విక్రయాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 33,275 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నా, ఇందులో 90 శాతం దళారుల ద్వారానే జరిగాయని తెలుస్తోంది. వాస్తవానికి రైతులు పీపీసీలను సంప్రదించినా మిల్లరు ధాన్యం కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తేనే గన్నీ బ్యాగ్లు ఇస్తారు. ఈ ప్రక్రియ అస్సలు జరగడం లేదు. పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలుకు మిల్లరు సిద్ధపడితే ధాన్యం పట్టుబడి నుంచి మిల్లు వరకు చేర్చే బాధ్యత ఆ రైతుదే. ధాన్యం పట్టుబడి చేయడానికి బస్తాకు రూ.30 కూలి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రైతులే భరించుకోవాలి. 99 శాతం మంది మిల్లర్లు పీపీసీల ద్వారా ధాన్యం విక్రయించుకునే రైతులకు గన్నీ బ్యాగ్లు ఇవ్వడం లేదు. రైతులే బస్తాలు, ట్రానన్స్పోర్టు వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తీరా మిల్లరు దగ్గరకు ధాన్యం తీసుకెళ్లితే నాణ్యత లేదని, గడ్డి ముక్క ఉందని, తేమ శాతం అధికంగా ఉందని తరుగు పేరుతో పేచీ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇన్ని ఖర్చులు, ఇన్ని ఇబ్బందులు భరించినా.. చివరకు ఆ రైతుకు పుట్టి ధాన్యానికి దక్కే ధర రూ.15 వేలు కూడా రావడం లేదు. దీంతో రైతులు ఈ తలనొప్పులు ఎందుకుని దళారులనే ఆశ్రయించి అమ్ముకుంటున్నారు. వీరు సదరు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వారి పొలం తాలూకా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లి పీపీసీలో నమోదు చేయించుకుంటున్న విషయం బహిరంగ విషయం. బ్యాంక్ గ్యారెంటీలు అరకొరే జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ రైస్ మిల్లింగ్) చేసే మిల్లులు 103 ఉన్నప్పటికీ వీటిలో కేవలం 50 నుంచి 60 మిల్లులు మొక్కుబడిగా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చాయి. మిగతా మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వకపోయినా.. అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో వారికే తెలియాలి. పీపీసీ ద్వారా ధాన్యాన్ని మిల్లుకు ట్యాగ్ చేయాలంటే.. సదరు మిల్లరు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి ఉండాలి. బ్యాంక్ గ్యారెంటీ లేని మిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని పీపీసీ ద్వారా పంపించడం అసాధ్యం. మిల్లర్లు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోవడంతో పీపీసీలు ఆ మిల్లులకు ధాన్యాన్ని ట్యాగ్ చేయడం లేదు. దీంతో రోజుల తరబడి రైతులు ధాన్యాన్ని నిలబెట్టుకోలేక నేరుగా మిల్లర్లకు దళారుల ద్వారా విక్రయించుకుంటున్నారు.రైతు నష్టపోతున్నదిలా.. జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఇప్పటికే 60 శాతం కోతలు పూర్తి పీపీసీల ద్వారా 33,275 మెట్రిక్ టన్నులే కొనుగోలు 103 రైస్ మిల్లులకు సీఎంఆర్ అనుమతి 50 మిల్లులే రూ.30 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ కల్లాల్లో ధాన్యం కొనడం ఒక ప్రహసనం జిల్లాలో పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలు ఒక తంతుగా సాగుతోంది. దిగుబడికి.. కొనుగోలుకు మధ్య తేడానే ఇందుకు అద్దం పడుతోంది. సీఎంఆర్ అనుమతి ఉన్న రైస్ మిల్లుల్లో సగం మిల్లులు కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదంటే ప్రభుత్వం, రైస్ మిల్లర్లు కలిసి ‘దోపిడీ డ్రామా’ ఆడుతున్నట్లు విస్పష్టమవుతోంది. కల్లాల్లోనే ధాన్యం కొనడం ఒక ప్రహసనంగా సాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు పీపీసీల ద్వారా కొంటున్న ధాన్యం లెక్కలు అధికార యంత్రాంగం ప్రకటిస్తున్నా.. ఏ రైతు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చేసుకోవడం లేదు. నేరుగా దళారులకే అమ్ముకుంటున్నారనేది నిజం. కొడవలూరు మండలానికి చెందిన ఓ రైతుకు 8 ఎకరాల పొలం ఉంది. ఆయన బీపీటీ 5204 వరి సాగు చేశాడు. పంట కోతకు రావడంతో ఒక దళారీని సంప్రదించాడు. పుట్టికి రూ.17 వేలు మాత్రమే ధర ఉందని చెప్పాడు. దీంతో ఆ రైతు స్థానిక పీపీసీ ద్వారా ధాన్యం విక్రయించడానికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ను సంప్రదించాడు. దిగుబడి అంచనాను బట్టి గన్నీ బ్యాగ్స్ ఆ రైతుకు అందజేశారు. వరి కోత కోసి ధాన్యం రాసి పోశాడు. సదరు రైతు ధాన్యం సరఫరా చేయడానికి ట్యాగ్ చేసిన మిల్లర్ అంత ధాన్యం తాము తీసుకోమని, మార్కెట్లో పుట్టి రూ.17 వేలే ఉంటే.. పీపీసీ ద్వారా రూ.19,700 పెట్టి ఎందుకు కొనాలని రైతును ప్రశ్నించాడు. ఇక కూలీలు, రవాణా ఖర్చులు పెట్టుకుని, మిల్లర్ అడిగినంత తరుగు ఇచ్చుకుంటే.. పుట్టికి రూ.16 వేలు కూడా వచ్చేటట్లు లేదని లెక్కలు వేసుకున్న ఆ రైతు ఆలోచనలో పడ్డాడు. అప్పటికే రెండు రోజులు గడిచిపోవడంతో ధాన్యం తడారిపోతుండడంతో నేరుగా మిల్లర్కే దళారీ ద్వారా విక్రయించాడు. కానీ ఈ ధాన్యం పీపీసీ ద్వారా విక్రయించినట్లు ఇటు అధికారులు, అటు మిల్లర్ నమోదు చేసుకున్నారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
● ఆటోను బైక్ ఢీకొని ముగ్గురి దుర్మరణం ● మృతుల్లో ఇద్దరు ఐటీఐ విద్యార్థులు, ఆటో డ్రైవర్ మనుబోలు: నిర్లక్ష్యంగా అతి వేగంతో బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మనుబోలు మండలంలోని గొట్లపాళెం వద్ద శనివారం జరిగింది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన ఆటోడ్రైవర్ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. సైదాపురం మండలం ఊటుకూరు దళితవాడుకు చెందిన నోసిన వెంకటేశ్వర్లు కుమారుడు వరుణ్కుమార్ (18), అర్తనపల్లి శంకరయ్య కుమారుడు నందకిశోర్ (18), మరో కుమారుడు అర్తనపల్లి ఈశ్వర్ ముగ్గురు మిత్రులు. వీరిలో వరుణ్కుమార్, నందకిశోర్ గూడూరులోని కళ్యాణ్ చక్రవర్తి కళాశాలలో ఐటీఐ చదువుతున్నారు. ఈ ముగ్గురు కలిసి బైక్పై నెల్లూరుకు పనిమీద వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గొట్లపాళెంలో ఉంటున్న వరుణ్ అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు నెల్లూరు నుంచి కసుమూరు, వడ్లపూడి మీదుగా వేగంగా వస్తున్నారు. అదే సమయంలో పొదలకూరు నుంచి ప్రయాణికులతో వడ్లపూడి వెళుతున్న ఆటోను ఎదురుగా వచ్చిన బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వరుణ్కుమార్, నందకిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ తురకా సురేంద్ర (38) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్పై వెనుక ఉన్న ఈశ్వర్తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేంద్ర మృతి చెందాడు. మృతులు ముగ్గురివి పేద కుటుంబాలే. అతి వేగం, నిర్లక్ష్యం మూడు కుటుంబాలను రోడ్డుపాల్జేసింది. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, మనుబోలు ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు కుటుంబాల్లో విషాదం ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఊటుకూరుకు చెందిన ఇద్దరు యువకులు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికంది వచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డున పడిన ఆటో డ్రైవర్ కుటుంబం ఆటో డ్రైవర్ సురేంద్రది పొదలకూరు కాగా అతను వడ్లపూడిలో పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చి ఇక్కడే ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సురేంద్రకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సురేంద్ర మృతి చెందడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయి రోడ్డున పడినట్లు అయింది. ముగ్గురు యువకుల అతివేగం ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఒకే బైక్పై మితిమీరిన వేగంతో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఇద్దరు యువకులతోపాటు ఆటో డ్రైవర్ కూడా దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. పనిమీద నెల్లూరుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో యువకుల్లో ఒకరి అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. -
ఐసీడీఎస్లోనూ అదే తీరు
పెద్ద మొత్తంలో స్వాహా జిల్లాలో ఐసీడీఎస్, విద్యాశాఖలు అవినీతి మయంగా మారాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అంగన్వాడీల విధులను పర్యవేక్షించే అధికారుల నుంచి ప్రాజెక్ట్ కార్యాలయం వరకు అడుగడుగునా ప్రతి బిల్లులో కమీషన్లు కొట్టేస్తున్నారు. ప్రాజెక్ట్ స్థాయి సమావేశాలకు వెళ్లినా.. సెక్టార్ స్థాయి సమావేశాలకు వెళ్లినా కనీసం టీఏ బిల్లులు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు కాజేస్తున్న పరిస్థితి. ఇటీవల అంగన్వాడీలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘జ్ఞానజ్యోతి’, ఐడీసీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ, పఢాయి భీ ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ఏర్పాటు చేసిన భోజనం, స్నాక్స్ నిధుల్లో ఎంఈఓలు కుక్కుర్తి చూపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శిక్షణకు హాజరైన కొన్ని ప్రాజెక్ట్ల అంగన్వాడీలకు ఇంత వరకు టీఏ బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది. నేను తిన్న బిల్లులు అరగడం లేదు ● గత నెలలో అంగన్వాడీలకు ‘జ్ఞానజ్యోతి’ ట్రైనింగ్ ● ఈ నెలలో పోషణ్ భీ, పఢాయి భీ కార్యక్రమం ● భోజనం, స్నాక్స్లో కక్కుర్తి ● టీఏ బిల్లులూ అందరికీ చెల్లించని వైనం టీఏ బిల్లులుఉదయగిరి: ఐసీడీఎస్, విద్యా శాఖల్లోని కొందరు అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. గత నెలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘జ్ఞాన జ్యోతి, ఈ నెలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ, పఢాయి భీ శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు మంజూరు చేసిన భోజనం, స్నాక్స్, టీఏ, స్టేషనరీ నిధులను భారీగా మెక్కినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యాబోధన కోసం జిల్లా వ్యాప్తంగా సెక్టార్ స్థాయిలో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో అంగన్వాడీలకు అందించిన భోజనం, స్టేషనరీ సామగ్రి కొనుగోలు, రవాణా ఖర్చులు (టీఏ), స్నాక్స్ తదితరాల్లో కొంత మంది నిర్వాహకులు చేతివాటం ప్రదర్శించి నిధులు స్వాహా చేశారు. రోజంతా కష్టపడితే అంతంత మాత్రం వేతనాలు వచ్చే చిరుద్యోగుల కడుపు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిఽధిలో 2,934 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చుతోంది. 3 నుంచి 6 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న చిన్నారులకు ఆట, పాటతో కూడిన చదువులు అందించేలా ‘జ్ఞానజ్యోతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంఈఓల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు రెండు విడతలుగా గత నెల 18వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రతి కార్యకర్తకు రోజుకు భోజనం, స్నాక్స్ కోసం రూ.300 కేటాయించింది. టీఏ కింద రూ.50, స్టేషనరీ మెటీరియల్ కోసం మరో రూ.100 కేటాయించారు. అయితే భోజనం, స్నాక్స్ కోసం కేవలం రూ.80 నుంచి రూ.100 వరకే ఖర్చు చేసినట్లు సమాచారం. కొన్ని కేంద్రాల్లో కనీసం మంచినీరు, స్నాక్స్ కూడా ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా అందించారు. అప్పటికప్పుడే చెల్లించాల్సిన టీఏలు ఇంత వరకు ఇవ్వలేదని కొందరు అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ఇక స్టేషనరీ సామగ్రి కొనుగోలు విషయంలోనూ అదే తంతు. ఈ నెలలో మూడు రోజుల పాటు ఐడీసీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ, పఢాయి భీ కార్యక్రమాలపై అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చారు. ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కోసం ప్రతి కార్యకర్తలకు రూ.450 ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భోజనం, స్నాక్స్ కోసం రూ.250, సామగ్రి కొనుగోలుకు రూ.50, టీఏ కోసం రూ.150 ఖర్చు చేయాలి. ఈ కార్యక్రమంలో కూడా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. భోజనం, స్నాక్స్ కోసం రూ.80 నుంచి రూ.100 వరకు ఖర్చు చేశారు. టీఏ రూ.150 ఇవ్వలేదు. అంగన్వాడీ కేంద్రంఅయినా భోజనం బిల్లులు కూడా వదలరా మీరు..! ఊరకే వచ్చిన భోజనం బిల్లులు, టీఏ బిల్లులు అంత అతిగా తింటే ఇలానే ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు రెండు శాఖల ఆధ్వర్యంలో 2,900 మంది శిక్షణ తీసుకున్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలో జరిగిన శిక్షణలో ప్రతి కార్యకర్త నుంచి ఒక్క భోజనం కోసమే కేటాయించిన నిధుల్లో రోజుకు రూ.200 లెక్కన స్వాహా చేశారు. ప్రతి రోజు రూ.5.80 లక్షలు, ఆరు రోజులకు రూ.34.80 లక్షలు మింగేశారు. టీఏ కోసం రూ.8.70 లక్షలు కేటాయించగా, ఇంత వరకు చాలా మందికి అందలేదు. కొంతమంది ఎంఈఓలు టీఏలు ఇవ్వగా, మరి కొంతమంది ఆలస్యమైతే మర్చిపోతారులే అని జాప్యం చేస్తూ ఇంకా బడ్జెట్ రాలేందటూ దాటవేస్తున్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలో కూడా అదే దందా కొనసాగింది. భోజనం, స్నాక్స్ కోసం రూ.100 ఖర్చు చేసి రూ.150 స్వాహా చేశారు. వింజమూరు ప్రాజెక్ట్లో అయితే కనీసం మంచినీరు, స్నాక్స్ కూడా ఇవ్వలేదు. ఇందులో కూడా భోజనంలో రూ.13 లక్షలు స్వాహా చేశారు. టీఏ రూపంలో ప్రతి కార్యకర్తకు రోజుకు రూ.150 లెక్కన రూ.450 ఇవ్వాల్సి ఉంది. ఇంత వరకు పైసా కూడా ఇవ్వలేదు. ఎవరైనా అడిగితే వేధింపులు తప్పువని ఎవరూ సాహసం చేసి సీడీపీఓలను టీఏ అడగలేకపోతున్నామని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ఇందులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకొని కార్యకర్తలకు రావాల్సిన టీఏలు ఇప్పించాల్సిన అవససరం ఉంది. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా నిబంధనల మేరకే వ్యవహరించామని తెలిపారు. టీఏ విషయంలోనూ, భోజనం ఖర్చు విషయం గురించి సమగ్ర సమాచారం ఇవ్వకుండా దాటవేశారు. -
సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ
కావలి: పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బక్కాలి నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేపట్టిన సైకిల్ యాత్ర కావలికి శనివారం చేరుకుంది. దేశంలోకి అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ కట్టడి, తీర ప్రాంత రక్షణ తదితరాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో యాత్రను ఈ నెల ఏడున ప్రారంభించారు. మొత్తం 60 మంది సభ్యులు పాలుపంచుకున్న ఈ యాత్ర కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్ వద్ద ముగియనుంది. ఈ – కేవైసీని నూరు శాతం పూర్తి చేయాలి నెల్లూరు (పొగతోట): రేషన్కార్డుదారులకు సంబంధించిన సభ్యులందరితో ఈ – కేవైసీని పూర్తి చేయించాలని డీఎస్ఓ అంకయ్య ఆదేశించారు. నగరంలోని జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో డీలర్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 7.21 లక్షలకుపైగా రేషన్ కార్డులకు గానూ 20 లక్షలకుపైగా సభ్యులున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 18 లక్షల మంది ఈ – కేవైసీని పూర్తి చేశారని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు మినహాయింపు ఉందని, ఈ నెల 31లోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. బైక్ల ఢీ: నలుగురికి గాయాలు ఉదయగిరి: బైక్లు ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయగిరికి చెందిన చాంద్బాషా, మస్తాన్, కాలేషా బైక్పై కృష్ణంపల్లెలోని పొలం వద్దకు బయల్దేరారు. వీరి వెనుకనే బైక్పై వస్తున్న పట్టణానికి చెందిన మస్తాన్.. గడ్డంవారిపల్లె సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి ఢీకొన్నారు. ఘటనలో నలుగురూ గాయపడ్డారు. వీరిని 108లో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దుత్తలూరులో పట్టపగలే దొంగతనం ● 11 సవర్ల బంగారు ఆభరణాల అపహరణ దుత్తలూరు: దుత్తలూరు సెంటర్లో శనివారం పట్టపగలే దొంగతనం జరిగింది. వివరాలు.. సెంటర్ సమీపంలోని వెంకయ్యస్వామి మందిర పక్కన చింతనబోయిన నరేష్ నివసిస్తున్నారు. మధ్యాహ్న వేళ ఎవరూ లేని సమయంలో గేట్ తాళాన్ని పగలగొట్టి.. ప్రధాన ద్వార తలుపు, తాళాన్ని ధ్వంసం చేసి లోపలికి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. బీరువాను పగలగొట్టి అందులోని 11 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇంటికొచ్చిన అనంతరం చోరీ విషయాన్ని నిర్ధారించుకున్న బాధితుడు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని ఎస్సై ఆదిలక్ష్మి పరిశీలించారు. వేలిముద్రలను క్లూస్టీమ్ సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గిట్టుబాటు ధర కల్పనలో విఫలం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(బారకాసు): రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. డైకస్రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో వెంకటాచలం మండల పార్టీ నేతలు, కార్యకర్తలతో శనివారం సమావేశమైన ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు గిటుబాటు ధర కల్పించకుండా ప్రకటనలనే పరిమితమవుతున్నారని విమర్శించారు. సోమిరెడ్డి మొక్కుబడిగా జరిపిన గొలగమూడి పర్యటనను చూసి రైతులు ఆవేదనకు గురయ్యారని చెప్పారు. డ్రామాలను ఆపి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ హయాంలో గతేడాది పుట్టి ధాన్యం రూ.25 వేలు పలకగా, ప్రస్తుతం రూ.16 వేలకు పతనమైందని తెలిపారు. రైతుల కు కనీస గిట్టుబాటు ధరగా రూ.19720 కల్పించాల్సి ఉండగా, దళారులు రూ.16 వేలకే దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారే తప్ప, రైతులను ఆదుకునేందుకు యత్నించడంలేదన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనే అంశాన్ని తన దృష్టికి తీసుకొస్తే న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రైవేట్ కేసులేస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు ఏ సమస్యొచ్చినా అండగా నిలిచి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. -
కీలకమైన రికార్డులు.. అధికారి ఇంటికా..?
కొడవలూరు: డీసీఎమ్మెస్లోని కీలకమైన మినిట్స్ బుక్, డే బుక్, లెడ్జర్లు.. డివిజనల్ కోఆపరేటివ్ అధికారి సుధాభారతి ఇంటికి మార్కెటింగ్ మేనేజర్ ద్వారా బుధవారం వెళ్లాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు ఆరోపించారు. నార్తురాజుపాళెంలోని తన అతిథిగృహ ప్రాంగణంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. రికార్డులను అధికారి ఇంటికి తీసుకెళ్తుండగా, మార్కెటింగ్ మేనేజర్ రవికుమార్ను ఓ విలేకరి ప్రశ్నించారని, దీంతో ఆయన తడుముకుంటూ తాను కొత్తగా వచ్చానని, అధికారి సూచనల మేరకే తీసుకెళ్లానని చెప్పారన్నారు. సీసీ పుటేజీల్లో చూసినా ఇదే విషయం బహిర్గతమవుతుందని చెప్పారు. డీసీఎమ్మెస్కు పర్సన్ ఇన్చార్జిగా జేసీ ఉన్నారని, ఆయనకు తెలియకుండా రికార్డులను అధికారి ఇంటికి తీసుకెళ్లడం దారుణమని చెప్పారు. అందులో దేన్ని మార్చేందుకు తీసుకెళ్లారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సదరు అధికారిపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలున్నాయని చెప్పారు. డీసీఎమ్మెస్ మార్కెటింగ్ మేనేజర్గా ఆమె ఉన్న సమయంలో సంస్థ రైస్ మిల్లును తన భర్తకు అప్పగించిన అంశాన్ని ప్రస్తావించారు. మిల్లులో అవకతవకలు జరిగి మెషినరీ పనికిరాకుండా పోయిందని చెప్పారు. డీసీఎమ్మెస్కు చెందిన బాణసంచా, పుస్తకాలు, వేప పిండి వ్యాపారంలోనూ రూ.నాలుగు లక్షలను స్వాహా చేశారని ఆరోపించారు. ఐసీడీఎస్ పీడీగా నియమించగా, అందులోనూ భారీ అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఆమె తీరే ఇంతని, మరో రెండు నెలల్లో రిటైరవ్వనున్నారని తెలిపారు. ఆమె అవినీతి బాగోతంపై విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ జ్యోతి, సర్పంచ్ సుప్రియ, పార్టీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరిరావు, నేతలు కొండా శ్రీనివాసులురెడ్డి, మాణిక్యరావు, అనపల్లి ఉదయ్భాస్కర్, జడ్డా సాయికుమార్, గాలి సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్ ఫిల్మ్పై తనిఖీలు
నెల్లూరు (టౌన్): రవాణా నిబంధనలకు విరుద్ధంగా కార్లు, బైక్లకు ఉన్న నంబర్ ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్పై ఇన్చార్జి ఆర్టీఓ బాలమురళి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలను శనివారం నిర్వహించారు. ముత్తుకూరు గేట్ సెంటర్లో జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఉన్న 38, బ్లాక్ఫిల్మ్ బిగించిన ఐదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న నాలుగు, సరైన పత్రాల్లేకుండా తిరుగుతున్న మూడు.. మొత్తం 50 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఎమ్వీఐలు రఫీ, పవన్ కార్తీక్, ఏఎమ్వీఐలు పూర్ణచంద్రరావు, స్వప్నిల్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పచ్చనేతల ‘బరి’ తెగింపు
సాక్షి, టాస్క్ఫోర్స్: కావలి మండలం చెన్నాయపాళెంలో అధికార పార్టీ నేతలు పక్కాగా కోడి పందేల బరిని, పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, బెట్టింగ్లు నిర్వహించారు. కోడి పందేలు వీక్షించేందుకు రెండు వరుసల్లో గ్యాలరీలు పెట్టి, టికెట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. బరికి ఆనుకుని ఉండే వరుసలో రూ.1,000 కాగా, ఆ తర్వాత వరుసకు రూ.700 టికెట్ ధరలుగా నిర్ణయించారు. బిర్యానీలు, ఇతరాలు అమ్మకాలు చేసేందుకు కొంత నగదు తీసుకుని అనుమతులిచ్చా రు. బరికి సమీపంలోనే మద్యం విక్రయాలు సిద్ధం చేశారు. చెన్నాయపాళెం ఎస్సీ కాలనీ సమీపంలో పుచ్చ తోటల్లో ఈ ఏర్పాట్లు చేసి మూడు రోజుల పాటు నిర్వహించారు. నిర్వాహ కుల మధ్య వివాదాలు రావడం, పోలీసులు హడావుడి చేయడంతో నిలిపి వేశారు. చెన్నాయపాళెం నుంచి పెద్దపట్టపుపాళెం రోడ్డు మీదుగా కోడి పందేల బరికి చేరుకునే విధంగా రోడ్డు వసతి ఉండే విధంగా సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడ జూద క్రీడల హడావుడి జరిగినా కనీసం పోలీసులకు సమాచారం లేదంటే నమ్మశక్యంగా కూడా లేదు. కోడి పందేలు బరి.. ప్రచారం మాత్రం క్యాసినో నిర్వాహకులు జూదగాళ్ల జేబులు ఖాళీ చేసి, తమ జేబులు నింపుకోవడానికి విస్తృత ప్రచారం చేశారు. కోడి పందేల కోసమే ఒక బరిని సిద్ధం చేశారు. దీంతో పాటు పేక ముక్కలతో ఆడే వివిధ రకాల ఆటల్లో పాల్గొనే జూదగాళ్ల కోసం‘క్యాసినో’ నిర్వహిస్తున్నట్లు అంతర్గత ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వందల సంఖ్యలో కార్లు చెన్నాయపాళెంకు చేరు కున్నాయి. కోడి పందేలు చూసేందుకు ప్రేక్షకులు బరి వద్దకు భారీగా తరలి వచ్చారు. ఈ విధంగా మూడు రోజులు ఈ జూద క్రీడలు నిర్వహించారు. పోలీసుల రాకతో నిలిపేశారు. రాబడి పంపకాల్లో విభేదాలు నిర్వాహకులకు భారీగానే రాబడి కూడా వచ్చింది. దీంతో పంపకాల విషయంలో వారి మధ్య గురువారం విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని నిర్వాహకుల్లో వారిలో వారే గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో ఉదయం 8.30 గంటలకు ఒక పోస్టు పెట్టారు. ఈ సమాచారం పోలీసులకు చేరింది. కావలిరూరల్ ఎస్ఐ బాజీబాబు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం 9 గంటలకు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడున్న నిర్వాహకులు, జూదగాళ్లు పొలాల్లో ఎటు పడితే అటు పరుగులెత్తి తప్పించుకున్నారు. పుచ్చ రైతులు అభ్యంతరం చెప్పినా.. ఇదిలా ఉండగా కోడి పందేలు వేయడానికి సిద్ధం చేసిన బరి పుచ్చ తోటలో ఉండడంతో ఆ పంట సాగు చేసిన రైతులు అభ్యంతరం చెప్పారు. పెద్ద సంఖ్యలో తమ పుచ్చ తోటలోకి జనాలు రాకపోకలు సాగిస్తే పుచ్చతోట ధ్వంసం అవుతుందని రైతులు కోడి పందేల నిర్వాహకులకు చెప్పారు. అయినా వారు ఖాతరు చేయలేదు. పంట కాలువపై సెంట్రింగ్ రేకులతో కాలిబాట వేసి జూదగాళ్లు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనాలు రావడంతో పుచ్చతోటలు ధ్వంసం అయ్యాయి. బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు కోడి పందేలు బరి, పేక ముక్కలతో వివిధ రకాల ఆటలు కోసం సర్వం సిద్ధం చేసిన నిర్వాహకులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మూడు రోజులు అక్కడ జూద క్రీడలు జరిగినా పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే అధికార పార్టీల ప్రాపకం కోసమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రచ్చకెక్కినా నిర్వాహకులపై కేసు నమోదు చేయకపోగా, నిర్వాహకుల చేతిలో దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు అందజేసినట్లుగా తెలిసింది. ఆస్పత్రిలో ఉన్న బాధితుల కేసు మెడికో లీగల్ కేసు అవుతుంది కాబట్టి, కౌంటర్ కేసుగా ముందస్తుగానే పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు ‘బరి’ తెగించారు. జిల్లాలోని కావలి మండలం చెన్నాయపాళెం వద్ద చట్ట విరుద్ధంగా పక్కాగా కోడి పందేలు, పేకాట బరులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రేక్షకుల కోసం రెండు వరుసల్లో గ్యాలరీలు ఏర్పాటు చేసి టికెట్లు వసూలు చేశారు. సుమారు వెయ్యి మంది వీక్షకులు కూర్చొని చూసే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడే బిర్యానీలు, ఇతర తినుబండారాలు అమ్ముకునేందుకు ‘వేలం’ పెట్టారు. గత మూడు రోజుల పాటు జరిగినా.. ఒక్క పోలీస్ కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిర్వాహకుల మధ్య తలెత్తిన పంపకాల్లో విభేదాల నేపథ్యంలో వారిలో వారే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విధిలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి హడావుడి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులకు ఓ కుటుంబం సమాచారం అందించినట్లు అనుమానించి వారిపై దాడికి తెగబడ్డారు. పక్కాగా కోడి పందేలు, పేకాట బరులు నిర్వాహకుల మధ్య పంపకాల్లో విభేదాలు వారిలో వారే పోలీసులకు సమాచారం ఖాకీల రాకతో నిర్వాహకులు, పందెం రాయుళ్లు పలాయనం అనుమానంతో ఒక కుటుంబంపై దాడి -
మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు
నెల్లూరు(క్రైమ్): ఆపరేషన్ గరుడకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో విజిలెన్స్, ఔషధ నియంత్రణ అధికారులు, స్థానిక పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు ఆత్మకూరు పట్టణంలోని రామలక్ష్మణ మెడికల్స్, ఎంఆర్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ, నెల్లూరు స్టోన్హౌస్పేటలోని సాయిరేఖ మెడికల్స్, శ్రీనివాస అగ్రహారంలోని అనంత సంజీవిని జనరిక్ మెడికల్ షాప్, ఆచారివీధిలోని గణేష్ మెడికల్స్, బోసుబొమ్మ సమీపంలోని రత్న మెడికల్స్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్లోనాజెపామ్, అల్పాజోలం తదితర డ్రగ్స్కు సంబంధించిన క్రయ, విక్రయాలపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఎంత మొత్తంలో మాత్రలు కొనుగోలు చేశారు?, ఎవరికి విక్రయించారు?, వాటికి సంబంధించిన బిల్లులు, వైద్యుడి ప్రిస్క్రిప్షన్ల మేరకే విక్రయించారా? లేదా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. తనిఖీల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. తాళాలు వేసి.. తనిఖీల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని కొందరు వ్యక్తులు తమ దుకాణాలకు తాళాలు వేసేశారు. ఈ సందర్భంగా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ వీరకుమార్ మాట్లాడుతూ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ల లేకుండా మత్తుమాత్రలను విక్రయించరాదన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు కె.నరసింహారావు, ఎ.శ్రీహరి, షేక్ సుభానీ, డీసీటీఓ విష్ణురావు, ఏఓ పి.వేణుగోపాల్రావు, ఏఈఈ బి.వెంకటరెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ ఇన్స్పెక్టర్లు కీర్తి పవిత్ర, టి.వెంకటకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మత్తుమాత్రల క్రయ, విక్రయాలపై పరిశీలన -
అటవీ భూమి కబ్జాకు యత్నం
సాక్షి టాస్క్ఫోర్స్: వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలోని తోపుగుంట సమీపంలోని పది ఎకరాల అటవీ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేశాడు. ఆ భూమి సోమశిల అనుసంధానమైన చైన్నె కాలువ సమీపంలో ఉండటం గమనార్హం. రూ.కోట్లు విలువ చేసే భూమిని కలువాయికి చెందిన ఓ వ్యక్తి చదును చేసి సాగు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. అలాగే ఆ భూమి సమీపంలోనే మరో 4.88 సెంట్లు ఓ వ్యక్తికి అసైన్మెంట్ పట్టా ఇవ్వగా.. దానిని కూడా ఆ వ్యక్తి కొనుగోలు చేసి మొత్తంగా సాగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ తంతు సంబంధిత అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. -
రక్షించుకుంటున్నాం
సోమశిల/ఆత్మకూరు: నాలుగునెలల పాటు ఎరువులు, పిండి వేసి ఏపుగా పెంచుకున్న వరి పైరును కంకి దశలో దుప్పులు, అడవి పందులు, కొన్ని గ్రామాల్లో ఎలుగుబంట్లు రాత్రి వేళల్లో తొక్కి నాశనం చేస్తుంటాయి. అవి తిరిగిన మేర పొలంలో పైరు నేలవాలడం, వడ్ల గింజలు రాలిపోవడం జరుగుతుంది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతుంటారు. రాత్రి వేళల్లో జంతువుల బారి నుంచి పైర్లను కాపాడుకునేందుకు కాపలా కాయడం కష్టమైన పని. ఆ సమయంలో విష పురుగుల బారిన పడి మృతిచెందిన అన్నదాతలు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితుల నుంచి పైర్లను రక్షించుకునేందుకు అనంతసాగరం మండలంలోని పెన్నాతీరం, కొండ, అటవీ ప్రాంతాల గ్రామాలైన గార్లదిన్నెపాడు, చిలకలమర్రి, పాతదేవరాయపల్లి, శంకరనగరం గ్రామాల రైతులు వినూత్నంగా ఆలోచించారు. ఏం చేస్తున్నారంటే.. రైతులు మైక్లను వినియోగిస్తున్నారు. ముందుగానే జంతువులను తరుముతున్నట్లుగా అరవడం, పళ్లెం లేదా డప్పు మోగించడం తదితర శబ్దాలను రికార్డు చేసి ఉంచుతారు. దీనిని ఆన్ చేసి తమకు కావాల్సిన ప్రాంతంలో పెట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. చిన్న రైతులు ఎకరాకు ఒకటి పెడుతుండగా, ఎక్కువ పొలం ఉన్న వారు 4, 5 సెట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని నుంచి వచ్చే శబ్దాలతో జంతువులు పొలాల్లోకి వచ్చేందుకు భయపడుతున్నాయి. ఆ నాలుగు గ్రామాల్లో రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తుండటంతో వారికి అడవి జంతువుల బాధలు తప్పాయి. అదే విధంగా పగటి వేళల్లో పక్షుల నుంచి పైర్లను రక్షించుకునేందుకు మెరిసే రిబ్బన్లను (అగ్ని రిబ్బన్లు) పొలాల్లో అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్నారు. సూర్యరస్మి రిబ్బన్లపై పడినప్పుడు పక్షుల కళ్లు భ్రమిస్తాయి. దీంతో అవి పైరుపై వాలకుండా వెళ్లిపోతాయి. ఇలా ఓ వైపు తమ పైరును రక్షించుకోవడంతోపాటు మూగ జీవాల ప్రాణాలను రక్షించేలా రైతులు అనుసరిస్తున్న ఈ విధానాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించే పైరు అడవి జంతువుల పాలవుతుంటుంది. రక్షణ కోసం కఠిన పద్ధతుల వల్ల అవి మృతిచెందడమో, గాయపడటమో జరుగుతుంది. ఈ సమయంలో కేసులతో పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొందరు రైతులు తమ వరి పైరును కాపాడుకునేందుకు.. మూగజీవాలకు హాని కలగకుండా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి పైరు రక్షణకు రైతుల చర్యలు అడవి జంతువులకు హాని చేయకుండా.. మైక్లను పెడుతున్న వైనం జంతువుల వల్ల పైరు దెబ్బతింటుండేది. నాలుగేళ్ల క్రితం మైక్లను పెట్టాం. జంతువులు పొలాల వద్దకు రావడం లేదు. వాటి బారి నుంచి పైర్లను రక్షించుకుంటున్నాం. ఎండ, వాన, మంచు నుంచి మైకులు పాడవకుండా ప్లాస్టిక్ కవర్లు చుట్టి కర్రలకు కట్టి పెడుతున్నాం. – నరేంద్ర, రైతు -
యుద్ధప్రాతిపదికన బకాయిల వసూలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ విజయన్ ఆదేశించారు. నెల్లూరులోని కోటమిట్టలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఆ శాఖ నెల్లూరు టౌన్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ అదనపు విద్యుత్ లోడును క్రమబద్ధీకరించేందుకు విద్యుత్ శాఖ కల్పించిన 50 శాతం రాయితీని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీని గడువు జూన్ 30వ తేదీతో ముగుస్తుందన్నారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు వినియోగదారులు స్వచ్ఛందంగా లైట్లు ఆపివేసి ఎర్త్అవర్ను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సర్చార్జ్ రద్దును వినియోగిం చుకోవాలని ఈ అవకాశం ఏప్రిల్ 17వ తేదీ వరకు ఉంటుందన్నారు. పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నగరంలోని అన్ని సబ్స్టేషన్లలో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు (పీక్ అవర్స్)లో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సైబర్ నేరగాళ్ల నుంచి విద్యుత్ సిబ్బందికి ఫోన్కాల్స్ వస్తున్నాయని వారి వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి, నెల్లూరు టౌన్ ఈఈ శ్రీధర్, డీఈఈలు కిరణ్, అశోక్, సునీల్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ సురేఖ, ఆశాలత, ఏఈలు కృష్ణవేణి, విజయ్కుమార్, దామోదర్రెడ్డి, విజయ్, లక్ష్మీనారాయణ, సుధాకర్, నస్రూల్లా, సూర్య గాంధీ, మునిశేఖర్, గోపాలకృష్ణ, జేఏఓ పద్మజ తదితరులు, పాల్గొన్నారు. నేటి రాత్రి గంటసేపు ఎర్త్అవర్ను పాటిద్దాం సబ్స్టేషన్లలో సిబ్బంది అందుబాటులో ఉండాలి ఎస్ఈ విజయన్ -
చెట్లు ఉండడంతో హద్దులు చూపించలేదు
ఎల్పీ స్కీమ్లో ఇచ్చిన భూముల్లో కంప చెట్లు ఉండడంతో వాటికి హద్దులు చూపించలేకపోతున్నాం. ఆ భూముల్లో ఉన్న చెట్లు తొలగించుకుని వస్తే అప్పుడు సర్వే చేసి హద్దులు చూపిస్తాం. – పీ చంద్రశేఖర్, తహసీల్దార్ విడవలూరు హద్దులు చూపించకుంటే ఎలా 2018లో మాకు ఒక్క ఎకరా చొప్పున ప్రభుత్వం మొత్తం 91 ఎకరాల విస్తీర్ణంలో పొలాన్ని ఇచ్చారు. అయితే 91 ఎకరాలకు నాలుగు వైపులా హద్దు రాళ్లను ఏర్పాటు చేయకుండా జంగిల్ క్లియరెన్స్ చేసుకోమంటే ఎలా చేసుకోవాలి. – చనుమూరి సరోజనమ్మ పొలం చూపించలేదు.. లోన్ కట్టాలంట!మాకు మంజూరైన పొలం 8 ఏళ్లుగా ఎక్కడ ఉందో ఇంత వరకు తెలియదు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడేమో లోన్ కట్టాలంటూ మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి నోటీసులు వచ్చాయి. అసలు మా పొలం ఎక్కడుందో మాకు తెలియదంటే లోను కట్టాలంటూ నోటీసులు పంపడం హాస్యాస్పందంగా ఉంది. – కర్లగుంట శీనమ్మ ● -
ఆశ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని ఆశ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశ వర్కర్లను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలన్నారు. ఎన్హెచ్ఎం స్కీం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయినా వారికి కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. విధినిర్వహణలో మృతిచెందిన వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆశాలను రెగ్యులర్చేసి హెల్త్ వర్కర్స్గా గుర్తించాలన్నారు. పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి మధుసూదన, కల్యాణి, వాణి, జీవా, సునీత, గీత, సురేఖ తదితరులు పాల్గొన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీ మూతకు కారణం టీడీపీనే..
