SPSR Nellore District News
-
గౌతమన్న ఆశయ సాధనకు కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి
మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ గౌతమన్న ఆశయాలకు అనుగుణంగా ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో శ్రమించారని, వ్యవసాయ పరంగా, పారిశ్రామికంగా అన్నింటా నియోజకవర్గాన్ని ముందు స్థానంలో నిలబెట్టారన్నారు. మంత్రిగా మూడేళ్ల పాటు పదవిలో ఉన్నప్పటికీ 30 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునేలా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రణాళికతో కూడిన అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ గౌతమ్రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు పలు కీర్తనలు ఆలపించారు. -
మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు
నెల్లూరు (పొగతోట): రాబోయే వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ మాట్లాడారు. జిల్లాలో మంచినీటి పథకాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇప్పటికే జెడ్పీ నుంచి రూ.14 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఆర్ఓ ప్లాంట్లను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఆర్ఓ ప్లాంట్ల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పనులకు సంబంధించి పూర్తి చేసిన బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుందంటూ జెడ్పీటీసీలు చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. చైర్పర్సన్ స్పందిస్తూ బిల్లులను సకాలంలో మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ధాన్యం ధరలు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యానికి మద్దతు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోలు చేసేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్డు పనులు వేగవంతం చేయాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నిధులు ల్యాప్స్ కాకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు. ఆయా పథకాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఇటీవల భోజనం సక్రమంగా లేదంటూ విద్యార్థులు ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకుంటున్నట్లు తెలుస్తుందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలన్నారు. జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచాలన్నారు. ఉపాధి పనులు వేగవంతంగా జరిగేలా ఆయా శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ విద్యారమ, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. రైతుకు మద్దతు ధర కల్పించండి పనులు త్వరితగతిన పూర్తి చేయండి స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ -
మచ్చలేని నాయకుడు గౌతమ్రెడ్డి
నెల్లూరు (బారకాసు): దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి రాజకీయాలకు అతీతంగా అందరివాడుగా, నిష్పక్ష పాతిగా, మచ్చలేని నాయకుడిగా ఎదిగారని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కొనియాడారు. నెల్లూరు నగరంలోని డైకస్రోడ్డు సెంటర్లోని మేకపాటి స్వగృహంలో శుక్రవారం ఆయన తృతీయ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌతమ్రెడ్డి చిత్రపటం వద్ద తల్లిదండ్రులు మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, మణిమంజరి దంపతులు, కుటుంబ సభ్యులు ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి, అభినవ్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి బంధుమిత్రులు నివాళులర్పించారు. రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ గౌతమ్రెడ్డి మరణం అత్యంత విషాదకరమన్నారు. తన కుమారుడు గౌతమ్రెడ్డి అకాల మరణం ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు తీరని లోటన్నారు. మూడేళ్లు అయినా ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. నిష్పక్ష పాతిగా, అందరివాడుగా ఎదిగారు తృతీయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి భారీగా తరలివచ్చిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు -
తమ్ముళ్ల గ‘లీజు’ దందా!
వలేటివారిపాళెం: మండలంలోని మాలకొండపై కొలువైన మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలోని దుకాణాలకు పలు నాటకీయ పరిణామాలతో వేలం ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. టీడీపీ నేతలు గ‘లీజు’ దందాకు తెరతీశారు. దుకాణాల వేలానికి పాటదారులు రాలేదని చూపించి, నామినేషన్ పద్ధతిలో ఆ దుకాణాలను అతి చౌకగా కొట్టేయ్యాలనే కుతంత్రంతో టీడీపీ నేతలు వ్యాపారులను బెదిరించించినట్లు తెలుస్తోంది. దేవాలయ ప్రాంగంణంలో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు 11 షాపులకు శుక్రవారం ఉప కార్యనిర్వహణాధికారి సాగర్బాబు లీజు వేలం పాట నిర్వహించారు. బొమ్మల విక్రయాల షాపు –1 రూ.5 లక్షలకు, షాపు–2 రూ.4 లక్షలకు, హోటల్ రూ.10.30 లక్షలకు హెచ్చుపాట పాడి షాపులను దక్కించుకున్నారు. మిగిలిన ఎనిమిది షాపుల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. గతంలో వేలం పాట పాడుకున్న వ్యాపారులు పర్యవేక్షణ అధికారిగా వచ్చిన వై.బైరాగిని నిలదీశారు. ‘గతంలో ఇన్చార్జి ఈఓగా దేవస్థానంలో పని చేశావు.. వ్యాపారులకు ఏం న్యాయం చేశావు, చెప్పిన మాటపై నిలబడకుండా అన్యాయం చేశావంటూ’ నిలదీశారు. దీంతో గతం గతహః ఇప్పుడేంటో మాట్లాడాలని బైరాగి వ్యాపారులను దబాయించారు. మిగిలిన ఎనిమిది షాపులకు వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులను అధికార పార్టీ నాయకులు బెదిరించడంతో ఎవరూ పాటలో పాల్గొనలేదు. డిపాజిట్ కట్టేందుకు వచ్చిన వ్యాపారులను పాట పాడుకుంటే వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరించడంతో వెనుదిరిగిపోయారు. దీంతో ఆ ఎనిమిది షాపుల వేలం పాట నిలిచిపోయింది. మూడు సార్లు వేలం నిలిచిపోతే.. మూడు సార్లు వేలం పాట నిలిచిపోతే ఆ తర్వాత వేలం లేకుండానే నామినేషన్ పద్ధతిపై షాపులను దక్కించుకునేందుకే వేలం జరగనివ్వకుండా కుతంత్రాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఎనిమిది పెద్ద షాపుల్లోనే వ్యాపారం భారీగా జరిగేవి కావడంతో ఓ పథకం ప్రకారం రెండో సారి కూడా వేలం పాటను వాయిదా వేయించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వేలం పాట విషయంలో ఇంత జరుగుతున్నా.. అంతా బైరాగిపై వదిలేసి ఉప కార్యనిర్వహణాధికారి సాగర్బాబు ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. మాలకొండ దేవస్థానంలో వేలం పాట పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించాలంటే డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఈఓ, గతంలో ఈ దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్గా, ఇన్చార్జి ఈఓగా పనిచేసిన అధికారిని నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి కుట్రలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. బైరాగి పనిచేసిన కాలంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదే వ్యక్తిని పర్యవేక్షణ అధికారిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాలకొండలో 11 షాపులకు వేలం పాట మూడు షాపులను హెచ్చుపాటతో దక్కించుకున్న వ్యాపారులు ఎనిమిది షాపులకు నిలిచిన వేలం టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకే నాటకీయ పరిణామాలతో వాయిదా -
విద్యుదుత్పత్తి కేంద్రాలుగా గృహాలు
నెల్లూరు(పొగతోట): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటిని విద్యుదుత్పత్తి కేంద్రంగా మార్చాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ ఆనంద్తో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. దీనికి శాసనసభ్యులు ఎవరూ హాజరుకాలేదు. అధికారులు మాత్రమే వచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మర్యాదపూర్వకంగా చైర్మన్ను కలిశారు. సమీక్ష అనంతరం దినకర్ మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ, జల్జీవన్ మిషన్, అమృత్ పథకం తదితర అంశాలపై సమీక్షించామన్నారు. సత్ఫలితాలను సాధించేలా అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. జిల్లాను ఎలక్ట్రానిక్ హబ్గా, వస్తువులు తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. రామాయపట్నం పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అవగాహన లేకుండానే.. అధికారుల సమీక్షలో దినకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఉపాధి హామీకి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.2,300 కోట్లకు పైగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులను నష్టపోవడం జరిగిందన్నారు. వాస్తవానికి ఉపాధి పనులకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ముందుగా మంజూరు కావు. ఒక జిల్లాను యూనిట్ తీసుకుంటారు. ఉదాహరణకు రూ.200 కోట్ల విలువైన పనులు జరిగితే రూ.80 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తం కూలీలు చేసే పనులకు సంబంధించి ఇస్తారు. కలెక్టర్లు జిల్లాలో కూలీలు చేసే పనులను పరిశీలించి మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా సీసీ రోడ్లు, ఇతర భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. ఈ విషయంపై అవగాహన లేని చైర్మన్ రూ.2 వేల కోట్లకు పైగా నిధులు నష్టపోయామని చెప్పడం విడ్డూరంగా ఉంది. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అవకాశాలు 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ -
సోమిరెడ్డి ఇసుక దోపిడీ నిజమని తేలింది
తమ అక్రమ సంపాదన కోసం రాజకీయ నేతలు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణా నిలువరించాల్సిన అధికారులు నేతల సేవలో, మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో విరువూరు, సూరాయపాళెం ఇసుక రీచ్ల నుంచి ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత అధికార యంత్రాంగం దాదాపు తొమ్మిది నెలల తర్వాత కళ్లు తెరిచింది. నిజాలు తెలుసుకుని కట్టడి చేస్తున్నారా? లేక నిష్పక్షపాతంగా వ్యవహస్తున్నామని కనికట్టు చేస్తున్నారా? లేక కోర్టు స్టే ఉన్న విరువూరు రీచ్ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని భావించి ఇలా చేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదిఏమైనా.. స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని అధికారులు బట్టబయలు చేయడం చూస్తుంటే.. ఇన్నాళ్లు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నిజమే అని తేటతెల్లం చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లిలో టీడీపీ నేతలు రీచ్ల్లో ఇసుక దోపిడీ చేస్తున్నట్లు మైనింగ్ శాఖ అధికారుల దాడుల్లో తేట తెల్లమైంది. అధికారమే అండగా తొమ్మిది నెలలుగా విరువూరు, సూరాయపాళెం ఇసుక రీచ్లను అడ్డాగా చేసుకుని తమ్ముళ్ల ఇసుక మాఫియా చెలరేగిపోయింది. నిబంధనలకు పాతరేసి ఇసుక తవ్వేసి జిల్లా సరిహద్దులు దాటిస్తూ ధనార్జన సాగిస్తున్నారు. విరువూరు ఇసుక రీచ్లో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్నప్పటికీ దీనిపై కోర్టు స్టే విధించింది. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వచ్చారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు ఇసుక రీచ్ల వైపు కన్నెత్తి చూడకపోవడంతో నదీ గర్భాన్ని కుళ్లబొడి చేశారు. విరువూరు రీచ్ నుంచి రేయింబవళ్లు బయట జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలకు ఇసుక రవాణా చేస్తున్నా.. పట్టించుకునే అధికారి లేకుండా పోయారు. భూగర్భ జలాలు, కరకట్టలు దెబ్బతింటున్నా.. పెన్నాబ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రైతులు చెబుతున్నా.. ఉచిత ఇసుకను నగదుగా మార్చి దోచుకుంటున్నారు. ఇన్నాళ్లు తెలియదా? ఇప్పుడే కళ్లు తెరిచినట్లు! గత తొమ్మిది నెలలుగా కోర్టు స్టే ఉన్న విరువూరు రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన మైనింగ్ శాఖాధికారులు ఇప్పుడే కళ్లు తెరిచినట్లుగా ఆ రీచ్పై దాడులు చేయడం, ఇసుక తవ్వే యంత్రాలతోపాటు లారీలు, టిప్పర్లను సీజ్ చేయడం చూస్తుంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రెగ్యులర్ డీడీ లేని సమయంలో జిల్లా మైనింగ్ అండ్ జియాలజీ డీడీ (ఎఫ్ఏసీ) బాలాజీనాయక్ సాహసించి విరువూరు ఇసుక రీచ్లో ఇసుక అక్రమ రవాణా బండారాన్ని బయట పెట్టారు. అక్కడి నుంచి పోలీసులకు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడంతో కలెక్టర్కు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ.. సీజ్ చేసిన వాహనాలను పోలీసులకు అప్పగించడం వెనుక చాలా కథే ఉన్నట్లు సమాచారం. సర్వేపల్లి ప్రజాప్రతినిధి ఇసుక దోపిడీకి కళ్లెం వేసేందుకు అధికారులే నడుం బిగించారా? లేక స్టే ఉన్న రీచ్లో ఇసుక దోపిడీపై రేపు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితులు ఉంటాయని జాగ్రత్త పడుతున్నారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజంగా కళ్లు తెరిచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారంటే.. సురాయపాళెం రీచ్ నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోకపోవడం చూస్తే.. ఇది కనికట్టుగానే ప్రజలు భావిస్తున్నారు. సరే ఏది ఏమైనా విరువూరు రీచ్ నుంచి ఇసుక దోపిడీ జరుగుతుందనే విషయం బహిర్గతమైంది. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ చేశారంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ వచ్చిన ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ వస్తోంది. డీడీపై ముఖ్యనేత ఆగ్రహం విరువూరు రీచ్లో మైనింగ్ డీడీ దాడులు చేసి కలెక్టర్కు తెలియజేస్తున్న సమయంలోనే ఇసుకాసురుడు నియోజకవర్గ ముఖ్య నేతకు ఫోన్ చేసి డీడీకి ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. కలెక్టర్తో మాట్లాడుతున్నానని.. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. నా ఫోన్ కాల్ మాట్లాడకపోతే తాట వలుస్తా, బదిలీ చేయిస్తానంటూ సదరు ముఖ్య నేత ఊగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకే దాడులు చేశామని చెప్పినా ఆ నేత వినిపించుకోకుండా డీడీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పొదలకూరు మండలం సూరాయపాళెం, విరువూరు ఇసుక రీచ్ల్లో విరువూరు రీచ్కు అనుమతి లేదు. కోర్టు స్టే ఉంది. అయినప్పటికీ ఈ రెండు రీచ్ల్లో సీసీ కెమెరాలు పెట్టి.. సమీపంలోనే కారులో నుంచే ఆపరేట్ చేస్తూ ఇసుక దోచుకుంటున్నారు. సర్వేపల్లి ముఖ్య నేత తన సొంతూరుకు చెందిన ఓ వ్యక్తి కనుసన్నల్లో రీచ్ను నడిపిస్తూ ఎవరికి చెందాల్సిన మామూళ్లు వారికి అందజేస్తున్నట్టు ప్రచారం ఉంది. ఈ రెండు రీచ్ల నుంచి నిత్యం 16 టైర్ల లారీల్లో సుమారు 75 వాహనాలకు పైగా నిత్యం 2,250 టన్నుల ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క వాహనానికి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. విరువూరు రీచ్పై స్టే ఉన్నా.. ఆగని ఇసుక దోపిడీ విరువూరు, సూరాయపాళెం రీచ్ల నుంచి యథేచ్ఛగా రవాణా సర్వేపల్లి ముఖ్య నేత కనుసన్నల్లోనే.. మైనింగ్ డీడీ దాడులతో కూటమి నేతల ఉలికిపాటు ఇసుక లారీల సీజ్తో డీడీపై సదరు ముఖ్య నేత ఆగ్రహం పొదలకూరు మండలంలోని ఇసుక రీచ్ల ద్వారా సోమిరెడ్డి రూ.100 కోట్ల మేర ఇసుక దోపిడీకి ప్లాన్ చేశారని, మొదటి నుంచి చెపుతూనే ఉన్నాం. అధికారుల కళ్ల ముందే ఇసుక లారీలు వెళుతున్నా.. పట్టించుకోవడం లేదు. అధికారులు ఒక వేళ ఆపినా సోమిరెడ్డి అండదండలు ఉన్న కారణంగా లారీలు ఆగకుండా వెళ్లిపోయాయి. ఇప్పటికై నా అధికారులు రీచ్లో దాడి చేయడంతో ఇక్కడ దోపిడీ జరుగుతుందని ఈ జిల్లా ప్రజలకు తెలిసింది. సోమిరెడ్డి ఇసుక దోపిడీ నిజమని తేలింది. వాస్తవానికి సూరాయపాళెం, విరువూరు రీచ్ల్లో వందలాది లారీలు ఉన్నాయి. అధికారి వెళుతున్నాడనే సమాచారం తెలుసుకుని పంపించి వేశారు. దీన్ని బట్టి పరిశీలిస్తే సోమిరెడ్డి నీతి, నిజాయితీ ఎంతో తెలుస్తుంది. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి విరువూరు రీచ్పై కోర్టు స్టే ఉంది పొదలకూరు మండలం విరువూరు ఇసుక రీచ్పై కోర్టు స్టే ఉంది. ఈ రీచ్ నుంచి ఇసుకను తరలించేందుకు వీలు లేదు. పోతిరెడ్డిపాళెం, సంగం, సూరాయపాళెం ఇసుక రీచ్లను పరిశీలించి విరువూరు రీచ్లో లారీలను గమనించి తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న లారీలు, హిటాచీలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించాను. ఇక్కడి నుంచి ఎవరు ఇసుకను తరలించినా న్యాయస్థానాన్ని ధిక్కరించినట్లు అవుతుంది. – బాలాజీనాయక్, జిల్లా మైన్స్ అండ్ జియాలజీ డీడీ, నెల్లూరు -
No Headline
నెల్లూరు(అర్బన్): జీజీహెచ్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. తల్లీబిడ్డల (ఎంసీహెచ్) విభాగం వద్ద వెనుక వైపు సుమారు 2 నెలల క్రితం కుళాయి పైపు పగిలి నీరు వృథా అవుతుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగాయి. నీరు చాలదు. కేవలం రూ.1,000 ఖర్చు చేస్తే దానికి మరమ్మతులు చేయొచ్చు. అయినా నేటికీ దిక్కులేదు. ఆర్వో ప్లాంట్లో చిన్న మరమ్మతుల వల్ల నెలరోజులుగా ఎంసీహెచ్ విభాగంలో నీరు రాలేదు. సూపరింటెండెంట్ పట్టించుకోకపోవడంతో హెచ్డీఎస్ కమిటీ సభ్యులు తమ జేబులో నుంచి రూ.3 వేలు ఖర్చు చేసి వారం క్రితం ఆ ప్లాంట్ను రన్నింగ్లోకి తెచ్చారు. ఐపీ భవనంలోనూ నీటి సమస్య ఉంది. జనరేటర్కు డీజిల్ కావాలన్నా ఎవరో ఒకరి చేత ముందుగా ఖర్చు పెట్టిస్తారు. ఇక ఆ ఉద్యోగికి సకాలంలో డబ్బులు చెల్లించకుండా తిప్పుతూనే ఉంటారు. డాక్టర్లు పలుమార్లు తమ జేబులో నుంచి చిన్న, చిన్న మొత్తాలను ఖర్చుపెట్టుకుని సూపరింటెండెంట్ ఇవ్వకపోవడంతో మిన్నకుండి పోయారు. ఆరోగ్యశ్రీ రోగులకు.. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు పొందుతున్న రోగులు కనీసం 10 మంది పెద్దాస్పత్రి నుంచి ప్రతిరోజూ డిశ్చార్జి అవుతున్నారు. వీరికి చార్జీల కింద ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.150 వంతున చెల్లిస్తోంది. ఈ డబ్బును సూపరింటెండెంట్ ఆస్పత్రి ఖాతాలో నుంచి ఇవ్వాల్సి ఉంది. అయితే ఆయన సెలవుపై వెళ్లడం, ఇన్చార్జిగా ఉన్న వ్యక్తికి చెక్పవర్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొద్దిరోజుల నుంచి ఓ ఉద్యోగి తన జేబులో నుంచి రోగులకు చార్జీల కింద నగదు ఇస్తున్నారు. సూపరింటెండెంట్ చెక్పవర్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అధికారులు, డాక్టర్లు పేర్కొంటున్నారు. పట్టించుకోకుండా.. రెగ్యులర్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ సిద్ధానాయక్ ఈనెల 15 నుంచి రెండు నెలలపాటు సెలవు పెట్టారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కి తెలియకుండా సెలవులోకి వెళ్లడంతో జీజీహెచ్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికీ సెలవుల గురించి డైరెక్టర్ నుంచి అప్రూవల్ రాలేదని సమాచారం. వాస్తవానికి సెలవు పెట్టాలంటే ముందస్తుగా అడ్మినిస్ట్రేటివ్ అధికారి ద్వారా డీఎంఈ అనుమతి కోరుతూ లెటర్ పంపాలి. అయితే ఏ రోజూ అలా జరగలేదనే ప్రచారం ఉంది. ఇన్చార్జి సూపరింటెండెంట్గా డాక్టర్ నరేంద్రకు బాధ్యతలు అప్పగించారు. ఈయనకు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగిస్తారని తెలిపారు. ఇంతలోనే అనుమానం వచ్చిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ (హెచ్డీఎస్) ఈనెల 17న సెలవులపై ఆరాతీసింది. కనీసం డీఎంఈకి సమాచారం లేదని తెలిసింది. ఈ విషయం ఇన్చార్జి సూపరింటెండెంట్కు తెలియకుండా రెగ్యులర్ సూపరింటెండెంట్ జాగ్రత్త పడ్డారు. దీంతో హెచ్డీఎస్ కమిటీ ఈ తతంగాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీని గురించి తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సిద్ధానాయక్ హడావుడిగా 18న డీఎంఈకి తమ సెలవులు గురించి అనుమతి కోరుతూ లెటర్ ఈ–మెయిల్ చేసినట్టు తెలిసింది. కాగా ఇంకా అనుమతి రాలేదని సమాచారం. పరిశీలిస్తే.. సిద్ధానాయక్ చాలాసార్లు సెలవులు పెట్టినప్పటికీ అవన్నీ రికార్డుల్లో నమోదు కాలేదని ఆరోపణలున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన 2022 ఆగస్ట్ 4 నుంచి బయోమోట్రిక్, ఎఫ్ఆర్ఎస్ హాజరు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దాస్పత్రిలో సూపరింటెండెంట్గా అడిషనల్ డీఎంఈ హోదా కలిగిన సిద్ధానాయక్ మొదటి నుంచి ఎక్కువగా సెలవులు పెడుతున్నారు. ప్రతి శని, ఆదివారాలు ఇక్కడ ఉండరు. మిగతా రోజుల్లో ఎక్కువగా సెలవులు పెడుతుంటారు. రోజుకి 1,200 నుంచి 1,300కు పైగా ఓపీ ఉండే చోట పెద్దదిక్కుగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సిద్ధానాయక్ ఎప్పటికప్పుడు డీఎంఈ కార్యాలయంలో మేనేజ్ చేసుకుంటుండంతో పెద్దాస్పత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు అందడం లేదనే విమర్శలున్నాయి.జిల్లా సర్వజన ఆస్పత్రి రోగుల సమస్యలు పరిష్కరిస్తాం రోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఇన్చార్జిగా నాకు చెక్పవర్ లేదు. అయినా సర్దుబాటు చేసి ఆస్పత్రిలో కనీస వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నా. – డాక్టర్ నరేంద్ర, ఇన్చార్జి సూపరింటెండెంట్ఆరోగ్యశ్రీ రోగులకు చార్జీలు కూడా ఉద్యోగి జేబులో నుంచే.. కనీస వసతులకు ఇబ్బంది పడుతున్న వైనం రెగ్యులర్ సూపరింటెండెంట్ సెలవుపై గందరగోళం డీఎంఈకి తెలియకుండానే.. హెచ్డీఎస్ కమిటీ జోక్యంతో మూడురోజుల తర్వాత సమాచారం జిల్లాకు రెఫరల్ ఆస్పత్రిగా ఉన్న నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో పాలన పడకేసింది. ఆస్పత్రికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన సూపరింటెండెంట్ పదిరోజులు పనిచేస్తే మరో పదిరోజులు సెలవుపై ఉంటారు. అది కూడా అధికారికంగానా.. అనధికారికంగానో అర్థం కాని పరిస్థితి. సెలవుపై వెళ్లినా చెక్ పవర్ ఎవరికీ ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో ఏ చిన్న పని చేయాలన్నా రూపాయి ఖర్చు పెట్టలేని దుస్థితి నెలకొంది. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 23న సీఎం చంద్రబాబు రానున్నారు. దీంతో ఎస్పీ జి.కృష్ణకాంత్ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ ఒ.ఆనంద్, ఎస్పీ, ఇంటెలిజెన్స్ ఇతర శాఖల అధికారులతో కలిసి ఏఎల్ఎస్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్)ను నిర్వహించారు. కనుపర్తిపాడు ఉన్నత పాఠశాలలోని హెలిప్యాడ్ నుంచి కన్వెన్షన్ సెంటర్, పార్కింగ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.టెండర్ల ఆహ్వానం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు మూలాపేటలోని ఏపీ స్టార్స్లో శిక్షణకు హాజరయ్యే జైళ్ల శాఖ సిబ్బందికి భోజన సదుపాయం అందించేందుకు 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గానూ అర్హులైన కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్ ఎస్.రాజారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ ధరావత్తు రూ.20,23,500లని వెల్లడించారు.టెండర్ దక్కించుకున్న వారు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2026 మార్చి 31వ తేదీ వరకు భోజనం అందించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు టెండర్ల సీల్డ్ కవర్లను స్వీకరిస్తామన్నారు. పూర్తి వివరాలకు ఏపీ స్టార్స్ను సంప్రదించాలని కోరారు.సర్పంచ్ చెక్పవర్ రద్దు పొడిగింపు పొదలకూరు: మండలంలోని ప్రభగిరిపట్నం సర్పంచ్ పి.వెంకమ్మ చెక్పవర్ రద్దును మరో ఆరునెలలపాటు పొడిగిస్తూ డీపీఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయం, సర్పంచ్కు వాటిని అందజేశారు.గొలుసు దొంగ అరెస్ట్నెల్లూరు(క్రైమ్): ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆయాను మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకెళ్లిన ఘటనలో నిందితుడిని నెల్లూరు చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. గాంధీనగర్ సమీపంలోని వీఎంఆర్ నగర్లో సొంగ బుజ్జమ్మ, పుల్లయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. బుజ్జమ్మ 15 ఏళ్లుగా మద్రాస్ బస్టాండ్ సమీపంలోని అహల్యా దేవి నర్సింగ్హోంలో ఆయాగా పనిచేస్తోంది. జనవరి 4వ తేదీ రాత్రి హాస్పిటల్కు వెళ్లింది. గుర్తుతెలియని యువకుడు వచ్చి బుజ్జమ్మతో మాటలు కలిపాడు. ఉన్నట్టుండి ఆమె మెడలోని 12 గ్రాముల బంగారు గొలుసును తెంపుకెళ్లాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు హిందీలో మాట్లాడుతున్నాడని ఆమె వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికత ఆధారంగా నిందితుడు కొరడావీధిలోని గోల్డ్ స్మిత్ దుకాణంలో పనిచేస్తూ రాధామాధవి సెంటర్లో ఉంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన రాజగౌరిగా గుర్తించారు. అతను శుక్రవారం బుజ్జమ్మ బంగారు గొలుసును విక్రయించేందుకు వెళ్తుండగా చిన్నబజారు వద్ద అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వా ధీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. అయ్యప్ప, క్రైమ్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
2027 నాటికి దగదర్తి ఎయిర్పోర్ట్ పూర్తి
● ఎంపీ వేమిరెడ్డి కావలి: దగదర్తి విమానాశ్రయాన్ని 2027 నాటికి పూర్తి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు కలెక్టర్ ఆనంద్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు, కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి విమానాశ్రయం నిర్మించే దామవరం వద్ద భూములను శుక్రవారం పరిశీలించారు. అధికారులతో ఎంపీ వేమిరెడ్డి చర్చించారు. రైతులకు సంబంధించి పరిహారం అంశంపై మాట్లాడుతూ 1,379 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ను నిర్మించాలని ప్లాన్ చేశారని, 669 ఎకరాలను ప్రభుత్వం సేకరించించగా, మరో 710 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఎయిర్పోర్ట్ స్థలం జాతీయ రహదారిని ఆనుకుని ఉందని, కార్గో, పాసింజర్ సేవలకు అవకాశం ఎక్కువ ఉందన్నారు. విమానాశ్రయానికి దగ్గరలోనే రెండు పోర్టులున్నందున ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉంటుందని, ఈ ప్రాంతం పరిశ్రమల హబ్గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూసేకరణకు రూ.96 కోట్ల నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని చెప్పారు. -
కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల మూత
● వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జయకుమార్రెడ్డి నెల్లూరు(బారకాసు): ‘కూటమి నేతలు పరిశ్రమల వద్దకు వెళ్లి దందాలు చేయడం, కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. దీంతో సదరు యజమానులు పరిశ్రమలను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది’ అని వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.జయకుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని డైకస్రోడ్డులో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సెజ్లు ఏర్పాటై యువతకు ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కూడా అనేక పరిశ్రమలు రావడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లేదని, ఎక్కడ చూసినా అవినీతి మయమైపోయిందన్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారన్నారు. దీంతో ఇసుక కొరత ఏర్పడి భవన నిర్మాణ కార్మికులకు పనుల్లే అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తలేదన్నారు. అంతేకాకుండా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ అనేక కుటుంబాలను వీధిన పడేలా చేస్తోందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇసుక మాఫియా, రౌడీయిజంపై ప్రశ్నించిన దాఖలాల్లేవన్నారు. ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో తమ యూనియన్ తరఫున పోరాటాలు చేస్తామన్నారు. -
పకడ్బందీగా గ్రూప్ – 2 మెయిన్స్
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: జిల్లాలో గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో పరీక్షల సమన్వయాధికారి, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, డీఆర్వో ఉదయభాస్కర్రావుతో కలిసి అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏడు కేంద్రాల్లో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం పరీక్షలను నిర్వహించనున్నారని వెల్లడించారు. ఈ కేంద్రాలకు లైజనింగ్ అధికారులుగా ఏడుగుర్ని నియమించామని పేర్కొన్నారు. 4102 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, సీసీ కెమెరాల ఏర్పాటు తదితరాలను పర్యవేక్షించాలన్నారు. సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలు తెరుచుకోకుండా, 144 సెక్షన్ను అమలు చేయాలని చెప్పారు. సెల్ఫోన్లను పరీక్ష కేంద్రంలో డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణవేణి, సెక్షన్ అధికారులు అంజన, రమణ, లైజనింగ్ అధికారులు శ్రీధర్రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆల్ పాస్
నెల్లూరు(అర్బన్): ఎంబీబీఎస్ ఫైనలియర్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో నగరంలోని ఏసీఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. 177 మంది వైద్య విద్యార్థులు పరీక్ష రాయగా, అందరూ ఉత్తీర్ణులై డాక్టర్ పట్టాను అందుకోనున్నారు. గతేడాది 164 మంది పరీక్షలు రాయగా, 154 మంది పాసై 93.9 శాతం విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది నూరు శాతం పాస్ కావడంతో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఘనత సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ రాజమన్నార్ మాట్లాడారు. ఇదే స్ఫూర్తితో వైద్యకళాశాలను ముందుకు నడుపుతామని చెప్పారు. -
ప్రశ్నిస్తే.. కన్నెర్రే..!
సాక్షి టాస్క్ఫోర్స్: ఉదయగిరి నియోజకవర్గంలో తమ్ముళ్ల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయి. ఆగడాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వోద్యోగులు, సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులపై దాడులకు తెగబడుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వికటాట్టహాసం పొందుతుండటంతో ఇది ప్రజాస్వామ్యమా.. లేక అటవిక రాజ్యంలో ఉన్నామాననే సందేహం కలుగుతోంది. నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. బరితెగిస్తూ.. పైశాచికానందం కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఉదయగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో టీడీపీ నేతల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉపాధి హామీ పనుల్లో భాగంగా మంజూరైన సిమెంట్ రోడ్లు, మిని గోకులాల్లో ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధుల పాత్రను నిర్వీర్యం చేశారు. దీనిపై ప్రశ్నించిన సర్పంచ్ల చెక్పవర్ను రద్దు చేస్తామని బెదిరించారు. ఎవరైనా గట్టిగా నిలబడితే అక్రమ కేసులు బెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. నాలుక చీరేస్తాం వరికుంటపాడు మండలంలోని అగ్రిగోల్డ్ భూముల్లో కొంతకాలంగా జామాయిల్ సంపదను కొల్లగొడుతున్నారు. ఈ విషయమై రెవెన్యూ, పోలీస్, సీఐడీ అధికారులకు సీపీఐ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో తహసీల్దార్, పోలీస్స్టేషన్ల ఎదుట రాష్టస్థాయి నేతలు, అగ్రిగోల్డ్ బాధితులు రెండు రోజుల క్రితం ధర్నా చేపట్టారు. తమ మండలంలో ధర్నాలను ఎందుకు చేస్తున్నారని, మరోసారి వస్తే నాలుక చీరేస్తామంటూ వారిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దాడులపై పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేసినా, ఎలాంటి చర్యల్లేవని బాధితులు వాపోతున్నారు. చొక్కా పట్టుకొని దౌర్జన్యం కలిగిరి మండలం పెదకొండూరు వీఆర్వో నరేష్ చొక్కా పట్టుకొని టీడీపీ నేత ప్రసాద్ దౌర్జన్యం చేసిన ఉదంతంపై ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో తాము చెప్పిందే చేయాలంటూ పలు సచివాలయ ఉద్యోగులపై ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తుండటంతో తట్టుకోలేక పలువురు ఉద్యోగులు సెలవుపై వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది. దీంతో నియోజకవర్గంలో పనిచేయాలంటేనే ఉద్యోగులు వెనుకంజ వేస్తున్నారు. వేధింపులకు పరాకాష్ట కొండాపురం మండలం మర్రిగుంటలో గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఓ ఎస్సీ సర్పంచ్పై అక్రమ కేసుల పేరుతో బెదిరింపులకు దిగారు. సదరు సర్పంచ్ను మండల కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వొద్దంటూ అధికారులకు స్వయంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హుకుం జారీ చేశారు. అదే మండలం యర్రబాళేనికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ట్రాక్టర్లో వస్తుంటే, టీడీపీ కార్యకర్తలు ఆడ్డుకొని దాడి చేశారు. అయితే వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా బాధితుడిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపారు. తాజాగా రెండు రోజుల క్రితం వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసాద్పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఇలా అనేక మండలాల్లో టీడీపీ కార్యకర్తల దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయగిరిలో పేట్రేగిపోతున్న తమ్ముళ్లు అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలపై దాడి విధుల్లో ఉన్న వీఆర్వోపై దౌర్జన్యం యథేచ్ఛగా అక్రమాలు నిస్తేజంగా పోలీస్ యంత్రాంగం -
అక్రమంగా ఇసుక తరలిస్తుండగా..
● మైనింగ్ డీడీ దాడులు ● పలు వాహనాల సీజ్ పొదలకూరు: అనుమతి లేని రీచ్ నుంచి రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా మైనింగ్ అధికారులు దాడులు చేశారు. విరువూరు ఇసుక రీచ్కు మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ గురువారం వచ్చారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, ఒక టిప్పర్, ఇసుక లోడింగ్ చేస్తున్న రెండు హిటాచీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ విరువూరు ఇసుక రీచ్పై కోర్టులో స్టే ఉందన్నారు. ఇక్కడి నుంచి ఎవరూ ఇసుకను తరలించేందుకు అనుమతుల్లేవన్నారు. పోతిరెడ్డిపాళెం, సూరాయపాళెం, సంగం ఇసుక డంపింగ్ యార్డులను తనిఖీ చేసి వెళ్తుండగా ఇసుక లారీలను గమనించి విరువూరు రీచ్కు వచ్చినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించి రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం అందజేసి వాహనాలను సీజ్ చేశామన్నారు. వాటిని పొదలకూరు పోలీస్స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి..
● వ్యక్తి మృత్యువాత నెల్లూరు(క్రైమ్): చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరులోని బారాషహీద్ దర్గా సమీపంలో నెల్లూరు చెరువులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు అంబాపురానికి చెందిన కె.కోటయ్య (50), కామేశ్వరమ్మ దంపతులకు ఐదుగురు పిల్లలున్నారు. కోటయ్య నెల్లూరు చెరువులో చేపలు పట్టుకుని వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకోసాగాడు. అతను గురువారం బారాషహీద్ దర్గా సమీపంలోని చెరువులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడున్నవారు 112కు సమాచారం అందించారు. దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. భర్త మృతి విషయం తెలుసుకున్న కామేశ్వరమ్మ తన పిల్లలతో కలిసి ఘటనా స్థలానికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై రమేష్బాబు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెత్తందారులకు జీహుజూర్
విడవలూరు: స్థానికంగా ఆక్రమణల తొలగింపు వ్యవహారం లోపభూయిష్టంగా మారింది. ఈ అంశంలో టీడీపీ నేతలు రంగప్రవేశం చేసి, తమకు అనుకూలంగా ఉండే వారి ఆస్తులను తొలగించకుండా.. ఇతరులవి ధ్వంసం చేసేలా రూపకల్పన చేశారు. వీరే సర్వే అధికారులుగా అవతారమెత్తారంటే ఏమి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేత పక్కనే ఉండి తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఇంటికి ఒకలా.. ఇతరుల గృహాలకు మరోలా మార్కింగ్లను వేయించారు. బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తే, రోడ్డు క్రాస్ తిరిగిందంటూ అధికారులు సమాధానమిచ్చారు. జరిగిందిదీ.. విడవలూరులోని సినిమా హాల్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఉన్న బుచ్చి – ఊటుకూరు రోడ్డును ఇరువైపులా ఆక్రమించారని, దీన్ని తొలగించి వెడల్పు చేయాలంటూ లోకాయుక్తను ఓ వ్యక్తి ఆశ్రయించారు. దీంతో ఆర్అండ్బీ స్థలాలను సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో మార్కింగ్లను సర్వే అధికారులు వేశారు. వీటిని ఈ నెల 12న తొలగించాలని, లేని పక్షంలో తామే రంగంలోకి దిగుతామంటూ నోటీసులను పంచాయతీ అధికారులు జారీ చేశారు. కాగా గృహాలను కూల్చేస్తే తామంతా రోడ్డున పడతామని, మరోసారి సర్వే చేసి న్యాయం చేయాలంటూ నెల్లూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు తహసీల్దార్కు ఆర్జీలను పలువురు అందజేశారు. దీంతో ఆక్రమణల తొలగింపును వాయిదా వేశారు. మరోసారి రీసర్వే చేసి కొత్త మార్కింగ్లు వేశారు. అంతా కక్షపూరితం.. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ఆర్అండ్బీ, రెవెన్యూ, సర్వే, పోలీస్, పంచాయతీ అధికారులు ఈ నెల 18న ప్రారంభించారు. ఇందులో టీడీపీ నేతలు దగ్గరుండి తాము వేసిన తప్పుడు మార్కింగ్ల మేరకే తొలగించాలంటూ పట్టుబట్టి అధికారులను ఒత్తిళ్లకు గురిచేశారు. అనుకున్న విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించి కక్షపూరితంగా తొలగింపు ప్రక్రియను పూర్తి చేశారు. వీపీఆర్ వాటర్ ప్లాంటా.. ఎక్కడా..? రోడ్డు ఆక్రమణల పేరుతో గ్రామంలోని వారిని నష్టపర్చారు. అయితే రోడ్డు పక్కన ఆక్రమణలో ఉన్న వీపీఆర్ వాటర్ పాంట్ను మాత్రం విస్మరించారు. దీని పక్కనే నివాసముంటున్న 70 ఏళ్ల రఘురామయ్య పూరి గుడిసెను కూల్చేసి రోడ్డున పడేశారు. టీడీపీ కార్యాలయానికి లైన్ క్లియర్ విడవలూరులోని మద్యం దుకాణానికి ఎదురుగా ఉన్న అరటి తోటను బుధవారం సాయంత్రం తొలగించారు. దీనికి సంబంధించి యజమానికి ఎలాంటి నోటీసులను ఇవ్వలేదు. 50 ఏళ్లుగా ఉంటున్న స్థలంలో చెట్లతో సహా తొలగించడంపై యజమాని రవి లబోదిబోమన్నారు. ముందు ఉన్న మూడు గృహాలను తొలగించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అరటితోట పక్కనే ఉన్న టీడీపీ మండల నేత పొలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. అసలు కేసులేసింది పచ్చ పార్టీ నేతలే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విడవలూరులో లోపభూయిష్టంగా ఆక్రమణల తొలగింపు టీడీపీ మద్దతుదారులకై తే ఓకే.. ఇతరులవైతే ధ్వంసమే సర్వే అధికారుల అవతారమెత్తిన పచ్చ నేతలు -
నీరు – చెట్టులో దోచుకున్న వ్యక్తి సోమిరెడ్డి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(బారకాసు): ‘నీరు – చెట్టు పనుల్లో దోచుకున్న వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి. ఆయనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి లేదు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిరెడ్డి అన్నారు. గురువారం నెల్లూరు నగరంలోని డైకస్రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో కాకాణి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విమర్శించే వ్యక్తికి స్థాయి ఉండాలన్నారు. సోమిరెడ్డి విషయం ఏమిటనేది నెల్లూరుకు వచ్చి చూస్తే తెలుస్తుందని టీడీపీ అధిష్టానానికి సూచించారు. ఆయన ఎంత దోచుకున్నాడో తెలుస్తుందని చెప్పారు. సోమిరెడ్డి మాట్లాడిన మాటలకు యూట్యూబ్లో కామెంట్స్ చూస్తుంటే అతను ఎటువంటి వ్యక్తి, ఎంతమాత్రపు వ్యక్తి అని అందరికీ అర్థమవుతోందన్నారు. ఎంపీడీఓల నియామకం నెల్లూరు(పొగతోట): ఉమ్మడి జిల్లాలో నాలుగు మండలాలకు ఎంపీడీఓలను నియమిస్తూ జెడ్పీ సీఈఓ విద్యారమ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాపూరు ఎంపీడీఓ ఎం.భవానీని కలువాయికి, చిల్లకూరులో పనిచేస్తున్న ఎం.గోపీని కోటకు, వాకాడు ఏఓ శ్రీనివాసులును వాకాడు కు, తడ ఏఓ మల్లికార్జున్ను సూళ్లూరుపేట ఎంపీడీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నేడు
నెల్లూరు (పొగతోట): నగరంలోని జెడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశాలను శుక్రవారం నిర్వహించనున్నామని సీఈఓ విద్యారమ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశాలకు ఆయా శాఖల జిల్లా అధికారులు, సభ్యులు తప్పక హాజరుకావాలని కోరారు. ఆర్పీ సిసోడియాతో భేటీ నెల్లూరు(అర్బన్): రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ్ప్రసాద్ సిసోడియా నగరానికి గురువారం చేరుకొని ఓ హోటల్లో బస చేశారు. ఆయనకు కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై చర్చించారు. రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. విజయదీపిక పుస్తకాల అందజేత సంగం: స్థానిక జెడ్పీ హైస్కూల్ను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గురువారం సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధనపై ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు విజయదీపిక పుస్తకాలను అందజేసి, పరీక్షలను విజయవంతంగా రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని కాంక్షించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను ఆమెకు తెలియజేశారు. ఎంపీడీఓ షాలెట్, ఎంఈఓ మల్లయ్య పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలపై శిక్షణ రేపు నెల్లూరు (టౌన్): ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై నగరంలోని డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో చీఫ్, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లకు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నామని ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్లకు కేంద్రానికి సంబంధించి పరీక్ష సామగ్రిని అందజేయనున్నామని వివరించారు. ఏపీపీగా రఫీమాలిక్ నెల్లూరు (లీగల్): నెల్లూరు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు ఏపీపీగా సీనియర్ న్యాయవాది రఫీమాలిక్ను నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం జారీ చేసింది. ఏపీపీగా మూడేళ్లు ఆయన కొనసాగనున్నారు. కాగా ఆయనకు పలువురు అభినందనలను తెలియజేశారు. పెట్రోల్ కల్తీపై ఆందోళన ఉలవపాడు: ఉలవపాడులోని హెచ్పీ అవుట్లెట్లో పెట్రోల్ కల్తీ జరిగిందంటూ వాహనదారులు ఆందోళనను గురువారం చేపట్టారు. కల్తీ పెట్రోల్తో తమ వాహనాలు ఆగిపోయాయని, మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా ఇదే విషయాన్ని నిర్ధారించడంతో సుమారు 15 మంది వచ్చి యజమానులను నిలదీశారు. టెస్టింగ్ చేసే ఫిల్టర్ కాగితాన్ని దాదాపు గంట పాటు ఇవ్వలేదు. వాహనం నుంచి తీసిన పెట్రోల్తో పాటు అక్కడే మరో బాటిల్లో పట్టించారు. పరీక్షించాలని కోరగా, వారు నిరాకరించి ఏదో తప్పు జరిగిందని తెలియజేశారు. వాహనదారుల ఫిర్యాదుతో ఎస్సై అంకమ్మ వచ్చి తనిఖీ చేయాలని నిర్వాహకులను ఆదేశించడంతో పరీక్ష చేశారు. ఫిల్టర్ పేపర్పై పోయగా, మరకలతో తడి ఆరకుండా ఉండటంతో కల్తీ పెట్రోల్గా నిర్ధారించారు. కంపెనీ వారు వచ్చి తనిఖీ చేసి మార్చేంత వరకు బంక్ను మూసేయాలని ఆదేశించారు. ఈలోపు నిర్వాహకులు ప్రాధేయపడి, వారి వాహనాలను బాగు చేయించేలా మాట్లాడుకున్నారు. వీరికి నగదును ఇచ్చారని సమాచారం. కాగా పెట్రోల్ కల్తీపై విచారణ జరపాలంటూ హెచ్పీ సేల్స్ అధికారి, నెల్లూరు డీఎస్ఓకు ఫిర్యాదు చేశారు. -
ఆత్మకూరు అభివృద్ధికి పరితపించి..
