SPSR Nellore District News
-
సీ్త్రనిధి నిధుల స్వాహా
సీ్త్రనిధిలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించినా.. డీఆర్డీఏ సిబ్బంది చేతివాటంతో పొదుపు మహిళలు లబోదిబోమంటున్నారు. అధికారులకు పలువురు వినతిపత్రమిచ్చారు. సంగం మండలం మర్రిపాడుకు చెందిన శ్రీవీరాంజనేయ, శ్రీహనుమాన్, శ్రీలక్ష్మి పొదుపు సంఘాలు సీ్త్రనిధి ద్వారా రూ.4 లక్షల చొప్పున రుణాలు పొందారు. శ్రీలక్ష్మి పొదుపు సంఘం వారు తమకు రూ.3 లక్షలు సరిపోతాయని, మిగిలిన రుణం తిరిగి చెల్లించి తీర్మానం కూడా చేసుకున్నారు. కానీ ఆ మొత్తాన్ని బకాయిగా చూపించడంతో వారు ఆవేదన చెందుతున్నారు. అలాగే శ్రీహనుమాన్ పొదుపు సంఘం వారు ప్రతినెలా నగదు చెల్లిస్తున్నా మరో మూడు నెలలు కట్టాలంటూ బకాయి చూపారు. మరో గ్రూపు పరిస్థితి ఇలాగే ఉంది. న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించారు. -
కలెక్టరేట్ ఎదుట బీటీఏ నిరసన
నెల్లూరు(దర్గామిట్ట): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీటీఏ జిల్లా శాఖ నెల్లూరు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గలేదని వాపోయారు. జిల్లా అధ్యక్షుడు మణి సుబ్బు, ప్రధాన కార్యదర్శి మాస ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
కన్నకొడుకు ఇంట్లో నుంచి గెంటేశాడు
● ఓ మహిళ ఫిర్యాదు ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’నెల్లూరు(క్రైమ్): ‘చిన్న కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై నన్ను కొట్టడమే కాకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలి’ అని కొడవలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 126 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తామని బాధితులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ యు.సత్యనారాయణ, మహిళా స్టేషన్, పీసీఆర్, ఎస్బీ 2 ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన మా తండ్రి లారీ ఢీకొని మృతిచెందాడు. వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని వెంకటాచలానికి చెందిన ఓ వ్యక్తి కోరాడు. ● ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని వంశీకృష్ణ అనే వ్యక్తి రూ.3.75 లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, నగదు తిరిగివ్వకుండా మోసగించాడని వరికుంటపాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● వెంకయ్య అనే వ్యక్తి నా కుమార్తెను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని వెంటబడి వేధిస్తున్నాడు. ఆమైపె చెడుగా ప్రచారం చేస్తుండగా అడిగినందుకు నాపై, కుటుంబ సభ్యులపై దాడిచేసి గాయపరిచాడు. విచారించి న్యాయం చేయాలని బిట్రగుంట ప్రాంతానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. ● భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను పట్టించుకోలేదు. ఇటీవల మమ్మల్ని కొట్టి ఇంట్లో నుంచి గెంటేశాడని బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ సమర్పించారు. ● భర్త, అత్తింటివారు ప్రతి చిన్న విషయానికి నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ వివాహిత కోరారు. -
తమ్ముళ్లూ.. ఇదేం పని?