● వైఎస్సార్సీపీ నేతలు కోవూరు: ‘కోవూరు చక్కెర కర్మాగారం మూసివేతకు కారణం టీడీపీ అనే విషయాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుసుకోవాలి. దీనిపై అసెంబ్లీలో అసత్యాలు చెప్పడం దారుణం’ అని డీఏఏబీ మాజీ చైర్మన్ నిరంజన్బాబురెడ్డి అన్నారు. కోవూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కలిసి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కోరారన్నారు. దాని స్థితిగతులు తెలుసుకోవాలని నిపుణులతో కూడిన బృందాన్ని జగన్ పంపారన్నారు. వారు పరిశీలించి ఈ కర్మాగారం తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేదని, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పారన్నారు. 2013 వరకు ఉద్యోగులు, కార్మికులకు ఉన్న బకాయిలను అప్పటి ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2014 – 19 వరకు టీడీపీ హయాంలో బకాయిలు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విషయాన్ని ప్రశాంతిరెడ్డి తెలుసుకోవాలన్నారు. ఆ మొత్తం రూ.20 కోట్లని అసెంబ్లీ సాక్షిగా ఆమె చెప్పారని, కానీ ప్రస్తుతం రూ.22.30 కోట్లకు చేరుకుందన్నారు. ప్రసన్నకుమార్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలుమార్లు కార్మికుల బకాయిల గురించి లేఖలు రాశారన్నారు. కొన్ని ఫ్యాక్టరీలకు గత ప్రభుత్వం బకాయిలను చెల్లించిందని తెలిపారు. కోవూరు ఫ్యాక్టరీ విషయానికి వచ్చేసరికి ఎన్నికల కోడ్ రావడంతో బకాయిల చెల్లింపు ఆగిందన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని చూస్తారే తప్ప కమీషన్ల కోసం ఎదురు చూడరని తెలుసుకోకుండా అసెంబ్లీలో అసత్యాలు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు అనూప్రెడ్డి మాట్లాడుతూ కార్మికుల పక్షాన ప్రసన్నకుమార్రెడ్డి పోరాటం చేశారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నరసింహులురెడ్డి, కవరగిరి ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అటవీ పనుల వేతనాల పెంపు
● జోన్ – 4 పరిధిలోని జిల్లాల అధికారుల సమావేశంలో నిర్ణయం నెల్లూరు(అర్బన్): అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని రకాల పనులకు ఈ ఏడాది 4.36 శాతాన్ని అదనంగా పెంచి వేతనాలివ్వాలని కమిటీ నిర్ణయించిందని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, గుంటూరు కాశీవిశ్వనాథరాజు పేర్కొన్నారు. వేతనాల పెంపుపై జోన్ – 4 పరిధిలోని జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని వేదాయపాళెంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఫారె్స్ట్స్ ఆఫ్ షెడ్యూల్ రేట్స్ కమిటీ చైర్మన్ కాశీవిశ్వనాథరాజు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం డీజిల్ ధర తగ్గిందని, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరగనున్న పనులకు 4.36 శాతం అదనంగా వేతనాలను ఇవ్వనున్నామన్నారు. అడవుల్లో చేపట్టే జంగిల్ క్లియరెన్స్, మొక్కలు నాటడం, కాపలా ఉండే వారికి, ట్రెంచ్లను ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లు, రవాణా.. ఇలా అన్ని రకాల వాటికి ఇది వర్తించనుందని వెల్లడించారు. వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు ఏర్పాటు చేయాల్సిన నీటి వనరులపై చర్చించారు. డీఎఫ్ఓ మహబూబ్బాషా, అనంతపురం డీఎఫ్ఓ, కర్నూలు ఎఫ్ఏసీ డీఎఫ్ఓ యశోదబాయి, నంద్యాల ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ నుంచి కృష్ణమూర్తి, తిరుపతి అధికారి సెల్వం, రాష్ట్ర సిల్వి కల్చరిస్ట్, బయోట్రిమ్ తిరుపతి అధికారి నరేంద్రన్, ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా, తిరుపతి సోషల్ ఫారెస్ట్ ఆఫీసర్ఽ ధర్మరాజు, నెల్లూరు సోషల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగార్జునరెడ్డి, సూళ్లూరుపేట వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి హారిక తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో వీరంగం
● సచివాలయ అద్దాలు ధ్వంసం అనుమసముద్రంపేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించి సచివాలయ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఏఎస్పేటలో చోటుచేసుకుంది. ఎంపీడీఓ ప్రసన్నకుమారి, ఎస్సై సైదులు తెలిపిన వివరాల మేరకు.. ఏఎస్పేట దర్గా ప్రాంతంలో షరీఫ్ అనే వ్యక్తి మానసిక రోగులకు ఆశ్రయ కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఇతను బుధవారం రాత్రి పూటుగా మద్యం తాగి ముగ్గురు వ్యక్తులతో కలిసి సచివాలయ అద్దాలను పగులగొట్టాడు. గురువారం పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓకు తెలపడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. -
ఇన్సురెన్స్, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలి
లారీ తిప్పడం ప్రస్తు తం కష్టంగా మారింది. ఇన్సురెన్స్, గ్రీన్ట్యాక్స్ను అమాంతంగా పెంచేశారు. ఈ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. జీఎస్టీతో యజమానులపై పెనుభారం పడింది. టోల్గేట్ల సంఖ్యను తగ్గించడంతో పాటు కొత్తగా వచ్చే ఆటోమేటెడ్ ఫిట్నెస్ స్టేషన్లను నిలిపేయాలి. రవాణా రంగాన్ని ఆదుకోకపోతే పూర్తిగా విక్రయించే పరిస్థితి వస్తుంది. – గోపాలనాయుడు, లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీజిల్పై వ్యాట్ను తగ్గించాలి డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నాలుగు శాతం వ్యాట్ను తగ్గించాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దీని ధర ఇక్కడే ఎక్కువగా ఉంది. కిరాయిలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. డ్రైవర్లు దొరకని పరిస్థితి. విడిభాగాల ఖరీదులు బాగా పెరిగాయి. ప్రస్తుత రోజుల్లో పాత లారీని తిప్పే పరిస్థితే లేదు. – దయాకర్రెడ్డి, యజమాని -
గ్రావెల్.. అన్స్టాపబుల్
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పచ్చ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నిన్నామొన్నటి వరకు ఇసుకను కొల్లగొట్టి భారీగా వెనుకేసుకున్న వీరి కళ్లు గ్రావెల్పై పడ్డాయి. అనుకున్నదే తడవుగా దగదర్తి మండలంలో దీన్ని యథేచ్ఛగా తవ్వుతూ లారీల్లో నిత్యం తరలిస్తున్నారు. విసిగివేసారిన గ్రామస్తులు ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. వాహనాలతో తొక్కించి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పరోక్ష సహకారం ఉండటంతో వీరు మరింత చెలరేగిపోతూ సవాల్ విసురుతున్నారు. ప్రమాదాలు జరుగుతాయనే ఆందోళన కాలనీ వెనుక వైపు దాదాపు 40 అడుగుల మేర గోతులు తవ్వారు. వర్షాకాలంలో నీరు నిలిచి పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులు బుట్టదాఖలవుతుండటంతో ఇక తమకు దిక్కెవరని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దగదర్తి ప్రాంతంలోని కేకేగుంట, ఉలవపాళ్ల తదితర గ్రామాల్లోని గ్రావెల్కు డిమాండ్ అధికంగా ఉండటంతో కూటమి నేతలు కుమ్మకై ్క తమ పనిని కానిచ్చేస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమ రవాణా ఆగలేదంటే ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారనే అంశం స్పష్టంగా అర్థమవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేతల ధనదాహం పరాకాష్టకు చేరుతోంది. ఇసుక.. మద్యం.. ఇలా ప్రతి అంశంలో తమ మాటే చెల్లుబాటయ్యేలా వ్యవహరిస్తూ వచ్చిన వీరు.. తాజాగా గ్రావెల్ను కొల్లగొట్టడంలో నిమగ్నమయ్యారు. వీరి చేష్టలతో దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల, కేకేగుంట, సున్నపుబట్టి తదితర ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ రవాణా రెండు నెలలుగా నిరాటంకంగా జరుగుతోంది. రాత్రయితే హడలే.. ఉలవపాళ్లలో రాత్రి వేళ ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. రెండు పొక్లయిన్లు ఏర్పాటు చేసి రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు వరకు 20 లారీల్లో గ్రావెల్ను యథేచ్ఛగా తరలిస్తున్నారు. మండలంలోని చోటా.. నియోజకవర్గ స్థాయి నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోంది. గ్రామస్తులెవరైనా అడ్డుకుంటే తొక్కి చంపేస్తామంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి వేళ వాహన శబ్దాలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. ఫిర్యాదు చేస్తే కన్నెర్రే..! కాలనీకి వెనుక వైపు ఉన్న ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలు అనే చందంగా సాగుతోంది. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని సమాచారం. ఒకరిద్దరు సాహసం చేసి వీడియోలు, ఫొటోలు తీసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన.. స్థానిక తహసీల్దార్కు ఫోన్ చేసి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఫలితంగా లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే కూటమి నేతల ఒత్తిళ్లతో దీన్ని వదిలేశారు. అదే రోజు రాత్రి నుంచి అక్రమ రవాణా మళ్లీ మొదటికొచ్చింది. ఉలవపాళ్ల, కేకేగుంట, సున్నపుబట్టీలో యథేచ్ఛగా తవ్వకాలు కొల్లగొడుతున్న టీడీపీ నేతలు అడ్డుకున్న గ్రామస్తులపై దౌర్జన్యాలు లారీలతో తొక్కిస్తామంటూ హెచ్చరికలు అధికారుల పరోక్ష సహకారం దగదర్తి మండలంలో ఇదీ తంతు రోడ్లు.. పైప్లైన్లు ధ్వంసమై భారీ వాహనాల పుణ్యమానని గ్రామంలోని రోడ్లు.. తాగునీటి పైప్లైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా గ్రామస్తుల పాట్లు వర్ణనాతీతమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మూల్యాంకనం ప్రారంభం
నెల్లూరు (టౌన్): ఇంటర్కు సంబంధించిన ఫిజిక్స్, ఎకనమిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనాన్ని స్టోన్హౌస్పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా సబ్జెక్టుల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మాట్లాడారు. మూల్యాంకనంలో 750 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారని తెలిపారు. కెమిస్ట్రీ, హిస్టరీకి సంబంధించిన మూల్యాంకనాన్ని ఈ నెల 24 నుంచి.. బాటనీ, జువాలజీ, కామర్స్ ప్రక్రియను 26 నుంచి ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారానికి పూర్తి చేయనున్నామని ప్రకటించారు. మీటర్ రీడర్ల నిరసన నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్ వద్ద మీటర్ రీడర్లు నిరసనను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిశోర్, మీటర్ రీడర్ల ప్రధాన కార్యదర్శి హజరత్వలీ మాట్లాడారు. తమ శ్రమను కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎస్క్రో ద్వారా వేతనాలివ్వాలని ఆదేశాలు జారీ చేసినా, జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో పనికరువై మీటర్ రీడర్లు రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళికి వినతిపత్రాన్ని అందజేశారు. మీటర్ రీడర్ల కోశాధికారి బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసుబ్బయ్య, ఫిరోజ్, చెంచురామయ్య, సుబ్బయ్య, రవిచంద్ర పాల్గొన్నారు. డీసీపల్లిలో 245 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 245 బేళ్లను గురువారం విక్రయించారని నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 269 బేళ్లు రాగా, వీటిలో 245ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280.. కనిష్ట ధర రూ.270.. మొత్తమ్మీద సగటు ధర రూ.277.19గా నమోదైందని వివరించారు. వేలంలో 32,510 కిలోల పొగాకును విక్రయించగా, రూ.90,11,680 వ్యాపారం జరిగిందని, ఎనిమిది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. రేషన్ బియ్యం లారీ పట్టివేత కావలి: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని దగదర్తి మండల పరిధిలోని జాతీయ రహదారిపై తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. లారీలో 520 బస్తాలున్నాయని, గుడ్లూరు మండలం పెద్దపవని నుంచి చైన్నెలోని రెడ్హిల్స్కు వెళ్తుండగా పట్టుకున్నామన్నారు. అనంతరం లారీని దగదర్తి పోలీసులకు అప్పగించారు. ఖజానా శాఖలో పలువురికి ఉద్యోగోన్నతి నెల్లూరు(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఖజానా శా ఖలో పనిచేస్తున్న పలువురు సీనియర్ అసిస్టెంట్లకు సబ్ ట్రెజరీ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ మోహన్రావు ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. ఉద్యోగోన్నతులు పొందిన వారిలో ఉస్మాన్, రామారావు, విజయలక్ష్మి, నిజాముద్దీన్, శ్యామల, నాగేశ్వరరావు, నాగరాజు ఉన్నారు. -
జాప్యం లేకుండా పరిశ్రమలకు అనుమతులు
నెల్లూరు రూరల్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు గానూ వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపే అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లను వెంటనే పూర్తి చేయాలని కందుకూరు సబ్ కలెక్టర్, ఆత్మకూరు ఆర్డీఓను ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖలు తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రింటింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఆమంచర్ల వద్ద కేటాయించిన భూమికి బదులు కేకేగుంట, అనంతరం వద్ద ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఉన్న భూమిని పరిశీలించి అప్పగించాలని సూచించారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పీఎంఈజీపీ రుణాలను విరివిగా మంజూరు చేయాలని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెస్సెమ్ఈ పార్కుల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి నివేదిక పంపాలని ఏపీఐఐసీ అధికారులను సూచించారు. నారంపేట మెగా ఇండస్ట్రియల్ పార్కు వద్ద విద్యుత్, తాగునీటి ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీపీ రుణాల మంజూరు తదితర అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్ వివరించారు. జేసీ కార్తీక్, ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్, డ్వామా పీడీ గంగాభవాని, డీపీఓ శ్రీధర్రెడ్డి, ఎల్డీఎం శ్రీకాంత్ ప్రదీప్, ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్, డీటీసీ చందర్, కమిటీ సభ్యులు ఏపీకే రెడ్డి, సతీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఆనంద్ -
టైర్లు కొనలేక బెంబేలు..
అన్నింట్లో మోతే.. ●టైరు ధర మూడేళ్ల క్రితం రూ.16 వేలుంటే, ప్రస్తుతం అది రూ.21,500కు చేరింది. రేడియల్ టైర్లు ఒక్కొక్కటి రూ.22 వేలు ఉంటే, రూ.26 వేలకు ఎగబాకాయి. ఇంజిన్ ఆయిల్తో పాటు విడిభాగాల ధరలను 20 శాతం మేర పెంచారు. లారీని బట్టి నిర్వహణ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. అన్ని పత్రాలున్నా పోలీస్, రవాణా అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పందే అక్కడి నుంచి పంపే పరిస్థితి లేదు. ● పెరిగిన ఇన్సురెన్స్, టైర్లు, విడి భాగాల ధరలు ఈ రంగాన్ని కకావికలం చేస్తున్నాయి. ● లారీ, దాని విలువ బట్టి థర్ట్ పార్టీ ఇన్సురెన్స్ రెండేళ్ల క్రితం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండేది. ప్రస్తుతం ఇది రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు ఎగబాకింది. ● 22 చక్రాల కొత్త లారీకి ఇన్సురెన్స్ రూ.1.25 లక్షల వరకు ఉంది. ● లారీని బట్టి త్రైమాసిక పన్ను రూ.8 వేల నుంచి రూ.14 వేల వరకు ఉంది. ● నేషనల్ పర్మిట్కు రూ.17 వేలు అదనం. ● ఏడేళ్లు దాటిన రవాణా వాహనానికి ఏటా గ్రీన్ ట్యాక్స్ను చెల్లించాల్సి ఉంటుంది. నెల్లూరు(టౌన్): లారీ ఉందంటేనే అదో ఠీవి. అబ్బో యజమానా.. ఇంకేమిలే అనే మాట తరచూ వినిపించేది. అయితే ఇదంతా గతం. రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ రంగం ప్రస్తుతం కకావికలమవుతోంది. డీజిల్ ధర లీటర్ రూ.98కి చేరువలో ఉండటం.. జాతీయ రహదారిపై ప్రతి 50 కిలోమీటర్లకో టోల్గేట్.. జీఎస్టీ మోతతో ఆదాయం సంగతి దేవుడెరుగు.. కనీస ఖర్చులొస్తే చాలు మహాప్రభో అనే స్థితికి యజమానులు వస్తున్నారు. అప్పటికీ.. ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం గతంలో ఉమ్మడి జిల్లాలో 30 వేలకుపైగా లారీలు ఉండేవి. ప్రధానంగా కృష్ణపట్నం పోర్టుకు ఎగుమతులు, దిగుమతులు అధిక సంఖ్యలో జరిగేవి. దీంతో పాటు ఇసుక, సిలికా, క్వార్ట్జ్, ధాన్యం, బియ్యం తదితరాల్లో వీటి పాత్ర కీలకం. లాభాలెక్కువగా ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపేవారు. అయితే కాలక్రమంలో ఇది పతనావస్థకు చేరుతోంది. కొత్తగా కొనుగోలు చేసే వారి సంగతి అటుంచితే.. ఉన్నవి కాపాడుకోవడమే గగనంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో లారీల సంఖ్య పది వేల్లోపే ఉంటాయని సమాచారం. కాలం మారింది.. కిరాయే మారలేదు రవాణా రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా ఐదేళ్లుగా ఉన్న కిరాయే నేటికీ కొనసాగుతోంది. లోడింగూ అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు సరుకుల రవాణాకు ఇటీవలి కాలంలో రైళ్లను ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. రాబడి తగ్గి.. ఖర్చులు అమాంతం పెరగడంతో కొందరు యజమానులు తమ లారీలను విక్రయానికి పెట్టారంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు బయటకొచ్చి ఏ వ్యాపారం చేయలేక అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు. డ్రైవర్లేరీ..? రవాణా రంగ సంక్షోభానికి డ్రైవర్ల కొరతా ఓ కారణమవుతోంది. కొత్తగా ఇందులోకి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. పైగా వీరికిచ్చే కమీషన్ను పది శాతానికి పెంచారు. ఉదాహరణకు కిరాయి రూ.లక్ష ఉంటే అందులో రూ.పది వేలను డ్రైవర్కు ఇవ్వాల్సిందే. లోడింగ్, అన్ లోడింగ్ బాధ్యతను యజమానే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మేరకు కిరాయి వస్తే అన్ని ఖర్చులు పోనూ రూ.20 వేలు కూడా మిగలని పరిస్థితి నెలకొంది. -
సంక్షోభంలో కూరుకుపోతున్న రంగం
యార్డులో నిలిచిన లారీలు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది లారీ రవాణా రంగ పరిస్థితి. డీజిల్, ఇన్సురెన్స్, టోల్ట్యాక్స్లు, స్పేర్పార్ట్స్ మోతతో ఇప్పటికే చుక్కలు చూస్తుండగా.. తాజాగా కిరాయిలు దొరక్క.. ఏమి చేయాలో పాలుపోక ఆందోళనకు గురవడం లారీ యజమానుల వంతవుతోంది. ఒకవేళ అరకొరగా దొరికినా ఐదేళ్ల క్రితం నాటి ధరలే లభిస్తుండటం వీరిని ఆవేదనకు గురిచేస్తోంది. లీటర్ డీజిల్ ధర రూ.98కి చేరువలో 25 శాతానికి పైగా పెరిగిన టైర్లు, విడిభాగాల ధరలు ఐదేళ్ల క్రితం నాటి కిరాయిలే నేటికీ లోడింగ్ అంతా రైలు వైపే నాడు 30 వేల లారీలు.. నేడు పది వేల్లోపే -
లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడి అరెస్ట్
వరికుంటపాడు: మండలంలోని వరికుంటపాడులో ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించిన కేసులో గొలపల్లి గురవయ్య అనే వ్యక్తిని గురువారం అరెస్ట్ చేశామని ఎస్సై రఘునాథ్ తెలిపారు. అతడిని ఉదయగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆకుపచ్చ రంగు హాఫ్ హ్యాండ్ టీ షర్ట్, బులుగు రంగు షాట్ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్సై మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసం వచ్చి కానరాని లోకాలకు.. ● గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి మనుబోలు: ఉపాధి కోసం వచ్చి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మనుబోలు – పొదలకూరు రోడ్డు మార్గంలో రాజోలుపాడు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. గురువారం పోలీ సులు వివరాలు వెల్లడించారు. హరియాణా రాష్ట్రానికి చెందిన బల్వీందర్ సింగ్ (30) వరికోత మెషీన్ ఆపరేటర్గా ఉన్నాడు. రాజోలుపాడు గ్రామ పొలాల్లో పనిలు చేస్తున్నాడు. సమీపంలోని పెట్రోలు బంక్ వద్ద ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి మూత్రవిసర్జన కోసం అతను రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై శివరాకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 24,289 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ● జాయింట్ కలెక్టర్ కార్తీక్ నెల్లూరు రూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 24,289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కార్తీక్ తెలిపారు. గురువారం 3,582 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని ప్రకటన విడుదల చేశారు. రూ.52.10 కోట్లను రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు. రైతులు దళారుల మాటలు విని తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని తెలియజేశారు. -
దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(అర్బన్): సదరం క్యాంపునకు వచ్చే దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జరుగుతున్న దివ్యాంగుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ సదరం క్యాంపును కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ను త్వరగా చేసి అదేరోజు వైద్యపరీక్షలు పూర్తి చేసి పంపాలని సూచించారు. సమయం చాల్లేదంటూ దివ్యాంగులను మరోరోజు పిలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివ్యాంగులకు ఐడీ నంబర్ ఇచ్చే ప్రక్రియను ఆన్లైన్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారంటూ సంబంధిత సిబ్బందిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ తాము దూరప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు పడి ఇక్కడికి వస్తున్నామని, వెరిఫికేషన్ ప్రక్రియను ఆత్మకూరు, కావలి, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, డాక్టర్ గంగాధర్, డాక్టర్ మస్తాన్బాషా, అడ్మిని స్ట్రేషన్ అధికారులు డాక్టర్ కళారాణి, డా.సుశీల్, ఏడీ ఏడుకొండలు పాల్గొన్నారు. -
కొడుకు చేతిలో తండ్రి హతం
● మద్యం మత్తులో ఘాతుకం ● ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం మర్రిపాడు: మద్యం మత్తులో తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన మండలంలోని చుంచులూరు గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీలో చిలపోగు చిన్నయ్య (45) నివాసం ఉంటున్నాడు. అతనికి శివకుమార్ అలియాస్ సూరి అనే కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్నయ్య కూలి పనులకు వెళ్తుంటాడు. సూరి మద్యానికి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. బుధవారం రాత్రి చిన్నయ్య ఇంట్లో ఉండగా సూరి మద్యం తాగొచ్చి తండ్రితో గొడవపడి దాడి చేసి హతమార్చాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సబ్బు నీళ్లను చిన్నయ్య నోట్లో పోసి నురగ వచ్చేలా చేశాడు. గురువారం తెల్లవారుజామున ఇంటి పక్కన వారికి తన తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే చిన్నయ్య శరీరంపై గాయాలుండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సూరి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. ఆత్మకూరు సీఐ గంగాధర్, మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. కాలనీకి చెందిన కొందరు అటవీ ప్రాంతానికి వెళ్లి సూరి ని వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
నెల్లూరు(టౌన్): మహిళా విద్యకు ప్రాధాన్యమిస్తున్న డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉందని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ సునీత అన్నారు. కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ సంబరం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు కళాశాల నుంచి కేవీఆర్ సెంటర్ వరకు వజ్రోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం పూర్వ, ప్రస్తుత అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడంతో సెల్ఫీలు తీసుకున్నారు. రిజిస్ట్రార్ సునీత మాట్లాడుతూ రానున్న రోజుల్లో కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చదువుకున్న పాఠశాల, కళాశాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులపై ఉందన్నారు. దొడ్ల కౌసల్యమ్మ మేనల్లుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ డీకేడబ్ల్యూలో చదివిన ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని కొనియాడారు. సినిమా హీరో చిరంజీవి సోదరి విజయదుర్గ మాట్లాడుతూ వజ్రోత్సవ సంబరాలకు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతోమంది స్నేహితులను కలిసినట్లు చెప్పారు. ఇంకా పూర్వ ప్రిన్సిపల్ మస్తానయ్య, పూర్వ ప్రిన్సిపల్ శైలజ, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సతీమణి, పూర్వ విద్యార్థిని హేమావతి మాట్లాడారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు గంగాధర్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఏవీ రమణారావు పాల్గొన్నారు. వీఎస్యూ రిజిస్ట్రార్ సునీత ముగిసిన వజ్రోత్సవ సంబరంచాలా ఆనందంగా ఉంది డీకేడబ్ల్యూ కళాశాల వజ్రోత్సవాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఆశించిన స్థాయిలో పూర్వ విద్యార్థులు ఈ వేడుకలను తరలివచ్చారు. డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నందుకు గర్వ పడుతున్నా. – జ్యోతిరెడ్డి, అధ్యక్షురాలు, పూర్వ విద్యార్థుల సంఘం విజయవంతానికి కృషి చేశాం డీకేడబ్ల్యూ వజ్రోత్సవానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్నోరోజులు కృషి చేశాం. ఎంతో దూరం నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. సంవత్సరాల తర్వాత అందరం ఒకచోట నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది. – కుసుమకుమారి, కార్యదర్శి, పూర్వ విద్యార్థుల సంఘం -
రైతులను ఆదుకోకపోతే పోరాటం చేస్తాం
నెల్లూరు(బారకాసు): ‘పంటకు గిట్టుబాటు ధర లేక వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వారిని ఆదుకోకపోతే పోరాటం చేస్తాం’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరు నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యాన్ని ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు విక్రయించుకుంటున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అమరావతిలో సమీక్షలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారే తప్ప ధాన్యం కొనుగోలుకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించడం లేదన్నారు. జిల్లాలో పుట్టి ధాన్యం రూ.19,720లకు అమ్మాల్సి ఉండగా ప్రస్తుతం రూ.15,500 విక్రయించుకునే పరిస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుకురాక, మరోవైపు దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇదే సీజన్లో పుట్టి ధాన్యం రూ.22 వేలకు కల్లాలోనే కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఆరబెట్టిన ధాన్యాన్ని రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు కొనుగోలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆపేశారని దీంతో రైస్మిల్లర్లు, దళారులు విజృంభిస్తున్నారని చెప్పారు. దీంతో రైతు ఎకరాకు రూ.40 వేలు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం గన్నీబ్యాగ్లు లేవని, రవాణా సౌకర్యం లేదని, కూలీలు లేరని రైతులు వాపోతున్నారన్నారు. ఏప్రిల్ మూడో వారం వరకు ధాన్యం కోతలు ఉంటాయని కాబట్టి, ప్రభుత్వం కళ్లు తెరిచి గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. బ్లాక్మెయిల్ కోసమే.. మిల్లర్లు, దళారులు రైతుల వద్ద ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేయడానికి వీలు లేదంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి వాట్సాప్లో పోస్టు చేశారని కాకాణి అన్నారు. దీనికి కారణం రైతుల మీద ప్రేమ కాదని కేవలం రైస్మిల్లర్లు, దళారులను బ్లాక్మెయిల్ చేసేందుకేనన్నారు. అమరావతిలో కలెక్టర్లు, శాసనసభ్యులతో మాట్లాడటం, ఇక్కడకు వచ్చి రైస్మిల్లర్లు, దళారులతో డీల్ కదుర్చుకోవడం చేస్తున్నారన్నారు. గతంలో క్వార్ట్జ్ మైనింగ్ దగ్గరికి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి హడావుడి చేశారని.. ఆ తర్వాత వాటి యజమానులను బెదిరించి వాటాలు తీసుకున్న ఘనత సోమిరెడ్డిదన్నారు. వరికి గిట్టుబాటు ధర లేక ఆందోళన పెట్టుబడి కూడా రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
వృద్ధుడికి ఎంత కష్టం వచ్చిందో..