ఆత్మకూరు: మేకపాటి గౌతమ్రెడ్డి.. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో పరితపించిన నాయకుడు. రాజకీయాల్లోకి వచ్చిన తొలిరోజుల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. సాధారణంగా రాజకీయాల్లో పార్టీల మధ్య విభేదాలతో ఒకరంటే ఒకరు పడని పరిస్థితులుంటాయి. కానీ దానికి భిన్నంగా గౌతమ్రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసి అజాతశత్రువుగా పేరు పొందారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అటు అధికార, ఇటు ప్రతిపక్ష నాయకుల మన్ననలు పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనేక పనులు గౌతమ్రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో నారంపేట ఇండస్ట్రియల్ పార్కు తీసుకొచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్తో కలిసి హైలెవల్ కెనాల్ రెండో ఫేజ్ పనులు ప్రారంభించారు. ఆత్మకూరు మున్సిపల్ ప్రజలకు సోమశిల జలాలను తాగునీటిగా అందించేందుకు ఎంజీఆర్ – అదానీ వాటర్ ప్లాంట్ను ఒకటో వార్డులో నెలకొల్పారు. దీని ద్వారా సుమారు 13 వార్డుల్లో ప్రజలకు నీరందుతోంది. జాబ్మేళాలు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎంజీఆర్ హెల్ప్లైన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గౌతమ్రెడ్డి 2022 ఫిబ్రవరి 21వ తేదీన ఆకస్మికంగా మృతిచెందారు. ఈ విషయాన్ని నాయకులు, ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. రాజకీయాల్లో అజాతశత్రువు మేకపాటి గౌతమ్రెడ్డి నాడు మంత్రిగా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి నేడు ఆయన వర్ధంతి -
నిధులు కేటాయించాలని డిమాండ్
ఉదయగిరి: వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేసేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని వెలుగొండ సాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో గురువారం వెలిగొండ ప్రాజెక్ట్ సాధన సమితి, రైతు సంఘం నేతల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగు, సాగునీరు లేక ఇప్పటికే ఉదయగిరి ప్రాంత ప్రజలు వలసబాట పడుతుండటంతో పల్లెలు ఖాళీ అవుతున్నాయన్నారు. దీనిని నివారించాలంటే వెలిగొండ ప్రాజెక్ట్ సాగునీరు ఒక్కటే మార్గమన్నారు. సమావేశంలో వెలిగొండ ప్రాజెక్ట్ సాధన సమితి నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్, గాజులపల్లి రామిరెడ్డి, కాకు వెంకటయ్య, కాకు విజయమ్మ, కోడె రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కారు ఢీకొట్టడంతో.. ● యువకుడి మృతి నెల్లూరు సిటీ: కారు ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఆమంచర్ల గ్రామానికి చెందిన రమణయ్య కుమారుడు ఓజిలి కృష్ణ (20) ఓ వైన్షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఆమంచర్లలో సేవా జ్యోతికాలనీ వద్ద కృష్ణ బైక్పై వెళ్తుండగా పొదలకూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పది పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు
● డీఈఓ బాలాజీరావు ఆత్మకూరు: పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రధానోపాధ్యాయులు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సహకరించాలని డీఈఓ ఆర్.బాలాజీరావు అన్నారు. ఆత్మకూరు డివిజన్ స్థాయిలోని 9 మండలాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రెసిడెన్షియల్, కేజీబీవీ, ప్రిన్సిపల్స్తో పట్టణంలోని చైతన్య పాఠశాలలో గురువారం ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలల వారీగా వంద రోజుల ప్రణాళిక అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్లైన్లో పంపాలని చెప్పి రెండు రోజులైనా ఇంకా కొందరు స్పందించ లేదని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్ఎంలను మందలించారు. దీంతో పలువురు అప్పటికప్పుడు ఆ పత్రాలను సమావేశంలో అందజేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. పబ్లిక్ పరీక్షల విధి, విధానాల గురించి, డీసీఈబీ కార్యదర్శి టి.రామ్కుమార్ వివరించారు. ఇంకా నెల్లూరు రూరల్ విద్యాశాఖాధికారి ఆర్.మురళీధర్ మాట్లాడారు. హెచ్ఎంల అసంతృప్తి ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో చిన్న హాల్లో నిర్వహించడంతో డిప్యూటీ డీఈఓ ఎంవీ జానకిరామ్ పట్ల పలువురు హెచ్ఎంలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 9 మండలాలకు చెందిన వారు సుమారు వంద మందికిపైగా పాల్గొన్నారు. హాల్లో కేవలం 80 మంది మాత్రమే కూర్చొన్నారు. దీంతో పలువురు హాలు బయటే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఉద్యోగుల తొలగింపు
ఒకప్పుడు రైతాంగానికి అండగా.. ● నేడు సేవలు అందించలేని స్థితిలో.. ● నష్టాల బాటలో పయనం ● ఉద్యోగులకు జీతాలివ్వడం కష్టమే.. ● అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసిన బీఎంకూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లా కో– ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతలకు సేవలందించలేని స్థితికి చేరుకుంది. ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైంది. ఇంత వరకు పాలకమండలిని ఏర్పాటు చేయలేదు.నెల్లూరు(వీఆర్సీసెంటర్): 1942వ సంవత్సరంలో డీసీఎంఎస్ ఏర్పాటైంది. సబ్సిడీపై రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు పంపిణీ చేయడం నుంచి జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు ఫల సరుకులు, ఎన్నికల సమయంలో స్టేషనరీ, టీటీడీకి కందిపప్పు తదితరాలను అందించింది. ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు, దీపావళి సమయంలో సరసమైన ధరలకు బాణసంచా, చక్కెర, కందిపప్పు లాంటి విక్రయాలు చేసిన చరిత్ర సొసైటీకి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఽపలు ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి తద్వారా వచ్చే కమీషన్తో లాభాలు ఆర్జించింది. జిల్లాలో పలుచోట్ల విలువైన ఆస్తులను కూడా సంపాదించింది. కరోనా సమయంలో కూరగాయలు పంపిణీతోపాటు, జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఆర్థిక సాయం చేసింది. నేడు ఇలా.. ఎంతో ఘన చరిత్ర కలిగిన డీసీఎంఎస్ నేడు ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంటోంది. సొసైటీకి సొంతంగా నగరంలోని స్టోన్హౌస్పేటలో సొంత కార్యాలయ భవనం ఉంది. నవాబుపేటలో ఎకరా స్థలంలో రైస్మిల్లు, ఆత్మకూరులో షాపింగ్ కాంప్లెక్స్లున్నాయి, వీటిలో అత్యధిక విలువైనది రైస్మిల్లు. ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్, గోదాములు కట్టి బాడగకు ఇచ్చి సొసైటీకి ప్రధాన ఆదాయవనరుగా చేయాలని గత చైర్మన్ వీరి చలపతిరావు ప్రతిపాదించి ఆ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తెచ్చారు. దీంతో మిల్లును పడగొట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. సొసైటీ నేడు జనరిక్ ఔషధాల దుకాణం, ఎరువుల విక్రయ కేంద్రాన్ని మాత్రమే నడుపుతోంది. అయితే ఈ రెండూ వ్యాపారాలు నామమాత్రంగా సాగుతున్నాయి. గతంలో లాభాల బాటలో పయనించిన డీసీఎంఎస్ నేడు ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితికి చేరుకుంది. హామాలీలకు రూ.30 లక్షలకు పైగా వరకు బకాయిలు చెల్లించాల్సింది. సవాలక్ష కారణాలు డీసీఎంఎస్కు సుదీర్ఘంగా బీఎంగా వ్యవహిస్తున్న ఓ వ్యక్తి తన రాజకీయ పలుకుబడితో అధికారం చలాయిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలున్నాయి. కొందరు కింది స్థాయి ఉద్యోగులు కూడా అవినీతి బాటపడ్డారని ప్రచారం ఉంది. బీఎం, ఉద్యోగుల మధ్య ఏర్పడిన వివాదాలు, కోర్టు కేసులు లాంటి వ్యవహారాలతో సొసైటీ అభాసుపాలైంది. సంస్థ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అధికారి తన అనుయాయులకు ఉద్యోగాల ఇప్పించడం, ఇతర ఉద్యోగులతో కక్షపూరితంగా వ్యవహరించడంతో ఇరువర్గాల మధ్య కోల్డ్వార్ నడిచింది. వ్యక్తిగత దూషణలు, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్లడంతోనే సంస్థ ప్రతిష్ట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. భారీగా నిధులను దుర్వినియోగం చేయడంతో అంతంతమాత్రంగా ఆదాయంతో ఉన్న డీసీఎంఎస్ నేడు తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. గాడితప్పిన పాలన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు డీసీఎంఎస్కు పాలకమండలిని నియమించలేదు. దీంతో పాలన పూర్తిగా గాడి తప్పింది. డీసీఎంఎస్కు పూర్వ వైభవం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.బీఎంగా వ్యవహరించిన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా అవుట్ సోర్సింగ్ విధానంలో కొందరిని ఉద్యోగులుగా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న జేసీ 12 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధులు నుంచి తొలగించారు. నేడు నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. బీఎం తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ ఆనంద్ నూతన బిజినెస్ మేనేజర్ (బీఎం)గా సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిహిస్తున్న మోహన్కృష్ణను నియమించారు. -
తల్లీకుమారుడిపై హత్యాయత్నం
ఇందుకూరుపేట: గుర్తుతెలియని వ్యక్తులు తల్లీకుమారుడిపై హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటన బుధవారం రాత్రి పున్నూరు రోడ్డు సమీపంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. రావూరు గ్రామానికి చెందిన ముంగర మాలిని తన కుమారుడు వైభవ్రెడ్డితో కలిసి నెల్లూరు నుంచి కారులో ఇంటికి బయలుదేరారు. పున్నూరు రోడ్డు సమీపానికి వచ్చేసరికి వారి కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న వైభవ్ కిందకు దిగి వారిని ప్రశ్నించబోయాడు. ఇంతలో ఏడుగురు మంకీ క్యాపులు ధరించి కత్తులతో వైభవ్రెడ్డి పైకి వచ్చారు. అప్రమత్తమైన అతను ఒక్కసారిగా కారులోకి ఎక్కి అద్దాలు వేశాడు. ఆ వ్యక్తులు కత్తులతో అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఈలోగా అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని చూసి పరారయ్యారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మాలిని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై నాగార్జున్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ సుధాకర్రెడ్డి గురువారం బాధితులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. బాధితులకు కొందరిపై అనుమానం ఉండటంతో వారి వివరాలను పోలీసులకు తెలియజేశారు. నకిలీ బంగారం కేసులో దర్యాప్తు ముమ్మరం ఉదయగిరి: నకిలీ బంగారం ఇచ్చిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గుర్తుతెలియని మహిళలు ఉదయగిరిలోని ఓ బంగారు దుకాణానికి వెళ్లారు. నకిలీ బంగారం ఇచ్చి, అసలు బంగారు చైన్తోపాటు రూ.5 వేలు నగదు తీసుకుని బుధవారం ఉడాయించడంతో యజమాని సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఎస్సై గురువారం దుకాణాన్ని సందర్శించి సీసీ పుటేజిలను పరిశీలించారు. కేసుకు సంబంధించి కొంత పురోగతి సాధించామని, త్వరలోనే మహిళలను అరెస్ట్ చేస్తామని తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి వెంకటాచలం: విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు షాక్కు గురై శేషాద్రి (25) అనే యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పూడిపర్తి గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద బుధవారం జరగ్గా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన దార శేషాద్రి కరెంట్ పని నిమిత్తం పూడిపర్తి గ్రామానికి బుధవారం వచ్చాడు. పొలాల వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తుండగా షాక్కు గురై కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం నెల్లూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ విషయంపై మృతుడి తండ్రి వెంకటరత్నం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.టీడీపీలో ఫ్లెక్సీల కలకలం ఉదయగిరి: ఉదయగిరిలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొంతభాగాన్ని బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. ఆధిపత్యం కోసం కొంతకాలంగా రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ముఖ్య అనుచరులు రామయ్య, లక్ష్మయ్యలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో వెంకటరెడ్డితోపాటు అనుచరుల ఫొటోలను చింపేయడంతో టీడీపీలో కలకలం రేగింది. సొంత పార్టీలోని ఓ వర్గం వారు ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెబుతున్నారు. -
నృసింహుని హుండీల రాబడి రూ.93 లక్షలు
రాపూరు: పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని హుండీల కానుకలను శ్రీవారి క్రేన్ మండపంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా డీసీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ 77 రోజులకు గానూ రూ.93,28,696 వచ్చిందన్నారు. బంగారం 220 గ్రాములు, వెండి 3.50 కేజీలు వచ్చినట్లు చెప్పారు. పలు దేశాల విదేశీ నాణేలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, జిల్లా దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం వెంకటాచలం: గుర్తుతెలియని మహిళ మృతదేహం సర్వేపల్లి కాలువలో కొట్టుకుపోతుండగా మండలంలోని గొలగమూడి సమీపంలో స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. వివరాలు.. గ్రామానికి చెందిన కొందరు రైతులు గేదెల కోసం పొలాల వద్దకు వెళ్లగా సర్వేపల్లి కాలువలో సుమారు 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకుపోతుండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి వచ్చే సరికి చీకటి పడటంతో మృతదేహం ఆచూకీ తెలియలేదు. మహిళ ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, లేక ఆత్మహత్య చేసుకుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు
నెల్లూరు(బారకాసు): అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మండిపడ్డారు. డైకస్రోడ్డులోని ఎన్జేఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు కింద తీర్చిదిద్దడంతో బడిబాట పట్టే పిల్లల సంఖ్యా పెరిగిందని చెప్పారు. వీటిని చూసి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు డేటా అవసరమంటూ ఆ విషయాన్ని దాటేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వృద్ధి రేటు 15 శాతానికి చేరితేనే అన్ని పథకాలను అమలు చేస్తామంటున్నారని, అవి అందే పరిస్థితి లేదనే విషయం దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. పిల్లల చదువుకు గండికొట్టడం సరికాదని హితవు పలికారు. ఫీజు రీయింబర్స్మెంట్ను ఎందుకు ఇవ్వాలనే ధోరణిలో మంత్రి లోకేశ్ ఉన్నారన్నారు. 2019 నాటికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన దాదాపు రూ.రెండు వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చెల్లించిందని తెలిపారు. పాఠశాల.. కళాశాల విద్యను అనుసంధానం చేసేందుకు బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ను ఏర్పాటు చేశారని, ఈ కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. విద్యారంగాన్ని ప్రస్తుతం భ్రష్టు పట్టిస్తున్నారని, విద్యార్థుల్లేకుండా విజన్ – 2047ను ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నాలుగు విడతల ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లించాల్సి ఉందని, ఒక్క విడతా.. అదీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు. ప్రైవేట్ రంగానికి లబ్ధి చేకూరుస్తారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ పనినీ చంద్రబాబు చేయరని ధ్వజమెత్తారు. హెరిటేజ్ లాభాల్లో ఉండగా, ప్రభుత్వ రంగానికి చెందిన విజయ డెయిరీ నష్టాల్లో ఉందనే అంశాన్ని దీనికి ఉదాహరణగా చూపారు. కూటమి ప్రభుత్వంపై మండిపడిన నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి -
ఉపాధి పథకం అధికారులకు ప్రజాప్రతినిధి ఆదేశాలు
ఉపాధి హామీ పథకం ‘పచ్చ’ మయం ఉపాధి హామీ పథకం అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనులు జరుగుతున్నాయి. ఆ పార్టీ కార్యకర్తలే మేట్లు, ఫీల్డ్ అసిసెంట్లుగా వ్యవహరిస్తున్నారు. కూలీల కడుపులు కొట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. వీరి అక్రమాలకు అడ్డుగా ఉన్నారని, తమకు అనుకూలంగా లేని ఫీల్డ్ అసిసెంట్లను తొలగించి టీడీపీ కార్యకర్తలను పెట్టి పనులు జరుపుకుంటున్నారు. తమ ఉద్యోగాలు తమకు కావాలని పోరాడుతున్న వారిపై కేసులు పెట్టమని, భారీగా రికవరీలు చేయమని సిఫార్సులు చేస్తూ మరింతగా వేధిస్తున్నారు. ఈ రకంగా వేధింపులు బెదిరింపుల్లో కావలి ప్రజాప్రతినిధి ప్రథమ స్థానంలో ఉన్నారని జిల్లా ఉపాధి హామీ కార్యాలయంలో చర్చ నడుస్తోంది. ‘నేను చెప్పినట్లు చేస్తారా.. మిమ్మల్ని ఊడగొట్టించమంటారా? అంటూ తమనే బెదిరిస్తూ, ఒత్తిడి పెంచుతున్నట్లు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఇన్సులిన్కూ కటకటే..!