● శిలాఫలకాన్ని టీడీపీ జెండా దిమ్మెగా మార్చి.. ● 3వ వార్డులో టీడీపీ నేతల అత్యుత్సాహం నెల్లూరు సిటీ: నగరంలోని మూడో డివిజన్ కిసాన్ నగర్లోని మధురా నగర్లో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల ప్రారం భోత్సవం నిమిత్తం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు శిలాఫలకానికి పచ్చరంగు వేశారు. జెండా కట్టి ఎగురవేశారు. శిలాఫలకాన్ని జెండా దిమ్మెగా మార్చడంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతికలిగిరి: మండలంలోని అనంతపురం గ్రామంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై కాకునూరు వెంకటేశ్వర్లు (60) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకటేశ్వర్లు ట్రాక్టర్ పైకి ఎక్కి గడ్డి దించే క్రమంలో పైన ఉన్న విద్యుత్ వైర్లను గమనించలేదు. వాటికి తగిలి షాక్ గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణం తీసిన ఈత సరదా దగదర్తి: సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని చెన్నూరులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చెన్నూరు ఎస్సీ కాలనీకి చెందిన వరకుమార్ కుమారుడు గుర్రం సంతోష్ (17) బుచ్చిరెడ్డిపాళెంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పరీక్షలు రాశాడు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులతో కలిసి కావలి కాలువలో ఈతకు వెళ్లాడు. కాలువలో ఉన్న గుంతలో సంతోష్ ఇరుక్కుపోవడంతో భయపడిన స్నేహితులు గ్రామంలోకి వెళ్లి బంధువులకు తెలిపారు. వారొచ్చి సంతోష్ మృతిచెందినట్లు గుర్తించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ‘పది’ పరీక్షలకు 228 మంది గైర్హాజరునెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షలకు సోమవారం జిల్లా వ్యాప్తంగా 228 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 28,002 మందికి గానూ 27,774 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 83 పరీక్ష కేంద్రాలను ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ బాలాజీరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ తనిఖీ చేశారు. ● ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 202 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 1,198 మందికి గానూ 996 మంది హాజరయ్యారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
దుత్తలూరు: ఫ్యాన్కు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండలంలోని నందిపాడు ఎస్సీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నందిపాడు ఎస్సీ కాలనీకి చెందిన బక్కా ప్రసాద్ (32)కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అతను తన బావమరిది కొసినపోగు మధు పెళ్లికి వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటకు ఆదివారం వెళ్లాడు. తిరిగి అర్ధరాత్రికి కాలనీకి చేరాడు. ముందుగా తన ఇంటికి వెళ్లాడు. భార్య అదే కాలనీలోని పుట్టింట్లో ఉండటంతో సోమవారం తెల్లవారుజామున అక్కడికెళ్లాడు. కాసేపటికి ఏమైందో గానీ తలుపులు వేసుకుని లోపల గడియ పెట్టుకుని ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఇంటి వెంటిలేటర్ నుంచి చూశారు. వెంటనే తలుపులు పగులగొట్టి ప్రసాద్ను కిందికి దించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ కలహాలతోనే ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు. -
అయ్యా.. మా వినతులు చూడండి
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● పోటెత్తిన అర్జీదారులునెల్లూరు(దర్గామిట్ట): ‘అయ్యా.. చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతుల్ని పరిశీలించి పరిష్కారం చూపండి’ అంటూ ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఆర్వో విజయ్కుమార్, నెల్లూరు ఆర్డీఓ అనూష, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు, పింఛన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. 5 రకాల బస్సుల్లోనే ప్రయాణం అన్యాయం ఆర్టీసీ 16 రకాల బస్సులను నడుపుతున్నా దివ్యాంగ శక్తి పథకం కింద కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అన్యాయని వైఎస్సార్సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్లా మోహన్ విమర్శించారు. డీఆర్వో విజయ్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సేవలకే పరిమితం చేయడం దివ్యాంగుల హక్కులను పరిమితం చేయడమేనన్నారు. సీఎం పథకం ప్రకటించిన సమయంలో అన్ని సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామన్నారు. ఇప్పుడు పరిమితం చేయడం దారుణమన్నారు. గతంలో ఉన్న 50 శాతం రాయితీపై మరో 50 శాతం కలిపి పూర్తి ఉచితం చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాగేంద్ర, సుబాన్బాషా, ప్రభు తదితరులు పాల్గొన్నారు. విచారణకు డిమాండ్ రాపూరు మండలం తెగచర్ల గ్రామ సంఘ బంధం నిధుల గోల్మాల్పై విచారణ చేపట్టాలని పొదుపు మహిళలు వినతిపత్రం అందజేశారు. సంఘ బంధ అధ్యక్షురాలు, రాపూరు ఏపీఎం సహకారంతో నిధులు గోల్మాల్ చేసిందన్నారు. విచారణ చేపట్టాలని కోరారు. రైతులను ఆదుకోవాలంటూ.. ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలంటూ భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ నేతృత్వంలో నేతలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. మిల్లర్లు, దళారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. డాక్టర్ గుంజి నరసింహారావు, వేల్పుల రామ్మోహన్, సోమ గోపాల్, హరినాథ్, కొణిదెల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కల్వర్టును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్
● డ్రైవర్ మృతి కావలి: ఆయిల్ ట్యాంకర్ కల్వర్టును ఢీకొట్టి గుంతలో పడటంతో డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం కావలి రూరల్ పరిధిలోని తుమ్మలపెంట రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జంగారెడ్డిగూడెం నుంచి ఆయిల్ లోడ్తో కృష్టపట్నం పోర్టుకు ట్యాంకర్ వెళ్తోంది. ఇది కావలి తుమ్మలపెంట రోడ్డు సమీపంలోని కల్వర్టును ఢీకొట్టి అదుపుతప్పి గుంతలో పడిపోయింది. దీంతో డ్రైవర్ పి.అంకయ్య (55) మృతిచెందాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
కలువాయి(సైదాపురం): అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రాజుపాళెంలో ఏకంగా పెన్నానదిలోకి రహదారి నిర్మించి యథేచ్ఛగా టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగురాయపురం, రాజుపాళెం నుంచి రోజుకు వందల లారీల్లో ఇసుక తరలివెళ్తోంది. దీనివల్ల పెన్నానది ప్రవాహానికి ముప్పు ఏర్పడుతుందని తెలిసినా ఆపేందుకు ఏ అధికారి సాహసించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కుల్లూరు హైవే పక్కన ఇసుక డంపింగ్ యార్డ్ అనధికారికంగా ఏర్పాటు చేశారు. అంతేగాక హైవేపై టిప్పర్ల రాకపోకల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయం
● అంకయ్య, రాజేంద్రప్రసాద్ నెల్లూరు(లీగల్): న్యాయవాదుల సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తామని సీనియర్ న్యాయవాదులు సత్తు అంకయ్య, సుంక రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరిలో జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి కల్యాణ మండపంలో ఐలు, న్యాయవాదుల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అభినందన సభ నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ హెల్త్కార్డులు, స్టైఫండ్ ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, యూనియన్ జాతీయ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసా ద్ మాట్లాడుతూ పౌర సమాజానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా గెలుపొందామన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి మరింత బాధ్యతతో పనిచేస్తామన్నారు. ఐలు రాష్ట్ర నాయకులు బీవీ రమణరెడ్డి, నల్లారి మాధవరావు, నర్రా శ్రీనివాసరావు, ఐక్యవేదిక నాయకులు కుడుమల రవికుమార్, నెల్లూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుందరయ్య యాదవ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో గంజి దయాకర్, కృష్ణుడు, రేఖారాణి, సాయికుమార్, కిరణ్, కొండల రావు, సుధీర్, దీక్షత్ పాల్గొన్నారు. -
నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నామని జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. వినియోగదారులు ఉదయం 8 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు. డ్రోన్ ద్వారా పేకాట స్థావరం గుర్తింపు ● ఆరుగురి అరెస్ట్ పొదలకూరు: మండలంలోని నందివాయ అటవీ ప్రాంతంలో పోలీసులు ఆదివారం డ్రోన్ను ఎగురవేసి పేకాట స్థావరాన్ని గుర్తించారు. ఎస్సై హనీఫ్ ఆరుగురిని అరెస్ట్ చేసి రూ.12 వేలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. తల్లిదండ్రులు మందలించారని.. ● పదో తరగతి విద్యార్థి బలవన్మరణం సోమశిల: పరీక్షల నేపథ్యంలో చదువుపై దృష్టి పెట్టమని తల్లిదండ్రులు మందలించి నందుకు ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం అనంతసాగరం మండలంలోని ఆమనిచిరివెళ్ల వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గౌరవరం గ్రామానికి చెందిన చెలిక పెంచల య్య, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు చెలిక కుశ్వంత్ (15) మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. ఈ సమయంలో విద్యపై దృష్టి పెట్టమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కుశ్వంత్ ఆమనిచిరివెళ్ల వద్ద ఉత్తర కాలువలో దూకాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికుల సాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా సమీపంలోనే కుశ్వంత్ మృతదేహం లభ్యమైంది. చిన్న కారణానికి ఎంత పని చేశావురా అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గౌరవరంలో విషాదం నెలకొంది. 