● ఉరేసుకుని బలవన్మరణం మర్రిపాడు: ఓ వ్యక్తి పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేశాడు. వారిప్పుడు దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. భార్య అనారోగ్యంతో మంచాన పడింది. వృద్ధాప్యంలో ఉన్న అతను ఆమె బాధ చూడలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని రాజులపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బక్కిరెడ్డి (70)కి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలకు వివాహాలై బెంగళూరులో ఉంటున్నారు. మూడేళ్ల క్రితం బక్కిరెడ్డి భార్య పక్షవాతంతో మంచాన పడింది. సంతానం దగ్గర లేకపోవడం.. ఎవరూ పట్టించుకోకపోవడంతో భార్యకు సపర్యలు చేయడం బక్కిరెడ్డికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె పడుతున్న బాధ చూడలేక ఆయన ఎంతగానో ఆవేదన చెందేవాడు. గురువారం బక్కిరెడ్డి గ్రామానికి సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ను ఢీకొట్టిన లారీ
● యువకుడి మృతి ఆత్మకూరు: మోటార్బైక్ను లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గురువారం జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. తెల్లపాడు ముస్తాపురం గ్రామానికి చెందిన తాటిపర్తి ఈశ్వర్ (19) కూలి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో కరటంపాడుకు బైక్పై వెళ్లి తిరిగి ముస్తాపురానికి వస్తున్నాడు. ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో లారీ బైక్ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై ఈశ్వర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
ఉలవపాడు: మండల పరిధిలోని కరేడు గ్రామానికి చెందిన కబడ్డీ కోచ్ సాదం శ్రీనివాసరావు నేషనల్ రెఫరీగా ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గురువారం తెలిపారు. బిహార్లోని బుద్ధగయలో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న సబ్ జూనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్షిప్కు ఆంధ్రప్రదేశ్ రెఫరీ బోర్డు నుంచి శ్రీనివాసరావును ఎంపిక చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తనకు సహ కరించిన వ్యాయామ అధ్యాపకులు, బోర్డు కన్వీనర్ రవీంద్రబాబు, అసోసియేషన్కు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.నెల్లూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది ● సినీ నటుడు తనికెళ్ల భరణి సంగం: నెల్లూరు జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి తెలిపారు. అసుర సంహారం అనే సినిమా షూటింగ్ గురువారం మండలంలో జరిగింది. పలు సన్నివేశాలను తెలుగు ఉపాధ్యాయుడు ప్రవీణ్కుమార్ నివాసంలో, సంగమేశ్వరాలయంలో చిత్రీకరించారు. తనికెళ్ల భరణిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో 40 ఏళ్ల క్రితం నాటికను ప్రదర్శించానన్నారు. ఇక్కడ అమరావతి కృష్ణారెడ్డి, నందు, హరివిల్లు ఆర్గనైజేషన్ నిర్వాహకులు, పలువురు మిత్రులున్నారని తెలిపారు. నెల్లూరుకు చెందిన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తాను పలు సినిమాల్లో నటించామన్నారు. ప్రతిభ ఉన్నవారిని సినిమా ఇండస్ట్రి ఎప్పుడూ స్వాగతిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడాలన్నారు. కండలేరులో 49.983 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 49.983 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 580, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 80, మొదటి బ్రాంచ్ కాలువకు 25 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
త్యాగరాజ స్మరణోత్సవాల్లో పాల్గొనడం అదృష్టం
●ప్రముఖ గాయని ఎస్పీ శైలజ నెల్లూరు(బృందావనం): నగరంలో నిర్వహిస్తున్న త్యాగరాజ స్మరణోత్సవాల్లో పాల్గొనడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ గాయని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. నగరంలోని పురమందిర ప్రాంగణంలో భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన స్మరణోత్సవాలకు ఆమె హాజరయ్యారు. గాత్రకచేరి నిర్వహించిన హైదరాబాద్కు చెందిన గాయని చాగంటి రమ్య కిరణ్మయి, త్యాగరాజస్వామి, శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపాలను త్రీడీ కార్డు బోర్డుతో తీర్చిదిద్దిన కళాకారుడు కిడాంబి నరసింహాచార్యులును సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. తన తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ, తన తండ్రి ఆప్తమిత్రుడు డాక్టర్ యనమండ్ర వెంకటేశ్వరశాస్త్రి కుటుంబసభ్యులతో కలిసి ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభించిన స్మరణోత్సవాలను కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వీటిని తన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్నేళ్ల పాటు నిర్వహించారన్నారు. ఉ త్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 26న నిర్వ హించనున్న సీతారాములు, శివపార్వతుల కల్యా ణోత్సవాల్లో పాల్గొంటానన్నారు. యనమండ్ర నాగ దేవీప్రసాద్, కమిటీ సభ్యులను అభినందించారు. -
సోమశిల ఈఈ బాధ్యతల స్వీకరణ
సోమశిల: సోమశిల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా శ్రీనివాస్కుమార్ బాధ్యతలను బుధవారం చేపట్టారు. ఆయన్ను డీఈఈ రవీంద్రప్రసాద్, జేఈలు గురుప్రసాద్, పెద్దిరాజు, నిఖిల్, శరత్చంద్ర, రామ్మోహన్రెడ్డి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలను తెలియజేశారు. రొయ్యల ఫ్యాక్టరీలో తనిఖీలు కొడవలూరు : మండలంలోని పెయ్యలపాళెం రోడ్డులో గల అల్ఫా మైరెన్ రొయ్యల ఫ్యాక్టరీలో బాల కార్మికులతో పని చేయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలను అధికారులు బుధవారం నిర్వహించారు. కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి, వైద్యాధికారి బాలచంద్రబాబు, కార్మిక శాఖ, సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు తనిఖీలను జరిపారు. 18 ఏళ్లలోపు వయస్సున్నట్లు అనుమానం ఉన్న పలువుర్ని గుర్తించారు. వయస్సు నిర్ధారణ నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. 18 ఏళ్లలోపు ఉందని నిర్ధారణ అయితే యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. -
రుణాల మంజూరులో భాగస్వాములవ్వాలి
నెల్లూరు రూరల్: ఎమ్మెస్సెమ్ఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, వీటి మంజూరులో ప్రైవేట్ బ్యాంకర్లు భాగస్వాములు కావాలని జేసీ కార్తీక్ కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులకు రుణాల మంజూరులో ప్రైవేట్ బ్యాంకర్లు వెనుకబడి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సహకారాన్ని అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముద్ర యోజన, పీఎంఈజీపీ, ఎమ్మెస్సెమ్ఈ రుణాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను విరివిగా ఇవ్వాలన్నారు. గ్రామాల్లో లబ్ధిదారులతో నిర్వహించే అవగాహన సదస్సులకు బ్యాంక్ అధికారులు హాజరుకావాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తరుణంలో రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీలను త్వరగా మంజూరు చేయాలని కోరారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ మాట్లాడారు. ఈ త్రైమాసికానికి సంబంధించిన రుణాల మంజూరులో మంచి ఫలితాలను సాధించామని చెప్పారు. నాబార్డు డీడీఎం బాబు, మేనేజర్ రాజేష్, పశుసంవర్థక, మత్స్యశాఖ జేడీలు రమేష్నాయక్, నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
3537 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నెల్లూరు రూరల్: జిల్లాలో 3537 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మంగళవారం కొనుగోలు చేశామని జేసీ కార్తీక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.43.3 కోట్లను జమ చేశామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దు నెల్లూరు రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అసెంబ్లీలోని తన చాంబర్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశాన్ని మంత్రి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు అందుబాటులో ఐదు లక్షల గోతాలున్నాయని చెప్పారు. దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని కోరారు. ధాన్యం కొనుగోలు విషయమై జిల్లాలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏమైనా ఇబ్బందులుంటే పరిష్కరించేందుకు చొరవ చూపాలని సూచించారు. మిల్లు వద్ద రెవెన్యూ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టామని, కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమవుతుందని తెలిపారు. అవసరమైతే ప్రకాశం, బాపట్ల, కందుకూరు తదితర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ప్రశాంతిరెడ్డి, కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీచైతన్య పాఠశాలకు తాళాలు ● జీఎస్టీ వివాదంలో భవన యజమాని చర్య ● స్కూల్మూతతో వెనుదిరిగిన విద్యార్థులు కోవూరు: పట్టణంలోని శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు భవన యజమాని బుధవారం తాళాలేశారు. యజమాని వినీత్రెడ్డికి చెల్లిస్తున్న అద్దెకు సంబంధించిన 18 శాతం జీఎస్టీని పాఠశాల యాజమాన్యం జమచేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే దీన్ని చెల్లించకపోవడంతో వడ్డీ, జరిమానాతో కలిసి ఇది రూ.36.83 లక్షలకు చేరింది. ఈ తరుణంలో జీఎస్టీ, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, నెల్లూరు నుంచి యజమానికి నోటీస్ జారీ అయింది. దీనిపై పలుమార్లు కోరినా స్పందించలేదని, దీంతో తాళాలేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. కాగా ఈ పరిణామంతో విద్యార్థులు వెనుదిరిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రంగనాథ్గౌడ్ పాఠశాల వద్దకు చేరుకొని సిబ్బందిని విచారించారు. పది పరీక్షలకు 309 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన హిందీ టెస్ట్కు జిల్లాలో 309 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. 28,485 మందికి గానూ 28,176 మంది హాజరయ్యారు. ఆరు కేంద్రాల్లో స్టేట్ అబ్జర్వర్, ఎనిమిది కేంద్రాల్లో డీఈఓ, 56 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ● ఏపీ ఓపెన్ స్కూల్ పది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 392 మంది అభ్యాసకులకు గానూ 344 మంది హాజరయ్యారు. -
ధాన్యం.. చిత్తశుద్ధి శూన్యం
గోతాలకూ కటకటే సిబ్బంది కొరతా సమస్యే ధాన్యం కొనుగోళ్లలో అధికారులకు చిత్తశుద్ధి కరువవడం.. ముందస్తు ప్రణాళిక లేకపోవడం రైతుల పాలిట శాపంలా పరిణమించింది. ధరల్లేక.. కొనేవారు కానరాక అన్నదాతలకు ఇబ్బంది తప్పడంలేదు. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు.. నిల్వ చేసేందుకూ సౌకర్యాల్లేవంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా కోసిన అనంతరం కల్లాల్లోనే విక్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని ధరలను మిల్లర్లు తగ్గించి వారిని దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా, కర్షకులకు మద్దతు ధర లభించడం గగనమవుతోంది. నెల్లూరు (పొగతోట): అనాలోచిత చర్యలు.. ముందస్తు ప్రణాళికల్లేకపోవడం.. పక్క జిల్లాల మిల్లర్లను రప్పించడంలో అధికార యంత్రాంగం విఫలం కావడం రైతుల పాలిట శాపంలా మారింది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల మధ్య పోటీతత్వం లేకపోవడం.. ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం.. నిల్వ చేసేందుకు రైతులకు సౌకర్యాల్లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీ పర్వానికి తెరలేపారు. గతేడాదితో పోలిస్తే పుట్టికి రూ.పది వేలు తగ్గించి కొంటున్నా చేష్టలుడిగి చూడటం అధికారుల వంతవుతోంది. మద్దతు ధరకు విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని ప్రచారం చేస్తున్నారే తప్ప, మిల్లర్లను కట్టడి చేసి ధరలు పెరిగేలా చూడటంలో విఫలమవుతున్నారు. బ్యాంక్ గ్యారెంటీల సేకరణలో వైఫల్యం వాస్తవానికి జిల్లాలో 120 రైస్మిల్లులుండగా, నెల్లూరులోనే 80 ఉన్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను ఆడించేందుకు 103 మిల్లులను గుర్తించారు. వీటికి ధాన్యాన్ని సరఫరా చేయాలంటే బ్యాంక్ గ్యారెంటీలను తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటి సేకరణలోనూ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎంపిక చేసిన వాటిలో కేవలం 50 నుంచి 60 మిల్లులే రూ.30 కోట్లకు గ్యారెంటీలను సమర్పించడం విశేషం. వాస్తవానికి వరికోతలు ప్రారంభం కాక ముందే రైస్ మిల్లర్లతో ఆయా ప్రాంతాల సీఎస్డీటీలు సమన్వయం చేసుకొని.. సమావేశాలను నిర్వహించి వీటిని సేకరించాల్సి ఉంది. అయితే ఇవేవీ జరగకపోవడం రైతులకు అశనిపాతంలా పరిణమించాయి. ఒకే అధికారి.. మూడు విధులు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించే డీఎస్ఓ పోస్ట్ ఖాళీగా ఉంది. నెల్లూరు ఏఎస్ఓ, ఆఫీస్ ఏఎస్ఓ, డీఎస్ఓ.. ఇలా మూడు పోస్ట్లను ప్రస్తుత ఇన్చార్జి డీఎస్ఓ అంకయ్య నిర్వహిస్తున్నారు. డీఎస్ఓ లేని సమయాల్లో డిప్యూటీ కలెక్టర్ హోదా స్థాయి అధికారులను ఇన్చార్జిగా నియమించాల్సి ఉన్నా, ఆ యత్నాన్నే చేయకపోవడం గమనార్హం. ప్రతి అంశంలోనూ ఇంతే.. గోతాల్లేక.. బ్యాంక్ గ్యారెంటీలు అందక.. రవాణాకు లారీలు సక్రమంగా పంపక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వీటిని సహాయ పౌరసరఫరాల అధికారులు, సీఎస్డీటీలు పర్యవేక్షించేవారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితే లేదు. ధాన్యం బస్తాలను దించుకుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. కొద్దో గొప్పో సేకరించిన లారీల నుంచి సకాలంలో అన్లోడ్ కావడంలేదు. పుట్టి ధరలు ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకే ఉన్నాయి. కోతలు ముమ్మరం కావడంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. తాజాగా ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్లను పిలిపించి వారితో జేసీ కార్తీక్ సమావేశమై.. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. బ్యాంక్ గ్యారెంటీలిచ్చేందుకు ముందుకు రాని మిల్లర్లు కొనుగోళ్లలో అధికారుల తీరిదీ..జిల్లాలో 103 సీఎమ్మార్ మిల్లులు అన్నదాతల అగచాట్లు సకాలంలో జరగని సమన్వయ సమావేశాలు మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు రైతులు నష్టపోకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రకాశంతో పాటు సమీప జిల్లాల రైస్ మిల్లర్లను సంప్రదించాం. వీరితో ధాన్యాన్ని కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టాం. రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించేలా చూస్తున్నాం. – అంకయ్య, ఇన్చార్జి డీఎస్ఓ జిల్లా వ్యాప్తంగా సీఎస్డీటీ పోస్టులు 11 ఉండగా, అందులో ఆరు ఖాళీగా ఉన్నాయి. కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, ఇందుకూరుపేట, రాపూరు, నెల్లూరు రూరల్, అర్బన్లో ఈ పరిస్థితి నెలకొంది. నెల్లూరు రూరల్, అర్బన్లో ఎలక్షన్ డీటీలను ఇన్చార్జి సీఎస్డీటీలను నియమించారు. ఇందుకూరుపేట జీపీఏ, సీఎస్డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో వరిని అధికంగా పండిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడి సీఎస్డీటీలను ఆయా ప్రాంతాల ఎమ్మెల్ఎస్ పాయింట్లకు ఇన్చార్జిలుగా నియమించారు. -
కామధేనులో మూగరోదన
కలవరపెడుతున్న బ్రూసెల్లోస్ వ్యాధి అధికారిక లెక్కల మేరకు 120 గోవులు, గేదెలకు బ్రూసెల్లోస్ వ్యాఽధి సోకింది. వీటిని వేరు చేసి ప్రత్యేకంగా ఉంచారు. ఇది సోకితే నయమయ్యే అవకాశం లేకపోవడంతో ఆహారం, దాణాను తగ్గిస్తున్నారు. దీంతో అనేక మూగజీవాలు చిక్కిశల్యమవుతున్నాయి. ప్రత్యేక షెడ్లో ఉండాల్సిన వీటిలో ప్రస్తుతం 47 మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాటి సంగతి ఏమిటని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదు. మరణిస్తే రికార్డుల్లో నమోదు చేయాలి, అయితే గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీ కార్తీక్ ఇటీవల పర్యటించి ఈ అంశమై అఽధికారుల నుంచి నివేదిక కోరారు. అవసరం లేకపోయినా కొన్ని సాహివాల్ ఆవులు, ముర్రాజాతి గేదెలను కొనుగోలు చేసి కమీషన్లు కోసం నిధులు వెచ్చించారనే ఆరోపణలున్నాయి. ఏళ్ల తరబడి అధికారులు ఇక్కడే తిష్ట వేయడంతో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని సిబ్బందే పేర్కొంటున్నారు. సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయమై కామధేను ప్రాజెక్ట్ జేడీ, వెంకటేష్ ను సంప్రదించగా, ప్రాజెక్ట్ సీఈఓ, గుంటూ రు, శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నడు చుకుంటున్నామని చెప్పారు. అనుమానాలు ఉంటే ఆయన్నే సంప్రదించాలని సూచించారు. మరికొన్ని ప్రశ్నలు అడగ్గా, మౌనం వహించారు.ఉదయగిరి / కొండాపురం: కొండాపురం మండలంలోని చింతలదేవి క్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రంలో పశువులు మూగవేదనను అనుభవిస్తున్నాయి. సరైన ఆహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. దేశంలో ఉన్న వివిధ రకాల ఆవులు, గేదెల పిండోత్పత్తి చేసి రైతులకు మేలు జాతి సంపదను అందించాలనేది ఈ కేంద్ర ఆశయం. ఇంతటి ప్రాధాన్యమైన ఈ ప్రాజెక్ట్ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇక్కడి పశువులకు అహారం, నీళ్లు, తగిన వసతులు, మెరుగైన వైద్యం అందక మూగరోదనను అనుభవిస్తున్నాయి. విడుదలకు నోచుకోని వాటా.. 2015లో రూ.36.12 కోట్ల అంచనా వ్యయంతో కామధేను ప్రాజెక్ట్ మంజూరైంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.25 కోట్లను మంజూరు చేయగా, రాష్ట్ర వాటాగా రూ.11.12 కోట్లను విడుదల చేయలేదు. ఈ పరిణామంతో కేంద్రమిచ్చిన నిధులతోనే పనులు జరుగుతున్నాయి. చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రంలో 2448 ఎకరాలుండగా, ఇందులో 510 ఎకరాలను దీని కోసం కేటాయించారు. ఇందులో పదెకరాల్లో పశువులు, గోవులకు అవసరమైన నిర్మాణాలు, పరిపాలన భవనాలను నిర్మించారు. పశుగ్రాసానికి 500 ఎకరాలను కేటాయించారు. అయితే ఇక్కడ నీటి పారుదలకు సదుపాయం లేకపోవడంతో వేసవిలో పశుగ్రాస కొరత వెంటాడుతోంది. రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా కోసం నిధులు మంజూరై కొంతమేర పనులూ జరిగాయి. అయితే అక్కడి నుంచి నీటిని తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలపడంతో నిలిచిపోయాయి. ఇదీ ప్రాజెక్ట్ నేపథ్యం.. ఇక్కడి ప్రాజెక్ట్లో దేశంలోని 14 రకాల దేశవాళీ ఆవులు, ఆరు రకాల గేదెలున్నాయి. వీటి ద్వారా మేలు జాతి ఆవులు, గేదెలను పునరుత్పత్తి చేసి రైతులకు అందించాలని, తద్వారా పాల దిగుబడి పెరిగి పశుపోషకుల జీవన ప్రమాణాలు వృద్ధి చెందుతాయనేది లక్ష్యం. దీని కోసం ప్రత్యేకమైన ల్యాబ్నూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 14 రకాలకు చెందిన 317 ఆవులు, ఆరు రకాలకు చెందిన 138 గేదెలున్నాయి. వీటికి తోడు మరో 70 వరకు దూడలూ ఉన్నాయి. నిర్లక్ష్యానికి పరాకాష్ట అభివృద్ధి చేసిన పిండాన్ని ఆవు గర్భంలో ప్రవేశపెట్టి వాటి ద్వారా మేలుజాతి సంతతిని రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఈ విధానంలో 11 మాత్రమే జన్మించాయి. వాస్తవానికి వందలాది మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరాలి. అయితే అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఇది జరగడంలేదు. ఐవీఎఫ్ – వీటీటీ ల్యాబ్కు చెందిన డాక్టర్ ఇక్కడ జీతం తీసుకుంటూ చుట్టపు చూపుగా వస్తుండటంతో ఆశించిన ప్రగతి లేదు. అర్థాకలి.. ఈ ప్రాజెక్ట్ మారుమూల ప్రాంతంలో ఉండటంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మూగజీవాలకు అర్థాకలి తప్పడం లేదు. ఎండుగడ్డి, దాణా కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నా, లభించేది అరకొరే. దీంతో లేగ దూడలు బక్కచిక్కుతున్నాయి. ఇక్కడి గేదెలు, ఆవుల ద్వారా పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నా, రికార్డుల్లో మాత్రం కాకి లెక్కలు చూపుతున్నారు. గోవుల కోసం దాతలు ఉచితంగా ఇచ్చే ఎండు గడ్డిని సైతం కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపి నిధులను కాజేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. వేసవిలో సరిపడా నీరు లేక దాహంతో జీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసానికి కొరత తాగునీటికీ కటకట బ్రూసెల్లోస్ వ్యాధితో విలవిల్లాడుతున్న మూగజీవాలు రూ.లక్షలు వెచ్చిస్తున్నా, వాటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఇదీ చింతలదేవిలోని కేంద్ర దుస్థితి -
కారుణ్య నియామక పత్రాల అందజేత
నెల్లూరు(అర్బన్): ఐదుగురికి కారుణ్య నియామకాల కింద కలెక్టర్ ఆనంద్ ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను బుధవారం కలెక్టరేట్లో డీఆర్వో ఉదయభాస్కర్రావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్లు లబ్ధిదారులకు అందించారు. సీహెచ్ రాము హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తూ మృతిచెందగా అతడి కుమారుడు భార్గవ్కు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా, కె.జోసఫ్ ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోగా అతని కుమారుడు కుష్వంత్ కల్యాణ్కుమార్కు పంచాయతీరాజ్ సర్కిల్లో సబార్డినేట్గా, గురవయ్య ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ మృతిచెందగా ఆయన కుమారుడు గురుకిషోర్కు పశుసంవర్థక శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా, పి.ఆదినారాయణ ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ చనిపోగా అతడి కుమారుడు నవీన్కుమార్కు రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రేడ్–2 వీఆర్వోగా, యు.శ్రీనివాసులు ఎన్ఫోర్స్మెంట్ హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తూ మృతిచెందగా ఆయన కుమారుడు సాయిని రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా నియమించారు. ఈ సందర్భంగా డీఆర్వో ఉదయభాస్కర్రావు మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన వారు సర్వీస్లో మంచి పేరు తెచ్చు కోవాలని ఆకాంక్షించారు. -
విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరులోని మినీబైపాస్ రోడ్డులో రాస్తారోకో జరిగింది. అనంతరం రామ్మూర్తి నగర్ విద్యుత్ సెక్షన్ కార్యాలయం ఎదుట కరెంట్ బిల్లులను నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా, నగర కార్యదర్శులు మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రూఅప్ చార్జీలు రద్దు చేస్తామని, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు వేయమని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. వీరు అధికారంలో లేనప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒకమాట చెప్పారన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్లో ఒకరు 53 విద్యుత్ యూనిట్లు వాడినందుకు రూ.126 బిల్లు రావాల్సి ఉండగా అదనపు చార్జీలు, ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.687 బిల్లు వచ్చిందన్నారు. ఒక్క యూనిట్ విద్యుత్కు వినియోగదాడికి రూ.14 వేస్తున్నారని ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగులగొట్టాలని గతంలో లోకేశ్ పిలుపునిచ్చారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను పగులగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు, సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు నరసింహ, మూలం ప్రసాద్, ఎన్వీ సుబ్బమ్మ, జాఫర్, ఫయాజ్, రమణారెడ్డి, చెంగయ్య, శాఖా కార్యదర్శులు సంపూర్ణమ్మ, రాజ్యలక్ష్మి, గడ్డం శ్రీనివాసులురెడ్డి, మురళి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో సబ్స్టేషన్ ఎదుట కరెంట్ బిల్లుల దగ్ధం -
డెలివరీ బాయ్గా..