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని కూటమి ప్రభుత్వం తరచూ ఊదరగొడుతున్నా, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అదంతా ఒట్టిదేనని తేలిపోతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఆధారపడే ఇన్సులిన్ వైల్స్ సరఫరాలో నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తోంది. పీహెచ్సీలకు ఐదు నెలలుగా వీటి సరఫరా నిలిచిపోయిందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని సిబ్బందే నిర్ధారిస్తుండటం గమనార్హం. ఆత్మకూరు: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తోంది. పెద్దాస్పత్రి, పీహెచ్సీలకు ఇన్సులిన్ వైల్స్ ఐదు నెలలుగా సరఫరా కావడంలేదు. వాస్తవానికి షుగర్ వ్యాధి తీవ్రమైతే దీన్ని వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి సంబంధించిన మందులు ఖరీదు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వాస్పత్రులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. దీంతో జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లోని ఆస్పత్రులకు అన్ని రకాల మందులు సక్రమంగా సరఫరా అయ్యేవి. ఇన్సులిన్ వైల్స్ తగినంత అందుబాటులో ఉండేవి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో అర్బన్ హెల్త్ కేంద్రాలు 25, పీహెచ్సీలు 52 ఉన్నాయి. నెల్లూరులో జీజీహెచ్, ఆత్మకూరులో ప్రభుత్వ జిల్లా వైద్య కేంద్రం, కావలి, కందుకూరులో ప్రాంతీయ వైద్య కేంద్రాలు, ఉదయగిరి, వింజమూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు, కోవూరు, రాపూరు ప్రాంతాల్లో సీహెచ్సీలున్నాయి. వీటికి మందులు ఏపీఎంఐడీఎస్ నుంచి సరఫరా అవ్వాలి. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్కు చేరితే అక్కడి నుంచి మండలాలకు సరఫరా చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో పీహెచ్సీలకు మందుల సరఫరాను తగ్గించారని సమాచారం. మందుల సరఫరా ఇలా.. వివిధ రోగాలకు సంబంధించిన మందులను ఏడాదిలో నాలుగుసార్లు సరఫరా చేస్తారు. పేషెంట్ల తాకిడిని బట్టి ఒక్కో పీహెచ్సీకి రూ.50 వేల నుంచి రూ.3.5 లక్షల విలువగల 84 రకాల నుంచి 172 రకాల మందులు సరఫరా అవుతాయి. ఏరియా, జీజీహెచ్ లాంటి కేంద్రాలకు రూ.15 లక్షల విలువగల మందులను సరఫరా చేస్తారు. ఆన్లైన్లోనే ఇండెంట్ ప్రక్రియ ఆయా పీహెచ్సీల పరిధిలోని షుగర్ పేషెంట్ల వివరాల మేరకు.. గతంలో పంపిణీ చేసిన షుగర్ వైల్స్ను దృష్టిలో ఉంచుకొని కావాల్సిన మేరకు ఇండెంట్ను ఫార్మసిస్ట్లు పెడతారు. ఇలా ఒక్కో పీహెచ్సీ కేంద్రంలో 300 నుంచి 500 వరకు షుగర్ వైల్స్ను ఇండెంట్లో నమోదు చేస్తారు. ఈ వ్యవహారమంతా ఆన్లైన్ ద్వారానే జరగాల్సి ఉంది. ఒక్కో వైల్లో 10 ఎమ్మెల్ ఇన్సులిన్ ఉంటుంది. వైల్స్లోనూ 30 / 70.. 40 ఐయూ ఇలా రెండు రకాలుంటాయి. అయితే ఇండెంట్లో ఇన్సులిన్ అనే కాలమ్ను తాజాగా ఎత్తేశారని సమాచారం. దీంతో రానున్న త్రైమాసికంలో దీని సరఫరా నిలిచిపోనుందని తెలుస్తోంది. కొన్ని పీహెచ్సీల్లో వైల్స్ పూర్తవ్వడంతో సమీప కేంద్రాల నుంచి తెచ్చుకొని అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిబ్బంది పేర్కొంటున్నారు. కొనుగోలు భారం పీహెచ్సీల్లో వైల్స్ కొరత కారణంగా రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇన్సులిన్ 10 ఎమ్మెల్ను రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. వీటి సరఫరాను పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై ఎడీఎంహెచ్ఓ ఖాదర్వలీని సంప్రదించగా, ఫార్మసిస్ట్లు నమోదు చేసే ఇండెంట్ మేరకు సరఫరా అవుతోందని చెప్పారు. ఈ త్రైమాసికంలో ఇన్సులిన్ సరఫరా కాని విషయాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని బదులిచ్చారు. పీహెచ్సీలకు ఐదు నెలలుగా నిలిచిన సరఫరా ఆన్లైన్లో ఇండెంట్ కాలమే ఎత్తివేత ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్గా కొనుగోలు చేసుకోవచ్చు ఆస్పత్రిలో ఇన్సులిన్ వైల్స్ తగినంత ఉన్నాయి. అవకాశం బట్టి ప్రైవేట్గా కొనుగోలు చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు ఆ పరిస్థితే రాలేదు. ఫార్మసిస్ట్లు నమోదు చేసే ఆన్లైన్ కాలమ్ను పరిశీలిస్తా. పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూస్తా. – శేషారత్నం, ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
నూతన సాంకేతికతను ప్రోత్సహించాలి
మాట్లాడుతున్న సునీత వెంకటాచలం: ఆర్థిక స్థిరత్వం, గ్రామీణ స్వయంప్రతిపత్తి కోసం నూతన సాంకేతికతలు, వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు కోరారు. సుస్థిర జీవనోపాధులవైపు నూతన మార్గదర్శనలు, గ్రామీణ వృత్తుల విభజన అనే అంశంపై కాకుటూరు సమీపంలోని వర్సిటీలో జాతీయ సదస్సును బుధవారం నిర్వహించారు. గూగుల్ మీట్ ద్వారా వర్చువల్ విధానంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి రిజిస్ట్రార్ సునీత మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి కోసం కొత్త అవకాశాలను గుర్తించి, వాటి అమలు దిశగా ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా మారనుందని చెప్పారు. హైదరాబాద్కు చెందిన ఆంకాలజీ ప్రొఫెసర్ రఘునాథరావు, డాక్టర్ మహేష్ పవన్, వీఎస్యూ ప్రిన్సిపల్ విజయ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిపై హత్యాయత్నం
నెల్లూరు(క్రైమ్): పాతకక్షలను మనస్సులో పెట్టుకొని వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని గంటల వ్యవధిలోనే నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. రాయపుపాళెంలో చికెన్ పకోడా దుకాణాన్ని నిర్వహిస్తున్న ఏసీనగర్కు చెందిన పఠాన్ మౌలాలీ వద్దకు అదే ప్రాంతానికి చెందిన గంగాధర్ 20 రోజుల క్రితం వెళ్లారు. చికెన్ పకోడా ఇవ్వాలని కోరగా, అందజేయడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన గంగాధర్.. దుకాణంలో ఉన్న చికెన్ పకోడాను కిందపడేశారు. దీంతో వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాయపుపాళెం – రామచంద్రాపురం జంక్షన్లో గంగాధర్పై మౌలాలీ కత్తితో మంగళవారం రాత్రి దాడి చేసి గాయపర్చారు. ఈ మేరకు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం ఎస్సై రెహమాన్ గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంతినగర్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం కావలి: పట్టణంలోని ముసునూరులో గల ఓ ఇంట్లో ఏసీ షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం మంగళవారం రాత్రి సంభవించింది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. మంటలతో ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పింది. 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.ఐదు లక్షల నగదు కాలిబూడిదైందని బాధితుడు నరసయ్య వాపోయారు. బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఉపాధి హామీ వ్యవస్థను దెబ్బతీయొద్దు నెల్లూరు (పొగతోట): క్షేత్రస్థాయిలో వివిధ రకాల ఒత్తిళ్లు, బెదిరింపులు ఉండొచ్చని, దీనికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వ్యవస్థను దెబ్బతీయొద్దని డ్వామా పీడీ గంగాభవాని పేర్కొన్నారు. నగరంలోని డ్వామా కార్యాలయంలో క్లస్టర్ ఏపీడీలు, ఏపీఓలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒత్తిళ్లను అధిగమించి పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అందరూ అనుభవమున్న అధికారులేనని, సమస్యలను అధిగమించి పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలని పేర్కొన్నారు. పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను లక్షకు పెంచాలని ఆదేశించారు. ఆర్బీకేలో జేసీ పరిశీలన బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని రేబాలలో గల రైతు భరోసా కేంద్రాన్ని జేసీ కార్తీక్ బుధవారం పరిశీలించారు. పరికరాలను పరిశీలించి రైతులతో ముచ్చటించి వారి సమస్యలను ఆరాతీశారు. ధాన్యం మద్దతు ధరతో పాటు తేమ శాతంలో సడలింపులిచ్చి గోడౌన్లను ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రైతులు తెలియజేసిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాతకక్షలతో మహిళ ఇంటికి నిప్పు పొదలకూరు: పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని పూరింటికి ఓ వ్యక్తి నిప్పుపెట్టిన ఘటన మండలంలోని బిరదవోలులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలో పూరింట్లో నివాసం ఉంటున్న కై తేపల్లి లక్ష్మమ్మకు అదే గ్రామానికి చెందిన రంగయ్య కుటుంబానికి మధ్య విభేదాలున్నాయి. ఈ తరుణంలో ల క్ష్మ మ్మ తన కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండ గా, రంగయ్య నిప్పు పెట్టారు. మంటలు వ్యా పించడంతో లక్ష్మమ్మ, ఆమె కుమార్తె బయటకు పరుగులు తీశారు. గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. పెన్షనర్ల సర్వసభ్య సమావేశం నేడు నెల్లూరు(అర్బన్): పురమందిర ప్రాంగణంలోని వర్ధమాన సమాజ మందిరంలో ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నామని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, వెంకయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షనర్ల పెండింగ్ సమస్యలు, డీఆర్ బకాయిలు తదితరాలపై చర్చించనున్నామని, సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు. -
మితిమీరుతున్న టీడీపీ దౌర్జన్యాలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు మితిమీరిపోయాయనే విషయాన్ని ఎక్కడికెళ్లినా ప్రజలు తెలియజేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల వద్ద పొలాలను కొనుగోలు చేసి జగనన్న కాలనీలను నిర్మిస్తే, టీడీపీ మూకలు దౌర్జన్యం చేసి ఆక్రమిస్తున్నారని బాధితులు వాపోతున్నారని తెలిపారు. ఆక్రమించిన వారు ఇల్లు కట్టుకున్నా, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అసలైన లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించడంలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఎదురయ్యే ప్రతి సమస్యపై పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి స్పందించి ప్రజలకు అండగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పేదలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘన నివాళి కల్యాణపురానికి చెందిన పార్టీ నేత లక్ష్మణరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. పట్టణంలోని యాదవవీధికి చెందిన నాయీబ్రాహ్మణ సేవా సంఘ నాయకుడు బెల్లకొండ కాళిదాస్ తల్లి ఇటీవల మృతి చెందడంతో పరామర్శించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు నరసాపురం సుబ్బయ్య ఇటీవల మృతి చెందడంతో నివా ళులర్పించారు. బిరదవోలు ఎంపీటీసీ రావుల దశరథరామయ్యగౌడ్, వెన్నపూస దయాకర్రెడ్డి, కృష్ణారెడ్డి, యనాదిరెడ్డి, ఆకుల గంగిరెడ్డి, మాలపాటి రమణారెడ్డి, లక్ష్మయ్య, మద్ది రెడ్డి రమణారెడ్డి, బెల్లంకొండ ప్రసాద్, తుమ్మ ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025 – 26 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి నుంచి ఐఐటీ, నీట్ అకాడమీలో ప్రవేశానికి బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త పద్మజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు సెప్టెంబర్ ఒకటి, 2012 నుంచి ఆగస్ట్ 31, 2016 మధ్య.. బీసీ, ఓసీ విద్యార్థినులు సెప్టెంబర్ ఒకటి, 2014 నుంచి ఆగస్ట్ 31, 2016 మధ్య జన్మించి ఉండాలని చెప్పారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోరే వారు 2024 – 25 విద్యా సంవత్సరంలో పదో తరగతిని రెగ్యులర్ ప్రాతిపదికన చదివి ఉండాలని వివరించారు. ఈ ఏడాది ఆగస్ట్ 31 నాటికి 17 ఏళ్లు మించి ఉండకూడదని తెలిపారు. apbragcet.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల ఆరో తేదీ సాయంత్రం ఐదు తర్వాత దరఖాస్తులను స్వీకరించబోమన్నారు. వివరాలకు 97045 50083, 97045 50096 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
కూటమి దెబ్బకు కదిలిన కమిషనర్ కూసాలు
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ఆకస్మికంగా బదిలీ కావడం స్థానికంగా చర్చకు దారి తీసింది. మరో ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఆయన్ను తప్పించడం వెనుక అధికార పార్టీ రాజకీయ కుట్రలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న పట్టణాని కి ఆక్రమణలు శాపం కాకూడదని భావించిన కమిషనర్ ప్రధాన రహదారుల్లో వాటిని తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ఆక్రమణలు తొలగించకుండా అడ్డుకునేందుకే ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటరీగా వ్యవహరిస్తున్న వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పావులు కదిపి కమిషనర్ కూసాలు కదిలించారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తామనుకున్న లక్ష్యంలో భాగంగా ఆయన్ను బదిలీ చేశామని జబ్బలు చరుచుకున్నా.. ఇది బుచ్చి పట్టణానికి భవిష్యత్లో పెను శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. మేజర్ పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీ హోదా సంతరించుకున్న బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రధాన రహదారులు ఇప్పటికీ ఇరుకుగా ఉన్నాయి. భవిష్యత్లో గ్రేడ్–1 మున్సిపాలిటీ అవతరించే స్థాయిలో పట్టణం విస్తరిస్తోంది. ఇదే సమయంలో రహదారులు విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఆక్రమణలు తొలగిస్తే.. భవిష్యత్ కాలంలో పట్టణం అభివృద్ధి దిశగా అడుగులు పడుతాయి. లేదంటే ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా మారుతుంది. బుచ్చి అభివృద్ధిలో తనదైన మార్కు చూపించిన కమిషనర్ ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకే ఆకస్మిక బదిలీ చక్రం తిప్పిన రియల్ ఎస్టేట్, వ్యాపారులు పట్టణానికి శాపంగా మారనున్న ఈ పరిణామం -
కోలాహలం.. ఛత్రపతి జయంత్యుత్సవం
నెల్లూరు (బృందావనం): దేశభక్తిని చాటుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నగరంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవ ర్యాలీ బుధవారం కోలాహలంగా సాగింది. శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 496వ జయంతిని పురస్కరించుకుని హిందూ ధార్మిక సంస్థలు, పార్టీలకతీతంగా పలువురు పాల్గొన్నారు. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న శివాజీ జయంతి వేడుకలకు ప్రజలు భారీగా తరలిరావడంతో నగరంలో కోలాహల వాతావరణం కనిపించింది. వక్తలు మాట్లాడుతూ భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ అని, దేశానికి ఆయన వరమని, ఆయన త్యాగనిరతిని దేశం ఎన్నటికీ మరువదన్నారు. యువత ఛత్రపతి భావజాలాన్ని, శౌర్యాన్ని నింపుకుని ముందుకు సాగితే దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. యువతకు ఛత్రపతి మార్గదర్శకుడన్నారు. దేశం కోసం, హైందవ ధర్మం కోసం శివాజీ మహరాజ్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కోలాహలంగా ప్రదర్శన ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కాకు మురళీరెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంత్యుత్సవ ర్యాలీ స్థానిక మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్న వైఎంసీఏ మైదానం నుంచి బయలుదేరి వీఆర్సీ, గాంధీబొమ్మ, శివాజీ సెంటర్, ఏసీ సెంటర్, నర్తకి సెంటర్, కనకమహల్, కొత్తహాల్ సెంటర్, సండే మార్కెట్ సెంటర్ మీదుగా వైఎంసీఏ మైదానానికి చేరింది. అశ్వంపై అధిరోహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
జీబీఎస్ కలకలం
● అరవపాళెంలోముమ్మరంగా పారిశుధ్య పనులు సంగం: మండలంలోని అరవపాళెంలో గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జీబీఎస్ లక్షణాలతో మంగళవారం నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. అతనికి అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ సర్పంచ్, అధికారులు అరవపాళెంతోపాటు పుట్టువారిగుంట గ్రామాల్లో బుధవారం ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే, శానిటేషన్, వాటర్ ట్యాంక్ క్లోరినేషన్, వాటర్ టెస్టింగ్లను నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాసులరెడ్డి ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. జ్వరం, దగ్గు, వాంతులు, విరోచనాలు, జలుబు ఈ వ్యాధి లక్షణాలని, వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత తిమ్ముర్లు, నరాల బలహీనత, కండరాల నొప్పులు వస్తాయన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రాణాపాయం ఉంటుందని, ఈ వ్యాధి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని డాక్టర్ అశోక్ తెలిపారు. -
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు వేధింపులు
కావలి: ఉపాధి హామీ పథకంలో ఏన్నో ఏళ్లుగా చిరు ఉద్యోగాలతో కుటుంబాలను పోషించుకుంటున్న ఎఫ్ఏలపై కూటమి నేతల వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఆయా స్థానాల్లో టీడీపీ నేతలను నియమించేందుకు అధికారులు నోటి మాటగా అధికారికంగా ఫైల్ను తయారు చేసి ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించారు. కోర్టు ఆదేశాలంటూ పోరాడుతున్న ఎఫ్ఏలపై అవినీతి ఆరోపణలతో రికవరీలతో ఇబ్బందులు పెడుతున్నారు. అందులో భాగంగానే కావలి మండలంలో సర్వాయపాళెం, రుద్రకోట, అడవిలక్ష్మీపురం, తుమ్మలపెంట, పెద్దపట్టపుపాళెం ఐదుగురు ఎఫ్ఏలను తొలగించారు. ఇక ఆముదాలదిన్నె ఎఫ్ఏ విషయంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని తమ వాడని చెప్పడంతో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ ఇచ్చి సరిపెట్టారు. తొలగించిన ఎఫ్ఏలు అందరూ కూడా 15, 10 ఏళ్ల నుంచి నెలకు రూ.10 వేలు మాత్రమే జీతంగా తీసుకుంటూ పని చేస్తున్నారు. వీరిని తొలగించడానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ గంగాభవాని మంగళవారం ఏకంగా కావలి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరు, పనుల కొలతల్లో తేడాలకు సంబంధించి రూ.11,37,684 అవినీతి జరిగిందని ప్రకటించారు. జరిగిన నష్టం నగదును తొలగించిన ఎఫ్ఏల నుంచి వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ ప్రకటించారు. సోషల్ ఆడిట్లో రికవరీలు పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. రూ.లక్షల్లో రికవరీలు ఉన్న సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆ ప్రకారం అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రికవరీలకు సంబంధించి ఎఫ్ఏలు తమ వద్ద ఉన్న వివరాలను డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్, ఉన్నతాధికారులకు చూపించి తగ్గించుకునే అవకాశం ఉంది. – గంగాభవాని, డ్వామా పీడీ పరిశీలించి చర్యలు తీసుకుంటాం -
సమస్యాత్మకంగా మారిన ఆక్రమణలు
బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్ నుంచి చెన్నూరు రోడ్డు వరకు ఆక్రమణలు అత్యంత సమస్యాత్మకంగా మారాయి. ఈ క్రమంలో ఇటీవల కమిషనర్ చంద్రశేఖరరెడ్డి పట్టణాభివృద్ధిని కాంక్షించి రోడ్డును ఆక్రమించిన వ్యాపారులను తొలగించేందుకు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త ఇచ్చిన నోటీసులను కొంత మంది రియల్టర్లకు కమిషర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే కమిషనర్ బదిలీ అంటూ ప్రచారం జరిగినప్పటికీ పలు ఆక్రమణల తొలగింపు ప్రక్రి య కొనసాగింది. నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్కు వెళ్లే రోడ్డులో నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించి కొందరు వ్యాపారులు పక్కాగా షాపులు నిర్మించి నిర్వహిస్తున్నారు. వాటిని కూడా తొలగిస్తే చెన్నూరు రోడ్డు నుంచి మార్కెట్కు, బైపాస్ రోడ్డు వరకు రహదారి విశాలంగా ఉంటుందనే ఆలోచనతో కమిషనర్ కొంత మేర కొలతలు కూడా తీశారు. ఆ స్థలం నీటిపారుదల శాఖకు చెందినది కావడంతో ఆ శాఖ జిల్లా ఎస్ఈ, ఈఈలకు కమిషనర్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.కోట్ల విలువైన ఆ స్థలాలను వదులు కునేందుకు ఇష్టపడని వ్యాపారులు పైరవీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆకస్మికంగా కమిషనర్ చంద్రశేఖర్రెడ్డిని రాష్ట్ర పురపాలక శాఖా కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు అందాయి. ఆ స్థానంలో నెల్లూరు కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డబ్బుగుంట బాలకృష్టను నియమిస్తూ ఆదేశాలు సైతం వచ్చా యి. ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులను బదిలీలు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఆయన బదిలీ జరగడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఆయన బదిలీ వెనుక ఎమ్మెల్యే కోటరీ శక్తులు బలంగా పని చేసినట్లు సమాచారం. కమిషనర్ బదిలీ విషయం తెలుసుకుని కలకలం రేగడంతో, నష్ట నివారణ చర్యల్లో భాగంగా బుధవారం బుచ్చిరెడ్డిపాళెం వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రోడ్డు మార్జిన్ నుంచి తొలగించిన చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చారు. ఆక్రమణలను తొలగింపును అడ్డుకునేందుకు చర్యలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు కానీ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ అభివృద్ధికి ఆదిలోనే హంసపాదు పడినట్లుగా అయింది. -
పకడ్బందీగా రీసర్వే చేయండి
సంగం: మండలంలోని కొరిమెర్ల కండ్రికలో జరుగుతున్న రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ కె.కార్తీక్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. బుధవారం రీసర్వే జరుగుతున్న తీరును పరిశీలించి, తహసీల్దార్ సోమ్లానాయక్ను అడిగి తెలుసుకున్నారు. ఆ భూములకు సంబంధించిన రైతులతో మాట్లాడారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 35 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. భూములకు సంబంధించిన పట్టాదారులకు నోటీసులు అందజేసి రీసర్వే ప్రక్రియను జరపాలన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావని, డీఎస్ఎల్ఓ నాగశేఖర్, సర్వేయర్ శివరంజని, ఆర్ఐ సల్మా, వీఆర్ఓలు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓగా మల్లికార్జునరెడ్డి నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఐటీడీఏ పీఓగా మల్లికార్జునరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖలో జాయింట్ డైరెక్టర్గా పని చేస్తున్న ఆయనకు అడిషనల్ డైరెక్టర్గా తాత్కాలిక పదోన్నతిని కల్పిస్తూ నెల్లూరు ఐటీడీఏ పీఓగా ఉత్తర్వులను ఇచ్చారు. నేడు లంకా దినకర్ రాక నెల్లూరు(అర్బన్): ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ గురువారం రాత్రి నెల్లూరుకు వస్తారని జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ డీడీ సదారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ తేదీ జిల్లా అధికారులతో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారన్నారు. డాక్టర్ విజయకుమార్ రాక రేపు మాల సంక్షేమ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ ఈ నెల 21న నెల్లూరుకు చేరుకుని రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22వ తేదీ సంబంధితశాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం కలెక్టర్తో సమావేశమవుతారు. ఆర్పీ సిసోడియా రాక రేపు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా శుక్రవారం నెల్లూరుకు రానున్నారు. అధికారులతో రెవెన్యూ సమస్యలపై చర్చిస్తారు. మితిమీరిన టీడీపీ నేతల అరాచకాలు ● ప్రజా సంక్షేమం గాలికి ● అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మేస్తున్నారు ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ధ్వజం నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతోందని విమర్శించారు. నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోలార్ విద్యుత్ పేరుతో ఒప్పందం చేసుకుని రైతుల నుంచి తీసుకున్న భూములను అదానీకి కట్టబెట్టిందని, ఇది చాలదన్నట్టుగా యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని యూనిట్ విద్యుత్ను రూ.4.23 కొనేందుకు సిద్ధపడిందన్నారు. ఈ ఒప్పందంలో భారీగా ముడుపులు దండుకున్నారని ఆరోపించారు. దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా చూస్తూ హిందూ మతాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని రిమ్స్లో రేడియోలజీ విభాగంలో మతం ప్రాదిపదికన నియామకాలు జరపాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన కారణంగా 400 మంది ఉద్యోగులు వారి కుటుంబాలు వీధిన పడ్డాయని, వారికి చెల్లించాల్సిన రూ.23 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్లను టీడీపీ నేతలు నరికి విక్రయాలు సాగిస్తున్నా.. అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్లను నరికిన విషయమై తహసీల్దార్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకులపై దాడి చేసిన టీడీపీ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్రావు, అజయ్కుమార్, వెంగయ్య, మంగలి పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజన పథకంపై ఎంఈఓ విచారణ