2న జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు నెల్లూరు(టౌన్): శాప్లీగ్స్ – 2026లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన స్వర్ణాల చెరువులో జిల్లా స్థాయి శాప్లీగ్స్ వాటర్ స్పోర్ట్స్ పోటీలు జరుగుతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే జసీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాల్లో బాలురు, బాలికలకు కేనోయింగ్, కయాకింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈవెంట్స్ల్లో పాల్గొనే వారు ఉదయం 8 గంటలకు ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయాలన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు శాప్ అధికార వెబ్సైట్ www. sports. ap. gov. in శాప్ లీగ్స్ పోర్టల్లో లేదా క్రీడా యాప్లో ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 88622 38444 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,040 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,606 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.18 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేనివారికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
మొక్కే కదా.. మేసేద్దాం
నెల్లూరు(బారకాసు): సిటీ నియోజకవర్గంలో 28 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 42, 43, 44, 47 డివిజన్లలో మొక్కలు నాటేందుకు వీలుకాని పరిస్థితి. వాటిని మినహాయించి ఒక్కో డివిజన్లో 700 నుంచి 900 మొక్కలు చొప్పున మొత్తం 24 డివిజన్లలో 20 వేల మొక్కలు నాటాలని కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే తెలుగు తమ్ముళ్ల కోసమే నారాయణ ఈ ప్లాన్ వేశారని ఆరోపణలున్నాయి. మొక్కలు నాటే పనులను ఆయా డివిజన్ టీడీపీ ఇన్చార్జిలకే కట్టబెట్టారు. ఇష్టారాజ్యంగా.. టీడీపీ ఇన్చార్జిలు ఇష్టానుసారంగా మొక్కలు నాటిస్తున్నారు. ఏ డివిజన్లో ఎన్ని మొక్కలు నాటారో తెలియని పరిస్థితి. అంతేకాకుండా తమ ఇళ్ల ముందున్న రోడ్లు ధ్వంసం చేసేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసిన కొందరు తమ్ముళ్లు పలువీధుల్లో చెట్లు ఉన్నప్పటికీ కూడా వాటి పక్కనే గుంతలు తీసి మొక్కలు నాటేస్తున్నారు. ప్రధానమైన వీధుల్లో అయితే అసలు నాటిన పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి ప్రతి 15 అడుగులకు ఒక మొక్క నాటాలి. కానీ అలా కాకుండా డివిజన్ల ఇన్చార్జిలు వారికిచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత కార్పొరేషన్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. అంత ఖర్చా? మొక్కలు నాటేందుకు కార్పొరేషన్ అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. వీటిని టీడీపీ నేతలే దక్కించుకున్నారు. ఒక మొక్కను నాటి దానికి నెలరోజులపాటు నీళ్లు పోసి సంరక్షించేందుకు రూ.3,600 చొప్పున చెల్లించేలా నగరపాలక సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో మొక్క ఖరీదు రూ.625. సిమెంట్ రోడ్డును కటింగ్కు, ఆ తర్వాత గుంత కోసం డ్రిల్ వేయడం, మట్టిని లోడి మొక్కను నాటి పూడ్చడం అనంతరం దానికి గ్రీన్గార్డ్ను ఏర్పాటు, నెలరోజు లపాటు నీరు పోసి సంరక్షించేందుకు రూ.2,975 చెల్లించడం జరుగుతుంది. మొత్తం 24 డివిజన్లకు కలిపి సుమారు రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పనులు చేపట్టిన ఒక్కో టీడీపీ ఇన్చార్జికి సుమారు రూ.10 లక్షలు మిగిలే అవకాశం ఉందని తెలిసింది. తెలుగు తమ్ముళ్లకు దోచి పెట్టేందుకు మంత్రి నారాయణ తీసుకున్న చర్య లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ ప్లాన్ మొక్కల పెంపకం పేరుతో నిధుల స్వాహా టీడీపీ డివిజన్ ఇన్చార్జీలకే పనులు నగరంలో 20 వేల మొక్కలు నాటేందుకు రూ.8 కోట్లు ఒక్క మొక్కకు ఖర్చు రూ.3,600 అధికార పార్టీ దోపిడీపై ప్రజల ఆగ్రహంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో నిధుల స్వాహాకు తెరతీశారు. నగరంలో మొక్కల పెంపకం చేపట్టి గ్రీన్సిటీ గా మార్చి చూపిస్తానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. కానీ ఇది తెలుగుదేశం నేతలకు దోచిపెట్టేందుకే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా?