పోలయ్య బేల్దారి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పనికి వెళ్లలేకపోయాడు. దీంతో కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత సురేష్పై పడింది. అతను క్రీడలను పక్కనపెట్టాడు. 2022లో పోలయ్య మృతిచెందడంతో అప్పటి నుంచి సురేష్ చిన్నపాటి పనులు చేస్తున్నాడు. అన్నకు వివాహమైంది. తమ్ముడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సురేష్ కొంతకాలం సచివాలయ వలంటీర్గా పనిచేశాడు. ప్రస్తుతం ఓ కంపెనీలో డెలివరీ బాయ్గా ఉన్నాడు. మొండి చేతులతో స్కూటీ నడుపుతూ రోజుకు 20కి పైగా అడ్రసుల్లో వస్తువులను డెలివరీ చేస్తుంటాడు. శారీరకంగా కష్టంగా ఉన్నా కుటుంబం కోసం నిత్యం సుమారు వంద కిలోమీటర్ల మేర రాకపోకలు చేస్తున్నాడు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేస్తూనే ఉంటాడు. ఒక్కో డెలివరీకి ఇంత మొత్తంలో అని ఇస్తుండటంతో ఎక్కువగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఎంకామ్ ఫైనలియర్ చదువుతున్నాడు. -
కండలేరులో 50.025 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 50.025 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 580, లోలెవల్ కాలువకు 110, హైలెవల్ కాలువకు 80, మొదటి బ్రాంచ్ కాలువకు 25 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్● వ్యక్తి మృతి దుత్తలూరు: ఆగి ఉన్న లారీని మోటార్బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి నర్రవాడ – తెడ్డుపాడు దారిలో 565వ జాతీయ రహదారిపై జరిగింది. బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి చెందిన మేలింగి సురేష్ (35) నర్రవాడ నుంచి తెడ్డుపాడు ఎస్సీ కాలనీలోని తన ఇంటికి బైక్పై బయలుదేరాడు. ఈక్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని గమనించలేదు. ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై పి.ఆదిలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సురేష్కు భార్య ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంనెల్లూరు(టౌన్): జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025 – 26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు మే 22వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఆర్.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు ఉన్నాయన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందన్నారు. జిల్లాలో వలేటివారిపాళెం మండలంలోని చుండి, ఉలవపాడు మండలంలోని వీరేపల్లి, లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాళెం, కందుకూరు మండలంలోని జి.మేకపాడు, కలిగిరి, కావలి మండలంలోని ఒట్టూరు, కొండాపురం, సీతారామపురం, ఏఎస్పేట, దుత్తలూరు ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన బడుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ, ఈబీసీలకు రూ.200లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.150లు ఉంటుందన్నారు. పదో తరగతిలో మెరిట్, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. చేపలు పట్టేందుకు వెళ్లి..● పెన్నానదిలో పడి యువకుడి మృతి ఆత్మకూరు: పెన్నా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఏలూరు రవీంద్ర అనే గిరిజన యువకుడు నీళ్లలో పడి మృతిచెందిన ఘటన ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. గిరిజన కాలనీకి చెందిన ఏలూరు రవీంద్ర (27) చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని పెన్నానదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతిచెందాడు. స్థానికులు రవీంద్ర బంధువులకు తెలియజేశారు. వారొచ్చి పరిశీలించగా నదిలో రవీంద్ర మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పొగాకు వేలం ప్రారంభం
● గరిష్ట ధర రూ.280కలిగిరి: మండలంలోని కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం వేలం ప్రారంభమైంది. తొలుత వేలం నిర్వహణాధికారి వి.మహేష్ కుమార్, రైతులు కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు 36 పొగాకు బేళ్లకు తీసుకొచ్చారు. మహేష్ కుమార్ కిలో పొగాకుకు రూ.306తో వేలం ప్రారంభించారు. ఆ ధరతో కంపెనీల ప్రతినిధులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో తగ్గిస్తూ వచ్చారు. కిలోకు గరిష్టంగా రూ.280 నుంచి కంపెనీల ప్రతినిధులు కొనుగోలు ప్రారంభించారు. మొత్తం 36 బేళ్లను కిలో ఆ మొత్తానికి కొనుగోలు చేశారు. 6 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనంగా ఉన్నట్లు తెలిపారు. దిగుబడుల్లో 80 శాతం బ్రైట్ (హైగ్రేడ్), మీడియం గ్రేడ్ ఉత్పత్తి వచ్చిందన్నారు. పొగాకుకు మంచి ధరలు లభించే అవకాశం ఉందన్నారు. రైతులు గ్రేడ్ల వారీగా బేళ్లను తయారు చేసుకుని అమ్మకాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది, రైతు సంఘం అధ్యక్షుడు రావూరి శ్రీకాంత్బాబు, అన్నదాతలు పాల్గొన్నారు. డీసీపల్లిలో.. మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం వేలం ప్రారంభించారు. తొలిరోజు 18 బేళ్లు రాగా అన్నింటిని విక్రయించామని వేలం నిర్వహణాధికారి జి.రాజశేఖర్ తెలిపారు. గరిష్ట ధర రూ.280 లభించింది. 2,439 కిలోల పొగాకును విక్రయించగా రూ.6,83,144ల వ్యాపారం జరిగింది. 7 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
క్రీడల్లో శిక్షణ
సురేష్ నెల్లూరులోని కేఎన్ఆర్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. అతడికి మొదటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉంది. దీనిని గమనించిన పీఈటీ అజయ్కుమార్ శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాడు. సురేష్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి నిత్యం వెళ్లేవాడు. కోచ్లు అతడి ఆసక్తిని గమనించి అథ్లెటిక్స్లో శిక్షణ ఇచ్చారు. ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్ ప్రావీణ్యం సంపాదించాడు. దివ్యాంగులకు నిర్వహించే అనేక క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. 2018లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలు తదితర వాటిల్లో ప్రతిభ చూపాడు. 2021 వరకు క్రీడల్లో రాణించినా పలు కారణాలతో దూరం కావాల్సి వచ్చింది. -
25న పోలేరమ్మ జాతర తొలి చాటింపు
● మే 6, 7 తేదీల్లో జాతర నాయుడుపేటటౌన్: నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ జాతరకు సంబంధించిన తొలి చాటింపును ఈనెల 25న వేయనున్నట్లు దేవదాయ శాఖ ఈఓ రవికృష్ణ తెలిపారు. ఆ శాఖ అధికారులు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు నానాబాల సుబ్బారావు, ఆకుల కుబేరు మణి, నల్లబోతుల రామారావు, రాగి శేషగిరి బుధవారం విన్నమాలలో ఉన్న ఆలయ పెదకాపు ఆర్వభూమి శ్రీనివాసులురెడ్డి ఇంటికి వెళ్లి సంప్రదాయబద్ధంగా తాంబూలం అందజేశారు. అనంతరం జాతర వేడుకలకు శ్రీకారం చుట్టారు. 25న పోలేరమ్మ మొదటి చాటింపు వేసి జాతర వేడుకలను వేదపండితుల సూచనల మేరకు మే 6, 7, తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పెదకాపు శ్రీనివాసులురెడ్డి చేతుల మీదుగా విన్నమాల గ్రామస్తులకు అమ్మవారి తాంబూలం అందజేశారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ సిబ్బంది యుగంధర్, నాయకులు దేవత కిశోర్శెట్టి, బిరదవాడ నారాయణ, మహేష్రెడ్డి, గుంటూరు లక్ష్మయ్య, మదిరి జలంధర్, చిట్టిబాబు, ఆలయ పూజారి రాయపూడి మునిసురేష్, విన్నమాల గ్రామపెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. -
రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు
ముత్తుకూరు: కూటమి ప్రభుత్వంలో అటు మిల్లర్లు, ఇటు దళారులు రైతుల్ని దోచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. మండలంలోని డమ్మాయపాళెంలో మంగళవారం వరి ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పుట్టి (850 కిలోలు) ధాన్యాన్ని రైతులు రూ.25,000లకు అమ్మకం చేసుకోగా, కూటమి ప్రభుత్వంలో రూ.15,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40,000 నష్టపోతున్నారన్నారు. వరి కోతలు ముమ్మరమైతే ధరలు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టపోతుంటే.. కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. దీన్ని బట్టి రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. మిల్లర్లు పుట్టి ధాన్యానికి ధర ఇస్తూ రైతు నుంచి తరుగు పేరుతో అదనంగా 150 కిలోల ధాన్యాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. పేరుకు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఒక్క చోట కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. జిల్లా అధికారుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఉత్తుత్తి ప్రకటనలు కట్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలన్నారు. సోమిరెడ్డికి కమీషన్లపైనే దృష్టి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ముడుపులు, కమీషన్లు, వసూళ్లపై దృష్టి పెట్టారని, రైతుల కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడని కాకాణి ఆగ్రహం వెలిబుచ్చారు. రైతుల పక్షాన ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, నాయకులు దువ్వూరు చంద్రశేఖర్రెడ్డి, పోచారెడ్డి చెంగారెడ్డి, సన్నారెడ్డి దయాకర్రెడ్డి, సర్పంచ్ సన్నారెడ్డి హారతి, ఎంపీటీసీ సభ్యులు మూగ కీర్తి, పాముల శ్రీనివాసులు, దువ్వూరు కోదండరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతనలేదు మా ప్రభుత్వ హయాంలో పుట్టి రూ.25 వేలు కూటమి ప్రభుత్వంలో రూ.15 వేలు మాజీ మంత్రి కాకాణి ధ్వజం -
రథం ఘటనలో కేసు నమోదుపై సందిగ్ధం?
బిట్రగుంట: కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం రథోత్సవం అపశృతి వెనుక కుట్రకోణం ఉందంటూ ఆలయ ఈఓ రాధాకృష్ణ చేసిన ఫిర్యాదుపై సందిగ్ధత నెలకొంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రథోత్సవం నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథాన్ని ముందుగా పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథోత్సవం ప్రారంభించడంతో 20 అడుగులు కూడా ముందుకు కదలకముందే చక్రాల బేరింగ్ సిస్టంలో సమస్యలు తలెత్తి రథం ఆగిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, జిల్లా వ్యాప్తంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో దేవదాయశాఖ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈఓ రాధాకృష్ణ ఆదివారమే బిట్రగుంట పోలీస్స్టేషన్లో కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతోపాటు భక్తులను అలజడికి గురిచేసే సున్నితమైన అంశం కావడంతో మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఉన్నతాధికారుల అనుమతితో కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈఓపైన, కొండపై తిష్టవేసిన అతని సోదరుడిపై దేవదాయశాఖ ఏసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోతే శనివారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 31 వరకు అఫిలియేషన్ల రెన్యూవల్ నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రొవిజనల్ అఫిలియేషన్ రెన్యూవల్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు మార్పిడి, కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు, ద్వితీయ భాష, మీడియం మార్పు అనుమతి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కళాశాల తరలింపు, కళాశాల మూసివేత, మూసివేసిన కళాశాల పునః ప్రారంభం, కళాశాలల పేర్లు మార్పు తదితర వాటిని చేసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణీత గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంఈఓ వ్యవహారంపై డిప్యూటీ డీఈఓ విచారణ ● ఆయన్ను కాపాడే యోచనలో అధికారులు ● విచారణకు వచ్చి ఎంఈఓ పెట్టిన భోజనాన్ని ఆరగించి వెళ్లిన వైనం ఉలవపాడు: ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ శివనాగేశ్వరరావు మద్యం మత్తులో తూగుతున్న వైనంపై కందుకూరు డిప్యూటీ డీఈఓ పీపీ నరసింహారావు మంగళవారం విచారణ చేపట్టారు. సాక్షిలో మంగళవారం ‘మద్యం మత్తులో ఎంఈఓ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. డిప్యూటీ డీఈఓ పాఠశాలకు వచ్చి శివనాగేశ్వరరావుతో మాట్లాడారు. ఆయన వివరణ, ఉపాధ్యాయుల వివరణ తీసుకున్నారు. విచారణ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. అయితే మరో ఎంఈఓ, ఉపాధ్యాయులు శివనాగేశ్వరరావుపై మద్యం తీసుకుంటాడని లిఖిత పూర్వకంగా ఇవ్వలేమని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ డీఈఓ కూడా సదరు ఎంఈఓను మందలించారని సమాచారం. మద్యం తాగుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నా ఎంఈఓను కాపాడే పనిలో విద్యాశాఖ విచారణ జరిగిందని తెలుస్తోంది. విచారణకు వచ్చిన అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓతో భోజనం తెప్పించుకుని అక్కడే తిని వెళ్లడం చూస్తే.. ఈ విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతుంది. -
ధాన్యం కొనుగోళ్లపై చర్చ
● మంత్రి నాదెండ్లతో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ నెల్లూరు రూరల్: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని తన చాంబర్లో మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 15 వేల టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని, గన్నీ బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్స్తో చర్చించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం 17–20 ఉన్న ధాన్యాన్ని సైతం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. ఏఐ ద్వారా ధాన్యం అమ్మకం మరింత సులభతరం చేసేందుకు 7337359375 నెంబరుకు హాయ్ మెసేజ్ పంపితే రైతులు ధాన్యం అమ్మకం వివరాలు తెలుసుకోవచ్చనని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కె రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్సూర్ పాల్గొన్నారు. -
కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో..
కలిగిరి: జిల్లాలోని కలిగిరి, మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో బుధవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. వాటి పరిధిలో 2,963 బ్యారెన్ల ద్వారా 3,469 మంది రైతులు పొగాకు సాగు చేపట్టారు. 2025 – 26 సీజన్కు సంబంధించి 12.65 మిలియన్ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకోవడానికి బోర్డు అనుమతి ఉంది. పెరిగిన సాగు విస్తీర్ణం, అధిక దిగుబడుల దృష్ట్యా 18.30 మిలియన్ కేజీల వరకు ఈ సీజన్లో అమ్మకాలు జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి పొగాకు గ్రేడింగ్ సమయంలో రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉంది. మొత్తం ఉత్పత్తిలో 50 శాతం వరకు మొదటి రకం (బ్రైట్ గ్రేడ్) వచ్చినట్లు రైతులు, అధికారులు చెబుతున్నారు. మిగిలిన గ్రేడ్ ఉత్పత్తులు కూడా బాగున్నట్టు తెలుస్తోంది. భారీగా పెరిగిన పెట్టుబడులు ఈ ఏడాది పొగాకు సాగుకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. గత రెండు సంవత్సరాలుగా మంచి ధరలు లభిస్తుండటంతో ఈసారి సాగు చేయడానికి రైతులు అమితంగా ఆసక్తి చూపారు. దీంతో ఈ ప్రాంతంలో పొలాలు, బ్యారెన్ల కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది రూ.లక్ష ఉన్న బ్యారెన్ కౌలు ఈసారి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలికింది. పొలం కౌలు, కూలీల రేట్లు కూడా దాదాపు రెట్టింపయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో బ్యారెన్కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతం కందుకూరు–1లో వేలం జరుగుతుండగా గరిష్ట ధర కిలోకు రూ.280 పలికింది. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఈ ఏడాది రూ.300 లభించేలా చూడా లని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలోని రైతు లు డిమాండ్ చేస్తున్నారు. రైతులు : 3,469 బ్యారెన్లు : 2,963 బోర్డు అనుమతించిన సాగు విస్తీర్ణం : 9,931 హెక్టార్లు రైతులు సాగు చేసిన విస్తీర్ణం : 9,973 హెక్టార్లు బోర్డు అనుమతించిన ఉత్పత్తి : 12.65 మిలియన్ కేజీలు రైతులు పండించిన ఉత్పత్తి (అంచనా) : 18.30 మిలియన్ కేజీలు సూచనలు పాటించాలి ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రైతు లు అవశేషాలు లేని, హీట్ లేకుండా గ్రేడ్ల ఆధారంగా బేళ్లను తయారు చేసుకోవాలి. పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటిస్తే మంచి ధరలు లభించే అవకాశం ఉంది. – మహేష్ కుమార్, వేలం నిర్వహణాధికారి, కలిగిరి పొగాకు బోర్డు పెట్టుబడులు పెరిగాయి ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెరిగాయి. సీజన్ ప్రారంభం నుంచే మంచి ధరలు లభిస్తాయని ఎదురు చూస్తున్నాం. సరాసరిన కిలో రూ.300 తగ్గకుండా ఉంటేనే రైతులు గట్టున పడతారు. – పూసాల అక్కపునాయుడు, రావులకొల్లు, కలిగిరి మండలం నేటి నుంచి కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభం సాగు సమయంలో పెరిగిన పెట్టుబడులు సరాసరిన రూ.300 ఇవ్వాలని రైతుల డిమాండ్ -
రథం ఘటనలో కేసు నమోదుపై సందిగ్ధం?
బిట్రగుంట: కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం రథోత్సవం అపశృతి వెనుక కుట్రకోణం ఉందంటూ ఆలయ ఈఓ రాధాకృష్ణ చేసిన ఫిర్యాదుపై సందిగ్ధత నెలకొంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రథోత్సవం నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథాన్ని ముందుగా పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథోత్సవం ప్రారంభించడంతో 20 అడుగులు కూడా ముందుకు కదలకముందే చక్రాల బేరింగ్ సిస్టంలో సమస్యలు తలెత్తి రథం ఆగిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, జిల్లా వ్యాప్తంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో దేవదాయశాఖ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈఓ రాధాకృష్ణ ఆదివారమే బిట్రగుంట పోలీస్స్టేషన్లో కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతోపాటు భక్తులను అలజడికి గురిచేసే సున్నితమైన అంశం కావడంతో మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఉన్నతాధికారుల అనుమతితో కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈఓపైన, కొండపై తిష్టవేసిన అతని సోదరుడిపై దేవదాయశాఖ ఏసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోతే శనివారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 31 వరకు అఫిలియేషన్ల రెన్యూవల్ నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రొవిజనల్ అఫిలియేషన్ రెన్యూవల్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు మార్పిడి, కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు, ద్వితీయ భాష, మీడియం మార్పు అనుమతి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కళాశాల తరలింపు, కళాశాల మూసివేత, మూసివేసిన కళాశాల పునః ప్రారంభం, కళాశాలల పేర్లు మార్పు తదితర వాటిని చేసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణీత గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంఈఓ వ్యవహారంపై డిప్యూటీ డీఈఓ విచారణ ● ఆయన్ను కాపాడే యోచనలో అధికారులు ● విచారణకు వచ్చి ఎంఈఓ పెట్టిన భోజనాన్ని ఆరగించి వెళ్లిన వైనం ఉలవపాడు: ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ శివనాగేశ్వరరావు మద్యం మత్తులో తూగుతున్న వైనంపై కందుకూరు డిప్యూటీ డీఈఓ పీపీ నరసింహారావు మంగళవారం విచారణ చేపట్టారు. సాక్షిలో మంగళవారం ‘మద్యం మత్తులో ఎంఈఓ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. డిప్యూటీ డీఈఓ పాఠశాలకు వచ్చి శివనాగేశ్వరరావుతో మాట్లాడారు. ఆయన వివరణ, ఉపాధ్యాయుల వివరణ తీసుకున్నారు. విచారణ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. అయితే మరో ఎంఈఓ, ఉపాధ్యాయులు శివనాగేశ్వరరావుపై మద్యం తీసుకుంటాడని లిఖిత పూర్వకంగా ఇవ్వలేమని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ డీఈఓ కూడా సదరు ఎంఈఓను మందలించారని సమాచారం. మద్యం తాగుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నా ఎంఈఓను కాపాడే పనిలో విద్యాశాఖ విచారణ జరిగిందని తెలుస్తోంది. విచారణకు వచ్చిన అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓతో భోజనం తెప్పించుకుని అక్కడే తిని వెళ్లడం చూస్తే.. ఈ విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతుంది. -
నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్
సంగం: భారతి సిమెంట్ నాణ్యతకు మారుపేరని ఆ సంస్థ సేల్స్ ఆఫీసర్ బాబ్జాన్, సీనియర్ టెక్నికల్ అధికారి ఎన్.భవానీశంకర్ తెలిపారు. మండల కేంద్రమైన సంగంలోని భారతి ట్రేడర్స్ భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులకు సోమవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారవుతుందన్నారు. కట్టడాలు దీర్ఘకాలం ఉండేందుకు దోహద పడుతుందన్నారు. సిమెంట్ తయారీకి నాణ్యమైన ముడి పదార్థాలను తమ కంపెనీ ఎంచుకుంటుందన్నారు. ఈ సిమెంట్తో వేసిన శ్లాబులను ఏడురోజుల అనంతరం కంపెనీ ప్రతినిధులు పరీక్షించి నాణ్యతను మేసీ్త్రలు, యజమానులకు వివరిస్తారన్నారు. ఇందుకు సంబంధిత డీలర్ ద్వారా వివరాలు తెలుసుకుని సమాచారం అందిస్తే సరిపోతుందన్నారు. సదస్సుకు హాజరైన మేసీ్త్రలు, కార్మికులకు రూ.లక్ష చొప్పున ఉచిత బీమా సదుపాయం కల్పించి బాండ్లను అందజేశారు. కార్యక్రమంలో భారతి ట్రేడర్స్ అధినేత రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ఇద్దరికి గాయాలు మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పెట్రోల్ బంకు సమీపంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొన్న ఘటన మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి ఏఎస్పేటకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీపల్లి పెట్రోల్ బంకు సమీపంలో ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లోని ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం దెబ్బతింది. క్షతగాత్రులను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబూ.. మహిళలకు పథకాలెప్పుడిస్తారు
నెల్లూరు(బారకాసు): మహిళల కోసం ఎప్పటి నుంచి పథకాలను అమలు చేస్తారో సీఎం చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని డైకస్రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా మహిళా సాధికారత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలవుతున్నా మహిళలకు ఉచిత బస్సు ఊసే ఎత్తడం లేదన్నారు. తల్లికి వందనం పథకాన్ని అమ లు చేయకుండా నీరుగారుస్తున్నారన్నారు. అలాగే ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. సున్నావడ్డీ రుణాలు ఎప్పుడిస్తారో ప్రకటన చేయాలన్నారు. ఆశావర్కర్లకు జీతాలు పెంచుతామని, పనిభారం తగ్గిస్తామని చెప్పి నిలువునా మోసం చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు నెలకు రూ.10 వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఆ ఉద్యోగమే లేకుండా చేసి వారి కడుపుకొట్టడం న్యాయమా అని కూటమి నేతల్ని ప్రశ్నించారు. 2014 – 19 మధ్య కూడా చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. జగన్ దిశ యాప్ను తీసుకొస్తే, దానిని నేడు శక్తి యాప్ అంటూ హంగామా చేస్తున్నారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన వ్యవస్థలను కాపీ కొడుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలిచ్చిందన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయించారని చెప్పారు. స్థానిక సంస్థల పదవులను కూడా 50 శాతం వారికే ఇచ్చారన్నారు. చంద్రబాబు హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో ఆ పార్టీ రూరల్ నియోజకవర్గ మహిళా, అంగన్వాడీ, సాంస్కృతిక విభాగాల అధ్యక్షులు బషీర, శాలిని, శారద, కార్యవర్గ సభ్యురాలు ఫరీదా తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళకు అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద -
తెలుగు అధ్యాపకుల నిరసన
నెల్లూరు(టౌన్): ‘ఇంటర్ బోర్డు చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఎప్పటి నుంచో ద్వితీయ భాషగా ఉన్న తెలుగును ఆప్షనల్ చేయడం దారుణం. ఇది ఆ భాషను అవమానించడమే’ అని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు స్టోన్హౌస్పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో జరుగుతున్న మాల్యాంకనం వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం క్యాంప్ ఆఫీసర్ ఎ.శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్, వెంకట్రావు, పులి చెంచయ్య, శ్రీనివాసులు, ఆశ్వీరాదం, సోమశేఖర్, వనజ, సరళ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ధాన్యం లారీ బోల్తా ఆత్మకూరు: ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు అనంతరాయనియేని గిరిజన కాలనీ వద్ద పొలాల్లో లారీలో ధాన్యం బస్తాలు లోడ్ చేయగా నెల్లూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో డొంకరోడ్డు కొంతమేర కుంగి ఉండటంతో లారీ అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ గాయపడగా వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ధాన్యం బస్తాలు అన్ని పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో మరో లారీలో లోడ్ చేసి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చి..● రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్పై బయలుదేరిన దినేష్కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆటోలో వెళ్తుండగా.. ● కింద పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఉదయగిరి: మండలంలోని సున్నంవారిచింతల సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఆటోలో వెళ్తున్న తిరుమలాపురం ఎస్టీ కాలనీకి చెందిన కొండయ్య (48) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు
ముత్తుకూరు: కూటమి ప్రభుత్వంలో అటు మిల్లర్లు, ఇటు దళారులు రైతుల్ని దోచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. మండలంలోని డమ్మాయపాళెంలో మంగళవారం వరి ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పుట్టి (850 కిలోలు) ధాన్యాన్ని రైతులు రూ.25,000లకు అమ్మకం చేసుకోగా, కూటమి ప్రభుత్వంలో రూ.15,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40,000 నష్టపోతున్నారన్నారు. వరి కోతలు ముమ్మరమైతే ధరలు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టపోతుంటే.. కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. దీన్ని బట్టి రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. మిల్లర్లు పుట్టి ధాన్యానికి ధర ఇస్తూ రైతు నుంచి తరుగు పేరుతో అదనంగా 150 కిలోల ధాన్యాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. పేరుకు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఒక్క చోట కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. జిల్లా అధికారుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఉత్తుత్తి ప్రకటనలు కట్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలన్నారు. సోమిరెడ్డికి కమీషన్లపైనే దృష్టి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ముడుపులు, కమీషన్లు, వసూళ్లపై దృష్టి పెట్టారని, రైతుల కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడని కాకాణి ఆగ్రహం వెలిబుచ్చారు. రైతుల పక్షాన ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, నాయకులు దువ్వూరు చంద్రశేఖర్రెడ్డి, పోచారెడ్డి చెంగారెడ్డి, సన్నారెడ్డి దయాకర్రెడ్డి, సర్పంచ్ సన్నారెడ్డి హారతి, ఎంపీటీసీ సభ్యులు మూగ కీర్తి, పాముల శ్రీనివాసులు, దువ్వూరు కోదండరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతనలేదు మా ప్రభుత్వ హయాంలో పుట్టి రూ.25 వేలు కూటమి ప్రభుత్వంలో రూ.15 వేలు మాజీ మంత్రి కాకాణి ధ్వజం -
ఉపాధి పనుల్లో రూ.3.70 కోట్ల అవినీతి
ఉదయగిరి: మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్ తనిఖీల్లో నిగ్గు తేల్చితే.. చివరకు అధికారులు ఈ మొత్తాన్ని కుదించి పది శాతానికి తగ్గించారు. ఆయా పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన 16 మంది అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడిదంటే.. ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఈ చర్యలే అద్దం పడుతున్నాయి. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మంగళవారం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.14.08 కోట్ల పనులు చేపట్టారు. వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ చేయగా బినామీ మస్తర్లు, చనిపోయిన వారి పేర్లతో నగదు స్వాహా, పనుల్లో కొలతల్లో తేడా, డబుల్ జాబ్కార్డులు, అవెన్యూ ప్లాంటేషన్లో అవినీతి, రికార్డులు మాయం చేయడం, ఉద్యోగులు, వలంటీర్ల పేరుతో మస్తర్లు, ఒకే కుటుంబంలో వివిధ జాబ్కార్డులు సృష్టించడం, నేమ్బోర్డు లేకుండానే నిధులు స్వాహా, తదితర అవినీతి అక్రమాలు గుర్తించారు. మండలంలోని 17 పంచాయతీల్లో రూ.3.70 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా లెక్క తేల్చారు. డ్వామా పీడీ గంగాభవాని సమక్షంలో జరిగిన ప్రజా వేదికలో సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారీగా జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టారు. అయితే అటు చేసి.. ఇటు చేసి రూ.37.80 లక్షల అవినీతి జరిగినట్లుగా లెక్క తేల్చారు. మరో రూ.98 లక్షలకు సంబంధించి రికార్డులు మాయం కావడంతో అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఎంపీడీఓ అప్పాజీని డ్వామా పీడీ ఆదేశించారు. ఈ అవినీతి, అక్రమాల్లో ప్రమేయమున్న ఏపీఓ శ్రీనివాసులు, ఈసీలు వెలుగోటి శ్రీనివాసులు, మురళీకృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్లు సుహాసిని, రిఫీ, టెక్నికల్ అసిస్టెంట్లు మనోజ్, రామకృష్ణ, కాలె శ్రీనివాసులుతోపాటు 9 మంది క్షేత్ర సహాయకులను సస్పెండ్ చేస్తూ పీడీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంబుడ్స్మెన్ వెంకటరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి సతీష్బాబు, ఇన్చార్జి ఏపీడీ శంకరనారాయణ, ఎంపీడీఓ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. రికవరీకి ఆదేశించిన మొత్తాలు ఉదయగిరిలో రూ.2,98,788, కొండాయపాళెం రూ.2,61,763, పుల్లాయపల్లి రూ.9,28,320, ఆర్లపడియ రూ.4,14,074, బండగానిపల్లి రూ.1,53,811, దాసరపల్లి రూ.17,200, శకునాలపల్లి రూ.41,147, నేలటూరు రూ.29,400, తిరుమలాపురం రూ.2,71,774, వెంగళరావునగర్ రూ.2,31,071, జి.అయ్యవారిపల్లి రూ.2,42,066, జి.చెరువుపల్లి రూ.78,011, గండిపాళెం రూ.61,427, జి.చెర్లోపల్లి రూ.2,252, అప్పసముద్రం రూ.5,40,000, కృష్ణంపల్లి రూ.2,72,064, గన్నేపల్లి రూ.2,500 అవినీతి జరిగినట్లుగా తేల్చి రికవరీకి ఆదేశించారు. రికవరీకి ఆదేశించిన మొత్తం రూ.37.80 లక్షలే 16 మంది ఉపాధి సిబ్బంది, అధికారులపై సస్పెన్షన్ వేటు -
ధాన్యం కొనుగోళ్లపై చర్చ