● హెచ్ఎంకు మెమో, నిర్వాహకురాలికి నోటీసు ఆత్మకూరు: పట్టణంలోని ఏసీఎస్ఆర్కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని ఫిర్యాదులు రావడం, పత్రికల్లో కథనాలు రావడంతో జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఎంఈఓ జ్యోతి మంగళవారం పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, విచారణ చేపట్టారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఎంఈఓ ఆహార పదార్థాలను రుచి చూశారు. విద్యార్థులను భోజన నాణ్యతపై నిర్భయంగా చెప్పాలని కోరడంతో కొందరు ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చారు. హెచ్ఎం హజరత్తయ్య, ఉపాధ్యాయురాలు కె.సుజాతను ఎంఈఓ విచారించారు. పాఠశాల విద్యా కమిటీ సభ్యులను, కొందరు విద్యార్థుల తల్లులతోనూ ఎంఈఓ జ్యోతి విడివిడిగా మాట్లాడారు. పథకం నిర్వాహకురాలికి నోటీసు ఇచ్చినట్లు మరోసారి ఇలా జరగకుండా విద్యార్థులకు చక్కని భోజనం పెట్టాలని హెచ్చరించినట్లు తెలిపారు. హెచ్ఎంకు మెమో ఇచ్చినట్లు ఎంఈఓ జ్యోతి వివరించారు. ఈ మేరకు నివేదికను డీఈఓకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. -
వీఎస్యూ వైస్ చాన్సలర్గా అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ నూతన వైస్ చాన్సలర్గా అల్లం శ్రీనివాసరావు మంగళవారం నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్ పలు యూనివర్సిటీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు మూడేళ్ల పాటు వీఎస్యూ వైస్ చాన్సలర్గా కొనసాగుతారు. ఆడిట్పై ప్రత్యేక దృష్టి ● ఎస్హెచ్జీలు ఆర్థిక ప్రగతి సాధించాలి ● డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి నెల్లూరు (పొగతోట): జిల్లా, మండల సమాఖ్యలు ఇంటర్నల్ ఆడిట్ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఖర్చులు, ఆదాయాల విషయాల్లో లోటుపాట్లు ఉండకూడదని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. మంగళవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య సమావేశంలో పీడీ మాట్లాడారు. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఉల్లాస్, సూర్యఘర్ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు కుటీర పరిశ్రమల ద్వారా చేస్తున్న ఉత్పత్తులను మార్కెటింగ్ కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఉత్పత్తులకు సంబంధించి ఆన్లైన్లో మార్కెటింగ్ జరిగేలా విక్రయాలపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డీపీఎం కామాక్షి, రవికుమార్, సూరిబాబు, వెంకటేశ్వర్లు, జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి వరికుంటపాడు: మండలంలోని తోటలచెరువుపల్లెలో వైఎస్సార్సీపీ కార్యకర్త పులి వెంకటప్రసాద్పై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మౌలాలి, అతని కుమారుడు మరో ముగ్గురు కలిసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం మేరకు.. వెంకటప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ విషయాలు మాట్లాడుకుంటుండగా దొడ్ల మౌలాలి మద్యం తాగి వచ్చి నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ఉదయం ప్రసాద్ బస్టాండ్ సెంటరుకు వెళ్లి తిరిగి వస్తుండగా మౌలాలి మరి కొంత మందితో కలిసి మరోసారి దాడి చేసి గాయపరిచారు. రాత్రి ఫిర్యాదు చేసేందుకు వరికుంటపాడు స్టేషన్కు వెళ్లగా పోలీసులు తీసుకోలేదని, మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఎస్ఐ రఘునాథ్ను వివరణ కోరగా ప్రసాద్ కుటుంబ సభ్యులు టీడీపీని విమర్శిస్తూ తనపై దాడి చేశారని మౌలాలి ఫిర్యాదు చేేశాడన్నారు. మంగళవారం ఉదయం ప్రసాద్పై మౌలాలి మరికొంత మంది తనపై దాడి చేశారని ప్రసాద్ ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు ఇద్దరి ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రైతులకు భూపరిహారం పెంచాలి
నెల్లూరు (అర్బన్): భారతమాల, సాగరమాల జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం కమిటీల నాయకులు కలెక్టర్ను కోరారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలోని ఏడు మండలాల్లో 108 కి.మీ. పరిధిలో సాగరమాల, 30 కి.మీ. జాతీయ రహదారులు నిర్మిస్తున్నారన్నారు. 35 గ్రామాల్లో 900 ఎకరాలు భూసేకరణ జరుగుతుందన్నారు. భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం నామమాత్రంగా చెల్లిస్తున్నారన్నారు. గత కలెక్టర్ చెప్పిన ప్రకారం రైతులు ఆర్బిట్రేషన్ వేసినప్పటికీ ఇప్పటికీ విచారణ జరగలేదన్నారు. ఇకనైనా విచారణ జరిపి చట్ట ప్రకారం రైతులకు భూ పరిహారం పెంచాలని కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య మాట్లాడుతూ తోటపల్లిగూడూరు మండలం పేడూరులో బీపీసీఎల్ పైపు లైను నిర్మాణం కోసం కోత దశకు వస్తున్న పంటలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా ఆ పనులు ఆపి పంట కోతలు పూర్తయ్యాక పైపులైను నిర్మాణం చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పులిగండ్ల శ్రీరాములు, సంఘాల నాయకులు వెంకమరాజు, రాజా, పోతుగుంట కృష్ణయ్య, ఆదిశేషయ్య, వంశీకృష్ణ, లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు. -
రెడ్క్రాస్లో కలెక్టర్ తీరు ఆక్షేపణీయం
నెల్లూరు(అర్బన్): సేవకు మారు పేరుగా ఉన్న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ పాలక మండలి వ్యవహారంలో కలెక్టర్ ఆనంద్ తీరు ఆక్షేపణీయంగా ఉందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ముద్ర వేసి ఐదుగురు సభ్యులను తొలగించిన కలెక్టర్, అదే టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని రెడ్క్రాస్ చైర్మన్గా ఎన్నుకునేందుకు కలెక్టర్ ఎలా సహకరించారని నిలదీశారు. తిరిగి చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని, కలెక్టర్ నిర్ణయాన్ని తప్పు పడుతూ కాకాణి మంగళవారం కలెక్టర్కు లేఖ రాశారు. రెడ్క్రాస్ పాలక మండలి సభ్యుల్లో 15 మందితో జనవరి 8న కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. అందులో ఏడుగురు రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే వారిలో 7 మంది కాకుండా కేవలం వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు చైర్మన్గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డితోపాటు సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, దామిశెట్టి సుధీర్, ఎంవీ సుబ్బారెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డిలను మాత్రమే టార్గెట్ చేసి గత నెల 11న నోటీసులు ఇచ్చిన కలెక్టర్, వారి నుంచి వివరణ తీసుకుని కూడా పదవుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. వైఎస్సార్సీపీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ వీరు రెడ్క్రాస్లో ఎలాంటి రాజకీయ పక్షపాత ధోరణి అవలంభించలేదన్నారు. ఏ పార్టీకి చెందిన వారైన రెడ్క్రాస్లో పని చేయొచ్చన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ ఎంపీ జాతీయ స్థాయిలో రెడ్క్రాస్ చైర్మన్గా ఉన్నారని, మన రాష్ట్రంలో సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కడి రెడ్క్రాస్ చైర్మన్గా ఉన్నారన్నారు. రెడ్క్రాస్ ప్రాథమిక సభ్యత్వం కలిగిన వారిలో 80 శాతం మంది ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉండేవారన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన వాకాటి విజయకుమార్రెడ్డి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మంత్రికి మద్దతుగా కరపత్రాలు ముద్రించి, అందులో తన నంబర్ కూడా ఇచ్చిన వ్యక్తి అని, అటు వంటి వ్యక్తిని చైర్మన్ చేశారన్నారు. కలెక్టర్ సభ్యత్వాలు రద్దు చేసిన ఐదుగురిని తిరిగి పాలక మండలి సభ్యులుగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదన్నారు. మిగతా 10 మంది సభ్యులతోనే ఎన్నిక నిర్వహించి నేరుగా టీడీపీ ప్రచారంలో పాల్గొన్న వాకాటి విజయకుమార్రెడ్డిని చైర్మన్గా, జనార్దన్రాజును వైస్ చైర్మన్గా ఎన్నుకునేందుకు సహకరించడం దారుణమన్నారు. విజయకుమార్రెడ్డి టీడీపీతో అంటకాగిన ఆధారాలను లేఖతో జతచేసి కలెక్టర్కు పంపించారు. కలెక్టర్ ఇప్పటికై నా 10 మంది సభ్యులతో ఎన్నికై న వాకాటి విజయకుమార్రెడ్డి చైర్మన్ పదవిని రద్దు చేయాలని కోరారు. కోర్టు తీర్పును అనుసరించి తిరిగి 15 మంది సభ్యులతో ఎన్నికలు నిర్వహించాలని, తద్వారా పక్షపాత ధోరణిని వదిలి పారదర్శకతను పాటించాలని కోరారు. అధికార పార్టీకి వంత పాడుతున్న కలెక్టర్ తిరిగి చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి డిమాండ్ -
నిబంధనలు అతిక్రమించొద్దు
సైదాపురం: నిరుపేద గిరిజనులు, పేదలు సాగు చేసుకునే పొలాలను నిబంధనలను మితిమీరి ఎలా స్వాధీనం చేసుకుంటారని, నిబంధనలు అతిక్రమించొద్దంటూ హైకోర్టు రెవెన్యూ అధికారులకు మొట్టికాయలు వేస్తూనే.. ఈ విషయంలో నిబంధనలు ప్రకారం నడుచుకోవాలంటూ ఈ నెల 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపురంలోని 793 ఏ సర్వే నంబర్లో ఉన్న 114 ఎకరాల భూమికి మైనింగ్ లీజు ఉండేది. గడిచిన కొన్నేళ్లగా లీజు గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలోనే సమీపంలోని కమ్మవారిపల్లికి చెందిన ఐదు గిరిజన కుటుంబాలతో పాటు మరో 10 మంది నిరుపేదలు ఎకరా నుంచి రెండెకరాల వంతున అక్రమించుకుని నిమ్మ తోటలను సాగు చేసుకుంటున్నారు. అయితే సాగులో ఉన్న ఆ భూములను స్వాధీనం చేసేందుకు అధికారులు ప్రయత్నించడంతో గిరిజనులతోపాటు పేదలు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలే తప్ప ఇప్పటికిప్పుడు చర్యలు చేపట్ట వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పేదలం మాకు న్యాయం చేయండి తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి అందుకోవాలని ప్రభుత్వ భూముల్లో నిమ్మ సాగు చేసుకుంటున్న రైతులు అధికారులను కోరుతున్నారు. ఈ విషయమై అధికారులకు కూడా వినతిపత్రంతో పాటు కోర్డు ఆర్డర్ను అందజేయనున్నట్లు బాధితులు పేర్కొన్నారు. తాము కష్టపడి రెండెకరాల వంతున ఆక్రమించుకుని, అప్పులు తెచ్చి నిమ్మతోటలపై పెట్టుబడులు పెట్టాం. తీరా పంట చేతికొచ్చే సరికి ఆ భూములు మైనింగ్ లీజులు ఇచ్చే ప్రయత్నం చేయడం సరికాదు. రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు నిరుపేద గిరిజనులు, పేద రైతులకు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు -
ముక్కు మూసుకోవాల్సిందే
నగరంలో అపరిశుభ్రత కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్డుపై చెత్తాచెదారం కనిపిస్తోంది. రోడ్లపై రాకపోకలు సాగించాలంటే దుర్గంధం భరించలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి తప్పడం లేదు. పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో నగరం కంపు కొడుతోంది. గతంలో ప్రతి రోజు చెత్త తీసుకెళ్తే.. ఇప్పుడు వారంలో రెండు రోజులు కూడా వచ్చి తీసుకెళ్లడం లేదు. ఇళ్లలో చెత్త పెట్టుకుంటే కంపుకొడుతోంది. బయట వేద్దామంటూ జరిమానా అంటూ బెదిరిస్తున్నారు. – సుబ్బారెడ్డి, నగర వాసి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి ఏ వీధిలో చూసినా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. చెత్తాచెదారం రోడ్డుపైనే పడేయడం, వాటిని తొలగించకపోవడంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించి రోడ్లపై ఎక్కడా కూడా చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటే నగరం పరిశభ్రంగా ఉంటుంది. వ్యాధులు కూడా ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. చెత్త తొలగింపులో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – ప్రసాద్రెడ్డి, నెల్లూరు నగర వాసి -
వంద కేజీల గంజాయి స్వాధీనం
● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కందుకూరు: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17.50 లక్షల విలువైన 100 కేజీల గంజాయితోపాటు, కారును స్వాధీనం చేసుకున్నారు. కందుకూరులో డీఎస్పీ సీహెచ్వీ బాలసుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కొంతల్లి గ్రామానికి చెందిన ఇల్లపు నాగేశ్వరరావు, నాతవరం మండలం మన్నేపురట్ల గ్రామానికి చెందిన తాడి నాగసత్యన్నారాయణ, దుర్గారావు, ఆనందవేలు మరో ఇద్దరితో కలిసి గంజాయి అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారు. వీరు ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడుకు గంజాయిని రవాణా చేస్తుంటారు. ఈ మేరకు ఉలవపాడు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం ఉలవపాడు సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం వద్ద వాహనాల తనిఖీని చేపట్టారు. క్యాబ్ వాహనాన్ని పోలీసులు ఆపి అందులో ఉన్న ఇల్లపు నాగేశ్వరరావు, తాడి నాగసత్యన్నారాయణను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో వీరితో పాటు ఉన్న దుర్గారావు, ఆనందవేలు అక్కడి నుంచి తప్పించుకు పారిపోయారు. అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించడంతో గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. కారు డోర్లు, స్పీకర్ బాక్స్ల స్థానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అమరికల్లో గంజాయిని ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నట్లు చెప్పారు. కారు డోర్లలో దాచి ఉంచిన రూ.17.50 లక్షల విలువైన 95 ప్యాకెట్ల (100 కేజీల) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు కారును, సెల్ఫోన్లు వంటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఉండే వ్యక్తులతో కుదిరిన ఒప్పందం మేరకు వీరు కావలి వద్దకు గంజాయిని చేర్చాల్సి ఉందని, ఆ తర్వాత అక్కడి నుంచి వేరే బ్యాచ్ గంజాయిని తమిళనాడు వరకు చేరుస్తారన్నారు. పారిపోయిన దుర్గారావు, ఆనందవేలును కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. కార్యక్రమంలో కందుకూరు సీఐ కే వెంకటేశ్వరరావు, ఉలవపాడు ఎస్సై కే అంకమ్మ, కానిస్టేబుల్లు ఎన్ శంకర్, పీ శ్రీనివాసరావు, కే బ్రహ్మయ్య, ఎస్కే రిజ్వాన్, జయశంకర్, ఎం మాలకొండయ్య, డీ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
అధికార సేవలో పారిశుధ్య కార్మికులు
సాక్షాత్తు మున్సిపల్శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరం కంపుకొడుతోంది. ‘నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే కాకుండా దోమల రహిత నగరంగా మార్చుతాం’ అంటూ మంత్రి తరచూ చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నగరం చెత్తమయంగా తయారైంది. గతంలో ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరించగా, ప్రస్తుతం వారానికి రెండు రోజులే సేకరిస్తున్నారు. ఇళ్లల్లో పేరుకుపోయిన చెత్త నిల్వలతో దుర్గంధంతోపాటు కొత్త వ్యాధులు విజృంభిస్తున్నాయి. ●● ఐవీఆర్ఎస్ సర్వేలో 57 శాతం అసంతృప్తి ● చెత్త సేకరణలో రాష్ట్రంలోనే అట్టడుగు స్థానం ● గతంలో రోజూ చెత్త సేకరణ.. ఇప్పుడు వారానికి రెండు రోజులే ● చెత్త బయట వేస్తే జరిమానా అంటూ హెచ్చరికలు ● ఇళ్లల్లో మగ్గిపోతున్న చెత్తతో దుర్గంధం ● మొత్తం 1,500 మంది పారిశుధ్య కార్మికులు ● దోమల దండయాత్రతో పెరిగిన వ్యాధులు ● మున్సిపల్శాఖ మంత్రి ఇలాకాలో దుర్భర పరిస్థితులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో చెత్త సేకరించడం లేదని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో తేటతెల్లమైంది. ఆ సర్వేలో దాదాపు 57 శాతం మంది ఇది చెత్త నగరంగా ఉందంటూ అభిప్రాయం వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలోనే నెల్లూరు కార్పొరేషన్ చెత్త సేకరణలో అట్టడుగు స్థానంలో ఉన్నట్లు స్పష్టమైంది. మున్సిపల్ శాఖమంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్లో ఈ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ప్రతి రోజూ.. ఇప్పుడు వారానికి రెండు రోజులే.. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్ల ఉండగా దాదాపు 10 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. 149.89 చ.కి.మీ. మేర విస్తరించిన నగరంలో 1.84 లక్షల గృహాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తే.. ప్రస్తుతం వారానికి రెండు రోజులే చెత్త సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో చెత్త సేకరణకు గత ప్రభుత్వం 143 మినీ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ వాహనాల్లో అత్యధికం మరమ్మతులకు గురై మూలన పడ్డాయి. వాటి స్థానంలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా చెత్త సేకరణ చేస్తున్నారు. దీంతో చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడం లేదు. చిన్న చిన్న వీధుల్లో ట్రాక్టర్లు వెళ్లే వీలు లేకపోవడంతో ఇళ్లలో చెత్తను రోడ్లపై పడేస్తున్నారు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వీధులన్నీ చెత్తా చెందారంతో దర్శనమిస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. చెత్త వేస్తే జరిమానా అంటూ.. నగరపాలక సంస్థ అధికారులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామని ప్రచారం చేయడానికి గతంలో వీధి చివరలో ఉండే చెత్త డంపర్లను తొలగించేశారు. అదే స్థానంలో చెత్త వేస్తే జరిమానా విధిస్తామంటూ మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల వినూత్న చర్యలంటూ చెత్త వేసే దగ్గర ముగ్గులు వేసి, పూల కుండీలు పెట్టి అక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారు. దీనికి తోడు వారానికి రెండు రోజులే ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తుండడంతో ఇళ్లలో ప్రతి రోజు తయారయ్యే చెత్త నిల్వలతో ఇళ్లు కంపుకొడుతున్నాయి. దోమలు పెరగడంతోపాటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రధాన వీధులకే పరిమితం నగరంలో 54 డివిజన్లు ఉంటే.. పారిశుధ్య కార్మి కులు ప్రధాన సెంటర్లు, కూడళ్లలోనే ఊడ్చుతూ కనిపిస్తారు. ఇళ్ల మధ్య వీధుల్లో ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. ఉదాహరణకు మినీబైపాస్ మొత్తం మీద దాదాపు 3 డివిజన్లలో ఇరవై మంది కార్మికులు కూడా కనిపించని పరిస్థితి. మరి 15 వందల మంది కార్మికులు ఎక్కడ పనిచేస్తున్నారో అధికారులకే తెలియాలి. డ్రైనేజీలు చూస్తే దారుణంగా ఉన్నాయి. చెత్త పేరుకుపోయి నీరు రోడ్లపై పారుతోంది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్త సేకరణ కోసం ప్రతి నెలా కార్పొరేషన్ దాదాపు రూ.7 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేస్తున్నా.. ఆశించిన ఫలితాలు రావడం లేదు. మంత్రి, ఎమ్మెల్యే ఆర్భాటపు ప్రచారాలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతోపాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నగరాన్ని పరిశభ్రంగా ఉంచుతామంటూ ఆర్భాటంగా ప్రచారాలు చేస్తున్నారు. చెత్త పరిశీలన అంటూ ఫొటోలకు ఫోజులిచ్చి పోతున్నారే కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షించడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ చేయడం లేదని నగర ప్రజలు మండిపడుతున్నారు. విజృంభిస్తున్న వ్యాధులు నెల్లూరు నగరాన్ని వ్యాధులు చుట్టుముట్టాయి. పేరుకుపోతున్న చెత్త నిల్వలతోపాటు అపరిశుభ్రత కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. నగరంలో దాదాపు 45 శాతం మంది ప్రజలు వివిధ రకాల వ్యాధులతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూస్తే దాదాపు 75 శాతం నగర వాసులే కనిపిస్తున్నారు. ప్రస్తుతం గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి భయపెడుతోంది. కొత్తగా ఈ వ్యాధి చుట్టేస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. రూ.లక్షల్లో ఖర్చు చేసి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రస్తుతం పెద్దాస్పత్రిలో 20 మందికి పైగా జీబీఎస్ వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా చేయిదాటిపోతోందో అర్థం చేసుకోవచ్చు. నగరాన్ని పరిశుభ్రతగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులే కీలకం. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 1,500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీరిలో రెగ్యులర్ 262 మంది, ఔట్సోర్సింగ్ 1,237 మంది ఉన్నారు. రెగ్యులర్ మేసీ్త్రలు 27 మంది, అవుట్సోర్సింగ్ విధానంలో 323 మంది పనిచేస్తున్నారు. వీరిలో సంగం మంది కార్పొరేషన్ ఉన్నతాధికారులు నుంచి కింది స్థాయి ఉద్యోగుల ఇళ్లలో పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారిశుధ్య కార్మికులు విధులకు రాకున్నా జీతాలు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక మరమ్మతులకు గురైన మినీ చెత్త వాహనాల స్థానంలో ప్రత్యామ్నాయంగా కార్పొరేషన్ అధికారులు ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. 89 ట్రాక్టర్లు, 17 కాంపాక్టర్లు, 54 మినీ వాహనాల ద్వారా చెత్త తరలిస్తున్నారు. -
ఆయుర్వేద మందుల పేరిట మోసం
● నిందితులపై కేసు నమోదు నెల్లూరు(క్రైమ్): ఆయుర్వేద మందులు వాడితే చెవుడు పోతుందని ఓ వృద్ధుడిని నమ్మించి రూ.లక్షలు కాజేసిన నిందితులపై నెల్లూరు సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. గుప్తా పార్క్ సెంటర్కు చెందిన ఓ వృద్ధుడు స్థానికంగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనకు చెవుడు ఉంది. ఈక్రమంలో కృష్ణ అనే వ్యక్తి పరిచయమై తన తండ్రికి సైతం చెవుడు ఉందన్నాడు. ఓ ఆయుర్వేద కంపెనీకి చెందిన మందులు వాడటం ద్వారా చెవుడు పోయిందని నమ్మబలికాడు. అయితే ఆ మందులు చాలా ఖరీదైనవని కొంతకాలం క్రమం తప్పకుండా వాడాలని చెప్పాడు. దీంతో వృద్ధుడు అతడికి రూ.95 వేలను ఫోన్పే ద్వారా వేశాడు. ఈక్రమంలోనే విజయ్ అనే వ్యక్తిని తన అన్న అంటూ కృష్ణ వృద్ధుడికి పరిచయం చేశాడు. విజయ్ కొన్ని ఆకులు, లేహ్యం ఇచ్చి వాటిని రోజూ వాడాలన్నాడు. వృద్ధుడు కొద్దిరోజులు వాడగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో వారిని ప్రశ్నించాడు. ఇంకొన్ని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు. ఇటీవల వృద్ధుడిని శోధన్నగర్లోని ఓ ఆయుర్వేద దుకాణం వద్దకు తీసుకెళ్లి రూ.4.25 లక్షలు తీసుకుని కొన్ని మందులను ఇప్పించారు. వాటిని ఎలా వినియోగించాలో ఇంటి వద్దకు వచ్చి చెబుతామని కృష్ణ, విజయ్లు వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన వృద్ధుడు వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. షాపు వద్దకు వెళ్లి చూడగా మూసివేసి ఉండటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సంతపేట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేశారు. -
విలీన ప్రక్రియను ఆపాలంటూ..
నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని పెద్దచెరుకూరులో ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల విద్యార్థులను 1.2 కిమీటర్ల దూరంలో ఉండే మరో స్కూల్లో విలీనం చేసే ప్రక్రియను విరమించుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మంగళవారం స్కూల్ ఎదుట పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎస్టీ వర్గానికి చెందిన వారిమని, ఎక్కువ మందిమి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. విలీనం చేస్తే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు బడి మానేస్తారని తెలిపారు. బేసిక్ ప్రైమరీ స్కూల్గానే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ బి.శారద, వెంకటరమణమ్మ, పద్మప్రియ, హర్షిణి, చెంచులక్ష్మి పాల్గొన్నారు. -
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 21వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి జెడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు సీఈఓ విద్యారమ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక ప్రణాళిక, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర వాటిపై సమీక్షలు ఉంటాయన్నారు. జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమావేశాలు జరుగుతాయని తెలియజేశారు. 1.71 లక్షల మంది రైతులకు యూనిక్ ఐడీలు ● జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి మనుబోలు: జిల్లాలోని 1,71,500 మంది రైతులకు యూనిక్ ఐడీ (విశిష్ట సంఖ్య) నమోదు చేయడమే లక్ష్యమని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. మండలంలోని జట్ల కొండూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వరి పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి రైతు యూనిక్ ఐడీ కలిగి ఉండాలన్నారు. దీని ద్వారానే ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో నెలాఖరులోపు యూనిక్ ఐడీని నమోదు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో 297 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రైతులందరూ ఈకేవైసీ, ఈ–క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ శివనాయక్, నర్సోజిరావు, ఏఓ జహీర్, ఏఏఓ కళారాణి తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో రౌడీషీటర్ వీరంగం నెల్లూరు(క్రైమ్): మద్యం మత్తులో ఓ రౌడీషీటర్ తన స్నేహితుడితో కలిసి వీరంగం సృష్టించిన ఘటన నెల్లూరు పొదలకూరురోడ్డులోని ఓ వైన్షాపు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన ఓ రౌడీషీటర్ తన స్నేహితుడితో కలిసి మంగళవారం వైన్ షాపునకు వెళ్లారు. పక్కనే ఉన్న కూల్డ్రింక్ షాపులో ఫూటుగా మద్యం తాగారు. సాయంత్రం బయటకు వచ్చిన వారు మద్యం మత్తులో వీరంగం చేశారు. ఓ యువకుడిపై దాడి చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న దర్గామిట్ట ఎస్సై రమేష్బాబు తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మందుబాబులు పరారయ్యారు. దీంతో వారికోసం గాలిస్తున్నారు. న్యాయసేవ సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు నెల్లూరు(అర్బన్): జిల్లా న్యాయసేవాధికార సంస్థ నెల్లూరు, మండల న్యాయసేవాధికార సంస్థ కమిటీలైన గూడూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఉదయగిరిల్లో పారా లీగల్ వలంటీర్లు (న్యాయసేవ సహాయకులు)గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు నిండి ఇంటర్ ఆపైన విద్యార్హతలు గల వారు రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాలన్నారు. ఒక సంవత్సర కాలపరిమితితో భర్తీ అయ్యే ఈ పోస్టులకు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు నిర్ధారించిన గౌరవ వేతనాన్ని అందిస్తామన్నారు. దరఖాస్తులను చైర్మన్ కం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయసేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్టు కాంపౌండ్, నెల్లూరు చిరునామాకు ఈనెల 25వ తేదీలోగా పంపాలని కోరారు. రిజిస్టర్ పోస్టుపై అప్లికేషన్ ఫర్ ఎంపానెల్మెంట్ ఆఫ్ పారా లీగల్ వలంటీర్స్ అని రాయాలన్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించాలని కోరారు. ప్రజలకు చట్టపరంగా న్యాయసహాయం అందించేందుకు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ సేవకులు, లా డిగ్రీ చదవుతున్న విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.గరుడ వాహనంపై నృసింహుడి ఊరేగింపు రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వా మి చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వాతి నక్షత్రం శ్రీవారి జన్మ నక్షత్రం కావడంతో మంగళవారం మూలమూర్తికి చందనంతో అలంకారం చేసినట్లుగా అర్చకులు తెలిపారు. సాయంత్రం బంగారు గరుడ వాహనంపై లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి మేళతాళాల నడుమ కోన మాడవీధుల్లో ఊరేగించారు. -
సిమెంట్ బ్రిక్స్ తరలిస్తుండగా అడ్డగింత
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పక్కాగృహం నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ బ్రిక్స్ను ఓ కాంట్రాక్టర్ తరలిస్తుండగా ప్రజలు అడ్డుకున్న ఘటన మంగళవారం జరిగింది. నెల్లూరు 54వ డివిజన్ భగత్సింగ్ కాలనీలో గత ప్రభుత్వంలో లేఅవుట్ వేశారు. కొన్ని ఇళ్లు నిర్మించగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో నరాల సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ సగం నిర్మించిన ఓ ఇంటిని పగులకొట్టి సిమెంట్ బ్రిక్స్ను ట్రాక్టర్లో తరలిస్తుండగా స్థాని కులు అడ్డుకున్నారు. ఈ విష యమై హౌసింగ్ ఈఈ మోహన్రావు మాట్లాడుతూ సదరు కాంట్రాక్టర్ సిమెంట్ బ్రిక్స్ను అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్నట్టు స్థానికులు తనకు సమాచారం ఇచ్చారన్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించానన్నారు. -
భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): భ్రూణ హత్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ సుజాత తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిఽషేధ చట్టం అమలుపై నెల్లూరు సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి కమిటీ సభ్యులకు, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలకు, మెడికల్ అసోసియేషన్ల నేతలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లపై దాడులను విస్తృతం చేస్తామన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ చేసినట్టు తెలిస్తే ఆ సెంటర్లను సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ చేసేవారు ప్రతి గర్భిణి వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. అల్ట్రా సౌండ్, ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఎకో, బీ–స్కాన్ నిర్వాహకులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలీ, డీఐఓ డా.ఉమామహేశ్వరి, కమిటీ సభ్యులు పీడియాట్రిషియన్ డా.సర్ధార్ సుల్తానా, గైనకాలజిస్ట్ డా సీహెచ్ కిరణ్, డివిజనల్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డా.దయాకర్, డీఎస్పీ రామారావు, డా.బ్రిజిత, డా.శోభారాణి, డెమో అధికారి కనకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
విన్నవించినా.. స్పందన లేదు
● అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి ● సంబంధిత అసోసియేషన్, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ● టీడీపీ నాయకుల ఓవరాక్షన్వరికుంటపాడు: అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని సీపీఐ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావులు మండలంలోని కనియంపాడు సమీపంలో అక్రమంగా నరికివేసిన జామాయిల్ తోటలను మంగళవారం పరిశీలించారు. కొంతసేపు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్ల వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వరికుంటపాడు మండలంలో భాస్కరాపురం, కనియంపాడు గ్రామాల సమీపంలో 150 ఎకరాల్లో జామాయిల్ సాగు ఉందన్నారు. ఆ చెట్లను సుమారు రెండు నెలల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమార్కులు నరికివేసి రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఇటీవల తహసీల్దార్కు విన్నవించామన్నారు. అయినా స్పందన లేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ కర్రను తరలింపు వెనుక బడా నాయకుల హస్తం ఉందని తెలుస్తోందన్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడే ప్రసక్తే లేదని, ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. ఈ అంశాన్ని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరుతామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళ్లగా అక్కడ అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తీవ్ర వాగ్వాదం నిరసన కార్యక్రమాల అనంతరం నేతలు తిరుగు ప్ర యాణమయ్యారు. వరికుంటపాడు సమీపంలో జా మాయిల్ లోడుతో ట్రాక్టర్ వెళ్తుండగా అడ్డుకుని ప్ర శ్నించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నా యకులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శంకరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పాల్గొన్నారు. -
ఆక్రమణ దిశగా..
మోడల్ స్కూల్కు సంబంధించిన మైదానాన్ని ఆనుకుని నారాయణ స్కూల్ ఉంది. ఇక్కడ చదివే పిల్లలు ఆడుకునేందుకు స్థలం లేదు. ఈ నేపథ్యంలో సదరు యాజమాన్యం కన్ను మోడల్ స్కూల్ మైదానంపై పడింది. నారాయణ పాఠశాల వెనుక వైపు నుంచి మైదానంలోకి వెళ్లేందుకు సొంతంగా దారిని ఏర్పాటు చేశారు. మెట్లు కూడా నిర్మించారు. మోడల్ స్కూల్ పిల్లలు మైదానంలోకి వెళ్లేందుకు గతంలోనే దారి ఉంది. దీనిని పట్టించుకోని నారాయణ యాజమాన్యం వారి పిల్లల కోసం దారి ఏర్పాటు చేయడం, స్టేజీ చర్చనీయాంశంగా మారింది. వారి స్కూల్కు సంబంధించిన పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు అన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. మైదానం లేకుండానే నారాయణ యాజమాన్యాం పాఠశాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కూల్కు స్థలాన్ని యథేచ్ఛగా వినియోగించడంపై విమర్శలు వస్తున్నాయి. -
మన్నేరులో ఇసుక దొంగలు
గుడ్లూరు: కూటమి ప్రభుత్వంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. మండలంలోని దారకానిపాడు సమీపంలో ఉన్న మన్నేరులో టీడీపీ నాయకులు జేసీబీల ద్వారా ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దారకానిపాడు సమీపంలో డంపింగ్ చేసి అర్ధరాత్రి వేళల్లో మండలంలోని చుట్టుపక్కల ఉన్న వారికి, కందుకూరు పట్టణానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు ఆరునెలల నుంచి సాగుతోంది. కాగా టీడీపీలోని రెండు వర్గాలు ఇసుక తరలింపుపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వర్గం ఇటీవల కందుకూరు సబ్ కలెక్టర్కు తిరుమణిశ్రీ పూజకు ఈ దోపిడీ గురించి అర్జీ ఇచ్చింది. నాలుగు ట్రాక్టర్లలో.. సోమవారం సాయంత్రం నాలుగు ట్రాక్టర్లలో ఇసుక నింపి కందుకూరు ప్రాంతానికి తరలించారు. ఈ విషయమై గ్రామస్తులు సబ్ కలెక్టర్కు సమాచారమిచ్చారు. దీంతో ఆమె దారకానిపాడు గ్రామానికి చేరుకున్నారు. ఇంతలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాయకుడికి కొందరు సమాచారం అందించారు. వాహనాల లైట్ల ఫోకస్ చూసి జేసీబీ డ్రైవర్ అప్రమత్తమై జామాయిల్ తోటలోకి తీసుకెళ్లినట్లు సమాచారం. మన్నేరు నుంచి దారకానిపాడు గ్రామంలోకి రావడానికి ప్రత్యామ్నాయ మార్గం లేక స్కూటీ, ట్రాక్టర్, కారు యజమానులు సబ్ కలెక్టర్ వాహనాన్ని చూసి పరారయ్యారు. ఆమె స్థానిక వీఆర్వోకి మూడు వాహనాలను స్వాధీనపరిచి పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆదేశించారు. కేసు నమోదు మన్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు గుడ్లూరు ఎస్సై పి.వెంకట్రావు మంగళవారం తెలిపారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు మూడు వాహనాలపై కేసు నమోదు చేశామన్నారు. మన్నేరులో ఇసుక డంపింగ్ జోరుగా తవ్వకాలు దారకానిపాడు సమీపంలో డంపింగ్ కూటమి నాయకుల్లో విభేదాలు -
రూ.కోట్లు కొల్లగొట్టి.. పోలీసులకు చిక్కి..
కావలి: కావలి పట్టణంలో షేర్ మార్కెట్ ట్రేడింగ్ ముసుగులో జనాల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ప్రధాన నిందితుడు షేక్ మహబూబ్ సుభాని, అతని ప్రధాన అనుచరుడైన మరో నిందితుడు యలసిరి బ్రహ్మానందంను అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ పుల్లూరు శ్రీధర్ చెప్పారు. కావలిలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కావలిలో అనంతార్థ అసొసియేట్స్ పేరుతో 17 మంది కలిసి షేర్ మార్కెట్ ఫైనాన్సియల్ ట్రేడింగ్ను 2021లో ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుదాస లీలా స్టాక్ మార్కెట్ ఏజెన్సీ పేరుతో కూడా మరొక సంస్థను ప్రారంభించారు. దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుభాని. అలాగే ప్రభుదాస లీలా స్టాక్ మార్కెట్ ఏజెన్సీకి యలసిరి బ్రహ్మానందం హెడ్గా ఉన్నారు. వీరు అధిక వడ్డీ ఆశ పెట్టి ప్రజలు నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుభాని కార్యాలయాన్ని మూసేసి పరారయ్యాడు. మందా ప్రభాకర్ అనే వ్యక్తి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుభానిపై ఫిర్యాదు అందడంతో కావలి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ జి.రాజేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ సూత్రధారి సుభాని నేపథ్యం బాపట్ల జిల్లా ఏల్చూరుకు చెందిన షేక్ మహబూబ్ సుభాని విజయవాడలోని సిద్ధార్థ అకాడమీలో ఎంసీఏ పూర్తి చేసి నరసరావుపేటలో కొంతకాలం కంప్యూటర్ లెక్చరర్గా పనిచేశాడు. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలోకి వచ్చి షేర్ మార్కెట్ ట్రేడింగ్ మీద అవగాహన పెంచుకున్నాడు. గుంటూరు, విజయవాడలో కొంతకాలం పనిచేసి, తర్వాత కుటుంబంతో కలిసి కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలోని పూణేలలో కొంత కాలం ఉన్నాడు. కాకినాడలో... తర్వాత కాకినాడకు మకాం మార్చి డబ్బులు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ప్రజలకు నమ్మకం కలిగించాడు. ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ ముసుగులో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ, క్రమంగా ఒక పెద్ద నెట్వర్క్ను సృష్టించాడు. ఏజెంట్ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత కాకినాడ నుంచి పారిపోయాడు. దీంతో సుభాని మీద కాకినాడ పోలీస్ స్టేషన్లో 2014లో చీటింగ్ కేసు నమోదు అయింది. తెలంగాణలో... కొంతకాలానికి సుభాని తెలంగాణ రాష్ట్రం మక్తల్ ప్రాంతానికి వెళ్లి చెప్పులు, ఫెర్టిలైజర్, బంగారం వ్యాపారాలు చేశాడు. అక్కడ కూడా ప్రజలను మభ్యపెట్టి షేర్ మార్కెట్ ముసుగులో కోట్ల రూపాయలు ప్రజల నుంచి సేకరించి పారిపోయాడు. దీంతో మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు అయ్యాయి. దీంతో అరెస్ట్ కాకుండా సుభాని మాయమైపోయాడు. నిందితుడు పోలీసుల కంటపడకుండా అరెస్టు కాకుండా తెలివిగా జాగ్రత్త పడ్డాడు. కావలిలో... 2021 నవంబర్లో కావలి పట్టణం ముసునూరు ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అనంతార్థ అసోసియేట్స్ అనే ఏజెన్సీని స్థాపించాడు. షేర్ మార్కెట్ ముసుగులో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ప్రజల సొమ్ముతో తన కుటుంబ సభ్యుల పేరుతో, తన ఏజెన్సీలోని వ్యవస్థాపక సభ్యుల పేర్లతో కొన్ని స్థిరాస్తులు కొన్నాడు. నిందితుడు సుభాని, అతనికి సహకరించిన కావలికి చెందిన యలసరి బ్రహ్మానందంను కావలి రూరల్ పోలీస్ స్టేషన సీఐ జి.రాజేశ్వరరావు ఆదివారం రాత్రి గౌరవరం దగ్గర అరెస్టు చేశారు. అతని ఆస్తులకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకొని, బ్యాంకులో ఉన్న నగదు స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. సుభానికి ఇవ్వడం ద్వారా ప్రజలు పోగొట్టుకున్న డబ్బు తాలూకు వివరాలను దర్యాప్తులో తేలుస్తామని డీఎస్పీ తెలిపారు. సుభాని కొనుగోలు అనేక ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు ఇప్పటికే గుర్తించి ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. వీరే సభ్యులు అనంతార్థ అసోసియేట్స్లో సుభానితో పాటు ఈపలపూడి కమలకుమార్, చలంచర్ల అనిల్, పిల్లి సామ్రాజ్ రోమ్డీ చో, యలసిరి బ్రహ్మానందం, గోనె కిరణ్, యలసిరి ఆదినారాయణ, తలపల శివశంకర్, అద్దూరి శీనయ్య, చౌటూరి అశోక్, నిమ్మగడ్డ రాం రాబర్ట్ రహీం, కాకిని ప్రశాంతి, వట్టికాల ప్రశాంతి, బుట్టి శివార్జున, కశెట్టి పుష్పలత, జ్యోతి స్రవంతి, గుళ్లమూరి వంశీరెడ్డిలు సభ్యులని డీఎస్పీ వివరించారు. ఈ మనీ స్కాంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు ఉన్నారని గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇలాంటి మనీ స్కాంలో ఉండటం నేరంగా భావించి ఈ చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. పోలీస్ కానిస్టేబుళ్లు వట్టికాల రాధాకృష్ణ భార్య వట్టికాల ప్రశాంతి, జ్యోతి అయోధ్య కుమార్ భార్య జ్యోతి స్రవంతిలు ఉన్నారని తెలిపారు. వివరాలు తెలియజేయండి... సుభాని ద్వారా మోసపోయిన బాధితులు వివరాలు తెలియజేయాలని డీఎస్పీ శ్రీధర్ సూచించారు. ఇప్పటి వరకు 150 మంది ఫిర్యాదు అందజేశారని అన్నారు. వారందరి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.25 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని డీఎస్పీ చెప్పారు. సీజ్ చేసిన నగదు, ఆస్తులు ప్రధాన నిందితుడితోపాటు సభ్యుల బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.5,35,92,126లు సీజ్ చేసినట్లు తెలిపారు. సుభాన్ కుటుంబసభ్యుల పేర్లతో స్థిరాస్తులు రూపేణా ఉన్న రూ.5,74,51,000 విలువ కలిగిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సుభాని నివాసంలో రూ.28,48,600 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీతోపాటు కావలి రూరల్ సీఐ జి.రాజేశ్వరరావు, వన్ టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్, టు టౌన్ సీఐ వేల్పుల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. కావలిలో మనీ స్కామ్ సూత్రధారి మహబూబ్ సుభాని అరెస్ట్ అతని ప్రధాన అనుచరుడు కూడా.. బ్యాంక్ అకౌంట్లు, నగదు, ఆస్తులు సీజ్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్ -
ఉపాధి పనుల్లో కూలీల పొట్టగొడుతున్నారు
● వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ● ర్యాలీగా కలెక్టరేట్కు... జేసీకి వినతిపత్రం అందజేత నెల్లూరు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఉపాధి హామీ పనులు కట్టబెడుతూ కూలీల పొట్టగొడుతోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు ఆలపాక శ్రీనివాసులు విమర్శించారు. ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు సోమవారం ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో జేసీ కార్తీక్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలపాక శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదని 2024లో ఇచ్చిన కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం 50శాతం పనులను కచ్చితంగా కూలీలతో చేయించాల్సి ఉందన్నారు. గ్రామ సభలు ఆమోదం పొందిన పనులు మాత్రమే చేయాలన్నారు. అందుకు విరుద్ధంగా కూటమి నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గ్రామసభల తీర్మానం లేకుండా కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారన్నారు. దీంతో తాము కోర్టుకెళ్లగా అలా ప్రైవేటు కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులు రద్దు చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. ఉపాధి చట్టం అమలులో ప్రధాన భూమిక పోషిస్తున్న డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓ, ఎంపీడీఓ, పీఓ, ఏపీఓలు, సంబంధిత జిల్లా అధికారులే జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఏఎస్పేట ఎంపీపీ పద్మజారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, సర్పంచ్ అడపాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని చంపేసి.. భూముల్ని తీసుకోండి
● సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో సర్వేలు చేయడమేంటి ● కావలి ఆర్డీఓకు మొరపెట్టుకున్న తీర ప్రాంత గ్రామాల రైతులుకావలి: మా భూముల్లోకి రెవెన్యూ అధికారులు వచ్చి భూములు తీసుకుంటున్నాం, సర్వే చేస్తున్నాం అంటూ హడావుడి చేస్తున్నారు. ఎందుకు తీసుకుంటున్నారో.. ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారో.. ఇవేవీ మాకు చెప్పడం లేదు. ఇలా చేసే బదులు మమ్మల్ని చంపేసి మా భూములు తీసుకోండి అంటూ కావలి మండలంలోని తీర ప్రాంత గ్రామాలకు చెందిన రైతులు కావలి ఆర్డీఓ ఎం.వంశీకృష్ణ వద్ద ఆవేదన వ్యకం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆర్డీఓను పెద్ద సంఖ్యలో రైతులు కలిశారు. రామాయపట్నం పోర్టుకు సమీపంలో ఉన్న వేలాది ఎకరాలు భూములను సేకరించడానికి కూటమి ప్రభుత్వం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. సాంకేతికంగా మారిటైం బోర్డు ద్వారా భూసేకరణ జరుగుతున్నా ఈ ప్రక్రియలో కావలి తహసీల్దార్ కింద పని చేసే రెవెన్యూ ఉద్యోగులే క్రియాశీలకంగా ఉంటూ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. భూసేకరణలో ప్రధాన ఘట్టమైన గ్రామసభ నిర్వహించే విషయం రైతులకు తెలియలేదు. దీంతో సోమవారం చెన్నాయపాళెం, పాముగుంటపాళెం, మూలంపేట, పెద్దపట్టపుపాళెం, నందెమ్మపురం, చిన్నపాళెం, పల్లెపాళెం, శ్రీరాంపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు ఆర్డీఓను కలిశారు. ఈ గ్రామాల్లో 3,000 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ భూములతో బతుకుతున్న తాము జోవనోపాధి కోల్పోతే ఎలా బతకాలి? ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ధర ఉన్న భూములకు ఎంతోకొంత నష్ట పరిహారం ఇస్తామని చెప్పడం మమ్మల్ని అవమానపరచడం కాదా? అంటూ రైతులు ప్రశ్నించారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన గ్రామసభకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసేలా చేయడంలో పొరపాటు జరిగిందని, అలాంటి పొరపాటు పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. మీరు తెలియజేసిన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని అన్నారు. -
21న మామిడి సాగుపై క్రాప్ సెమినార్
నెల్లూరు(సెంట్రల్): ఈ నెల 21న మామిడి పంటపై జిల్లా స్థాయి క్రాప్ సెమినార్ కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలువురు శాస్త్రవేత్తలు మామిడి పంటలో తెగుళ్ల నివారణ, సాగులో పలు సూచనలు ఇస్తారన్నారు. మామిడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అక్రమ మైనింగ్పై కేసు నమోదు పొదలకూరు: మండలంలోని తాటిపర్తి పంచాయతీలో 2023లో అక్రమంగా మైనింగ్కు పాల్పడ్డారని మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్సై ఎస్కే హనీఫ్ కథనం మేరకు వివరాలు.. పేర్నేటి శ్యాంప్రసాద్, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి అక్రమంగా మైనింగ్ చేసి తెల్లరాయిను తరలించారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు వేటకెళ్లి మత్స్యకారుడి మృతి తోటపల్లిగూడూరు: వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు మృతి చెందా డు. ఈ ఘటన సోమ వారం వెలుగు చూ సింది. ఎస్సై వీరేంద్రబాబు సమాచారం మేరకు.. వెంకన్నపాళెంపట్టపుపాళెం గ్రామానికి చెందిన కొండూరు వెంకటేశ్వర్లు (51) సముద్రంలో వేటపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం వెంకన్నపాళెం పట్టపుపాళెం సమీపంలోని సముద్రతీరం గుండా ఇంజిన్ బోటుపై వేటకు బయల్దేరాడు. సోమవా రం ఉదయానికి కూడా వెంకటేశ్వర్లు తీరానికి చేరుకోకపోవడంతో తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇందుకూరుపేట మండలం కొరుటూరు సమీపంలోని తీరంలో వెంకటేశ్వర్లు మృతదేహం బయటకు కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. మృతుడు వెంకటేశ్వర్లకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వెల్లువెత్తుతున్న వినతులు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 472 అర్జీలు నెల్లూరురూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ కార్యక్రమానికి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు, పరిపాలన తీరుఎలా ఉందో ఈ వినతులే అద్దం పడుతున్నాయి. వారం వారం వచ్చే అర్జీల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం వరకు 400 వస్తున్న అర్జీలు ఈ వారం 472కు చేరాయి. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్తోపాటు డీఆర్ఓ ఉదయభాస్కర్రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీపీఓ శ్రీధర్రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయొద్దు విద్యార్థులను మార్కుల కోసం పాఠశాలల యాజమాన్యాలు మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నగర విద్యార్థి నాయకుడు తిరకాల శేషసాయి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, అప్రోజ్, జస్వంత్, సాయి పాల్గొన్నారు. స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు... ఆరు నెలల నుంచి పలు జిల్లాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడులపై అనేక సార్లు సంబంఽధిత పోలీస్శాఖ వారికి గ్రీవెన్స్ సందర్భంగా వినతిపత్రాలు సమర్పిస్తే వాళ్లు స్థానిక ఎస్హెచ్ఓలకు పంపుతున్నారని, వారు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్లను స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు రాగి పోలమ్మ, హైమావతి, సింహాద్రి, మాధవి, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, వక్ఫ్ జేపీసీ రిపోర్టు, ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి వందల కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాక్రాంతం చేసి ముస్లిం సమాజానికి అన్యాయం చేసే కుట్రలను తీవ్రంగా విభేదిస్తున్నామని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలంటూ నేషనల్ మైనార్టీ సెల్ నాయకులు ర్యాలీగా వచ్చి వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్షాలు చెబుతున్న సవరణలను స్వీకరించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో మరింత తీవ్రతరం చేస్తామన్నారు. -
కేసులు లేవంట
ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లాలో జీబీఎస్ కేసులు ఒక్కటి కూడా లేవని డీఎంహెచ్ఓ డాక్టర్ వి.సుజాత తెలిపారు. రోగులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే వైద్యశాఖ చోద్యం చూస్తోంది. కేసులు లేవంటూ దాచి పెడుతున్నారు.భయపడాల్సిన పనిలేదు జీబీఎస్ కేసులు గురించి భయపడాల్సిన పని లేదు. నిదానంగా కోలుకుంటారు. తిమ్మిర్లు, కాళ్లలో చచ్చుబడినట్టు ఉండటం, బ్యాలెన్స్ తగ్గిపోవడం లాంటి లక్షణాలుంటే సత్వరమే సమీప వైద్యశాలలో డాక్టర్ సలహాలను పొంది చికిత్స చేయించుకోవాలి. – డాక్టర్ నరేంద్ర, ఇన్చార్జి సూపరింటెండెంట్, పెద్దాస్పత్రి ● -
భోజనం బాగాలేదని విద్యార్థులు నిరసన
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ఏసీఎస్ఆర్ కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా అన్నం సరిగా ఉడకడంలేదంటూ, కూరలు సైతం బాగాలేకపోవడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్న సంఘటనలు జరిగాయని తల్లిదండ్రులు తెలిపారు. దీని గురించి భోజన పథకం నిర్వాహకులను ప్రశ్నిస్తే వెటకారంగా సమాధానం చెప్పారని ఓ విద్యార్థి తల్లి పేర్కొంది. ఈ విషయమై హెచ్ఎం హజరత్తయ్యను సంప్రదించగా భోజనం బాగాలేదని విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, నిర్వాహకురాలిని మందలించినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల ధర్నా నెల్లూరు(స్టోన్హౌస్పేట): తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పొదలకూరు రోడ్డులోని సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయనందున హెల్పర్లు, మినీవర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పెట్టుబడులు పెట్టి కేంద్రాలను నిర్వహిస్తున్నారన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనంగా రూ 26వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్కుమార్, రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు కొండా ప్రసాద్, నగర అధ్యక్షుడు అత్తిమూరు శ్రీనివాసులు, నాయకులు షాహినాబేగం, నాగభూషణమ్మ, సంపూర్ణమ్మ, రజని, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. చౌక దుకాణాలకు రేషన్ అలాట్మెంట్ నెల్లూరు (పొగతోట): జిల్లాలోని వివిధ చౌకదుకాణాలకు పదిశాతం రేషన్ విడుదల చేసినట్లు డీఎస్ఓ అంకయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’లో సోమవారం రేషన్ బియ్యం కోటాలో కోత శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు. చౌక దుకాణాలకు పదిశాతం రేషన్ విడుదల చేశారు. కార్డుదారులు ఇబ్బందులు పడకుండా రేషన్ సరఫరా చేస్తామని డీఎస్ఓ తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా పెన్నా డెల్టాకు నీటి విడుదల సోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని సోమశిల జలాశయం నుంచి సోమవారం పెన్నా తీర ప్రాంతాల వారికి ఎలాంటి సమాచారం లేకుండా నీటిని విడుదల చేసినట్లు ప్రజలు తెలిపారు. దీనిపై జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దశరథరామిరెడ్డిని అడుగగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెన్నా దిగువ ప్రాంతంలోని రైతుల తాగు, సాగునీటి అవసరం కోసం నీటిని విడుదల చేశామన్నారు. 22న ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సూపర్ కప్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే జట్టుకు క్రీడాకారులను ఈనెల 22న ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కోశాధికారి బి.ఉమాశంకర్ సోమవారం తెలిపారు. ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉదయం 7.30 గంటలకు ఈ ఎంపికలు ప్రారంభమవుతాయని అన్నారు. ఎంపికై న క్రీడాకారులు మార్చిలో జరిగే టోర్నమెంట్లో కోరమాండల్ జోనల్ ఫుట్బాల్ క్లబ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. -
వెల్లువెత్తుతున్న వినతులు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 472 అర్జీలు నెల్లూరురూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ కార్యక్రమానికి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు, పరిపాలన తీరుఎలా ఉందో ఈ వినతులే అద్దం పడుతున్నాయి. వారం వారం వచ్చే అర్జీల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం వరకు 400 వస్తున్న అర్జీలు ఈ వారం 472కు చేరాయి. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్తోపాటు డీఆర్ఓ ఉదయభాస్కర్రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీపీఓ శ్రీధర్రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయొద్దు విద్యార్థులను మార్కుల కోసం పాఠశాలల యాజమాన్యాలు మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నగర విద్యార్థి నాయకుడు తిరకాల శేషసాయి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, అప్రోజ్, జస్వంత్, సాయి పాల్గొన్నారు. స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు... ఆరు నెలల నుంచి పలు జిల్లాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడులపై అనేక సార్లు సంబంఽధిత పోలీస్శాఖ వారికి గ్రీవెన్స్ సందర్భంగా వినతిపత్రాలు సమర్పిస్తే వాళ్లు స్థానిక ఎస్హెచ్ఓలకు పంపుతున్నారని, వారు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్లను స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు రాగి పోలమ్మ, హైమావతి, సింహాద్రి, మాధవి, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, వక్ఫ్ జేపీసీ రిపోర్టు, ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి వందల కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాక్రాంతం చేసి ముస్లిం సమాజానికి అన్యాయం చేసే కుట్రలను తీవ్రంగా విభేదిస్తున్నామని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలంటూ నేషనల్ మైనార్టీ సెల్ నాయకులు ర్యాలీగా వచ్చి వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్షాలు చెబుతున్న సవరణలను స్వీకరించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో మరింత తీవ్రతరం చేస్తామన్నారు. -
మమ్మల్ని ఆదుకోండి సారూ..