● కూటమి అరాచకాలకు ప్రజలే గుణపాఠం చెబుతారు ● వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డివెంకటగిరి(సైదాపురం): ‘మున్సిపాలిటీలో కౌన్సిలర్ల పదవీ కాలం ముగిసింది.. మరో రెండురోజుల్లో పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉందా’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. మళ్లీ రాజధానికి భూములు కావాలంటూ రైతులను మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. పెన్నానదిని తవ్వేస్తూ పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై గ్రీన్ ట్రిబ్యునల్కు పిటిషన్ దాఖలు చేస్తున్నామన్నారు. బాహాటంగా పెన్నానదిలో అక్రమంగా రోడ్లు వేసి ఇసుకను తవ్వేసి రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంకటగిరిలో జాతీయ రహదారి పక్కనే ఇసుకను డంపింగ్ చేసి దోచుకుంటున్నారన్నారు. అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బాబు సర్కార్కు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదన్నారు. ప్రత్యేకాధికారుల పాలనను ఏర్పాటు చేసి మరింత దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నుతోందన్నారు. సమావేశంలో ఎస్ఈసీ సభ్యుడు బొలిగర్ల మస్తాన్యాదవ్, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, ముఖ్యనేత చిట్టేటి హరికృష్ణ, మాజీ కౌన్సిలర్లు బాలయ్య, ఆరి శంకరయ్య, పేర్నేటి సుబ్బారావు, ఆటంబాకం శ్రీనివాసులు, గోపాలకృష్ణ, పూజారి లక్ష్మి, ఉమామహేశ్వరి, కందాటి కల్యాణి, సుభావలి, విజయలక్ష్మి, మల్లీశ్వరి, కన్వీనర్లు ప్రసాద్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మన్నారపు రవికుమార్, వెందోటి కార్తీక్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా చట్టాల అమల్లో ప్రభుత్వాలు విఫలం
నెల్లూను(వీఆర్సీసెంటర్): శ్రామిక మహిళా చట్టాలను అమలు చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదరి గోగుల శ్రీనివాసులు, ఐద్వా జిల్లా జిల్లా కన్వీనర్ మస్తాన్బీ అన్నారు. నెల్లూరులోని డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం శ్రామిక మహిళా జిల్లా సమన్వయ కమిటీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లు దశలవారీ ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనట్లు ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ.3 వేలు సకాలంలో రావడం లేదన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా కూలీలు ఇవ్వడం లేదన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, మద్యం విక్రయాలు అధికమైనట్లు చెప్పారు. దీంతో యువత చెడుమార్గాల వైపు పయనిస్తోందన్నారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నికల్లో శ్రామిక మహిహిళా సంఘం జిల్లా కన్వీనర్గా మరోసారి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ, శ్రామిక మహిళా సంఘం, ఐద్వా, అంగన్వాడీ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు టీవీవీ ప్రసాద్, శేషమ్మ, మధుసూదన, సుజాతమ్మ, మేరీ, ప్రభావతి, ఈశ్వరమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