● మంత్రి నాదెండ్లతో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ నెల్లూరు రూరల్: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని తన చాంబర్లో మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 15 వేల టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని, గన్నీ బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్స్తో చర్చించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం 17–20 ఉన్న ధాన్యాన్ని సైతం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. ఏఐ ద్వారా ధాన్యం అమ్మకం మరింత సులభతరం చేసేందుకు 7337359375 నెంబరుకు హాయ్ మెసేజ్ పంపితే రైతులు ధాన్యం అమ్మకం వివరాలు తెలుసుకోవచ్చనని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కె రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్సూర్ పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు కష్టాలమయంగా మారాయి. ప్రజల దైనందిన జీవితంలో రెవెన్యూ, సర్వే, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పౌరసరఫరాలు, విద్యుత్, హౌసింగ్, నీటి పారుదల శాఖల పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి
8 నెలల్లో రిజిస్టర్ అయిన అర్జీలు 32,754 ఆన్లైన్లో నమోదు కానివి 3 వేల పైమాటే పరిష్కరించినట్లు చెబుతున్న అర్జీలు 28,913 పరిష్కారానికి నోచుకోని అర్జీలు 3,841 ప్రతి వారం వస్తున్న అర్జీల సంఖ్య 400 పైమాటే నెల్లూరు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక.. ఒక ప్రహసన కార్యక్రమంగా మిగిలిపోతోంది. ప్రతి సోమవారం కలెక్టర్ నుంచి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక సామాన్య ప్రజలకు పరిష్కారం చూపించి భరోసా కల్పించలేకపోతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే అర్జీలే నిదర్శనంగా ఉంది. ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి 400 నుంచి 450 అర్జీలు వస్తున్నాయంటే మండల కేంద్రాల్లో ఆయా శాఖల అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పేదలమైన తమ భూములను పెద్దలు గుంజుకుంటున్నారు. రైతులకు పాస్బుక్లు సకాలంలో ఇవ్వడం లేదు. రోడ్డు, బాటలను కబ్జా చేస్తున్నారు. శ్మశాన స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఉన్న ఇంటి స్థలాన్ని కబ్జాచేయాలని చూస్తున్నారు.. అంటూ ఇలాంటి సమస్యలు మండల కేంద్రాల్లో పరిష్కారం కాకపోవడంతో ఎంతో ఆశతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక వద్దకు బాధితులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల ఆక్రమణదారులకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా బాధితులు కలెక్టరేట్ చుట్టూ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మండలాల్లో పరిష్కారం కాలేదని కలెక్టరేట్కు వస్తే... మండల కేంద్రాల్లో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ తహసీల్దార్గాని, ఎంపీడీఓ గాని, ఇతర అధికారులు సమస్యలను పరిష్కరించకుండా తిప్పుకుంటున్నారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ఒక రోజు కూలీ వదులుకుని, ఛార్జీలు పెట్టుకుని, తినీ తినక కలెక్టరేట్కు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. అయితే కలెక్టరేట్లో అర్జీలు తీసుకుని అధికారులు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. మళ్లీ మండల కేంద్రాలకే అర్జీదారులను పంపుతున్నారు. ఇక సమస్య పరిష్కరించేసినట్టేనంటూ ఆన్లైన్లో అర్జీలను క్లోజ్ చేస్తున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అర్జీదారుల సంఖ్య ఎందుకు తగ్గడం లేదు అధికారులు చెబుతున్నట్లు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటే ప్రతి సోమవారం కలెక్టరేట్లో సుమారు 400 వరకు అర్జీదారులు ఎందుకు వస్తున్నారంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ రావాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ను పరిశీలించగా ఆన్లైన్ చేసిన అర్జీలు 303 రాగా, మరో 70కి పైగా ఆన్లైన్ కాకుండా అర్జీలు వచ్చాయి. -
భూమి మా ప్రాణం.. జీవనాధారం
కావలి: మూడు పంటలు పండే మా భూములు మా ప్రాణం, మా జీవనాధారం. అటువంటి భూములను బలవంతంగా లాక్కుంటామంటే ఊరుకునేది లేదని, అధికారులు మొండిగా వ్యవహరిస్తే.. సామూహిక ఆత్మహత్యలకు కూడా వెనుకాడేది లేదని మండలంలోని తీర ప్రాంతాల రైతులు తెగేసి చెప్పారు. మండలంలోని ఆనెమడుగు, మొండిదిన్నెపాళెం కట్టకిందపాళెం, బైనేటివారిపాళెం, ఆకుతోట గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, గీత కార్మికులు, గ్రామాల్లో ప్రజలు తమ అభిప్రాయాలు తీసుకోకుండా భూము లు లాక్కోవాలని 91 డిక్లరేషన్ ప్రకటించడంపై రైతులు నిరసన నినాదాలతో హోరెత్తించారు. రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా, ఏడాదికి మూడు పంటలు పండే భూములను పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారంటూ వందలాది మంది రైతులు సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్డీఓకు, అధి కారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అధికారుల వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం కావలి తీరంలో భూములు సేకరించడం దారుణమన్నారు. ఈ భూములపై ఆధారపడి ఐదు గ్రామాల ప్రజలు జీవ నం సాగిస్తున్నారని తెలిపారు. అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఈ నెల 25 నుంచి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సామూహికంగా ఆత్మహత్యలకై నా సిద్ధమే కానీ ఒక్క సెంటు భూమి కూడా వదులుకోమని తెలిపారు. దీంతో ఆర్డీఓ వంశీకృష్ణ బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులకు, కలెక్టర్కు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కావలికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాల్లో సంవత్సరానికి మూడు పంటలు పండే భూముల మీద 1,200 కుటుంబాలు, 400 కల్లుగీత కుటుంబాలు, 300 పాడి రైతు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. 2013 భూసేకరణ చట్టప్రకారం బహుళ పంటలు పండే భూములు తీసుకోకూడదని చెప్పారు. గ్రామ సభలో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలని, 80 శాతం ఆమోదం పొందాలని చట్టంలో ఉన్నా అధికారులు ఆ చట్టాన్ని తుంగలో తొక్కారని తెలిపారు. ప్రజలు చూడని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి భూములు లాక్కోవాలని చూడడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వ్యవసా య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగళ పుల్లయ్య, జిల్లా అధ్యక్షుడు జొన్నలగడ్డ వెంకమ్మరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్లూరు మాల్యాద్రి, మండల కార్యదర్శి రాధాకృష్ణయ్య, రైతు సంఘం నాయకులు గడ్డం మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తుమ్మల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. భూములు లాక్కుంటే ఆత్మహత్యలే మూడు పంటలు పండే భూములు పరిశ్రమలకు ఇవ్వం ఈ నెల 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు -
అస్తవ్యస్తంగా పది పరీక్షలు
నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తొలి రోజు సోమవారం అస్తవ్యస్తంగా నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో ఆలస్యంగా పరీక్షలు జరిగినట్లు తెలిసింది. కొన్ని సెంటర్లలో వసతులపై పేరెంట్స్, సెంటరు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. విడవలూరు మండలం వావిళ్లలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని ఓ గది తాళాన్ని పగుల కొట్టి విద్యార్థులు లోపలికి పంపించిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని మాగుంట లేవుట్లోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో 15 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైనట్లు విద్యార్థులు చెప్పారు. నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూల్లో వసతులపై పేరెంట్స్, సెంటర్ నిర్వాహకులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. చాలా సెంటర్లలో సరైన గాలి, వెలుతురు లేకపోవడంతో ఉక్కపోతతో పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి ఏర్పాట్లు కూడా చేయలేదని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఓ వైపు, ఇరుకు గదుల్లో పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. పలు కేంద్రాల్లో హాల్ టికెట్ల నంబర్ల డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో గదులు ఎక్కడో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని సెంటర్ల అడ్రసు సరిగా లేకపోవడంతో వెతకడానికే సమయం సరిపోయిందంటున్నారు. విద్యార్థులతో వచ్చిన తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం బయటే పడిగాపులు కాఽశారు. వారికి తాగేందుకు నీరు ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడ్డారు. ఈ విషయంపై డీఈఓకు ఫోన్ చేయగా సరైన కారణాలతో ఆలస్యంగా ప్రారంభమైన సెంటర్లలో అదనంగా సమయం కేటాయించమని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. 384 మంది గైర్హాజరు తొలి రోజు తెలుగు పరీక్షకు 28,496 మంది రెగ్యులర్, 734 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. రెగ్యులర్ 28,492 మంది, ప్రైవేట్ విభాగంలో 354 మంది హాజరయ్యారు. మొత్తంగా 380 మంది గైర్హాజరయ్యారు. కొన్ని సెంటర్లలో ఆలస్యంగా పరీక్ష ప్రారంభం వావిళ్ల సెంటరులో తాళాలు పగులకొట్టి తలుపులు తీసిన పేరెంట్స్ వసతులు లేక ఇబ్బందులు పడిన విద్యార్థులు -
కలెక్టర్ చెప్పినా తహసీల్దార్ ఇబ్బంది పెడుతున్నాడు
కోవూరు నందలగుంట గిరిజనులకు ఆ సమీపంలో 15 సెంట్ల శ్మశాన స్థలం ఉంది. శ్మశానం పక్కనే ఒక వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రి నిర్మిస్తూ శ్మశాన స్థలాన్ని ఆక్రమించాడు. ఈ విషయమై మూడు నెలలుగా ప్రతి వారం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ ఆనంద్ స్పందించి తహసీల్దార్కు ఫోన్ చేశారు. తహసీల్దార్, వీఆర్వో సర్వే చేసి శ్మశాన స్థలాన్ని గత నెల 11వ తేదీన గిరిజనులకు అప్పగించారు. హద్దులు కూడా వేయించారు. అయితే ఏమి జరిగిందో ఏమో నెల తిరిగే లోపు కలెక్టర్ రాతపూర్వకంగా తనకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తహసీల్దార్ చెప్పారు. అందువల్ల కలెక్టర్ వద్దకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవాలని ఇప్పుడు మెలిక పెట్టారు. ఇది గిరిజనుల శ్మశాన వాటిక కాదని చెబుతున్నారు. దీని వెనుక ఏ పెద్దలు ఉన్నారో తమకు అర్థం కావడంలేదు. కలెక్టర్ ఈ రోజు కూడా ఆ శ్మశాన స్థలం గిరిజనులదేనని చెప్పారు. ఆచరణలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కలెక్టర్ ఆదేశాలు ఇస్తు న్నా.. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తో అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. – నందిపోగు రమణయ్య, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి విజయమ్మ, జ్యోతి, నందలగుంట గిరిజనులు -
నా భూమిని కాపాడమని తిరుగుతున్నా
నాకు నలుగురు ఆడ పిల్లలు. అనంతపురంలో సుమారు 6 ఎకరాల వరకు బిట్లు, బిట్లు గా పొలం ఉంది. కొంత మంది నా పొలాన్ని, ఇంటిని ఆక్రమించాలని చూస్తున్నా రు. కిష్టమ్మ, రఘురామిరెడ్డి 1.70 ఎకరాలు ఆక్రమించారు. బావి దగ్గరకు పోనివ్వడం లేదు. పొలానికి వెళ్లే కాలువను తెగ్గొట్టారు. పోలా సురేష్, దశయ్య, మరికొంత భూమిని ఆక్రమించారు. నేను వయోభారంతో ఉండడంతో ఇబ్బంది పెడుతున్నా రు. నా బాధ కలెక్టర్కు మొర పెట్టుకున్నాను. తహసీల్దార్కు ఫోన్ చేశారు. అయితే మా గ్రామంలో కొంత మంది ఒత్తిడి వల్ల స్థానిక అధికారులు పట్టించుకోలేదు. నాలుగో దఫా కలెక్టరేట్కు వచ్చాను. – కాకు మాలకొండారెడ్డి, అనంతపురం, కలిగిరి మండలం ● -
పొలాన్ని చూపాలని కాళ్లరిగేలా తిరుగుతున్నా..
మా తండ్రి సుబ్బరాయుడు మిలిటరీలో జీపు డ్రైవర్. ఆయనకు నెల్లూరు పడారుపల్లిలో 5 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది. అయితే అది ప్రభుత్వ అవసరాలకు జానకమ్మ కలెక్టర్గా ఉన్నప్పుడు తీసుకుని పొదలకూరు తహసీల్దార్ వద్దకు పంపారు. అక్కడి తహసీల్దార్ మండలంలోని ఆల్తుర్తి వద్ద తనకు 5 ఎకరాలు కండలేరు కాలువ కింద కేటాయించి పట్టా ఇచ్చారు. పాస్ బుక్స్ ఇవ్వాలని 2016 నుంచి తహసీల్దార్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాను. – తడకలూరు సోమశేఖరయ్య, ప్రశాంతినగర్, మైపాడురోడ్డు ● -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
నెల్లూరు (టౌన్): నగరంలోని స్టోన్హౌస్పేటలో ఉన్న కేఏసీ జూనియర్ కళాశాలలో సోమవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షల జవా బు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్మ్యాటిక్స్, సివిక్స్ సబ్జెక్ట్ల మూల్యాంకనం చేస్తున్నారు. దాదాపు 480 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారని ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. వచ్చే నెల మొదటి వారానికి మూల్యాంకనం పూర్తి కావచ్చన్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు మిగిలిన సబ్జెక్ట్ల మూల్యాంకనం జరుగుతుందన్నారు. తొలివిడతలో జరుగుతున్న మూల్యాంకనానికి హాజరుకాని అధ్యాపకులు మూల్యాంకనం కేంద్రంలో రిపోర్ట్ చేయాలన్నారు. గైర్హాజరైన అధ్యాపకులు, సంబంధిత కళాశాలల యాజమాన్యాలపైన ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు చర్యలు ఉంటాయన్నారు. యోగి వేమన వర్సిటీ ఇన్చార్జి వీసీగా అల్లం వెంకటాచలం: వైఎస్సార్ జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్కు ఏఆర్ ఏఎస్పీ నెల్లూరు (క్రైమ్): ఏఆర్ ఏఎస్పీ జి. మునిరాజాను వీఆర్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిరాజా గతేడాది అక్టోబర్లో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలంగా విధుల్లో నిర్లక్ష్యం, వివిధ ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను వీఆర్కు బదిలీ చేశారు. దీంతో ఆయన విధుల నుంచి రిలీవ్ అయి పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసేందుకు వెళ్లారు. ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం ● రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ● కంట్రోల్ రూమ్ నంబర్ 85208 79979 ఏర్పాటు ● జేసీ కార్తీక్ నెల్లూరు (అర్బన్): ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగంగా జరపనున్నామని జేసీ కార్తీక్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 300 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఒకటి, రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 3.50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. 250 లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపేందుకు సిద్ధం చేశామన్నారు. లారీలు జిల్లా దాటి వెళ్లకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి రోజు 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. మద్దతు ధరకన్నా తక్కువకు కొనుగోలు చేసే రెండు మిల్లులపై కూ డా కేసులు నమోదు చేశామన్నారు. రైతులు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ను సంప్రదించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులుంటే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 85208 79979 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. -
తలకు తీవ్రగాయమై యువకుడి మృతి
నెల్లూరు(క్రైమ్): పక్కనున్న మిద్దైపె పడి తలకు తీవ్ర గాయమై యువకుడు మృతి చెందిన ఘటన నగరంలోని కొరడావీధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్కు చెందిన సుబ్రత సమంత ఉపాధి నిమిత్తం నగరానికి పదేళ్ల క్రితం వచ్చి కోటమిట్టకు చెందిన అన్వర్బాషా వద్ద బంగారు ఆభరణాల తయారీ పనులు చేసుకుంటూ కొరడావీధిలో నివసిస్తున్నారు. ఈయన చిన్నాన్న కుమారుడు సునీల్ సమంత (27) నెల్లూరుకు ఎనిమిదేళ్ల క్రితం వచ్చి కొరడావీధిలోని మొహిద్దీన్ వద్ద బంగారు పనులు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సురేంద్ర కాంప్లెక్స్లోని నాలుగో అంతస్తులో గల పెంట్హౌస్లో స్నేహితులు జయంత్, జయంత్గైన్తో కలిసి ఉంటున్నారు. ఈ ముగ్గురూ ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం భోజనం చేసేందుకు లోపలికి వీరు వెళ్లగా, సునీల్ సమంత బయటే ఉన్నారు. ఈ తరుణంలో పక్కనే ఉన్న మిద్దైపె సునీల్సమంత పడ్డారు. శబ్దం రావడంతో బయటకు పరుగులు తీసిన స్నేహితులు జరిగిన విషయాన్ని స్థానికంగా ఉన్న దస్తగిరి ద్వారా సుబ్రత సమంతకు తెలియజేశారు. ఘటన స్థలానికి హుటాహుటిన ఆయన చేరుకున్నారు. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలో ఉండటంతో 108కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వారు పరిశీలించి అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. ఈ మేరకు సంతపేట పోలీసులకు మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. ఎస్సై సుల్తాన్బాషా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో తమ స్వస్థలానికి తరలించారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ధర్నా
నెల్లూరు రూరల్: యువతకు ఉద్యోగాలు కల్పించాలని, లేకపోతే నిరుద్యోగ భృతినైనా ఇవ్వాలని ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ఎన్నో హామీలిచ్చారని, అధికారంలోకి వచ్చాక వీటిని విస్మరించారని ఆరోపించారు. మెగా డీఎస్సీ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. వేలాది మంది నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నారని, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సమస్యలపై స్పందించకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. -
ఎండల తీవ్రతతో జాగ్రత్తలు పాటించాలి
నెల్లూరు రూరల్: ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఇంజినీరింగ్ శాఖలు, డ్వామా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూలీలు పనిచేసే ప్రదేశంలో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నీటి కియోస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. కూలీలు, నిర్మాణ కార్మికులు మధ్యాహ్న సమయంలో పనిచేయకుండా చూడాలని సూచించారు. పని ప్రదేశాల్లో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురైతే చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూగజీవాలను రక్షించేందుకు పశుసంవర్థక అధికారులు కృషి చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, డీఆర్వో ఉదయభాస్కర్రావు, డ్వామా పీడీ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. -
మాయమాటలు చెప్పడంలో సిద్ధహస్తులు
● చంద్రబాబుపై మండిపడిన కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(బారకాసు): మాయమాటలు చెప్పడంలో సీఎం చంద్రబాబు సిద్ధహస్తులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. డైకస్రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తానేనని ఆయన ప్రకటించడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పచ్చ పత్రికలో ప్రచురించడం మరో విడ్డూరమని విమర్శించారు. వాస్తవానికి పొట్టి శ్రీరాములు జిల్లాగా 2008 జూన్లో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ప్రకటించిన అంశం అందరికీ తెలుసునన్నారు. దీనికి సంబంధించి అదే ఏడాది మే 25న జీఓ విడుదలైన అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలు నవ్వుకుంటారనే కనీస ఆలోచన లేకుండా చంద్రబాబు ఇలా అబద్ధాలు చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల విషయంలోనూ ఆయన గతంలో ఇదే తరహాలో విచిత్ర వ్యాఖ్యలు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రతి గొప్ప పనినీ తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు మొదట్నుంచి అలవాటని విమర్శించారు. అమరజీవి 56 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారని, గతంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించి, దాన్ని విస్మరించారని ఆరోపించారు. ఆయన మాటలు వింటే పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. రైతుల బాధలు వర్ణనాతీతం పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలేదని, దీంతో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారిందని కాకాణి చెప్పారు. అధికారుల లెక్కలు తప్పడం.. వాస్తవాలు ప్రభుత్వ దృష్టికి రాకపోవడంతో రైతులకు మేలు జరగడంలేదని టీడీపీ అనుకూల పత్రికల్లో ప్రచురించారన్నారు. తాను చేస్తున్న తప్పులను వదిలేసి అధికారులపై నింద వేసి తప్పించుకునే ధోరణిని ఆయన అవలంబిస్తున్నారనే అంశాన్ని అందులో పేర్కొన్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే సదరు మీడియా సంస్థ స్వరం మారిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పుట్టి ధాన్యానికి రూ.19,720 గిట్టుబాటు ధర కల్పిస్తే, అది ప్రస్తుతం రూ.15,500కు పడిపోయిందని వివరించారు. -
ఐదు కిలోల కణితి తొలగింపు
● పెద్దాస్పత్రి వైద్యుల ఘనత నెల్లూరు(అర్బన్): తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన 35 ఏళ్ల తాటిపర్తి శశికళకు నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ఆపరేషన్ చేసి ఆమె తొడ భాగం నుంచి ఐదు కిలోల కణితిని తొలగించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆస్పత్రి జనరల్ సర్జన్ కాలేషాబాషా సోమవారం వెల్లడించారు. ఎడమ తొడ భాగంలో కణితి ఏర్పడి క్రమేపీ పెరుగుతూ వచ్చిందని, నొప్పి ఎక్కువ కావడంతో పలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆమె ఆశ్రయించారని చెప్పారు. రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో పెద్దాస్పత్రికి ఆమె వచ్చారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా.. లోపలి రక్తనాళాలకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్ ద్వారా కణితిని తొలగించామని తెలిపారు. తనతో పాటు డాక్టర్లు సుహాసిని, ఉమామహేష్, మత్తు వైద్యులు శారదతో కూడిన వైద్య బృందం ఆపరేషన్లో పాల్గొందని తెలిపారు. ఆపరేషన్ను విజయవంతంగా చేసిన డాక్టర్లను ఆస్పత్రి సూపరింటెండెంట్ సిద్ధానాయక్ అభినందించారు. -
ధాన్యం ధరలు పతనమయ్యాయి
జిల్లాలో ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయని అఖిల భారత రైతు సంఘ నేతలు కోటిరెడ్డి, రాపూరు రాధాకృష్ణనాయుడు, శ్రీనివాసులురెడ్డి, షానవాజ్, నెల్లూరు రమణయ్య తెలిపారు. పుట్టికి రూ.16,500 మేరే మిలర్లు, దళారులు ఇస్తున్నారని, నెమ్ము పేరుతో 70 కిలోలను అదనంగా తీసుకుంటున్నారని వాపోయారు. జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మారాయని, వంద కేంద్రాల ద్వారా 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే సేకరించారని చెప్పారు. గోతాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంక్ గ్యారెంటీలను మిల్లర్లు ఇవ్వడంలేదని చెప్పారు. -
మోసపోయాం.. న్యాయం చేయండయ్యా
బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ కృష్ణకాంత్● ఎస్పీకి బాధితుల వినతి నెల్లూరు(క్రైమ్): ఉద్యోగాలు.. మెడికల్ సీట్లు.. వీసాల పేరిట రూ.లక్షల్లో దోచేసిన మోసగాళ్లపై చర్యలు చేపట్టాలని పలువురు బాధితులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీకి కృష్ణకాంత్కు 75 మంది తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. వీటిని పరిశీలించిన ఆయన త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆయా ప్రాంత పోలీస్ అధికారులను ఆదేశించారు. మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగర, కావలి డీఎస్పీలు సింధుప్రియ, శ్రీధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● వాట్సాప్లో జ్యోతిర్నాథ్ పరిచయమై సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించి రూ.2.1 లక్షలను తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా, ఉద్యోగమిప్పించకపోవడంతో గట్టిగా ప్రశ్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. అతనిపై చర్యలు చేపట్టాలని వేదాయపాళేనికి చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేశారు. ● తమిళనాడుకు చెందిన లక్ష్మీనారాయణ, సెల్వం అదే రాష్ట్రంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ.20 లక్షలు వసూలు చేశారు. ఇప్పించకపోవడంతో నిలదీయగా, దౌర్జన్యం చేస్తున్నారు. వీరిపై చర్యలు చేపట్టాలని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి కోరారు. ● వేదాయపాళేనికి చెందిన వెంకట్రావు బీవీనగర్లోని స్టీల్ కంపెనీలో డీజిల్ మోటార్లను ఇప్పిస్తానని రూ.4.2 లక్షలు తీసుకున్నారు. వీటిని ఇప్పించకుండా కాలయాపన చేస్తుండటంతో ఇటీవల గట్టిగా నిలదీయగా, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విన్నవించారు. ● అబుదాబీలో పనిచేసేందుకు వర్కింగ్ వీసా ఇప్పిస్తామని, నెలకు రూ.80 వేల జీతమొస్తుందని నమ్మించి రూ 2.7 లక్షలను విజయవాడకు చెందిన రామకృష్ణ, దివ్య, జగిత్యాలకు చెందిన శ్రీనివాస్, రిజ్వానా, ఆస్సు తీసుకున్నారు. విజిటింగ్ వీసా ఇచ్చి మోసం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, వీరిపై చర్యలు చేపట్టాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశారు. ● ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలిప్పిస్తామంటూ మా వద్ద రూ.5.62 లక్షలను అనంతసాగరానికి చెందిన ఖాజామొహిద్దీన్ తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో, నిలదీయగా దౌర్జన్యం చేస్తున్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని అదే ప్రాంతానికి చెందిన చెందిన ఇద్దరు యవకులు కోరారు. ● తన పేరుపై ఉన్న ఆస్తిని రాసివ్వాలని కొడుకు, కోడలు చిత్రహింసలకు గురిచేస్తూ, తన వస్తువులను ధ్వంసం చేసి దుస్తులను కాల్చేశారు. వీరిపై చర్యలు చేపట్టాలని తోటపల్లిగూడూరుకు చెందిన ఓ వృద్ధుడు విన్నవించారు. ● అల్లూరుకు చెందిన సుమంత్, అతని తండ్రి నాపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలని అల్లూరుకు చెందిన ఓ వృద్ధుడు వేడుకున్నారు. -
వెల్లువెత్తిన అర్జీలు
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులకు అర్జీలను అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీటిని కలెక్టర్ ఆనంద్, డీఆర్వో ఉదయభాస్కర్రావు, డ్వామా పీడీ గంగా భవానీ, డీపీఓ శ్రీధర్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఒ మోహన్రావు తదితరులు స్వీకరించారు. కాగా వివిధ సమస్యలపై మొత్తం 303 అర్జీలు అందాయి. మెడికల్ వేస్ట్ సేకరణకు అనుమతించాలి గ్రామీణ ప్రాంతాల్లో బయో మెడికల్ వేస్ట్ను సేకరించే కార్మికుల్లేకపోవడంతో దాన్ని ఇష్టమొచ్చినట్లు పారేస్తున్నారని ఏవీఐ బయోకేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వీటిని సేకరించే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కోరారు. జిల్లా వైద్య శాఖ సూచన మేరకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తామన్నారు. కోటేశ్వరరావు, రాజేష్, శీను తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
కలిగిరి: వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఘటన స్థానిక సబ్స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన సోమవారం వెలుగులోకి వచ్చింది. విషయాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎస్సై ఉమాశంకర్ పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న సెల్ఫోన్ ఆధారంగా నెల్లూరుకు చెందిన రాఘవరెడ్డి (60)గా గుర్తించారు. కలిగిరికి చెందిన రాఘవరెడ్డి 20 ఏళ్లుగా నెల్లూరులో ఉంటూ, అక్కడే కార్ల షోరూమ్ వద్ద వాచ్మెన్గా పనిచేస్తూ ఒంటరిగా జీవిస్తున్నారు. కలిగిరి, వింజమూరులో ఉన్న బంధువుల వద్దకొచ్చి ఇలా విగతజీవిగా మారారు. కాగా మరణ వార్తపై బంధువులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి వారు చేరుకొని ఎలాంటి కేసు అవసరం లేదని చెప్పి రాఘవరెడ్డి మృతదేహన్ని తీసుకెళ్లారు. మద్యం సేవించి మృతి చెంది ఉండొచ్చని బంధువులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అంబరాన్నంటిన రంగడి సంబరం
రంగడి రథోత్సవం నెల్లూరు(బృందావనం): నెల్లూరులో పవిత్ర పినాకినీ తీరాన రంగనాయకులపేటలో శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదేవేరులతో సర్వాలంకార శోభితంగా తీర్చిదిద్దిన తిరుత్తేరు (రథం)పై కొలువైన రంగనాథుడిని దర్శించుకునేందుకు తరలివచ్చిన అశేష భక్తజనంతో మాడవీధులు పోటెత్తాయి. దాదాపు ఐదున్నర గంటలకు పైగా ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. తొలుత ఆలయంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామి ఉభయ దేవేరులతో తూర్పు రాజగోపురం సమీపంలో ఉన్న రథమండపం వద్ద తిరుత్తేరులోకి వేంచేపు చేశారు. వివిధ పూజల తర్వాత మండం నుంచి రథం పినాకినీ తీరం వైపు ఉన్న ఉత్తర మాడవీధి వైపునకు అనంతరం తూర్పున ఉన్న గోపురం వీధి రైల్వేగేట్ వరకు అక్కడి నుంచి తిరిగి గోపురం వీధి, రంగనాయకులపేట, సంతపేట, నాలుగుకాళ్ల మండపం వరకు, అక్కడి నుంచి వెనుదిరిగి మండపం వరకు జరిగింది. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంప్రదాయంగా నాలుగు కాళ్ల మండపం వద్ద లక్ష్మీదేవి, చెంచులక్ష్మి సమేత వేదగిరి లక్ష్మీనృసింహస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వైభవంగా రథోత్సవం తరలివచ్చిన అశేష భక్తజనం వేడుకగా ఎదురుకోలోత్సవం -
ఇదేనా ప్రశాంతమ్మ పాలన?
పచ్చనాయకుడు చెప్పినట్లు విని వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెడితే పోలాసాక్షి, టాస్క్ఫోర్స్: బసవారెడ్డి శంకయ్య నుంచి రేబాల దశరథరామిరెడ్డి, వెంకురెడ్డి, పెళ్లకూరు రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వంటి రాజకీయ ఉద్దండులు కోవూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వర్గ రాజకీయాలకు దూరంగా పాలన సాగించి.. ప్రజాదరణ పొందారు. ఇటువంటి రాజకీయ చైతన్యంతోపాటు ప్రశాంత వాతావరణం ఉండే కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతమ్మ పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం, రౌడీ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సతీమణిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంతిరెడ్డి తన తొమ్మిది నెలల పాలనలో అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారనే విమర్శలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు అధికార పార్టీ నేతల రెడ్బుక్ రాజ్యాంగం అక్రమాలు ఎత్తిచూపితే కేసులతో వేధింపులు వైఎస్సార్సీపీ నేత వీరి చలపతిరావు, అనుచరులపై కేసులు బూతు పురాణాలతో రెచ్చిపోతున్న పచ్చనేతలు రాజకీయ చైతన్యానికి, విలువలకు కోవూరు నియోజకవర్గం మారు పేరు. ఇక్కడి నుంచి ఎన్నికై దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించిన గొప్ప రాజనీతిజ్ఞులున్నారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా రాజకీయ విద్వేషాలకు, రాగద్వేషాలకు తావులేని గడ్డపై రెడ్బుక్ రాజ్యమేలుతోంది. జిల్లాలో చరిత్ర కలిగిన కుటుంబం నుంచి మహిళా నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనతి కాలంలోనే వర్గ రాజకీయాలు, కక్షలకు పురిగొల్పుతూ తెర వెనుక నుంచి ఆజ్యం పోస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
ఈత కొట్టేందుకు పెన్నా నదిలో దిగి..
● బాలుడి మృతి నెల్లూరు(క్రైమ్): స్నేహితులతో కలిసి పెన్నానదికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. తడికలబజారు ప్రాంతంలో శ్రీదేవి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె పెద్ద కుమారుడు నందకిశోర్ తొమ్మిదో తరగతి, చిన్నకుమారుడు మహీధర్ (14) ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో మహీధర్ తన స్నేహితులైన కిరణ్కుమార్, రోహన్కుమార్, సాయి, చరణ్ తదితరులతో కలిసి పెన్నానదికి వెళ్లాడు. అందరూ కలిసి తిక్కన పార్కు సమీపంలో నదిలో చేపలు పట్టారు. తర్వాత ఈతకొట్టేందుకు నదిలో దిగే క్రమంలో మహీధర్ ప్రవాహంలో చిక్కుకుపోగా ఇంతలో అక్కడకు చేరుకున్న నందకిశోర్ రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. మహీధర్ నీటిలో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంతపేట ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమారుడు గల్లంతైన విషయం తెలుసుకున్న శ్రీదేవి తన భర్త వంశీ, బంధువులతో కలిసి పెన్నానదికి చేరుకున్నారు. అందరూ కలిసి బాలుడి కోసం గాలించారు. కొద్దిసేపటికి మహీధర్ను గుర్తించి బయటకు తీసుకొచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
మా బతుకుదెరువు పోతుంది
కావలి: బీపీసీఎల్కు భూమిలిచ్చేది లేదని గుమ్మడి బొందల గ్రామస్తులు తెగేసి చెప్పారు. సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కావలి రూరల్ మండలం రుద్రకోట పంచాయతీలోని ఆ గ్రామంలో రైతులు, స్థానికులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. బీపీసీఎల్ ఆయిల్ కంపెనీకి గ్రామంలోని పొలాలు పూర్తిగా అప్పగించాలని అధికారులు చేస్తున్న కుట్రలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయపట్నం పోర్టు అనుసంధానంగా ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ కంపెనీకి పొలాలను అప్పగిస్తే, తమ బతుకుదెరువు ఏమైపోవాలని, ఎలా బతకాలని ప్రశ్నించారు. పొలాలు పోతే కల్లుగీత వృత్తి కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పశువులు మేతకు తిరిగేదానికి కూడా అవకాశం లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం భూసేకరణను రద్దు చేసుకోవాలని, లేకపోతే పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు తాళ్లూరు మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మారుపూడి రాధాకృష్ణయ్య, వలపర్ల వెంకయ్య, తుళ్లూరు వెంకయ్య, రామకృష్ణ, జమ్ముల శివశంకర్రావు, వెంకటస్వామి, ఉప్పాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బీపీసీఎల్కు భూములివ్వం గుమ్మడిబొందల గ్రామస్తుల అల్టిమేటంనిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.90 సన్నవి : రూ.60 పండ్లు : రూ.40 -
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): పట్టాలు దాటుతుండగానో? లేక బహిర్భూమికెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు జరిగిందో.. స్పష్టమైన కారణం తెలియదు గానీ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీప నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.రోడ్డు దాటుతుండగా.. ● కారు ఢీకొని మహిళ మృతి బుచ్చిరెడ్డిపాళెం: ఓ మహిళ రోడ్డు దాటుతుండగా కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సంగం మండలం జెండాదిబ్బకు చెందిన షేక్ రహమత్ (55) బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న వే బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతోంది. నెల్లూరు వైపు అతివేగంగా వస్తున్న కారు ఆమెను ఢీకొట్టడంతో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆగని చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ● తాజాగా పడుగుపాడు వద్ద పట్టుకున్న పోలీసులు కోవూరు: కొందరు వ్యక్తులు చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున చైన్నె నుంచి జాతీయ రహదారి మీదుగా మినీ వ్యాన్లో వ్యర్థాలు వెళ్తున్న విషయాన్ని ఎఫ్డీఓ శ్రీనివాసులు కోవూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు పడుగుపాడు వద్ద వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 17 చికెన్ వేస్ట్ డ్రమ్ములున్నాయి. వెంటనే డ్రైవర్ ఈగ నాగరాజు, క్లీనర్ దాసరి గణేష్పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వ్యర్థాలను సమీపంలోని పెన్నానదిలో పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైనా చికెన్ వ్యర్థాలను రవాణా చేస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. -
నెలరోజులు.. రూ.5 కోట్లు
నెల్లూరు(క్రైమ్): సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నయామోసాలతో క్షణాల్లో జనాలను దోచేస్తున్నారు. ఇళ్లలో దొంగతనాలు.. దారిదోపిడీల కన్నా ప్రస్తుతం సైబర్ నేరాలే అందరిని హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు ఇతర ఆదాయాల కోసం ఆన్లైన్లో అన్వేషిస్తున్నారు. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు వలవేసి రూ.లక్షలు కొట్టేస్తున్నారు. చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు. నెలరోజుల వ్యవధిలో జిల్లాకు చెందిన డాక్టర్లు, ఆడిటర్లు, విశ్రాంత ఉద్యోగి తదితరుల నుంచి రూ.5 కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఏడాదికేడాది మోసాలు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సీబీఐ పేరుతో.. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్తపంథాలో నేరాలకు పాల్పడుతన్నారు. డిజిటల్ అరెస్ట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సైబర్ నేరాల్లో ప్రస్తుతం ఈ తరహా మోసాలే అధికంగా జరుగుతున్నాయి. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ అధికారుల పేరిట సమాజంలో సంపన్నవర్గాలు, విద్యావంతులు, ఉద్యోగులు, వైద్యులు, పిల్లలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి నమ్మేలా ప్రవర్తిస్తారు. అనంతరం విదేశాల నుంచి వచ్చిన కొరియర్లో డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయని, మీపేరుపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ నకిలీ పత్రాలను వాట్సాప్లో పంపుతున్నారు. విచారణ పూర్తయ్యే వరకూ ఇంట్లో నుంచి కదలనివ్వకుండా నిర్బంధిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నట్లు నటిస్తూ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పినంత మొత్తాన్ని చెల్లించాలని లేదంటే అరెస్ట్ తప్పదని కంగారుపెట్టి వారు అడిగినంత ఖాతాలో జమయ్యాక వదిలేస్తున్నారు. మనీ ల్యాండరింగ్ చేస్తున్నారంటూ మరికొందర్ని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు. ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, వర్క్ ఫ్రం హోమ్ పేరిట నమ్మించి ఇంకొందరిని మోసగిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోసగాళ్లు చెప్పేవి నిజమని భావించొద్దు. అసలు డిజిటల్ అరెస్ట్లు లేవు. నిజంగా ఏదైనా కేసు ఉంటే సంబంధిత పోలీస్ అధికారి నేరుగా వచ్చి మాట్లాడతారు. దేశంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియోకాల్లో విచారణ చేయదు. అలా చేస్తే వారు సైబర్ నేరగాళ్లని అర్థం చేసుకోవాలి. మోసపూరిత ఫోన్ కాల్ వస్తే సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1930 లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. తక్షణ ఫిర్యాదుతో బాధితులు కోల్పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశాలుంటాయని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.డిజిటల్ అరెస్ట్ ద్వారా కాజేసిన సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు ఇటీవల మోసపోయిన విశ్రాంత ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు నెల్లూరు చైతన్యపురి కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5వ తేదీ వరకు అతడి వద్ద నుంచి రూ.1.02 కోట్ల నగదును వివిధ బ్యాంక్ ఖాతాలకు జమ చేయించుకున్నారు. బెయిల్ కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు డాక్టర్లను సైతం ఇదే తరహాలో మోసగించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పొగతోటకు చెందిన ఓ మహిళకు ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ ట్రేడింగ్పై లింక్ వచ్చింది. ఆమె దానిపై క్లిక్ చేయగా వాట్సాప్ నంబర్కు నిషాబాసు అనే మహిళ మెసేజ్ పంపింది. ఆన్లైన్ మార్కెటింగ్లో లాభాలు వచ్చేందుకు సలహాలు, సూచనలిస్తామని నమ్మబలికి తమ కంపెనీ యాప్ను మహిళ ఫో్న్లో ఇన్స్టాల్ చేయించి నగదు డిపాజిట్ చేయించింది. ట్రేడింగ్లో ఆదాయం వచ్చేలా చేసి ఆమెను నమ్మించింది. అనంతరం మహిళ చేత రూ.2.46 కోట్లు పెట్టించి మోసగించింది. బాధితురాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది.డిజిటల్ అరెస్ట్లు ఉండవు సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ అధికారులు వీడియోకాల్ చేసి కేసుల విచారణ చేయరు. అలా చేశారంటే మోసం చేస్తున్నారని గుర్తించాలి. డిజిటల్ అరెస్ట్ల్లేవు. సైబర్ మోసాలపై జిల్లాలో విస్తృ తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా మోసాలకు గురైతే 1930, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. – జి.కృష్ణకాంత్, ఎస్పీ -
మిల్లర్ల మాయాజాలంతో నష్టపోతున్నాం
● బ్రహ్మదేవి రైతుల ఆందోళన ముత్తుకూరు: ‘బీపీటీ రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కడం లేదు. మిల్లర్ల మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నాం’ అని మండలంలోని బ్రహ్మదేవి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల వల్ల ధాన్యం అమ్మకం చేసే పరిస్థితి కరువైపోయిందని వాపోయారు. మూడు రోజులు ఎండలో ధాన్యం ఆరబెట్టి మిల్లర్ల వద్దకు తీసుకెళ్తే 18 శాతం తేమ ఉన్నట్టు సాకులు చూపి, నాలుగు కిలోల మేర దోచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండో పంటకు తాము సిద్ధంగా లేమంటూ ప్రకటించారు. ఎన్నికలకు ముందు పాత ధాన్యం పుట్టి రూ.27,000లకు పైగా అమ్మకం చేశామని, కూటమి ప్రభుత్వంలో ధర క్రమంగా తగ్గిపోయిందన్నారు. ఈ మాయాజాలం వెనుక ఎవరి హస్తం ఉందని రైతులు ప్రశ్నించారు. ప్రస్తుతం పాత వాటి ధర రూ.20,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి ఈనెల 13వ తేదీ సాయంత్రం పప్పులవీధి పార్కు వద్ద అపస్మారకస్థితిలో ఉండగా స్థానికులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్వో నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96306 ఫోన్ నంబర్కు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ అన్వర్బాషా కోరారు. యువతి అదృశ్యం నెల్లూరు(క్రైమ్): యువతి అదృశ్యమైన ఘటనపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. మాగుంట లేఅవుట్కు చెందిన ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. ఈనెల 14వ తేదీన ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది. బాధిత కుటుంబసభ్యులు గాలించారు. జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.పూరిల్లు దగ్ధం నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని 53వ డివిజ న్ గాంధీ గిరిజన కాలనీలో శనివారం పూరిల్లు దగ్ధమైంది. వివరాలు.. గాంధీ గిరిజన కాలనీలోని పూరింట్లో కట్టా నాగయ్య కుటుంబం నివాసం ఉంటోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటికి నిప్పంటుకుని దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వస్తువులు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. -
ఈఓ నిర్లక్ష్యానికి పరాకాష్ట
బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బిలకూట క్షేత్రంలో కొలువైన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై భక్తులు భగ్గుమంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన రథోత్సవం ప్రారంభమైన వెంటనే నిలిచిపోవడం ఈఓ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అంటున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ, అతని సోదరుడు రాంబాబులు కొండపై తిష్టవేసి క్షేత్ర వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని మంటగలుపుతున్నారని పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం నిర్వహించే రథోత్సవం అధికారుల తప్పిదం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథం చక్రాల వద్ద సమస్యలు తలెత్తి రథోత్సవం ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే రథం కదలకుండా నిలిచిపోవడంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. 2023లో రథోత్సవం సందర్భంగా రథం ఒక పక్కకు ఒరిగిపోవడం, ఈ దఫా అసలు కదలకపోవడంతో భక్తులు కలత చెందారు. ఫిట్నెస్ పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథాన్ని ఒకేసారి రథోత్సవానికి సిద్ధం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శిస్తున్నారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్వామివారి సేవల్లో వరుసగా ఆటంకాలు ఏర్పడుతున్నాయంటూ రథం వద్దే అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈఓ రాధాకృష్ణ డౌన్డౌన్, రాంబాబు డౌన్డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భక్తులకు, పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులకు సర్దిచెప్పి శాంతింపచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసుల జోక్యంతో అప్పటికి భక్తులు శాంతించినా, ఈఓని మాత్రం తక్షణమే బదిలీ చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా పెత్తనమంతా కావలికి చెందిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారని, కొండపై స్వామివారి సేవకన్నా ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీ ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. వీఐపీ పాస్లు ఇష్టారాజ్యంగా కేటాయించడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శిస్తున్నారు. తక్షణమే ఈఓని బదిలీ చేసి రథోత్సవం వైఫల్యంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతా ఇష్టారాజ్యమే బిలకూట క్షేత్రంలో రెండేళ్లుగా అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఈఓ సోదరుడు కొండపైనే తిష్టవేయడం, స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునే పేదలు, భక్తులు ఈఓ సోదరుడి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి రావడంతో పాటు అంతా వ్యాపారంగా మారిపోవడంతో తరచుగా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు బిలకూట క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, దాతల విరాళాలను కూడా గోప్యంగా ఉంచడం, బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఇదే నిర్లక్ష్యాన్ని, గోప్యతను పాటించడంపై పాత బిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఉత్సవాల్లో స్వామి వారిని తమ భుజాలపై మోసే మోతగాళ్లు కూడా ఈఓ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివాదం మరింత ముదిరి బిలకూట క్షేత్రం ప్రతిష్టకు మచ్చ రాకముందే అధికారులు ఈఓని బదిలీ చేసి ఆలయ వ్యవహారాలను చక్కదిద్దాలని కోరుతున్నారు. రథోత్సవం నిలిచిపోవడంపై భగ్గుమంటున్న భక్తులు ఈఓ, అతని సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు ఈఓని బదిలీ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ -
అగ్రిగోల్డ్ సంపద దొంగలను వదలం
ఉదయగిరి: వైఎస్సార్సీసీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ జామాయిల్, ఎర్రచందనం సంపద దోచేసిన దొంగలను వదలమని, వారి నుంచి ప్రతి పైసా వసూలు చేసి అగ్రిగోల్డ్ బాధితులకు అందజేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. ఆయన శనివారం ఉదయగిరి నియోజవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళీతో కలిసి వరికుంటపాడు మండలం కనియంపాడు, భాస్కరాపురంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో కొట్టేసిన వృక్ష సంపదను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ హేమంత్కుమార్ను కలిసి అగ్రిగోల్డ్ భూముల్లో పట్టపగలే వృక్ష సంపదను దోపిడీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కాకాణి మాట్లాడుతూ 2014 చంద్రబాబు పాలనలో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగు చూసిందని, దీనికి బాధ్యులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడినా పట్టించుకోకుండా కంపెనీ యాజమాన్యంపై వల్లమాలిన ప్రేమ చూపించారన్నారు. కోర్టుల జోక్యంతో సీఐడీకి అప్పగించారన్నారు. తమకు న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్న తరణంలో 15 ఏళ్లుగా 70 ఎకరాల్లో పెరిగిన రూ.3.5 కోట్ల విలువ చేసే సంపదను టీడీపీ నేతలు నరికి సొమ్ము చేసుకున్నారన్నారు. ప్రభుత్వ అధీనంలోని సీఐడీ జప్తు చేసిన సొమ్మును పట్టపగలు దోచేస్తే చర్యలు తీసుకోకుండా పేద ప్రజలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేస్తుందన్నారు. అధికారులు, పోలీసులు దొంగలను పట్టుకోవడం మానేసి మమ్మల్ని నివారించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ఎప్పుడూ ఇంతగా వేధించిన పరిస్థితులు లేవు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీలు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని పోలీసులు, రెవెన్యూ అఽధికారులు గుర్తించుకోవాలన్నారు. మాకు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. ఉద్యోగ విరమణ చేసినా జైలుకు పంపించడం ఖాయమన్నారు. సంపద సృష్టించడం అంటే దోపిడీనా? సంపద సృష్టించడం అంటే దోపిడీనా అని ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళీధర్, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి నిలదీశారు. పట్టపగలే అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికి తీసుకెళ్తుంటే వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తున్నాయని విమర్శించారు. అధికారులు తప్పులు చేసి బలికావద్దు. తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, భవిష్యత్లో కార్యకర్తల మాటే జగన్ చర్యగా ఉంటుందని గ్రహించాలన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు దిగమింగినదంతా కక్కించి బాధితులకు అందజేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు అగ్రిగోల్డ్ భూములు పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసుల ద్వారా అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు సివిల్ డ్రెస్లో పహారా కాశారు. పోలీసులు అడ్డుంకులు, ఆంక్షలు విధించినా లెక్క చేయకుండా క్షేత్ర పర్యటన చేసి, జామాయిల్ కర్రను నరికి సొమ్ము చేసుకున్న టీడీపీ నేతల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు షేక్ అలీ అహ్మద్, ఎం. తిరుపతినాయుడు, సిద్ధయ్య, గుర్రం భాస్కర్రెడ్డి, ఎం.మురళీకృష్ట, ఆంజనేయులు, చెన్నారాయుడు, మున్నంగి శ్రీనివాసులు, బొడ్డు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. అవినీతి అధికారులకు అరదండాలు తప్పవు వరికుంటపాడులో అగ్రిగోల్డ్ భూముల పరిశీలన మాజీ మంత్రి కాకాణి, మేకపాటి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి, మేరిగ -
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేశాం
గత ప్రభుత్వంలో మెరుగైన సేవలు పాడి రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచార పశు వైద్య అంబులెన్స్ వ్యవస్థ ప్రవేశ పెట్టారు. అత్యాధునికంగా హైడ్రాలిక్ సిస్టమ్తో పశువులను నేరుగా అంబులెన్స్లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యసేవలు అందించి తిరిగి తీసుకువచ్చి దించే విధంగా వీటికి రూపకల్పన చేశారు. వీటి ద్వారా రైతులకు పైసా ఖర్చు లేకుండా ఇంటి వద్దనే వైద్యం అందేది. ఒక్కొక్క నియోజక వర్గానికి 2 చొప్పున కేటాయించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొదటి దఫా 9 వాహనాలు, రెండో దఫా మరో 10 వాహనాలను కేటాయించారు. దీంతో వేలాది మంది పశుపోషకులకు మేలు జరిగింది. ఈ సర్వీసు ప్రజాదరణ పొందింది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సర్వీసులను నిర్వీర్యం చేయడంతో పాడిపై ఆధారపడే రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. నేనేమి చేశాను పాపం!గ్రామీణ ప్రాంత ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమే. పల్లెలో రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే పాడి, పంటలు ఎంతో ముఖ్యం. వ్యవసాయం కలిసి రాక పోయినా పాడి ద్వారా కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు. అటువంటి పాడి పశువులకు అత్యవసర వైద్య సేవలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందు కోసం సంచార అంబులెన్స్లను నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటు చేసింది. వీలైతే ఇంటి వద్దనే వైద్యం, మెరుగైన వైద్యం అవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సేవలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఉదయగిరి: పశువుల అత్యవసర వైద్య సేవలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఒక్కొక్క పథకాన్ని అటకెక్కిస్తొంది. ఆయా కార్యక్రమాల ప్రయోజనాన్ని పరిగణలోకి తీసుకోకుండా కక్ష పూరితంగా పథకాలను నిర్వీర్యం చేస్తోంది. అందులో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దనే పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించే సంచార పశువైద్య అంబులెన్స్ల సర్వీసులకు స్వస్తి పలుకుతోంది. తాజాగా ఈ నెల మొదటి నుంచి ఉమ్మడి జిల్లాలో 9 అంబులెన్స్ సర్వీసులు ఆగిపోయాయి. అందులో పని చేసే వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలట్లను ఇంటికి పంపింది. కూటమి సర్కార్ కక్ష ధోరణి చంద్రబాబు సర్కార్ పాడిపై ఆధారపడే పశుపోషకులను వదలడం లేదు. వైఎస్సార్ీసీపీ ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2021లో మొదటి విడతలో 9, రెండో విడతలో 10 వాహనాలు మంజూరు చేసింది. ఒక్కొక్క వాహనంలో వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలట్ కలిపి నలుగురు ఉంటారు. మారుమూల గ్రామాల్లోనూ పశువులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైతే 1962 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే అంబులెన్స్లు నేరుగా ఇంటికి వెళ్లి వైద్య సేవలందిస్తాయి. వీటి నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా జీవీకే ఫౌండేషన్కు అప్పగించింది. దీనికి గత నెలలో గడుపు ముగిసింది. దీంతో మార్చి 1వ తేదీ నుంచి మొదటి ఫేజ్లో మంజూరైన 9 అంబులెన్స్లు నిలిపి వేసి అందులో పనిచేసే వారిని ఇంటికి పంపారు. కారణంగా పశు వైద్యసేవలు ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ వైఖరిపై మండి పడుతున్నారు. సంచార అంబులెన్స్ల నిలిపివేత పాడి రైతులకు శాపంగా పరిణమించిన ప్రభుత్వ నిర్ణయం వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలట్ కొలువులు గోవిందా గత ప్రభుత్వ పథకాలపై కూటమి సర్కార్ కక్ష ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం మొదటి ఫేజ్లో ఉన్న 9 వాహనాలను నిలిపివేశాం. వీటికి నిర్వహణ ఏజెన్సీ కాల పరిమితి పూర్తి కావడంతో ఫిట్నెస్ పరిశీలన చేయమన్నారు. అది కూడా చేస్తున్నాం. తదిపరి ప్రభుత్వ అదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాం. – రమేష్నాయక్, జేడీ పశుసంవర్థక శాఖ -
అలవి వలలతో వేట సాగిస్తే చర్యలు
సోమశిల: సోమశిల జలాశయంలో అలవి వలలతో వేట సాగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు మత్స్యవేటకారులను హెచ్చరించారు. జలాశయం వెనుక భాగంలో నిషేధిత అలవి వలలతో వేట సాగుతుందని స్థానిక మత్స్యకారులు ఫిర్యాదు చేయడంతో శనివారం జేడీ నాగేశ్వరరావు తనిఖీ చేశారు. అధికారులతో కలిసి జేడీ జలాశయం నుంచి పడవలో వెనుక భాగం వరకు వెళ్లి పరిశీలించారు. అలవి వలలతో వేట సాగించే ప్రదేశానికి వెళ్లగా అక్కడ వాటికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. అనంతరం ఫిర్యాదు చేసిన మత్స్యకారులతో జేడీ మాట్లాడుతుండగా మత్స్యకారుల్లోని ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. జేడీ వెంట మండల మత్స్యశాఖ అధికారి చందన తదితరులు ఉన్నారు. మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు అధికారుల ముందే ఇరువర్గాల మత్స్యకారుల వాగ్వాదం -
ప్రజలందరి సహకారంతో స్వచ్ఛాంధ్ర లక్ష్యం
నెల్లూరు (బారకాసు): ప్రజలందరి సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం నగరంలోని తడికల బజార్ సెంటర్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ పాల్గొన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలందరూ కంకణ బద్ధులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో రోడ్ల నిర్మాణంలో కూడా ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ వినియోగించనున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ వాడకం కేన్సర్కు కారణం : కమిషనర్ సూర్యతేజ ప్లాస్టిక్ వాడకం మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా అత్యంత హానికరమని, కేన్సర్కు కారణమని మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ అన్నారు. నగరంలోని 54 డివిజన్లలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గ్లాసులు భూమిలో కరగవని, వీటిని కాల్చితే ఆ గాలి పీలిస్తే క్యాన్సర్ ప్రబలుతుందని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా బయోడి గ్రేడ్ కవర్లు, జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు సూచించారు. అనంతరం స్థానికులకు క్లాత్ బ్యాగులను కలెక్టర్, కమిషనర్ పంపిణీ చేశారు. స్టోన్హౌస్పేటలో పర్యటిస్తూ ప్రజలకు, దుకాణదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను కలెక్టర్, కమిషనర్ వివరించారు. ప్రజలందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తొలుత ప్లాస్టిక్తో కలిగే అనర్థాలను వివరిస్తూ దోర్నాల హరిబాబు, శంకర్ స్కిట్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కామాక్షి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి కలెక్టర్ ఆనంద్ ప్రజలకు క్లాత్ బ్యాగ్లు పంపిణీ చేసిన కలెక్టర్, కమిషనర్ -
పది సవర్ల బంగారం చోరీ
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన బుజబుజనెల్లూరు ఆర్టీసీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆర్టీసీ కాలనీలో రాజ్కిశోర్రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. అతను ఈనెల 14వ తేదీన తన కుటుంబంతో తిరుమలకు వెళ్లారు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న కొంత నగదు, సుమారు పది సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. స్థాని కుల ద్వారా విషయం తెలుసుకున్న బాధి తులు నెల్లూరుకు చేరుకుని వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
జిల్లాలో ఇలా.. రేపటి నుంచి ప్రారంభం ● ఏర్పాట్లు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు ● జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహణ ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ● సమస్యల పరిష్కారం కోసం కంట్రోలురూమ్ ఏర్పాటుపరీక్ష కేంద్రాలు : 174 విద్యార్థుల సంఖ్య : 33,434 సమస్మాత్మక కేంద్రాలు : 16 సీసీ కెమెరాల ఏర్పాటు : 7 కేంద్రాల్లో.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు : 9 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు : 24 ఇన్విజిలేటర్లు : 1,968 మంది నెల్లూరు(టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 31వ తేదీ వరకు ఇవి జరుగుతాయి. దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా గాలి, వెలుతురు, పూర్తిస్థాయిలో బెంచీలుండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్లో అందుబాటు ఉంచారు. దీంతోపాటు ప్రభుత్వ వాట్సాప్ నంబర్ 95523 00009కు విద్యార్థి వివరాలు పంపి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించారు. ఎగ్జామ్స్ను జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థులు హాల్టికెట్ చూపించి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. బాలికలే అధికం జిల్లా వ్యాప్తంగా 33,434 మంది (బాలురు 16,250 మంది, బాలికలు 17,184 మంది) విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 174 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 కేంద్రాలను సమస్యాత్మక, వాటిల్లో ఏడింటిని అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. పరీక్ష సమయానికి అరగంట ముందు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. గంట ముందు చేరుకోవాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. రెండు సెట్ల ప్రశ్నపత్రాలను జిల్లా వ్యాప్తంగా 48 స్టోరేజ్ పాయింట్లలో భద్రపరిచారు. పోలీస్ బందోబస్తు నడుమ ఏరోజుకారోజు ప్రశ్నపత్రాలను సమీపంలోని పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లనున్నారు. సిబ్బంది నియామకం ఇలా.. పరీక్షల నిర్వహణకు 1,968 మంది ఇన్విజిలేటర్లను, 174 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 174 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. మాస్ కాపీయింగ్కు తావులేకుండా 9 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశీలకుడిగా సమగ్రశిక్ష ఏఎస్పీడీ రవీంద్రనాథ్రెడ్డిని నియమించారు. ఎగ్జామ్స్ సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీప ప్రాంతాల్లో ఉండే జెరాక్స్ సెంటర్లు, ఆన్లైన్ సెంటర్లను మూసివేయించనున్నారు. కేంద్రంలోకి స్మార్ట్ వాచ్లు, కాలుక్యులేటర్లు, సెల్ఫోన్లను నిషేధించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు సైతం సెల్ఫోన్లను తీసుకెళ్లకూడదు. అధికారులతో సమావేశం రాష్ట్ర పరిశీలకుడు రవీంద్రనాఽథ్రెడ్డి శనివారం దర్గామిట్టలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను సజావుగా నిర్వహించాలని తెలిపారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ బాలాజీరావు, ఏపీ ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ అనుముల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.పరీక్ష జరిగే సమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కంట్రోల్రూమ్ నంబర్ : 83414 08109 హాల్ టికెట్ డౌన్లోడ్కు పెట్టిన వాట్సాప్ నంబర్ : 95523 00009 కంట్రోల్రూమ్ ఏర్పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ అధికారులు కంట్రోల్రూమ్ను ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి ఇబ్బందులు చెబితే వెంటనే స్పందిస్తారు. కేంద్రాల్లో మెడికల్ కిట్లతో ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. విద్యార్థులకు తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జామ్ టైంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా చర్యలు తీసుకున్నాం. మాస్ కాపీయింగ్కు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరైనా మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఎగ్జామ్స్ రాయాలి. గంట మందుగానే కేంద్రానికి చేరుకోవాలి. – ఆర్.బాలాజీరావు, డీఈఓ -
18న కోవూరు, ఆత్మకూరులో జాబ్మేళా