● ఎస్పీ కృష్ణకాంత్కు బాధితుల మొర ● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 93 ఫిర్యాదులు నెల్లూరు(క్రైమ్): నమ్మించి మోసం చేశారు.. న్యాయం చేయాలని బాధితులు ఎస్పీ జి. కృష్ణకాంత్ను కోరారు. సోమవారం స్థానిక ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 93 మంది తమ సమస్యలపై ఎస్పీకి వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్, ఆత్మకూరు డీఎస్పీలు చెంచురామారావు, వేణుగోపాల్రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని.. సాఫ్ట్వేర్ జాబ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగాలు ఇప్పిస్తానని పొదలకూరుకు చెందిన ఎన్. భగవాన్ అనే వ్యక్తి నమ్మించి ఒక్కొక్కరి వద్ద రూ.1.60 లక్షలు తీసుకున్నాడు. దీంతోపాటు ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాకు తెలియకుండా ఒక్కొక్కరి పేరుపై రూ.3 లక్షలు లోన్ తీసుకుని నకిలీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడు. నగదు తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాల ని నెల్లూరు బాలాజీనగర్, కోవూరు, గుడ్లూరు, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన పలువురు కోరారు. రూ 1.25 లక్షలు తీసుకుని.. తన కుమారుడికి వెటర్నరీ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన నూర్జాహాన్ రూ.1.25 లక్షలు తీసుకుంది. నెలలు గడుస్తున్నా.. ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఆమెను నిలదీయగా సమాధానం దాటేస్తుంది. తగిన చర్యలు తీసుకోవాలని బాలాజీనగర్కు చెందిన ఓ వ్యక్తి కోరారు. ● నా పేరుపై ఉన్న స్థలం పత్రాలు తీసుకుని పెద్ద కొడుకు వేధిస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని నెల్లూరు రూరల్కు చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. ● భూ వివాదంపై తిరుపాల్, కిశోర్, రమణమ్మ తమపై దాడిచేశారు. మాకు తీవ్రగాయాలయ్యాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మాపైనే కేసుల నమోదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు మండలం బండారుపల్లికి చెందిన బాధితులు కోరారు. ● మా అమ్మమ్మ ఆత్మకూరు బస్టాండు సమీపంలో పూల వ్యాపారం చేస్తోంది. గుర్తుతెలియని ఇద్దరు యువకులు ఆమైపె దాడిచేశారని, ఆమె ఒంటిపై కాల్చిన గాయాలున్నాయి. వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరుకు యువకులు కోరారు. -
ప్రాక్టికల్స్కు 143 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్ కు సోమవారం 143 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం ప్రాక్టికల్స్కు 2,685 మందికి 73 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2,2 16 మందికి 70 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ శ్రీనివాసు లు కేంద్రాలను తనిఖీ చేశారు. నేటి నుంచి భాషోత్సవాలు నెల్లూరు (టౌన్): జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మంగళవారం నుంచి భాషోత్సవాలను నిర్వహించాలని డీఈఓ ఆర్.బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఇంగ్లిష్, 19న సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20న గిరిజన భాష, కన్నడ, తమిళం, ఒరియా 21న తెలుగు భాషకు సంబంధించి ఉత్సవాలను జరపాలని చెప్పారు. ఇందు కోసం ఒక్కో పాఠశాలకు రూ.500 నిధులు కేటాయించినట్లు తెలిపారు. -
పశువులను కబేళాలకు తరలిస్తూ రూ.లక్షల్లో సంపాదన
డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కోవూరు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు నీచ స్థితికి దిగజారిపోయారు. ఇప్పటికే సహజ వనరులతోపాటు పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని దోచుకుంటూ జేబులు నింపుకుంటున్న వీరు పర్యావరణాన్ని కలుషితం చేస్తూ చేపలకు చికెన్ వేస్ట్ సరఫరా చేస్తున్నారు. తాజాగా పశువులను కబేళాలకు పంపిస్తూ కమీషన్లు దండుకునే నీచ స్థాయికి దిగజారిపోయారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం లేకుండానే ఆగమేఘాల మీద పంచాయతీ కార్యదర్శి అనుమతలు మంజూరు చేయడం చూస్తే ఏ స్థాయిలో సొమ్ములు చేతులు మారాయో అర్థమవుతోంది. ● పంచాయతీ పాలకవర్గ తీర్మానం లేకుండానే సంత నిర్వహణకు అనుమతి ● కోవూరు, పడుగుపాడు, రేగడిచెలికల్లో పశువుల సంతల నిర్వహణ ● రూ.లక్షల్లో చేతులు మారడంతో సంతలకు అనుమతి ● కోవూరులో బరితెగించిన షాడో ఎమ్మెల్యేలు -
సిమెంట్ రోడ్డుకు అడ్డంగా గోడ..!
● పరిహారం చెల్లించలేదంటూ వ్యక్తి వినూత్న నిరసన ఆత్మకూరు: పట్టణ పరిధిలోని రెండో వార్డులో గల నరసాపురంలో తన స్థలంలో సిమెంట్ రోడ్డును నిర్మించి, దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించలేదంటూ రోడ్డుపై అడ్డంగా గోడను ఓ వ్యక్తి నిర్మించారు. నరసాపురానికి చెందిన అల్లంపాటి మాధవరెడ్డి వలంటీర్గా పనిచేసేవారు. అతని ఇంటి దగ్గర సిమెంట్ రోడ్డును నాలుగేళ్ల క్రితం నిర్మించారు. తన స్థలంలో సైతం నిర్మించారని, దీంతో ఉమ్మడి ఆస్తి పంపకాల్లో తమ బంధువుల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. నష్టపరిహారాన్ని సైతం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ప్రయోజనం లభించలేదని, ఈ కారణంగానే సిమెంట్ రోడ్డు నిర్మించిన ప్రాంతంలో గోడను ఏర్పాటు చేశానని వివరించారు. మరోవైపు దారి మూసేయడమేమింటూ పలువురు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న కమిషనర్ గంగా ప్రసాద్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గోడను తొలగించారు. -
పరిహారంలో దగా
విజయవాడ–బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ పరిహారంపై సీతారామపురం మండల రైతులకు కూటమి సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోంది. నామమాత్రపు పరిహారం చెల్లించి బలవంతంగా భూములు లాక్కొంటున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. మా కడుపులు కొట్టొదంటూ రైతులు అధికారులు, కాంట్రాక్టర్లను వేడుకున్నా కనికరించడంలేదు. పచ్చని పైర్లను యంత్రాలతో ధ్వంసం చేసి రోడ్డు పనులు చేపడుతున్నారు. ఉదయగిరి: సీతారామపురం మండల పరిధిలో జరుగుతున్న ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం.. రైతుల పాలిట శాపంగా మారింది. విలువైన భూములను రోడ్డు నిర్మాణానికి సేకరిస్తున్న క్రమంలో రైతుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని సముచిత పరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అరకొరగా పరిహారం ఇస్తామంటూ బెదిరించి మరీ స్వాధీనం చేసుకుంటోంది. ఆయా గ్రామాల్లో సేకరిస్తున్న భూములకు ఇచ్చే పరిహారంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే అప్పటి అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కడుపుకొట్టి పచ్చని పంట సాగులో ఉన్న భూములను దౌర్జన్య పూరితంగా స్వాధీనం చేసుకుంటుంది. కనీసం పంట కాలం పూర్తయ్యాక అయినా.. తీసుకుని ప్రాధేయపడుతున్నా.. అధికారులు కనికరించడం లేదు. పరిహారంలో అన్యాయం మండలంలో మారుమూల గ్రామాల్లో కూడా ప్రస్తుతం ఎకరా ధర రూ.8 లక్షలు వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల అయితే రూ.15 లక్షలు వరకు కూడా ఉంది. అయితే రైతులకు మాత్రం రూ.4 లక్షలు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నారు. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా పరిహారం చెల్లింపుల్లో కూడా సమన్యాయం పాటించలేదని, అధికార పార్టీ నేతల మద్దతు ఉన్న వారికి అధికంగా చెల్లింపులు జరిగాయని పలువురు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం రూ.6 లక్షలు అయినా ఇవ్వాలని రైతులు కోరుతున్నా.. పట్టించుకోవడంలేదు. బలవంతంగా భూములు స్వాధీనం మండలంలోని మారంరెడ్డిపల్లి, గంధంవారి పల్లి, పబ్బులేటిపల్లి, ఓగూరువారిపల్లి గ్రామాల్లో భూములు సేకరించారు. అయితే పబ్బులేటిపల్లికి చెందిన కొంత మంది రైతులు న్యాయమైన పరిహారం ఇచ్చేంత వరకు తమ భూముల్లో పనులు చేయనీయమని గట్టిగా చెప్పారు. అయితే గత నెల 23న పోలీసులను అడ్డంపెట్టుకుని పంటలు ధ్వంసం చేసి పనులు చేపట్టారు. పొలం చుట్టు రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించుకున్న గోడకు పైసా పరిహారం ఇవ్వకుండా కూల్చేశారు. ఏళ్ల తరబడి పెంచుకున్న టేకుచెట్లకు కూడా పరిహారం ఇవ్వకుండా తొలిగించడంపై రైతులు లబోదిబోమంటున్నారు. పొలాల్లో నిర్మిస్తున్న రోడ్డు నామమాత్రపు ధరలతో రైతుల భూముల సేకరణ బలవంతంగా లాక్కొంటున్న అధికారులు -
మూడు చోట్ల సంతలు.. చేతులు మారిన రూ.లక్షలు
అరె! మీరు మాకన్నా మేయడంలో గొప్పోళ్లు! తినడంలో మిమ్మల్ని మించిపోయాం!సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోవూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు పశువుల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. పాడి పశువులను కబేళాలకు తరలించేందుకు ఏకంగా మూడు చోట్ల సంతలను ఏర్పాటు చేసి కమీషన్లతో జేబులు నింపుకుంటున్నారు. వారానికి రెండు రోజుల పాటు నిర్వహిస్తూ మూగజీవాల ఉసురుపోసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో నెల్లూరు పెన్నావంతెన, చిల్లకూరు ప్రాంతాల్లో ఉండే పశువుల సంతల నిర్వాహకులు పశువులను కబేళాలకు పంపించడం మహాపాపమని భావించి ఎత్తేయడంతో ఆ వ్యాపారాన్ని కోవూరు టీడీపీ నేతలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో మూడు చోట్ల సంతలను ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుండడంపై ఆ పార్టీ శ్రేణులే ఛీదరించుకుంటున్నాయి. పంచాయతీ పాలకవర్గం అనుమతి లేకుండానే కార్యదర్శి ఉత్తర్వులు కోవూరు పంచాయతీలో సంత నిర్వహించేందుకు ఆగమేఘాల మీద పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సంత నిర్వహణకు ఈ ఏడాది జనవరి 6వ తేదీ దరఖాస్తు చేసుకుంటే అదే రోజు పంచాయతీ తీర్మానం చేసినట్లు, ఫిబ్రవరి 3వ తేదీ సిఫార్సు, ఫిబ్రవరి 4వ తేదీ ఈఓపీఆర్డీ, అదే రోజు డివిజనల్ పంచాయతీ అధికారి అంగీకారం మేరకు ఫిబ్రవరి 5వ తేదీన కోవూరు పంచాయతీ కార్యదర్శి సంత నిర్వహణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియను పరిశీలిస్తే దరఖాస్తు చేసిన రోజునే పంచాయతీ తీర్మానం చేయడం, మూడు రోజుల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి డివిజనల్ పంచాయతీ అధికారి వరకు ఆగమేఘాల మీద అనుమతుల్వివడం చూస్తుంటే ఏ స్థాయిలో ముడుపులు చేతులు మారాయో అర్థమవుతోంది. వేరెవరైనా అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే.. ఇంత వేగంగా ప్రభుత్వ శాఖలు అనుమతి ఇస్తాయా? ఇచ్చినా దాఖాలు ఉన్నాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే కోవూరులో సంత నిర్వహణకు పంచాయతీ పాలకవర్గానికి తెలియకుండానే ఈ ప్రక్రియ అంతా పంచాయతీ కార్యదర్శి నడిపించినట్లు విమర్శలు ఉన్నాయి. బోగస్ పంచాయతీ తీర్మానంతో ఆగమేఘాల మీద సంత నిర్వహణ ఏడాది పాటు చేసుకునేందుకు ఏకంగా నిబంధనలు ఉల్లంఘించి రాత్రికి రాత్రే ఉత్తర్వులు ఇవ్వడం పెద్ద దుమారం రేపింది. అయితే పాలకవర్గం ఉన్నప్పటికి వారి అనుమతి లేకుండానే కోవూరు పంచామతీ కార్యదర్శి మండల స్థాయి నేతకు నిర్వహణ ఉత్తర్వులు ఎలా ఇస్తారంటూ పాలకవర్గం నిలదీసింది. తమపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్ల క్రమంలోనే ఉత్తర్వులు ఇచ్చేశానని కార్యదర్శి బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం. కోవూరులో ఏర్పాటు చేసిన సంతలో కట్టేసిన పశువులురవాణాకు పశుసంవర్థక శాఖ అనుమతుల్లేకుండానే.. పశువులను కబేళాలకు తరలించేందుకు పశుసంవర్థక శాఖ వైద్యుల అనుమతి ముఖ్యం. ఒట్టిపోయిన పశువులనే కబేళాలకు తరలించాల్సి ఉంది. జబ్బున పడ్డ పశువులను ఏమాత్రం కబేళాలకు తరలించకూడదు. ఇలాంటి నిబంధనల నేపథ్యంలో పశు వైద్యులు సర్టిఫై చేసిన పశువులనే కబేళాలకు తరలించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా రెండు.. మూడేళ్ల దూడల నుంచి పాలిచ్చే పశువుల వరకు ఈ సంతల నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ సంతల నుంచి అపహరించిన పశువులను రవాణా చేస్తున్నారు. డబ్బు సంపాదించేదుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ పశువుల ఉసురుతో డబ్బు సంపాదించేందుకు ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు అధికార పార్టీ నేతలు దిగజారిపోవడం పశు పోషకులతోపాటు మానవతావాదులను బాధిస్తోంది. హిందుత్వ వాదులూ.. ఏమయ్యారో! గోవధను నిషేధించాలంటూ ఉద్యమాలు చేసే హిందుత్వ సంఘాలు కోవూరు నియోజకవర్గం నుంచి పశువులను కబేళాలకు అధికార పార్టీ నేత లు అక్రమంగా తరలిస్తుంటే ఏం చేస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యం దైవసేవలో ఉండే స్థానిక ప్రజాప్రతినిధి సైతం తన షాడో ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ దురాగతాన్ని అడ్డుకోకపోవడాన్ని కూడా హిందువులు నిలదీస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పట్టీపట్టనట్ల ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కోవూరు, పడుగుపాడు పంచాయతీలతోపాటు కొడవలూరు మండలంలోని రేగడిచెలికలో పశువుల సంతలను ఏర్పాటు చేశారు. ఇందులో కోవూరు పంచాయతీలో సంత నిర్వహణకు అనుమతులు తీసుకుంటే.. పడుగుపాడు, రేగడిచెలిక సంతలకు కనీసం అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సంత నిర్వహణను ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందు కోసం రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క సంత నుంచి వారంలో రెండు రోజుల్లో కనీసం 100 నుంచి 150 లారీల్లో పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. తద్వారా నెలకు రూ.లక్షల్లో కమీషన్లు వస్తున్నట్లు సమాచారం. -
దేశ సంపదను దోచేయడమే లక్ష్యంగా నిర్ణయాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు – సవాళ్లు అనే అంశంపై నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ విధానాలను వీడకపోతే వికసిత్ భారత్ కాస్త చీకటి భారత్గా మారే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం, విద్య, వైద్యం, ఆహార సబ్సిడీ, వ్యవసాయం తదితరాలకు బడ్జెట్లో కోత విధించారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, నేతలు కత్తి శ్రీనివాసులు, రాంబాబు, నరసింహులు, మాలకొండయ్య, మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అతిగా ప్రవర్తించే వారి లెక్కలు తేలుస్తాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు : మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావడం ఖామని, కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో అతిగా ప్రవర్తించే వారి లెక్కలు తేలుస్తామని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని బిరదవోలులో శనివారం రాత్రి కాకాణి పర్యటించారు. ఆయన్ను పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. అక్రమ కేసులు పెట్టి తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి లెక్కలు రాసుకుంటామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు నడవాలని సూచించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముత్యాలపేట గ్రామ నాయకుడు కండే రమణయ్య సోదరుడు కండే వెంకటేశ్వర్లు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కాకాణి వెంట బిరదవోలు ఎంపీటీసీ రావుల దశరథరామయ్యగౌడ్, నాయకులు వెన్నపూస దయాకర్రెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, వెంకటశేషయ్య, వెన్నపూస యానాదిరెడ్డి, మాలపాటి రమణారెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డి, ఆకుల గంగిరెడ్డి ఉన్నారు. రోడ్లపై సాగునీరు సాగునీటి కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల సాఫీగా సాగాల్సిన సాగునీరు రోడ్లపై ప్రవహరించి రోడ్లు దెబ్బతింటున్నాయని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. సోమిరెడ్డి ధన దాహానికి సాగునీటి కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల కాలువలు పొంగుతున్నాయని విమర్శించారు. కాలువ నీరు ఉబికి రోడ్లపైకి రావడమే కాక పొలాల్లోకి వెళ్లడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పొదలకూరు మండలం నందివాయ–అమ్మవారిపాళెం గ్రామాల మధ్య సాగునీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది తప్పడం లేదన్నారు. పరిస్థితిని గమనించిన స్థానిక రైతులు సొంత నిధులతో నీరు రోడ్లపైకి రాకుండా కట్టలు పోసుకుంటున్నారన్నారు. -
కూటమికి కొమ్ముకాస్తే కష్టాలే!