నెల్లూరు (పొగతోట): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్తంగా ఈ నెల 18న కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు ఎస్వీ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్ధుల్ ఖయ్యూమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 73823 91116, 9491284199 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. రెండు కొత్త బస్సు సర్వీస్లు ప్రారంభం నెల్లూరు సిటీ: నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో రెండు కొత్త బస్సు సర్వీసులను శనివారం ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురే ష్రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు నుంచి పొదిలికి వయా పామూరు మీదుగా ఎక్స్ప్రెస్ సర్వీసు, అంబాపురం టిడ్కో నుంచి రాజుపాళెం వరకు పల్లె వెలుగు సర్వీస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా అధికారి మురళీబాబు, డిపో మేనేజర్ మురళీకృష్ణ, శివకేశవ్యాదవ్ పాల్గొన్నారు. 14 మంది ఉపాధి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు ● అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : డ్వామా పీడీ గంగాభవాని ● రూ.30,52,734 రికవరీకి ఆదేశాలు ● ఇందులో పీఆర్ శాఖ నుంచి రూ.3,71,832 సీతారామపురం: ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన 14 మంది సిబ్బందిపై సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికలోనే శనివారం సస్పెన్షన్ వేటు వేస్తూ డ్వామా పీడీ గంగాభవాని చర్యలు తీసుకున్నారు. సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని పీడీ హెచ్చరించారు. స్థానిక సీ్త్ర శక్తి భవనం వద్ద శనివారం నిర్వహించిన 14వ విడత సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికలో ఆమె పాల్గొని మాట్లాడారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మండలంలో రూ.8,35,69,875తో 649 రకాల ఉపాధి పనులు చేయగా వాటిపై సోషల్ ఆడిట్ బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టి తుది నివేదికను పంచాయతీల వారీగా వెల్లడించారు. చాలా గ్రామాల్లో ఒకే కుటుంబంలో రెండు, మూడు జాబ్కార్డులు ఉన్నాయని, ఉపాధి హామీ పనుల్లో చాలా తేడాలు ఉన్నాయని, పని తక్కువగా ఉందని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, కొలతల ప్రకారం పనులు జరగలేదన్న వంటి విషయాలను సామాజిక తనిఖీ బృంద సభ్యులు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకు వచ్చారు. వాస్తవాలను పరిశీలించిన డ్వామా పీడీ విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఏపీఓ సుభాషిని, ఈసీ సువార్తయ్య, ముగ్గురు టీఏలు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ మేట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 14 పంచాయతీల్లో రూ.30,52,734 రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు జిల్లా విజిలెన్స్ అధికారిణి విజయలక్ష్మి, ఏపీడీ శంకర్నారాయణ, అంబుడ్స్మెన్ వెంకటరెడ్డి, ఎంపీపీ పద్మావతి, ఎంపీడీఓ భాస్కర్, ఈఓపీఆర్డీ భార్గవి తదితరులు పాల్గొన్నారు -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
● అపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయులకు 30 శాతం ఐఆర్ను వెంటనే ప్రకటించాలని అపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఐఎంఏ హాల్లో అపస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం బాలాజీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆర్థిక విషయాల పట్ల ప్రభుత్వం శీతకన్ను వేసిందని, జీతాలు తప్ప ఏ ఆర్థిక ప్రయోజనాలు లేవన్నారు. ఆర్థిక బకాయిలు, సరెండర్ లీవ్స్, పీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్లు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ పీఆర్సీ వెంటనే ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు చక్రపాణి, పుట్టాశేషు, జిల్లా అధ్యక్షుడు రాజగోపాలాచార్యులు, ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, నాయకులు మణికందరాచారి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై స్పిరిట్ ట్యాంకర్ బోల్తా వెంకటాచలం: మండలంలోని గొలగమూడి క్రాస్రోడ్డు వద్ద స్పిరిట్లోడు లారీ ట్యాంకర్ అదుపుతప్పి శుక్రవారం బోల్తాపడింది. నెల్లూరు వైపు నుంచి గూడూరు వైపు వెళుతూ గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపానికి చేరుకోగానే డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ట్యాంకర్లోని స్పిరిట్ రోడ్డుపై పొర్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. క్రేన్ల సహాయంతో ట్యాంకర్ను పక్కకు తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిలకూట క్షేత్రం అభివృద్ధికి కృషి ● దేవదాయశాఖ మంత్రి ఆనం బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం అభివృద్ధికి దేవదాయశాఖ నుంచి సంపూర్ణ సహకారం అందించనున్నట్లు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రసన్న వేంకటేశ్వరస్వామికి ప్రభుత్వం తరుపున మంత్రి శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కల్యాణ వేడుక పూర్తయిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఆనం మాట్లాడుతూ బిలకూట క్షేత్రం అభివృద్ధికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కృషి చేస్తున్నారని, వారి కృషికి దేవదాయశాఖ తరపున సహకారం అందించి ఆలయ అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రూ.12.5 కోట్లతో ఆలయంలో అభివృద్ధి పనులకు రంగం సిద్ధం చేశారని, టెండర్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.1.85 కోట్లతో ఆలయం చుట్టూ ప్రహరీ, టీటీడీ నిధులు రూ.2.65 కోట్లతో గాలిగోపురం నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కల్యాణ కట్ట, కళ్యాణ మండపం, అన్నదాన సత్రం పనులు కూడా ప్రారంభించనున్నట్లు వివరించారు. -
కమనీయం.. శ్రీవారి కల్యాణ వైభోగం
బిట్రగుంట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంట బిలకూటక్షేత్రం బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ప్రసన్నుడి కల్యాణం శుక్రవారం కమనీయంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణలు, వేదపండితుల దివ్యమంత్రోచ్ఛరణలు, శుభకర మేళతాళాల మధ్య స్వామివారి కల్యాణం వైకుంఠ వైభవాన్ని తలపించింది. పాతబిట్రగుంట, కొండబిట్రగుంట వీధుల్లో గజవాహనంపై పెండ్లి కుమారుడిగా విహరించిన స్వామి వారు ఉదయం శుభముహూర్తంలో కల్యాణవేదిక వద్దకు చేరుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి తెప్పించిన పుష్పాలు, తులసీ మాలలతో శోభాయమానంగా అలంకరించిన కల్యాణ వేదికపై ఉభయ దేవేరులతో స్వామివారు అలంకార భూషితులయ్యే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంభ్రాలు తీసుకురాగా, కల్యా ణోత్సవం ఉభయకర్తలు పట్టువస్త్రాలు, కల్యాణ ద్రవ్యాలు తీసుకువచ్చారు. వేదికపై స్వామివారు సర్వాలంకారణ భూషితులైన తర్వాత అర్చక బృందం వైఖానస ఆగమోక్తంగా కల్యాణ వేడుకను ప్రారంభించారు. తొలుత విశ్వక్సేనుని పూజతో ప్రారంభించి యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, వేదమంత్రోక్తంగా కల్యాణ ద్రవ్యాలను శుద్ధిచేసే పుణ్యహవచనం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మధుపర్కం, దృశ్య, స్పర్శ, శ్రవణ వంటి షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు భక్తిపారవశ్యంతో గోవిందనామ స్మరణలు చేస్తుండగా, భాజాభజంత్రీలు ఉచ్ఛ స్థాయిలో మోగుతుండగా మాంగళ్యధారణ నేత్రపర్వంగా సాగింది. ఇదే సమయానికి మరో 10 జంటలకు పైగా స్వామివారి సన్నిధిలో ఒక్కటయ్యాయి. రథోత్సవంలో సమస్యలు వైకుంఠాన్ని తలపించిన బిలకూటక్షేత్రం గోవింద నామస్మరణలతో మారుమోగిన కొండబిట్రగుంట ప్రసన్నుడి కళ్యా ణోత్సవం అనంతరం స్వామివారి రథోత్సవంలో సమస్యలు ఎదురయ్యాయి. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపం కారణంగా రథం చక్రాలు పట్టేసి ముందుకు కదిలేందుకు మొరాయించడంతో ఆగమేఘాల మీద మరమ్మతులు చేపట్టారు. కల్యాణం తర్వాత శ్రీదేవి, భూదేవితో కలిసి కొండ దిగువన ఉన్న రథంపై స్వామివారు కొలువుదీరారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య రథం కదిలిన కొద్ది నిమిషాల్లోనే చక్రాలు పట్టేశాయి. రథం ముందుకు కదలకపోవడంతో హుటాహుటిన మరమ్మతులు చేయిస్తున్నారు. రాత్రి ఏడు గంటల వరకు కూడా మరమ్మతులు పూర్తి కాలేదు. దీంతో ట్రాక్టర్పై స్వామివారి ఊరేగింపు నిర్వహించాలని దేవదాయశాఖ అధికారులు, పాలకవర్గం చర్చలు జరుపుతోంది. బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవదాయశాఖ అధికారులు మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్సవాలకు సరైన ప్రచారం కల్పించకపోవడం, వీఐపీ పాస్లు, వెహికల్ పాస్ల్లో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈఓ కూడా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వినిపించాయి. ఉభయకర్తలు, దాతలతోనూ ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కనీసం రథోత్సవం ముందుగా ఏర్పాట్లు సరిచూసుకుని ఉంటే స్వామివారి రథోత్సవం మధ్యలో నిలిచిపోయేది కాదని భక్తులు మండి పడుతున్నారు. -
బియ్యం బ్యాగ్లో ఒకటిన్నర కిలోల తరుగు
హోల్సేల్ అంగడి నుంచి 25 కిలోల బియ్యం బ్యాగ్ కొనుగోలు చేశాం. వాటిని తెలిసిన వారి దగ్గర కాటా పెడితే ఒకటిన్నర కిలోలు తగ్గాయి. అంటే ఒక బస్తా మీద కనీసం రూ.80 నష్టపోయాం. బియ్యం తగ్గాయని వ్యాపారులను అడిగితే వారు తాము తయారు చేయలేదని పైనుంచి అన్ని బస్తాలు అలాగే వస్తున్నాయి. ఏమీ చేయలేమని బుకాయిస్తున్నారు. చేసేదేమి లేక మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలా అన్ని రకాల నిత్యావసర సరుకుల్లో మోసం జరుగుతోంది. అధికారులు నిత్యం దాడులు చేస్తే ఇలాంటివి జరగవు. – రీహానా, బుజబుజనెల్లూరు -
నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం
● వినియోగదారుల జేబులకు చిల్లు ● అడుగడుగునా అవకతవకలు ● నాణ్యతలేని సరుకుల విక్రయాలు ● కూరగాయలు, చేపల మార్కెట్లలో ఇదీ పరిస్థితి ● అందుబాటులో లేని ధర్మకాటా మోసాలు జరుగుతున్నాయి నెల్లూరు (పొగతోట)/ నెల్లూరు అర్బన్/ నెల్లూరు (క్రైమ్)/ నెల్లూరు సిటీ: వస్తు కొనుగోలు సమయంలో వినియోగదారుల జేబులకు నిత్యం చిల్లు పడుతోంది. వ్యాపారుల స్వార్థం, అధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా వినియోగదారులు అడుగడుగునా మోసపోతున్నారు. కూరగాయల మార్కెట్, పెట్రోలు బంకులు, నిత్యావసర సరుకుల దుకాణాలు, రోడ్లపై పండ్ల షాపులు ఇలా ప్రతిచోట వినియోగదారులు నష్టపోతున్నారు. తూకాలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సాక్షి బృందం శుక్రవారం పట్టణంలో పలుచోట్ల విజిట్ చేయగా అనేక విషయాలు బట్టబయలు అయ్యాయి. వినియోగదారులను నిత్యం మోసం చేయడమే పనిగా వ్యాపారులు కొత్త కొత్త ఆలోచనలకు రూపకల్పనలు చేస్తున్నారు. పెట్రోలు బంకుల్లో చిప్లు వాడడం, కూరగాయల మార్కెట్లలో ఎలక్ట్రానిక్ కాటాల్లో మోసాలకు పాల్పడడం నిత్యం తంతుగా మారిపోయింది. ప్రశ్నించిన వినియోగదారులపై దాడులకు దిగడం, బెదిరించడం పరిపాటి. నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్లో అడుగడుగునా మోసాల మయం అయిపోయింది. తనిఖీలు నిర్వహించి పర్యవేక్షించి వినియోగదారులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నెల మామూళ్లకు అలవాటుపడ్డ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చిన సమయంలో మినహా అధికారులు అటువైపుగా చూడడం లేదు. తూకాల్లో మోసపోకుండా ఉండేందుకు వినియోగదారుల కోసం ధర్మకాటాను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండాలి. వేయింగ్ మెషన్ అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం సిబ్బంది ఎవరూ లేక పోవడంతో వేయింగ్ మెషన్ను కిందపడేశారు. ధరల పట్టికలో వ్యత్యాసాలున్నాయి. నిత్యం కూరగాయల ధరలను పట్టికపై మార్పులు చేయాల్సి ఉంది. మార్కెటింగ్ అధికారులు పట్టించుకోక పోవడంతో బోర్డుపై ఒక ధర, వ్యాపారులు విక్రయించేది మరో ధరగా ఉంది. కుళ్లిన సరుకుల మిక్సింగ్.. కూరగాయల మార్కెట్లో కుళ్లిన, పాడైపోయిన కూరగాయలను వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వినియోగదారులను చులకనగా మాట్లాడడం పరిపాటి అయిపోయింది. కేజీకి 100 గ్రాముల నుంచి 150 గ్రాములు తూకం తక్కువ, నాణ్యత లేని కూరగాయలను వినియోగదారులకు అంటగడుతున్నారు. నెల్లూరు నగరంలో పదిలక్షల జనాభా ఉంది. నగర ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో కూరగాయల మార్కెట్ను సందర్శిస్తారు. వారికి అవసరమైన కూరగాయలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. కుళ్లినవి, వాడిపోయినవి తూకం తక్కువగా అంటగడుతున్నారంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయ మార్కెట్లో వినియోగదారులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తున్నారు. ఏమార్చి కవర్లు మార్చేస్తున్నారు కొన్ని పండ్ల దుకాణాల్లో పండ్లు కొనుగోలు చేస్తే నిర్వాహకుడు, పనిచేసే వ్యక్తి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాము కొన్న కవర్ను పక్కన పెట్టి ముందుగా ఏర్పాటు చేసుకున్న కవర్ను ఏమాత్రం అనుమానం రాకుండా వినియోగదారునికి ఇస్తున్నారు. ఓ వినియోగదారుడు నగరంలోని ఓ పండ్ల దుకాణంలో నాణ్యత కల్గిన రెండు కేజీల యాపిల్ పండ్లు, కేజీ ద్రాక్ష, ఒక కేజీ దానిమ్మలు కొనుగోలు చేశారు. కస్టమర్ కొనుగోలు చేసే క్రమంలో దుకాణదారుడు యాపిల్ పండ్ల కవర్ను మార్చేశారు. నాణ్యతలేని పండ్లను కవర్లో ముందుగా ఉంచి కస్టమర్ను బోల్తా కొట్టించారు. వినియోగదారుడు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఆదమరిస్తే జేబులకు చిల్లే మార్కెట్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు అవసరం. ఆదమరిస్తే కవర్లు మార్చడం, తక్కువ తూకం వస్తువులు ఇస్తుంటారు. వినియోగదారుడు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. –ఎస్కే సమీర్, బుజబుజనెల్లూరు వ్యాపారులు వినియోగదారులను నష్టపరుస్తున్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే చులకనగా మాట్లాడుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి వినియోగదారులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి – రమణారెడ్డి, వినియోగదారుడు -
తోపుడు బండ్లపై మోసం
రోడ్లపై తోపుడు బండ్లలో కూడా కాటాలు పెట్టి వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. సాక్షి విజిట్ సందర్భంగా వేదాయపాళేనికి చెందిన సుబ్బారావు అనే వినియోగదారుడు కేజీ దానిమ్మ కాయలు కొనుగోలు చేశాడు. సాక్షి కెమెరాను చూడడంతో ఆ వ్యాపారస్తుడు కేజీ రాయితో పాటు 400 గ్రాములు అదనంగా తూచి వినియోగదారుడికి ఇచ్చాడు. మొత్తం 1,400 గ్రాములు తూగాల్సి ఉంది. దానిమ్మ కాయలను మార్కెట్లో మరో వేయింగ్ మిషన్లో పరిశీలించగా 1,135 గ్రాములు వచ్చింది. కాటాల్లో టెక్నిక్లను ఉపయోగించి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు
నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారుప్రొవిజన్స్ దుకాణాలు, మార్ట్లలో పప్పుదినుసులు, నూనె, ఇతర నిత్యావసర వస్తువుల్లో నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదు. తక్కువ నాణ్యత కల్గిన వస్తువులను విక్రయాలు చేస్తున్నారు. అధికారులు ఆయా వస్తువులను పరిశీలిస్తే వారి అవకతవకలు బయటపడుతాయి. – రంజిత్, కిసాన్నగర్ మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తే వినియోగదారుడు నష్టపోతున్నాడు. వినియోగదారులకు అవసరమైనవి ఏరుకునే పరిస్థితి లేదు. వ్యాపారులు ఇచ్చినవే తీసుకోవాల్సి వస్తుంది. కుళ్లినవి, వాడిపోయినవి కలిపి వినియోగదారులకు అంటగడుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. – వెంకటరెడ్డి, వినియోగదారుడు ●వినియోగదారులుకు అండగా ఉంటాం తూనికలు, కొలతల శాఖ వినియోగదారులకు అండగా ఉంటుంది. మార్కెట్లో ఎవరైనా వ్యాపారులు మోసం చేసినట్టు తెలిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలి. తక్షణమే తాము వచ్చి అలాంటి వారిమీద కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో ఇప్పటి వరకు 290 మందిపై కేసులు నమోదు చేశాం. తూకాల్లో మోసం చేసేవారిపై భారీగా అపరాద రుసుం వసూలు చేస్తాం. – ఐజాక్, కంట్రోలర్, తూనికలు, కొలతలశాఖ -
ఉత్తమ పంచాయతీగా ఎంపిక
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని పాతవెల్లంటి గ్రామం... మద్య పానానికి దూరం. నేటి కాలంలో కూడా ఇలాంటి ఆదర్శ గ్రామం ఉండడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఎప్పుడో ముపై ఏళ్ల క్రితం విధించుకున్న స్వీయకట్టుబాటును ఇప్పటికీ అమలు చేస్తోంది. ఈ విషయంలో అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు. 1994 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్లుగా గ్రామంలోకి మద్యం ప్రవేశించకుండా గ్రామ పెద్దలు కట్టుబాట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కట్టుబాటును ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రస్తుతం యువత కూడా పెద్దల కట్టుబాటును కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. పాతవెల్లంటి గ్రామంలో మొత్తం 650 కుటుంబాలు ఉన్నాయి. 1200 ఓటర్లు ఉండగా, 3 వేల మంది వరకు జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో 1994 నుంచి సీపీఎంకు చెందిన అభ్యర్థులే సర్పంచులుగా గెలుస్తున్నారు. ప్రభుత్వాలు మారినా గ్రామ కట్టుబాటు మాత్రం మారకుండా పెద్దలు కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామంలోకి ఎవరైనా మద్యం బాటిల్లు తీసుకొచ్చినా, మద్యం సేవించినా వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. మద్యం సేవించాలంటే పక్క గ్రామాలకు వెళ్లాల్సిందే. 30 ఏళ్లుగా పాతవెల్లంటిలో వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి చెందిన పెద్దలు కూడా సాహసం చేయలేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క గ్రామంలో దాదాపు 10 బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. అయితే పాత వెల్లంటిలో మాత్రం బెల్టు దుకాణం నిర్వహిస్తే బెండు తీస్తారు. బెల్టు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే గ్రామస్తులే పోలీసులకు అప్పగిస్తారు. కల్లు దుకాణాలు కూడా ఊరి బయట పెట్టుకోవాలని పెద్దలు నిర్ణయించారు. పాత వెల్లంటి గ్రామానికి సమీపంలో పెన్నా పరీవాహక ప్రాంతం ఉంది. ఇక్కడి ఇసుకను గ్రామస్తులు మాత్రమే వినియోగించుకునేలా నిర్ణయించుకున్నారు. బయటకు ప్రాంతాలకు ఇసుకను తరలిస్తే రూ.10 వేలు జరిమానా విధించేలా నిబంధనలు విధించారు. ఈ క్రమంలో గ్రామంలోని పెన్నా నుంచి ఇసుకను బయటకు తరలించేందుకు ఎవరూ ప్రయత్నం కూడా చేయరు. గ్రామంలోని కట్టుబాట్లను అతిక్రమించిన వారి నుంచి వసూళ్లు చేసిన జరిమానాలు గ్రామాభివృద్ధి, ఆలయాభివృద్ధికి ఖర్చు చేయడం గమనార్హం. పారిశుధ్య నిర్వహణ, గ్రామ సభల నిర్వహణలో కేంద్రం 2021 సంవత్సరానికి పాత వెల్లంటి ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గ్రామ సభ కేటగిరీ కింద ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసి గ్రామానికి కేంద్రం రూ.10 లక్షలు నిధులు కేటాయించింది. ఆ నిధులతో గ్రామానికి సీసీరోడ్డును నిర్మించుకున్నారు. ఇసుక తరలిస్తే రూ.10 వేలు జరిమానా ఆ ఊరులో మూడు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతోంది. స్థానికులు ఈ ఊరులోనే కాదు.. బయట ప్రాంతాలకు వెళ్లినా మద్యం ముట్టరు. మద్యం తాగడం ఈ తరం యువతకు ఒక ఫ్యాషన్. నగరాలు, పట్టణాల నుంచి పల్లెల వరకు ఊర్లలో ఏ పండగొచ్చినా.. చావొచ్చినా.. ఎన్నికలొచ్చినా.. మందు బాటిల్ ఓపెన్ కావాల్సిందే. కానీ ఆ పల్లె అందుకు ఆమడ దూరంలో ఉంటుంది. ఆ ఊరు ఈ కట్టుబాటును విధించుకుంది. ఈ విషయంలో అక్కడి జనం రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు. ఎవరైనా మద్యం తాగితే జరిమానా కట్టాల్సిందే. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ మద్యానికి దూరంగా ఉంటున్నారు. 30 ఏళ్లుగా ప్రత్యేక కట్టుబాటును కొనసాగిస్తున్న గ్రామస్తులు నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా పెన్నా నుంచి ఇసుక బయట ప్రాంతాలకు తరలించకుండా ఆంక్షలు బెల్టు దుకాణాలు ఏర్పాటు చేస్తే.. ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగింత 2021లో ఉత్తమ పంచాయతీగా పాతవెల్లంటి గ్రామం అదృష్టంగా భావిస్తున్నా.. ఈ గ్రామంలో తాను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. గ్రామస్తులు మద్యాన్ని గ్రామంలోకి రానివ్వకుండా నిబంధనలు పెట్టడం సంతోషంగా ఉంటుంది. పెద్దల కట్టుబాట్లను ఎవరూ అతిక్రమించకుండా కొనసాగిస్తున్నాం. – వనం, సుబ్బమ్మ, గ్రామస్తురాలు యువత కూడా బాధ్యతగా తీసుకుంది గ్రామంలోకి మద్యం అనుమతి లేకుండా పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలోని యువత కూడా బాధ్యతగా తీసుకుని నడుచుకుంటుంది. రానున్న రోజుల్లో కూడా తాము కట్టుబాట్లను ఏ మాత్రం చెదరకుండా కొనసాగిస్తాం. – గుడి ఆనంద్, రైతు -
గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన వీఎస్యూ వీసీ
వెంకటాచలం: రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ను విక్రమసింహపురి యూనివర్సిటీ(వీఎస్యూ) వీసీ అల్లం శ్రీనివాసరరావు, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. వీఎస్యూ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను వివరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తిని కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. వైఎస్సార్సీపీలో పలువురి నియామకం నెల్లూరు (బారకాసు): వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో జిల్లాకు చెందిన పలువురిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా సయ్యద్ హంజాహుస్సేని, మైనార్టీ సెల్ సెక్రటరీలుగా షేక్ అలిఅహ్మద్, ఎస్కే షాహుల్హమీద్ నియమితులయ్యారు. మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీలు గా షేక్ మొయినుద్దీన్, షేక్ అహ్మద్, మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా సయ్యద్ అబ్దుల్ సలీం, రాష్ట్ర ఐటీ వింగ్ అధికార ప్రతినిధిగా పూసపాటి జగన్మోహన్రెడ్డి నియమితులయ్యారు. మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి ముత్తుకూరు: మండలంలోని నేలటూరులో ఉన్న శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్ట్లో మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతోందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు శుక్రవారం తెలిపారు. 1వ యూనిట్లో 250, 2వ యూనిట్లో 310, 3వ యూనిట్లో 410 మెగావాట్ల వంతున విద్యుదుత్పత్తి జరుగుతోందని వివరించారు. -
అయ్యో కూలీలు.. ఆకలి కేకలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘ఉపాధి’కి గండి పడింది. కూలీలకు ఇప్పటికే రెండు నెలలుగా వేతనాలు జమకాకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. మార్చి ఆఖరి కావడంతో ఆలస్యమవుతుందంటూ అధికారులు బుకాయిస్తున్నారు. ఇప్పటికే కూటమి నేతలు బినామీ మస్తర్లతో అసలైన కూలీలకు పనులు కల్పించడంలేదు. గతంలో రోజుకు లక్షల మందికిపై పనిచేస్తే.. ఇప్పుడు ఆ కూలీల సంఖ్య సగానికి తగ్గిపోయింది. నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందలేదు. జనవరి నెలలో సంక్రాంతి పండగ తర్వాత నుంచి వారి బ్యాంక్ ఖాతాల్లో చిల్లిగవ్వ కూడా జమ కాలేదు. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. జిల్లాలో 4 లక్షలకు పైగా జాబ్కార్డులు కలిగిన కూలీలున్నారు. 37 మండలాల పరిధిలో గత ప్రభుత్వంలో నిత్యం 1.20 లక్షల నుంచి 1.40 లక్షల మంది వరకు పనులకు హాజరవుతుండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా పార్టీల నేతలు యంత్రాలు పెట్టి బినామీ మస్తర్లు వేసి పనులకు గండి కొట్టారు. దీంతో ప్రస్తుతం సుమారు 70 వేల నుంచి 80 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. గతంలో ఇలా.. గతంలో ఉపాధి కూలీలకు వారం వారం వారి బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమయ్యేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సిబ్బందిపై వేధింపులు, టీడీపీకి అనుకూల వర్గాల వారికే పనులు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో లక్ష్యం నీరుగారుతోంది. కూలీలకు పేమెంట్లు అందకపోవడం ఒక పరిస్థితి అయితే, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనులు జరగాలంటూ ఆదేశాలివ్వడంతో పనులు కుంటుపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పాలనలో కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతం అటువంటి వాతావరణం లేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికే పనులు కల్పిస్తున్నారు. బడ్జెట్ ఆఖరి నెలకు, ఉపాధి కూలీల వేతనాలకు ఏం సంబంధం అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ ఏడాదికి కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పడానికి సందేహిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో పేమెంట్లు అందుతాయని అధికారులు అంటున్నారు. అయితే నమ్మకం లేదని కూలీలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా వేతనాలు పడక అవస్థలు జిల్లా వ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా బకాయిలు గతంలో వారానికొకసారి జమ చేస్తున్న పరిస్థితి ఏప్రిల్ మొదటి వారంలో వస్తాయంటున్న అధికారులు పేమెంట్లు అందకపోవడంతో తగ్గుతున్న కూలీల సంఖ్య -
కట్టుబాట్లను కొనసాగిస్తున్నాం
పెద్దలు పెట్టిన కట్టుబాట్లను మేము కూడా కొనసాగిస్తున్నాం. గ్రామ ప్రజలు కూడా కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తుంటాం. – పాదర్తి రాధ, పాతవెల్లంటి గ్రామ సర్పంచ్గ్రామస్తులందరి సహకారంతోనే... గ్రామంలో అన్ని కులాల వారు ఉన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరి సహకారంతోనే 30 ఏళ్లుగా కట్టుబాట్లను ఇప్పటికీ కొనసాగించ గలుగుతున్నాం. భవిష్యత్లో కూడా ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. – పల్లవరపు చెంచయ్య, మాజీ సర్పంచ్ సమస్యలపై కూడా కలిసికట్టుగా పరిష్కారం గ్రామంలో ఏ సమస్య వచ్చినా గ్రామస్తులందరు ఒకే తాటిమీదకు వచ్చి సమస్యను పరిష్కరించుకుంటాం. గ్రామస్తులందరం కలిసి కట్టుగా ఉండడంతోనే 30 ఏళ్లుగా అన్ని కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. – గంపల వెంకటరమణయ్య, గ్రామస్తుడు ● -
రెండిళ్లల్లో చోరీకి యత్నం
కోవూరు: నెల రోజులుగా ఇళ్లకు తాళాలు వేసి ఉన్న రెండిళ్లలో గుర్తు తెలియని దుండగలు గురువారం రాత్రి చోరీకి యత్నించారు. ఈ ఘటన స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలో జరిగింది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు విశ్రాంత ఉపాధ్యాయుడు వరప్రసాద్, బ్రహ్మదేవి లక్ష్మి ఇళ్లు పక్క పక్కనే ఉంటాయి. వీరు నెల రోజుల క్రితం ఇళ్లకు తాళాలు వేసి విజయవాడ, హైదరాబాద్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు గురువారం అర్ధరాత్రి తర్వాత ఆ రెండిళ్ల తాళాలు పగులకొట్టి బెడ్రూమ్లోకి చొరబడి గాలించారు. బీరువాలు, అల్మరాలు ప్రతి చోట వెతికి అక్కడ ఉన్న వస్తువులను చిందరవందరగా పడేశారు. అయితే వరప్రసాద్ ఇంట్లో మాత్రం రూ.5 వేలు నగదు చోరీకి గురైంది. పెద్ద మొత్తంలో నగదు, నగలు దొరకకపోవడంతో దుండగులు ఇళ్లల్లో ప్రతి చోటా గాలించినట్లు అక్కడ పడేసిన వస్తువులను బట్టి తెలుస్తోంది. దుండగులు ఇద్దరుగా గుర్తించారు. వీరు స్కూటీలో వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డుయింది. వీరు వెళ్తూ ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న మోటార్ బైక్ హ్యాండిల్ లాక్ పగులగొట్టి అపహరించుకుని పోయారు. ఈ మేరకు బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ట్రెయినీ డీఎస్పీ శివప్రియ పరిశీలన చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వేసవి కాలంలో ఆరుబయట, మిద్దెల మీద నిద్రపోయే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, బయట ఊర్లకు వెళ్లేవారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శివప్రియ తెలిపారు. ఆమె వెంట ఎస్ఐ రంగనాథ్గౌడ్, సిబ్బంది ఉన్నారు. -
నేత్రపర్వం.. తెప్పోత్సవం
నేత్రపర్వంగా సాగుతున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం గురువారం భక్తజన సంద్రంగా మారింది. క్షేత్రవాసి ప్రసన్న వేంకటేశ్వరస్వామిని బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడవాహనసేవలో దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో బుధవారం సాయంత్రం నుంచే బిలకూట క్షేత్రం కిటకిటలాడింది. ఉత్సవాలు, ఆపద సమయాల్లో స్వామికి వరపడిన భక్తులంతా బ్రహ్మోత్సవాల్లో సమారాధనల పేరిట మొక్కుబడులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఉత్సవాలు, వాహన సేవల్లో అర్చకులు, ఆగమ పండితులు ప్రధాన పాత్ర పోషిస్తే మొక్కుబడుల రోజు మాత్రం భక్తులే నేరుగా స్వామిని కొలుస్తారు. సంప్రదాయానికి కొనసాగింపుగా జలదంకి, కావలి, అల్లూరు, దగదర్తి తదితర మండలాలకు చెందిన భక్తులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై అధిక సంఖ్యలో తరలివచ్చారు. గరుడవాహనంపై స్వావిని దర్శించుకుని, పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. భక్తితో తలనీలాలు సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో, కొండదిగువన సామూహికంగా పొంగళ్లు పొంగించి భక్తితో ప్రసన్నునికి నివేదించారు. అనంతరం ఎవరికి వారు శక్తిమేర అన్నదానం చేశారు. పుష్కరిణిలో జలవిహారం ప్రసన్న వేంకటేశ్వరస్వామి గురువారం రాత్రి పుష్కరిణిలో జలవిహారం చేశారు. కలాణోత్సవానికి సిద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా పెండ్లికుమారుడైన స్వామివారు కొండపై కొలువుదీరగా అర్చకులు వైఖానస ఆగమోక్తంగా తెప్పోత్సవానికి సిద్ధం చేశారు. ఉభయదేవేరులను, స్వామిని కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే వివిధ రకాల ఫుష్ఫాలు, పట్టుపీతాంబరాలతో సిద్ధం చేసిన తెప్పపై స్వామివారిని ఉభయదేవేరులతో కొలువుదీర్చి జలవిహారం చేశారు. ● తెప్పోత్సవం పూర్తి చేసుకున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి గజవాహనంపై ఊరేగారు. దర్శించి... తరించిన భక్తులు -
రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములు కావాలి
నెల్లూరు రూరల్: ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములై భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఒ.ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో అటవీ, వన్యప్రాణుల రక్షణపై సమీక్ష కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత జిల్లా అటవీశాఖ అధికారి మహబూబ్బాషా పలు విషయాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ వివాదాల విషయమై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అవసరమైన గ్రామాల్లో అధికారులు హాజరై భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఆర్డీఓలు అనూష, పావని, వంశీకృష్ణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి పరిమళ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 17 నుంచి టెన్త్ పరీక్షలు ● హాజరుకానున్న 33,434 మంది విద్యార్థులు నెల్లూరు(టౌన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు తెలిపారు. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 174 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా 33,434 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా 9 ఫ్లయింగ్, 24 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు. విద్యార్థులు వారి హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం 83414 08109 ఫోన్ నంబర్తో కంట్రోలు రూంను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పెద్దాస్పత్రిలో డీఎంఈ ఆకస్మిక తనిఖీలు ● విధుల్లో లేని వారికి షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశం నెల్లూరు(అర్బన్): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అడ్మిన్) వెంకటేష్ గురువారం విజయవాడ నుంచి వచ్చి నెల్లూరులోని సర్వజన ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓపీలు, క్యాజువాలిటీ, వార్డులు పరిశీలించారు. పలు ఓపీల్లో డాక్టర్లు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జూనియర్ డాక్టర్లు రోగులను పరిశీలిస్తున్నారు. విషయాన్ని అర్థం చేసుకున్న డీఎంఈ సంతకాలు చేసి విధుల్లో లేని డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో లేని డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ను ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజమన్నార్, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అధికారులు, హెచ్ఓడీలు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ వెంకటేష్ మాట్లాడుతూ డాక్టర్లు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా జమ అయిన నిధులను హెచ్డీఎస్ కమిటీకి నిబంధనల మేరకు తరలించి వాటిని కనీస సౌకర్యాల కోసం ఖర్చు చేసుకోవాలని సూచించారు. అనంతరం తమ, తమ విభాగాలకు కొరత ఉన్న పరికరాల గురించి డాక్టర్లు నివేదిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ నరేంద్ర, డాక్టర్ మస్తాన్బాషా తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో దూకి వివాహిత ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఓ వివాహిత నెల్లూరులోని జాఫర్సాహెబ్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మనుమసిద్దినగర్లో ఎం.వెంకటేశ్వర్లు, సుహాసిని (54) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. వెంకటేశ్వర్లు ఆర్ఆర్ స్ట్రీట్లోని కేఏసీ ప్లాజాలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి తల్లి రంగమ్మ ఈనెల నాలుగో తేదీన మృతిచెందారు. అప్పటి నుంచి సుహాసిని మానసికంగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం భర్త దుకాణానికి వెళ్లగా సుహాసిని ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయింది. ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి తెలియజేశారు. దీంతో ఆయన తన చిన్న కుమారుడు అజయ్తో కలిసి గాలింపు చేపట్టారు. పెన్నానది సమీపంలో వెతుకుతుండగా అక్కడున్న వారు కొద్దిసేపటి క్రితం జాఫర్సాహెబ్ కాలువలో ఓ మహిళ దూకడంతో స్థానికులు ఆమెను బయటకు తీసి ఒడ్డున పెట్టారని చెప్పారు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికి వెళ్లి చూడగా సదరు మహిళను సుహాసినిగా గుర్తించి చికిత్స నిమిత్తం నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సుహాసిని మృతిచెందినట్లు నిర్ధారించారు. బాధితులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బాలకృష్ణ మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. -
మహిళ కుటుంబానికి చేయూత
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గుండె, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతూ పూటగడవక ఇబ్బందులు పడుతున్న సుభాషిణి అనే మహిళకు దాతలు సాయం చేశారు. గురువారం సాక్షిలో ‘ఆమె జీవితం కష్టాలమయం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో 54వ డివిజన్ జనార్దనరెడ్డికాలనీ ప్రాంతానికి చెందిన మల్లికార్జున బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. నకిలీ ఎస్సై అరెస్ట్ సంగం: మండలంలోని సంగంలో నకిలీ ఎస్సైగా చెలామణి అవుతున్న హరీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంగం పోలీస్స్టేషన్లో గురువారం ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ వివరాలు వెల్లడించారు. హరీష్ నకిలీ ఎస్సై అవతారమెత్తి వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కారు, నకిలీ యూనిఫాం, బెల్ట్, బూట్లు, నంబర్ ప్లేట్, టోపీ, స్టార్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 2023లో వచ్చిన ఎస్సై ఫలితాల్లో ఎంపికయ్యానని సిద్ధీపురానికి చెందిన హరీష్ అందరినీ నమ్మించాడు. ఎస్సై యూనిఫాం ధరించి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిపి నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. కేసును ఛేదించిన సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, సిబ్బందిని అభినందించారు. 15 నుంచి అందుబాటులోకి మ్యూజియం నెల్లూరు రూరల్: నెల్లూరు సరస్వతి నగర్లో ఉన్న పురావస్తు శాఖ మ్యూజియం ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని సహాయ సంచాలకుడు జి.గంగాధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ శాఖ నిధులతో ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు తెలియజేశారు. పురాతన వస్తువులు, రాజుల కాలం నాటి నాణేలు, అరుదైన శిల్పాలు ఉన్నాయన్నారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు ● ఒకరికి తీవ్రగాయాలు దగదర్తి(బిట్రగుంట): దగదర్తి మండలం ఉలవపాళ్ల కూడలి వద్ద ట్రాక్టర్ను కారు ఢీకొట్టిన ఘటన గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉలవపాళ్ల కూడలి వద్ద మలుపు తిరుగుతున్న ట్రాక్టర్ను ఒంగోలు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ రెండుగా విడిపోయింది. ట్రాక్టర్ విడిభాగాలు రోడ్డుపైన చెల్లాచెదురుగా పడిపోయాయి. డ్రైవర్ రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కారులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు చేపట్టారు. -
డీసీపల్లిలో అగ్నిప్రమాదం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ బ్యారెన్ సమీపంలో తాత్కాలికంగా వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న పది గుడిసెలు దగ్ధమయ్యాయి. స్థానికులు, అధికారుల కథనం మేరకు.. డీసీపల్లిలో ఓ పొగాకు బ్యారెన్లో పని చేసుకునే కూలీలు సమీపంలోనే తాత్కాలికంగా గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం ఉదయం పనికి వెళ్లగా 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా గుడిసెల్లో మంటలు వ్యాపించాయి. పదిగుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అంతేకాక ఒక ఆటో, ఒక మోటార్బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు, సామగ్రి దగ్ధమవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మర్రిపాడు ఇన్చార్జి తహసీల్దార్ అనిల్కుమార్, ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సై శ్రీనివాసరావు, అగ్నిమాపక కేంద్రం అధికారి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని కేసు నమోదు చేసుకున్నారు. రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. ● సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఇన్చార్జి తహసీల్దార్ అనిల్కుమార్ అండగా నిలిచారు. సొంత నిధులతో దుస్తులను అందజేశారు. పది కిలోల వంతున బియ్యం పంపిణీ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక అందజేసి బాధితులకు నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. పది గుడిసెలు, ఆటో, బైక్ దగ్ధం రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం -
వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
ఎవరేమన్నారంటే..నెల్లూరు(బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గురువారం వాడీవేడిగా జరిగింది. పలువురు కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానాల్లేవు. ఏపీజే అబ్దుల్ కాలం సమావేశ మందిరంలో మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యల కంటే అంజెండా ఆమోదమే మిన్న అంటూ అధికార సభ్యులు వ్యవహరించడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. అజెండాలో పొందుపరిచినవి ఆర్థిక అంశాలేనని.. నిబంధనలకు విరుద్ధంగా ఇన్యాంటిసిపేషన్ ఆర్డర్లకు సంబంధించిన అజెండాను తయరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కార్పొరేటర్లు.. వైఎస్సార్సీపీ వారిని మాట్లాడనివ్వకుండా అడుగడుగునా అడ్డు తగులుతూ సమావేశాన్ని సజావుగా జరగనివ్వలేదు. చివరకు అజెండాలోని 91 అంశాలను ఆల్పాస్ చేసి ముగించారు. వివిధ సమస్యలపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మేయర్కు వినతిపత్రం అందించారు. రెచ్చిపోయి.. ముందుగా డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ అజెండాలోని అంశాలను చదివి వినిపించి ఆమోదింపజేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. దీంతో 37వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ముందుగా సమస్యలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని అడగ్గా అందుకు డిప్యూటీ మేయర్ తాను చెప్పిందే జరగాలంటూ అజెండా అంశాలను పూర్తి చేయాలన్నారు. దీంతో ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 13వ డివిజన్కు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున తన సహచరుడు అడిగినట్లుగా తొలుత సమస్యలపై చర్చింకునేందుకు అవకాశం కల్పి ంచాలన్నారు. అయితే 9వ డివిజన్కు చెందిన టీడీపీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ నీవేంటి మాట్లాడేదంటూ నాగార్జున మీద రెచ్చిపోయాడు. కొందరు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్రెడ్డి సమస్యలు చెప్పి కమిషనర్ సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. 46వ డివిజన్కు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ప్రతి విషయానికి కమిషనర్ సమాధానం చెబుతుంటే సమయం సరిపోదని, మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలన్నారు. ప్రతాప్రెడ్డి నీకెందుకంటూ మొదలుపెట్టగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ వారికి సర్ది చెప్పారు. అడ్డుపడుతూ.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పలు సమస్యలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతుంటే అధికార పార్టీ కార్పొరేటర్లు అకారణంగా అడ్డుపడుతూ వచ్చారు. అధికశాతం మంది తమ డివిజన్లలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేయర్ స్పందించి కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ తహసిన్, కో–ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్యతేజ, అదనపు కమిషనర్ నందన్, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్ఈ రామ్మోహన్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, మేనేజర్ ఇనాయతుల్లా, అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సోలార్ ప్రాజెక్ట్ మేయర్ స్రవంతి మాట్లాడుతూ ప్రధాన అజెండాలోని 68 అంశాలు, సప్లిమెంటరీలోని 15 అంశాలు, టేబుల్ అజెండాలోని 8 అంశాలకు కార్పొరేటర్ల ఆమోదం తెలపడం జరిగిందన్నారు. రూ.60 కోట్లతో నూతనంగా సోలార్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ఎంసీకి సంబంధించిన ఖాళీ స్థలాలకు ప్రహరీ ఏర్పాటు చేసేందుకు రూ.25 కోట్ల నిధులు కేటాయించి ప్రతిపాదించారన్నారు. కార్పొరేషన్లో రెచ్చిపోయిన అధికార పార్టీ కార్పొరేటర్లు సమస్యలు తర్వాత.. ఆర్థిక అంశాలే ముఖ్యం పలువురు సభ్యుల మధ్య మాటల యుద్ధం వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల్లేవు అజెండాలోని 91 అంశాలు ఆల్ పాస్ 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఇలా మాట్లాడారు. ప్రధాన అజెండాలోని అంశాల్లో మొత్తం 68 ఉండగా ఇందులో 60 అంశాలకు ముందస్తు అనుమతులున్నాయి. రూ.10 లక్షలకు నిధులు పైగా ఖర్చు చేయాలంటే కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. అలా చేయకుండానే రూ.200 కోట్లకు ముందస్తు అనుమతులిచ్చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎన్ఎంసీలో అధికారులు కొన్ని బదిలీలను నిబంధనలకు విరుద్ధంగా చేశారు. మేనేజర్, ఇద్దరు ఆర్వోలను బదిలీ చేసి ఆ ముగ్గురి స్థానాల్లో సూపరింటెండెంట్ కేడర్ ఉన్న అధికారిని ఇన్చార్జిగా నియమించారు. సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై కూడా చర్చించారు. 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ నగర పాలక కమిషనర్ అధికారులతో కలిసి నా డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. అదే టీడీపీలో చేరిన కార్పొరేటర్లకు మాత్రం సమాచారం ఇస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?, కమిషనర్కు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని ఇది ఎంతవరకు సబబని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. 37వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ఇలా స్పందించారు. ట్రేడ్ లైసెన్స్లు, ఇంటి పన్నులను వసూలు చేసే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతుల్ని చేయాలి. అప్పుడే ఇబ్బందులుండవు. నగరంలో దోమలు విపరీతంగా ఉన్నాయని వీటి నియంత్రణకు సరైన చర్యలు చేపట్టాలి. 21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ ఇలా మాట్లాడారు. వైఎస్సార్సీపీ పాలనలో నిధుల డైవర్షన్ జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి అంటున్నారు. 2019 నుంచి 2024 వరకు ఎన్ఎంసీకి వచ్చిన అన్ని రకాల నిధులు, జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి విషయాలను ప్రజలకు తెలియజేయాలి. అజెండాలోని అంశాలు అధిక శాతం ఇన్యాంటిసిపేషన్ (ముందస్తు అనుమతులు)కు సంబంధించినవే పొందుపరిచారు. ఇది సరైన పద్ధతి కాదు. 21వ డివిజన్లో ప్రధాన డ్రెయిన్ను నిర్మాణం చేపట్టాలి. మాగుంట లేఅవుట్లో వాకింగ్ ట్రాక్, సైన్స్ పార్కు పక్కన ఉన్న రైల్వే లైన్ వెంబడి స్థలాన్ని బ్యూటిఫికేషన్ చేయాలి. -
విద్యార్థుల్లో ఫుల్ జోష్
నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈనెల ఒకటో తేదీన పరీక్షలు మొదలయ్యాయి. చివరిరోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. వీటికి జనరల్కు సంబంధించి 27,753 మందికి గానూ 26,961 మంది హాజరయ్యారు. 792 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 738 మందికి గానూ 634 మంది హాజరయ్యారు.104 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు ఆత్మకూరులోని ప్రభుత్వ, ప్రియదర్శిని, బీఎస్ఆర్, వింజమూరులోని వైఆర్ వికాస్ జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కాగితాలను చింపి కేకలు వేశారు. హాస్టళ్లలో ఉంటున్న వారు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్కు చేరుకుని సొంతూర్లకు బయలుదేరారు. -
వైఎస్సార్సీపీ ఆవిర్భావమే చారిత్రాత్మకం
నెల్లూరు (బారకాసు): దేశ రాజకీయ యవనికపై వైఎస్సార్సీపీ ఆవిర్భావమే ఒక చారిత్రాత్మకం, ఉప ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు వైఎస్సార్సీపీ విజయాలు అప్రతిహతంగా కొనసాగాయని మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని డైకస్రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను కాకాణి గోవర్ధన్రెడ్డి ఎగురవేశారు. కార్యాలయ ఆవరణలో ఉన్న దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్కట్ చేసి అందరికి పంచి పెట్టారు. కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి ఆశీస్సులు, ఆదరణ అందించిన ప్రజానీకానికి, నాయకులు, కార్యకర్తలకు, సానుభూతిపరులు, వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ వత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు. ఈ 14 ఏళ్ల పాటు పార్టీ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొందన్నారు. ఇడుపులపాయలో 2011న మార్చి 12న మహానేత డాక్టర్ వైఎస్సార్ సమాధి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం ప్రతిపక్ష పార్టీగా, అధికార పార్టీగా నిలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు. కోట్లాది మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, విలువలు, విశ్వసనీయత ఐదేళ్లు జగన్ పరిపాలన కొనసాగించారన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వాడవాడల వైఎస్సార్సీపీ జెండా ఎగరడానికి కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ప్రజల్లో ఉండే నమ్మకమేనని చెప్పారు. గడిచిన 9 నెలల్లోనే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటు వేయకుండా చంద్రబాబుకు ఓటు వేసి అధికారం ఇచ్చి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. బాబు పాలన కంటే వైఎస్ జగన్ పాలన వెయ్యి రెట్లు మేలని వైఎస్సార్సీపీ వాళ్లే కాకుండా కరుడు కట్టిన టీడీపీ వాళ్లు మాట్లాడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0 పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ వెంకటగిరి, ఉదయగిరి ఇన్చార్జిలు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు మల్లి నిర్మల, కార్పొరేటర్ మొయిళ్ల గౌరి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ సంబరాలు పార్టీ జెండా ఎగుర వేసిన నేతలు -
నమ్మక ద్రోహంపై... గర్జన గళమై..
విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన విడుదల చేయకుండా విద్యార్థులకు, ఉద్యోగాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నమ్మకం ద్రోహం చేసింది. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నయవంచనకు పాల్పడింది. తమ భవిష్యత్ను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకలిస్తామంటూ యువత గర్జించింది. సర్కార్ మెడలు వంచి హామీలు అమలయ్యే వరకు విశ్రమించబోమని శపథం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు మండు టెండను సైతం లెక్క చేయకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన విడుదల చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ నినాదాలు మార్మోగాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఎ. ఆనంద్కు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో కలిసి వినతిపత్రం అందజేశారు. – నెల్లూరు (అర్బన్) – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి ● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన యువత ● ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు ● కలెక్టరేట్ వద్ద ధర్నాకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు ● ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి కూటమి ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను నయవంచనకు గురి చేసింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.7,100 కోట్లు ఉండగా బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని బట్టి పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. రూ.8,900 కోట్లతో రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించగా, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకోవడం దుర్మార్గ చర్య. 2024–25 ఏడాదికి తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారు. 2025–26 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో కేవలం రూ.7,600 కోట్లు పెట్టి తల్లికి టోకరా పెట్టబోతున్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కల్పించలేదు. నిరుద్యోగ భృతి రెండేళ్లకు కలిపి రూ.72,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో ఆ ఊసే లేదు. ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. పోరాటాలతో ప్రభుత్వ మెడలు వంచి తీరుతాం.నిరుద్యోగులకు శాపం చంద్రబాబు – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ రాష్ట్రంలో 2 లక్షల మంది వలంటీర్లను తొలగించిన ఘనుడు చంద్రబాబు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తూ యువతను నడిరోడ్డులో నిలబెడుతున్నాడు. ఎన్నికల సందర్భంగా 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని చెప్పాడు. గెలిచాక 16 వేల పోస్టులతో డీఎస్సీ అంటూ తొలి సంతకం చేశాడు. ఆ తొలి సంతకానికి నేటికీ దిక్కులేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం అని చెప్పి బాబు మోసం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేద విద్యార్దులకు అండగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు. మనస్సు లేని పాలన బాబుది – మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ బాబుది మోసపూరిత పాలన – బుర్రా మధుసూదన్యాదవ్, మాజీ ఎమ్మెల్యే, కందుకూరు ఇన్చార్జి -
డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
వెంకటాచలం: విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) అనుబంధ కళాశాలల్లో బుధవారం నిర్వహించిన డిగ్రీ ఆరో, నాలుగో సెమిస్టర్ల పరీక్షలకు 449 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఎగ్జామ్స్ అధికారి డాక్టర్ ఆర్.మధుమతి తెలిపారు. ఉదయం నిర్వహించిన ఆరో సెమిస్టర్కు 55 మందికి 47 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నిర్వహించిన నాలుగో సెమిస్టర్కు 7,573 మందికి 7,132 మంది హాజరయ్యారనితెలిపారు. బుచ్చిరెడ్డిపాళెంలోని సెయింట్ మేరీ డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని తెలిపారు. -
యువత పాల్గొనాలి : కలెక్టర్
నెల్లూరు రూరల్: యూత్ పార్లమెంట్ – 2025లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ, యువకులు పాల్గొనాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తన కార్యాలయంలో బుధవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి యువత తమ ప్రణాళికలను పంచుకోవడానికి యూత్ పార్లమెంట్ – 2025 మంచి వేదిక అన్నారు. ఆసక్తి గల వారు వన్ నేషన్ – వన్ ఎలక్షన్పై మై భారత్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని వికసిత భారత్పై ఒక నిమిషం వీడియోను చిత్రీకరించి నెల్లూరు నోడల్ డిస్ట్రిక్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్శంకర్ అల్లం (81878 14140) నెహ్రూ యువ కేంద్రం అధికారి డాక్టర్ ఎ.మహేంద్రరెడ్డి (99635 33440)ను సంప్రదించాలన్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
కావలి: కోర్టు వివాదంలో ఉన్న పొలంలో వరి పంట కోత పనులను అడ్డుకుంటుండటంతో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం తాళ్లపాళెం గ్రామంలో మంగళవారం జరిగింది. కోత పనుల కోసం కౌలు రైతు ప్రసాద్రెడ్డి వరికోత మెషీన్ను తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో అతను, భార్య లక్ష్మీకాంతమ్మ పొలంలోనే పురుగు మందు తాగగా స్థానికులు వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణహాని లేదని తెలిసింది. సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అడవుల్లో ట్రాప్ కెమెరాల ఏర్పాటు సీతారామపురం: మండలంలోని సీతారామపురం, పండ్రంగి, దేవమ్మచెరువు, చిన్నాగంపల్లి బీట్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 35 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్వో కేవీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల వెలుగొండ అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నందున దానిని గుర్తించేందుకు అడవిలో కెమెరాలు అమర్చామన్నారు. పశువుల కాపరులు అడవిలో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అడవికి నిప్పు పెడితే శిక్షార్హులవుతారన్నారు. -
బీపీటీ రకాన్ని కేంద్రాల్లోనే విక్రయించుకోండి
● డీఏఓ పి.సత్యవాణి సూచన కొడవలూరు: బీపీటీ రకం ధాన్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున, దానిని రైతులు విధిగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిని పి.సత్యవాణి సూచించారు. మండలంలోని గుండాలమ్మపాళెం, వెంకన్నపురం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీటీ రకానికి ప్రభుత్వం పుట్టికి రూ.19,720 మద్దతు ధర ప్రకటించిందని, మార్కెట్లో రూ.17,500లకే కొంటున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రంలో విక్రయించుకుని అధిక ధర పొందాలన్నారు. తేమ శాతంలోనూ మినహాయింపు ఉన్నందున రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం అధికంగా ఉంటే అదనంగా ఉన్న ఒక్కో శాతానికి క్వింటాకు కిలో ధాన్యం వంతున అదనంగా కేంద్రాలకు ఇవ్వడం ద్వారా విక్రయించుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రధానంగా వరికోత కోసే రైతులు వారం ముందుగానే వీఏఏను సంప్రదించి షెడ్యూలింగ్ నమోదు చేసుకోవాలన్నారు. దీంతో కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, మిల్లుల కేటాయింపు, వాహనాలు సిద్ధం చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆమె పంట నమోదైన రైతుల వివరాలను కేంద్రాల వద్ద ప్రచురించారు. కార్యక్రమంలో ఏడీఏలు నర్సోజీ, శేషగిరిరావు, ఏఓ లక్ష్మి, ఏఈఓ పి.వెంకట్రావు, వీఏఏలు కె.విష్ణుప్రియ, బి.లిఖిత తదితరులు పాల్గొన్నారు. -
ఆరుగురు ‘తెలుగు తమ్ముళ్ల’పై కేసు●
● స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం చేసిన ఘటనలో.. తోటపల్లిగూడూరు: ఓ పాఠశాల వార్షికోత్సవంలో పచ్చమూక సృష్టించిన బీభత్సంపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదైంది. వివరాలు.. మండలంలోని చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం సరస్వతి పూజ, వార్షికోత్సవం జరిగింది. దీనికి వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు మద్యం తాగొచ్చి బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. డీజే సిస్టం నిర్వాహకులైన వంశీ (పల్లిపాడు), విక్రమ్ (విలుకానుపల్లి)పై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. అంతే కాకుండా డీజే సిస్టంకు సంబంధించిన మిక్సర్, ల్యాప్టాప్లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బాధితులైన వంశీ, విక్రమ్లు మంగళవారం పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఆవుల గణేష్, ముత్యాల హరి, మహేష్, చందు, విజయ్, కిరణ్తో పాటు మరికొందరు అకారణంగా దాడి చేసి, డీజే సిస్టం సామగ్రిని ధ్వంసం చేశారని, సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. -
అసంపూర్తి గృహాలకు అదనపు ఆర్థిక సాయం
నెల్లూరురూరల్: 2019–24 మధ్య కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకా వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అందజేసే యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గృహ నిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, అత్యంత వెనుకబడిన గిరిజనులకు రూ.లక్ష అదనపు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. పీఎంఏవై 1.0 ఇల్లు మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాలకు అదనంగా ఆర్థిక సహాయం అందించి ఆ ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్లు చెప్పారు. పీఎంఏవై (అర్బన్) బీఎల్సీ–1.0, పీఎంఏవై (గ్రామీణ్)–1.0, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్ధిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు. ఈ మేరకు లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 75,344 మందికి రూ.1,199.85 కోట్ల మంజూరు జిల్లాలో 75,344 మంది లబ్ధిదారులకు ప్రయో జనం చేకూరనుంది. ఆత్మకూరులో 8,467, కందుకూరు 6,159, కావలి 10,779, కోవూరు 8,696, నెల్లూరు సిటీ 6,690, నెల్లూరు రూరల్ 8,400, సర్వేపల్లి 19,267, ఉదయగిరి 6,886 ఇళ్లకు సంబంధించి రూ.119.85 కోట్లు మంజూరయినట్లు కలెక్టర్ తెలిపారు. పీఎంఏవై (అర్బన్) బీఎల్సీ–2.0, పీఎంఏవై (గ్రామీణ్) –2.0, పీఎం జన్మన్ తదితర పథకాల కింద యూనిట్ విలువ రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీలకు రూ.50వేలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 75,334 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలెక్టర్ ఆనంద్ -
ఆరుగురు ‘తెలుగు తమ్ముళ్ల’పై కేసు●
● స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం చేసిన ఘటనలో.. తోటపల్లిగూడూరు: ఓ పాఠశాల వార్షికోత్సవంలో పచ్చమూక సృష్టించిన బీభత్సంపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదైంది. వివరాలు.. మండలంలోని చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం సరస్వతి పూజ, వార్షికోత్సవం జరిగింది. దీనికి వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు మద్యం తాగొచ్చి బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. డీజే సిస్టం నిర్వాహకులైన వంశీ (పల్లిపాడు), విక్రమ్ (విలుకానుపల్లి)పై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. అంతే కాకుండా డీజే సిస్టంకు సంబంధించిన మిక్సర్, ల్యాప్టాప్లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బాధితులైన వంశీ, విక్రమ్లు మంగళవారం పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఆవుల గణేష్, ముత్యాల హరి, మహేష్, చందు, విజయ్, కిరణ్తో పాటు మరికొందరు అకారణంగా దాడి చేసి, డీజే సిస్టం సామగ్రిని ధ్వంసం చేశారని, సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. -
జూపూడి పేరుతో నకిలీ ఫిర్యాదు
కోవూరు: కోవూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కీలక అధికారి లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తన పరిధిలో ఉన్న పంచాయతీల్లోని కార్యదర్శులను బెదిరించి లంచాలు తీసుకునేందుకు ఆకాశ రామన్న ఉత్తరాలు రాయిస్తూ.. విచారణ పేరు తో ముడుపులు గుంజుతున్నాడని ఆరోపణలు ఉన్నా యి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, నెల్లూరు అడ్రస్తో కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ కార్యదర్శి అవినీతికి పాల్పడినట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖ కాపీలు కలకలం రేపుతున్నాయి. అందులో కనీసం తేదీని కూడా కనబరచకపోవడం గమనార్హం. ఫిర్యాదు కాపీ ఒకటే.. కానీ రెండు రకాలుగా ఉన్నాయి. 2025 ఫిబ్రవరి 10వ తేదీతో కలెక్టర్ కార్యాలయం, 2025 ఫిబ్రవరి 20వ తేదీతో జిల్లా పంచాయతీ కార్యాలయ ముద్రలు ఉన్న ఫిర్యాదు కాపీపై సదరు జూపూడి ప్రభాకర్ సంతకం లేదు. బయటపడిన మరో కాపీలో జూపూడి సంతకం చేసినట్లు ఉంది. ఈ రెండు కాపీలు చూస్తే ఫేక్ ఫిర్యా దులతోపాటు కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లను ఉపయోగించి సదరు అధికారి ఈ దారుణానికి పాల్ప డుతున్నట్లు సమాచారం. కలెక్టర్, డీపీఓలు విచారణకు ఆదేశించారంటూ ఆగమేఘాలపై సదరు అవినీతి అధికారే విచారణ పేరుతో పంచాయతీ కార్యదర్శిని వేధించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ సంబంధిత అధికారులు విచారణకు ఆదేశిస్తే.. ముందుగా ఆ ఫిర్యాదుల కాపీలు మండల పరిషత్ అధికారి కి రావాలి. ఎంపీడీఓకు కూడా తెలియకుండా సదరు అధికారి చేతికి వచ్చాయంటే.. ఇవి నకిలీ ఫిర్యాదులే అని అర్థమవుతోంది. సదరు అధికారి కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లను దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి పేరుతో వచ్చిన ఫిర్యాదులపై ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో తాను ఆ లేఖ రాయలేదని తన పేరు ఉపయోగించి ఫేక్ ఫిర్యాదులు సృష్టించిన వారిపై చర్యల నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కోవూరు ఎంపీడీఓ కార్యాలయ అధికారి ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఒకే ఫిర్యాదు కాపీ.. సంతకం లేకుండా.. సంతకంతో మరొకటి సంతకం లేని కాపీపై కలెక్టర్ కార్యాలయ ముద్ర కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లు తయారు చేసుకుని దుర్వినియోగం పోలీసులకు ఫిర్యాదు చేయనున్న జూపూడి -
దంపతుల ఆత్మహత్యాయత్నం
కావలి: కోర్టు వివాదంలో ఉన్న పొలంలో వరి పంట కోత పనులను అడ్డుకుంటుండటంతో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం తాళ్లపాళెం గ్రామంలో మంగళవారం జరిగింది. కోత పనుల కోసం కౌలు రైతు ప్రసాద్రెడ్డి వరికోత మెషీన్ను తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో అతను, భార్య లక్ష్మీకాంతమ్మ పొలంలోనే పురుగు మందు తాగగా స్థానికులు వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణహాని లేదని తెలిసింది. సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అడవుల్లో ట్రాప్ కెమెరాల ఏర్పాటు సీతారామపురం: మండలంలోని సీతారామపురం, పండ్రంగి, దేవమ్మచెరువు, చిన్నాగంపల్లి బీట్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 35 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్వో కేవీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల వెలుగొండ అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నందున దానిని గుర్తించేందుకు అడవిలో కెమెరాలు అమర్చామన్నారు. పశువుల కాపరులు అడవిలో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అడవికి నిప్పు పెడితే శిక్షార్హులవుతారన్నారు.