నెల్లూరు(బారకాసు)/వెంకటగిరి (సైదాపురం): ప్రజా సేవే లక్ష్యంగా అధికారులు పని చేయాలని, కూటమి నేతలకు కొమ్ముకాస్తూ.. వారిచ్చే మౌఖిక ఆదేశాలను పాటిస్తే భవిష్యత్లో కష్టాలు తప్పవని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పేదలకు న్యాయం చేయాలని, ఇబ్బంది పెట్టేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ కార్యకర్త పేచీరాజ్పై గతేడాది డిసెంబర్ 21న అక్రమంగా గంజాయి కేసు బనాయించి జైలుపాలు చేశారని ఆరోపించారు. అయితే పేచీరాజ్ కేసును విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీ సమర్పించాలని పోలీసులను ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు భవిష్యత్తో హైకోర్టుకు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని వివరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వెంకటగిరి సుందరీకరణకు 110 ఎకరాల్లో నగర వనం ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశామని, ప్రస్తుతం ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరవనం ప్రారంభోత్సవంలో శిలాఫలకం విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని, దళితుడైన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తిని అవమానించేలా ఆయన పేరు లేకుండా చేశారని మండి పడ్డారు. ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ పేరు కూడా శిలాఫలకంలో లేదన్నారు. దీనిపై స్థానిక జనసేన నేతలు స్పందించాలని సూచించారు. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం తథ్యమని స్పష్టం చేశారు. తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికారులు నిబంధనల అమల్లో సాంకేతిక కారణాలను సాకుగా చూపి సరైన విధానాన్ని పాటించలేదన్నారు. మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, చైర్మన్ల మార్పు జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో వెంకటగిరిలో అలాంటి ప్రయత్నం జరిగితే దానిని ఎలా తిప్పి కొట్టాలో తనకు సంపూర్ణ అవగాహన ఉందని, అధికారులు నిబంధనలు విధిగా పాటించాలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్రెడ్డి, వైస్ చైర్మన్ ఎస్.బాలయ్య, జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికష్ణ, బాలాయపల్లి, డక్కిలి మండలాల కన్వీనర్లు వెందోటి కార్తీక్రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, కౌన్సిలర్లు ఆటంబాకం శ్రీనివాసులు, సుబ్బారావు, వహిదా, నేతలు అల్లంసాయి, పేచీరాజ్, దశరథరామిరెడ్డి, సతీష్, రమేష్రెడ్డి పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల మౌఖిక ఆదేశాలు పాటిస్తే అధికారులకు ఇబ్బందులు తప్పవు న్యాయమే గెలిచిందనేందుకు పేచీరాజ్కు బెయిల్ మంజూరే నిదర్శనం నగరవనం ప్రారంభోత్సవ శిలాఫలకంలో తిరుపతి ఎంపీ పేరు లేకపోవడం సరికాదు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి -
పూలే దంపతుల విగ్రహావిష్కరణ
నెల్లూరు (టౌన్): నగరంలోని పప్పులవీధిలో ఉన్న వీవీఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో బండారు ఈశ్వరమ్మ పొదుపు గ్రూపు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పూలే దంపతుల విగ్రహాలను ఆదివారం హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొంగూరు నారాయణ ఆవిష్కరించారు. గవర్నర్ దత్తాత్రేయను మంత్రి నారాయణ ఘనంగా సత్కరించారు. గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వారి ఆదర్శాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్అజీజ్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఆర్డీఓ అనూష, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్రెడ్డి, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. మనీ స్కాం నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి కావలి: పట్టణంలోని ముసునూరులో అనంతార్థ అసోసియేట్స్ ఏర్పాటు చేసిస్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కావలిలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) నాయకులు బలిజేపల్లి వేంకటేశ్వర్లు, కె నాగరాజు, దమ్ము దర్గాబాబు, పసుపులేటి పెంచలయ్య, లక్ష్మీరెడ్డి, కరవది భాస్కర్, మల్లి అంకయ్య, చిట్టిబాబు, చేవూరి కొండయ్య తదితరులు మాట్లాడారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని, మనీ స్కాంలో నష్టపోయిన బాధితులకు వామపక్ష పార్టీలు అండగా ఉంటాయని ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. మనీ స్కాంలో ఏజెంట్లుగా ఉండి, అండగా నిలిచిన ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2024 ఆగస్టులోనే మనీ స్కాంపై పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ పోలీసులు దృష్టి సారించలేదన్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ తరహా నేరాలకు పాల్పడిన వ్యక్తికి కావలిలో పోలీసు అధికారులు కొమ్ము కాయడం అత్యంత విచారకరమన్నారు. ఆజాద్ సెంటర్లో పోలీసు పికెట్ నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరం ఆజాద్ సెంటర్లో శనివారం అర్ధరాత్రి స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటు చేయడంతో రెండు వర్గాల నడుమ వివాదానికి దారి తీసింది. అక్కడ ఆ రెండు వర్గాలు మోహరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ పి.సింధుప్రియ నేతృత్వంలో పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆజాద్సెంటర్ వైపు వెళ్లే అన్నీ రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించారు. దుకాణాలన్ని మూయించివేశారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఆదివారం నిర్మానుష్యంగా మారింది. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వింజమూరు(ఉదయగిరి): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బుక్కాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కృష్ణ (48) తనకున్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో పైరుకు నీరు పెట్టేందుకు ఉదయం 6.30 గంటల సమయంలో వెళ్లారు. ఆ సమయంలో మోటార్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ హెడ్ ఫ్యూజ్ కాలిపోవడాన్ని గమనించారు. దాన్ని సరిచేసే నిమిత్తం స్తంభమెక్కి విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయారు. ఎంతకీ రాకపోవడంతో భార్య ఫోన్ చేసినా ప్రయోజనం లభించలేదు. దీంతో పొలం వద్దకు కుటుంబసభ్యులు హుటాహుటిన వెళ్లగా నేలపై పడి ఉన్నారు. ఆయన్ను లేపి మాట్లాడగా, షాక్కు గురయ్యానని చెప్పడంతో ఆటోలో వింజమూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద దిక్కు మృత్యువాతపడటంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మరొకరికి గాయాలు మనుబోలు: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొమ్మలపూడి క్రాస్రోడ్డు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొమ్మలపూడి క్రాస్రోడ్డు సమీపంలోని కాఫీ డే వద్ద లారీ యాక్సిల్ విరిగిపోవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. ఇదే సమయంలో ఏర్పేడు మండలం బండారుపల్లికి చెందిన మద్దిపట్ల రాజేష్ నాయుడు (34), తన స్నేహితుడు శేఖర్ కలిసి బైక్పై సొంతూరు వెళ్లసాగారు. ఈ క్రమంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజేష్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, శేఖర్ గాయపడ్డారు. ఘటన స్థలాన్ని మనుబోలు ఎస్సై శివరాకేష్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముందస్తు సర్జరీలతో మెనోపాజ్
నెల్లూరు(అర్బన్): చిన్న వయస్సులోనే ఆపరేషన్లు చేసి గర్భ సంచులను తొలగించడం ద్వారా మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఢిల్లీకి చెందిన ఇండియన్ మెనోపాజ్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అంజూసోనీ పేర్కొన్నారు. మెడికవర్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నూతనంగా ఏర్పడిన నెల్లూరు మెనోపాజల్ సొసైటీని నగరంలోని ఓ హోటల్లో ఆదివారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. చిన్న అనారోగ్య కారణాలతో 30 ఏళ్లకే గర్భసంచిని తొలగించడం దారుణమని, దీంతో ముందస్తుగా మెనోపాజ్కు మహిళలు గురవుతున్నారని చెప్పారు. అనంతరం పలు రకాల కేన్సర్ వ్యాధులు, నివారణ తదితరాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. మెడికవర్ సెంటర్ హెడ్ బిందురెడ్డి, డాక్టర్లు రమేష్బాబు, రంగరామన్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక జిల్లాలోని 100కుపైగా మహిళా డాక్టర్లు సభ్యులుగా నెల్లూరు మెనోపాజల్ సొసైటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా పల్లంరెడ్డి యశోధర, కార్యదర్శిగా ఉషారాణి, నెల్లూరు అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులుగా సుప్రజ, లలితషిర్డీశాను ఎన్నుకున్నారు. -
రేషన్ బియ్యం కోటాకు కోత
నెల్లూరు(పొగతోట): జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో సమస్యలు నెలకొన్నాయి. చౌకదుకాణాలకు సరఫరా చేయాల్సిన దానికన్నా తక్కువ స్థాయిలో రేషన్ను అందించారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి దుకాణానికి పది నుంచి 20 శాతం కోత విధించారని సమాచారం. ఈ క్రమంలో 20 శాతం మంది కార్డుదారులకు బియ్యం అందక ఎండీయూ వాహనాలు, చౌక దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ విధానానికి స్వస్తి జిల్లాలో 7.23 లక్షల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా 1,513 చౌక దుకాణాల ద్వారా 13 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. చౌక దుకాణంలో మిగిలిన బియ్యం ఆధారంగా మరుసటి నెల్లో కేటాయింపులుంటాయి. అయితే రెండు నెలల నుంచి బ్యాక్ లాగ్ ఆధారంగా రేషన్ సరఫరా విధానానికి అధికారులు స్వస్తి పలికారు. ఇష్టానుసారంగా కోత విధించారు. దీంతో కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. అందుబాటులో ఉన్న బియ్యాన్నే పంపిణీ చేశారు. ప్రస్తుతం 20 శాతం మందికి బియ్యం అందలేదని తెలుస్తోంది. బియ్యాన్ని తక్కువగా సరఫరా చేశారని డీలర్లు చెప్పడంతో ఆయా ప్రాంతాల సీఎస్డీటీలు ప్రతి దుకాణానికి మరో పది శాతాన్ని మంజూరు చేయాలంటూ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించుకున్నారు. కాగా దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇంతవరకు జారీ కాలేదు. డీలర్లు ఏమంటున్నారంటే.. జిల్లాలో రేషన్ కొరత ఉన్నా, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారులను సంప్రదిస్తే మా చేతుల్లో ఏమీ లేదంటూ చేతులెత్తేశారని డీలర్లు చెప్తున్నారు. కార్డుదారులు తమ చుట్టూ తిరుగుతున్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నామని డీలర్ల అసోసియేషన్ నేతలు వెల్లడిస్తున్నారు. మాకు సంబంధం లేదు రెండు నెలల నుంచి రేషన్లో కోత విధించారని డీలర్లు చెప్తున్నారు. అలాట్మెంట్ విషయం రాష్ట్ర స్థాయి అధికారుల చేతుల్లో ఉంటుంది. జిల్లా పౌరసరఫరాల శాఖకు సంబంధం లేదు. రేషన్ అలాట్మెంట్ తర్వాత కార్డుదారులకు పంపిణీ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మిగిలిన కార్డుదారులకు రేషన్ అందించేలా చర్యలు చేపడతాం. – అంకయ్య, డీఎస్ఓ చౌక దుకాణాలకు పూర్తి స్థాయిలో జరగని సరఫరా కార్డుదారుల ఇబ్బందులు అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు శాంతమ్మ బియ్యం కోసం నాలుగుసార్లు ఎండీయూ వాహనం, ఆ ప్రాంత చౌక దుకాణం చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోవూరుకు చెందిన మస్తాన్ అనే వ్యక్తి బియ్యం కోసం వారం రోజులుగా తిరుగుతున్నారు. ఇంత వరకు అందలేదు. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళేనికి చెందిన వ్యవసాయ కార్మికుడు శ్రీనివాసరావు రేషన్ కోసం చౌక దుకాణం చుట్టూ తిరుగుతున్నారు. -
ఆందోళన వద్దు
● బర్డ్ ఫ్లూపై చర్యలు శూన్యం ఎక్కడా ఇబ్బందుల్లేవు ● నష్టపోతున్న నిర్వాహకులు ● ఆర్నెల్ల క్రితమే గుర్తించినా ముందస్తు చర్యలేవీ..? ● అంతా అయ్యాక టీకాల పేరిట హడావుడి నెల్లూరు(సెంట్రల్): బర్డ్ ఫ్లూ కేసులు జిల్లాలో ఆర్నెల్ల క్రితమే నమోదైనా, సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పెద్దగా నష్టం ఉండదంటూ పశుసంవర్థక శాఖ అధికారులూ నిర్లిప్త ధోరణిని కనబర్చారు. ఫలితంగా ఈ వైరస్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజృంబిస్తూ పౌల్ట్రీ రంగాన్ని కకావికలం చేస్తోంది. నష్టపోతున్న నిర్వాహకులు జిల్లాకు ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. జిల్లాలో పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కోళ్ల ఫారాలను కొందరు నిర్వహిస్తున్నారు. 19 ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాలుండగా, ప్రస్తుత ఇబ్బందుల తరుణంలో అది పదికే పరిమితమైంది. ఇందులో దాదాపు మూడు లక్షల కోళ్లను పెంచుతున్నారని సమాచారం. చిన్నచితకా చికెన్ వ్యాపారులు వారి షాపుల వద్దే కోళ్లను పెంచుకుంటున్నారు. వీటిలో ఒక్క దానికి వ్యాధి వచ్చినా, మిగిలినవి మృత్యువాతపడే అవకాశాలున్నాయి. అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటకు రానివ్వడంలేదు. ఎక్కడ తమ నిర్లక్ష్యం బయటపడుతుందోననే భయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో స్పందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. మీరే జాగ్రత్తలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామంటూ పౌల్ట్రీ నిర్వాహకులను కొందరు అధికారులు హెచ్చరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంతులేని నిర్లక్ష్యం జిల్లాలో బర్డ్ ప్లూ ఆనవాళ్లు కోళ్లకు వచ్చాయనే అంశం ఆర్నెల్ల క్రితమే బయటపడింది. గుమ్మళ్లదిబ్బ, చాటగొట్ల ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారణంగా అప్పట్లో దాదాపు పది వేల కోళ్లకుపైగా చనిపోయాయి. అప్పట్లో ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. కేంద్రం నుంచి నెల్లూరొచ్చిన ప్రత్యేక బృందం అధ్యయనం చేసి బర్డ్ఫ్లూ అని నిర్ధారించింది. కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతాల్లో పది కిలోమీటర్ల మేర ప్రత్యేక జోన్ను ప్రకటించారు. ఇప్పుడు హడావుడి.. బర్డ్ ఫ్లూ అనేది హెచ్5ఎన్1 అనే వైరస్ ద్వారా వస్తుందని సంబంధిత శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వ్యాధి ఒక కోడి నుంచి మరోదానికి వ్యాపించి మృత్యువాత పడే అవకాశాలున్నాయి. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లో వెలుగులోకి రావడంతో టీకాలంటూ జిల్లాలో సంబంధిత శాఖ అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. పౌల్ట్రీ నిర్వాహకుల వద్దకెళ్లి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కోళ్లను అనుమతించొద్దని, ఫారాల్లోకి కొత్త వ్యక్తులను రానీయొద్దంటూ సూచనలు జారీ చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని అధికారులు చెప్తున్నారు. వీటిపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కొద్ది నెలల క్రితం వ్యాధి వచ్చిన మాట వాస్తవమే. ప్రస్తుతం జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎక్కడా లేదు. వ్యాధి ప్రబలకుండా ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయి. ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. – చైతన్యకిశోర్, ఏడీ, జిల్లా పశువైద్య నిర్ధారణ ప్రయోగశాల జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ ఇబ్బందుల్లేవు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిసింది. ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. – వెంకటరమణయ్య, బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్ -
మలివయసులో ఆదరణ కరువై..
● మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య సీతారామపురం: వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పడమటి రొంపిదొడ్లలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ముటుకుందు చెన్నమ్మ (75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యుల ఆదరణ కరువవడంతో జీవితంపై విరక్తి చెంది ఊరి బయటకెళ్లి పురుగుల మందు సేవించి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. 108లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చెన్నమ్మ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జోయాలుక్కాస్లో 50 శాతం ఆఫర్లు నెల్లూరు(బృందావనం): అన్నమయ్య సర్కిల్ సమీపంలోని జోయాలుక్కాస్ జ్యూవెలరీ షోరూమ్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కేక్ను కట్ చేసిన అనంతరం 50 శాతం ఆఫర్ల బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ అక్రమ్ అహ్మద్, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ మాట్లాడారు. మాఘమాసం, పెళ్లిళ్ల సీజన్ను పురస్కరించుకొని గోల్డ్, డైమండ్ జ్యువెలరీ, అన్కట్ డైమండ్స్, ప్లాటినమ్, సిల్వర్ ఆభరణాలపై మజూరీ చార్జీల్లో 50 శాతం డిస్కౌంట్ను అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశం మార్చి ఏడు వరకే అందుబాటులో ఉంటుందని వివరించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్
● ఇద్దరికి గాయాలు పొదలకూరు: ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన పట్టణానికి సమీపంలోని రాపూరు మార్గంలో చైతన్య స్కూల్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మర్రిపాడు మండలం పల్లవోలుకు చెందిన ముగ్గురు యువకులు సైదాపురం మండలం కలిచేడుకు వెళ్లారు. తిరిగొస్తుండగా, పొదలకూరు నుంచి రాపూ రుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొంది. ఘటనలో ఇండ్ల పుల్లయ్య, రాగి వెంకయ్య గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్సీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో చోరీపై ఫిర్యాదు వెంకటాచలం: మండలంలోని గొలగమూడిలో ఆటో చోరీపై పోలీసులకు బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేశారు. వెంకటాచలానికి చెందిన మేకల గోవింద్, కుటుంబసభ్యులతో కలిసి గొలగమూడిలోని భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమానికి తన ఆటోలో శనివారం వెళ్లారు. ఆశ్రమం వద్ద పార్కింగ్ స్టాండ్లో ఆటోను నిలిపారు. అనంతరం వచ్చేసరికి కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్షుడిగా శ్రీధర్ నెల్లూరు సిటీ: పంచాయతీ కార్యదర్శుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా శ్రీధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ జనరల్ సెక్రటరీగా ముషీధర్, ఉపాధ్యక్షులుగా పద్మజ, కోశాధికారిగా దుర్గా దొరబాబు ఎన్నికయ్యారు. సమస్యలపై రాష్ట్ర కార్యవర్గానికి తెలియజేసి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలి నెల్లూరు(అర్బన్): అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్, ఉపాధ్యక్షుడు సంపత్కుమార్ డిమాండ్ చేశారు. నగరానికి ఆదివారం వచ్చిన వీరు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కలిసి ఉద్యోగ భద్రత కోసం చేపట్టాల్సిన ఉద్యమాలపై చర్చించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆప్కాస్ విధా నాన్ని నేటి ప్రభుత్వ పెద్దలు రద్దు చేస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఇలా అయితే మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి చిరుద్యోగులు బలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సొసైటీల కింద పనిచేస్తున్న మెప్మా, సెర్ఫ్ సిబ్బందికి హెచ్ఆర్ పాలసీని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించారని గుర్తుచేశారు. ఆప్కాస్పై ఏర్పడిన అనిశ్చితిని తొలగించాలని కోరారు. సంఘ జిల్లా అధ్యక్షుడు మహిధర్బాబు, జాయింట్ సెక్రటరీ విజయ్కుమార్, జిల్లా కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కోశాధికారి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ జిల్లా జట్టు ఎంపిక చిల్లకూరు: రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న హ్యాండ్బాల్ పోటీలకు 16 మంది క్రీడాకారులతో ఉమ్మడి నెల్లూరు జిల్లా జట్టును ఎంపిక చేశామని హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి, గురుకుల పాఠశాల పీడీ శ్రీరేష్ తెలిపారు. చిల్లకూరులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో జట్లను ఆదివారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్నూల్లోని క్రీడా మైదానంలో ఈ నెల 21 నుంచి 23 వరకు పోటీలను నిర్వహించనున్నారని చెప్పారు. పీడీ హేమంత్, పీఈటీ అఖిల్తేజ తదితరులు పాల్గొన్నారు. -
ఆడుకుంటుండగా..
● ధాన్యం తొట్టెలో పడి బాలుడి మృతి నెల్లూరు సిటీ: ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదశాత్తు ధాన్యం తొట్టెలో పడి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ మండలంలోని గుండ్లపాళెం గ్రామంలోని శరణ్య రా అండ్ బాయిల్డ్ రైస్మిల్లులో బిహార్కు చెందిన మంగళ పాశ్వాన్ తన కుటుంబంతో నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నారు. మిల్లు వద్ద గదిలో కాపురం ఉంటూ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అతని కుమా రుడు సత్యం కుమార్ (11) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ధాన్యం పడే తొట్టెలో పడ్డాడు. దీనిని ఎవరూ గుర్తించలేదు. కొంతసేపటికి బాలుడు తొట్టెలోని బియ్యంలో మునిగిపోయాడు. అక్కడి వారికి కాళ్లు కనిపించడంతో వెంటనే ధాన్యం పడటాన్ని ఆపారు. సత్యం కుమార్ను బయటికి తీసి హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శైవక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
ఉదయగిరి: ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ శైవక్షేత్రాలైన సిద్దేశ్వరం, బైరవకోనకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు డీఎం శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి సూచనల మేరకు ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయగిరిలో ఉదయం 7 గంటలకు బస్సు బయల్దేరి సిద్దేశ్వరం చేరుకుంటుందన్నారు. అనంతరం 9.30 గంటలకు సిద్దేశ్వరంలో బయలుదేరి 11 గంటలకు భైరవకోనకు చేరుకుంటుందని చెప్పారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు భైరవకోనలో బయలుదేరి 2 గంటలకు ఉదయగిరికి చేరుకుంటుందని తెలిపారు. కాగా బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్ను ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు ముడమాల రమేష్రెడ్డి, స్థానిక నాయకులు సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.