కలిగిరి: గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. జెడ్పీ నిధులతో కలిగిరి పంచాయతీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జెడ్పీటీసీ పాలూరు మాల్యాద్రిరెడ్డి, ఉప సర్పంచ్ పాలూరు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. కలిగిరిలోని మసీదు వద్ద నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. మండలానికి రూ.కోటికిపైగా నిధులను కేటాయించామని, మరికొంత మంజూరు చేయనున్నామని వెల్లడించారు. అనంతరం మాల్యాద్రిరెడ్డి నివాసంలో అరుణమ్మను పలువురు సర్పంచ్లు, నేతలు సత్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కాటం రవీంద్రరెడ్డి, సర్పంచ్ రాగి దివ్య, నేతలు హజరత్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రియాజ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రఘురామిరెడ్డి, తిరుపాల్, మస్తాన్రెడ్డి, మహేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హార్బర్ మత్స్యకారుల ఆస్తి
● అన్యాయం జరిగితే సహించేదిలేదు● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల ఆస్తి, హక్కు అన్నారు. ప్రాణాలకు తెగించి వారు పట్టుకున్న నాలుగు బోట్లను అధికారులు, నేతలు కుమ్మకై ్క వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇవి తరలివెళ్లాయని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారానని ప్రశ్నించారు. మత్స్యకారుల అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. బోట్లను వెనక్కి తెప్పించి, తమ చిత్తశుద్ధిని టీడీపీ నేతలు నిరూపించుకోవాలని హితవు పలికారు. బోట్ల మాయం విషయంలో బీఎమ్మార్ పేరును తాము ప్రస్తావించలేదని, ఇస్కపల్లి కాపు తోటయ్యే వాంగ్మూలంలో చెప్పిన అంశాన్ని గుర్తుచేశారు. తనకు ఆయన ఫోన్ చేసి.. రూ.10 లక్షల చొప్పున ఇస్తానని.. బోట్లను వదిలేయమన్నారని.. రెండు నెలల నుంచి ఇది జరుగుతోందని తోటయ్యే చెప్పారన్నారు. బీఎమ్మార్ ప్రమేయం లేకపోతే ఆయన ఒక్కరి పేరునే ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. విడ్డూరంగా రవిచంద్ర వ్యాఖ్యలు పాండిచ్చేరిలోని కారైకల్.. తమిళనాడు బోట్లకు సంబంధమేమిటంటూ బీద రవిచంద్ర మాట్లాడారని విమర్శించారు. అక్కడ్నుంచి తమిళనాడు బోట్లను నడపొచ్చా, లేదాననే విషయం నెట్లో కొడితే తెలిసిపోతుందన్నారు. కారైకల్ ఫిషింగ్ హార్బర్ ద్వారా తమిళనాడు బోట్లు ఆపరేటవుతుంటాయని, వాస్తవాలను దాచిపెట్టి వక్రీకరించేలా కూటమి నేతలు యత్నిస్తున్నారనే విషయం ఈ ప్రెస్మీట్ ద్వారా అర్థమైందని చెప్పారు. మత్స్యకారులపై మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, తమ పార్టీ నేతలకే ఉందని తెలిపారు. ఆదేశాలిచ్చింది వాస్తవం కాదా..? నెల్లూరుకు మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి బోట్లు విడుదల చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చిన మాట వాస్తవం కాదానని ప్రశ్నించారు. రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి వీటిని ఏ విధంగా తరలించాలో ప్రణాళికలను రచించిన విషయం నిజం కాదానని నిలదీశారు. ఈ ఉదంతంలో సీఐను మాత్రమే సస్పెండ్ చేసి మిగిలిన వారిని వదిలేశారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే పాండిచ్చేరిలో ఉన్న బోట్లను తీసుకొచ్చి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో పెట్టాలని డిమాండ్ చేశారు. మాటలు నీటిమూటలేనా..? గస్తీ బోటొస్తుందని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవర్నీ రానీయమంటూ కలెక్టర్ ఇటీవల చెప్పారని, అయితే వాకాడు సమీపంలోని శ్రీనివాసపురం తీరానికి వేరే రాష్ట్రం నుంచి బోట్ వచ్చి 100 మీటర్ల దూరంలో వేటాడి, మన మత్స్య సంపదను ఈ నెల 27న దోచుకుపోయింని ఆరోపించారు. దీనికి జిల్లా మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థకు మత్స్యకారులకు సంబంధించిన స్థలాలివ్వడం, హార్బర్లో కొంత భాగాన్ని కేటాయించడం పెద్ద తప్పన్నారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకే వ్యతిరేకమని చెప్పారు. జువ్వలదిన్నెకు జగన్మోహన్రెడ్డి రావాల్సి ఉందని, అయితే వరుసగా పండగలు రావడంతో ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు కొంత అంతరాయం ఏర్పడిందన్నారు. ఏప్రిల్ రెండో వారం లేదా ఆ తర్వాత వచ్చి మత్స్యకారుల సమస్యలను తెలుసుకొని, వారికి అండగా నిలుస్తారని చెప్పారు.టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ఎవరు నిర్మించారో జిల్లా ప్రజలు, మత్స్యకార కుటుంబాలకు తెలుసునని చెప్పారు. తట్టెడు మట్టి, ఒక్క రాయి పెట్టి కట్టకుండానే తామే నిర్మించామంటూ టీడీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలను అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూటమి నేతలకు కనిపించడంలేదానని ప్రశ్నించారు. నేలటూరులో ఫిషింగ్ జెట్టి నిర్మాణాన్ని ప్రారంభించారని, దీనికి ఎంత అవసరమైనా అదానీ కృష్ణపట్నం పోర్టు భరించి పూర్తి చేయాలని చెప్పారన్నారు. అయితే ప్రస్తుతం సోమిరెడ్డికి కమీషన్లు రాకపోవడంతో వీటిని అర్ధాంతంగా నిలిపేయించారని ధ్వజమెత్తారు. ప్రతి పనికీ వసూలు చేస్తూ అవినీతి సొమ్మును జేబులో వేసుకుంటున్నారని మండిపడ్డారు. -
గ్రావెల్ గుంతలో పడి చిన్నారి మృతి
● మంగళంపాడు గిరిజనకాలనీలో విషాదం వెంకటాచలం: గ్రావెల్ గుంతలో ప్రమాదవశాత్తూ జారిపడి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ పరిధిలో గల మంగళంపాడు గిరిజనకాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబసభ్యుల వివరాల మేరకు.. వ్యవసాయ పనులకు మానికల గజేంద్ర వెళ్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈయన చిన్న కుమార్తె సాత్విక స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. తోటి బాలికలతో కలిసి గిరిజన కాలనీని ఆనుకొని ఉన్న కోనచెరువు వద్దకెళ్లింది. చెరువులో గ్రావెల్ తవ్విన గుంతలో ప్రమాదవశాత్తూ జారిపడిపోవడంతో, మిగిలిన చిన్నారులు అక్కడ్నుంచి భయంతో గిరిజన కాలనీకి పరుగులు తీశారు. కొద్దిసేపటికి విషయాన్ని అక్కడి వారికి చెప్పడంతో, అందరూ కలిసి 108కు సమాచారమిచ్చారు. గ్రావెల్ గుంత వద్దకెళ్లి సాత్వికను బయటకు తీశారు. సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించగా, అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను గ్రావెల్ గుంత బలితీసుకోవడంతో తల్లిదండ్రులు గజేంద్ర, శ్రావణి గుండెలవిసేలా రోదించారు. -
నిరుద్యోగులకు కూటమి ద్రోహం
నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి ద్రోహం చేసిందని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 14వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. కాకాణి మాట్లాడుతూ ఎన్నికల ముందు మెగా డీఎస్సీపై మొదటి సంతకం అని చెప్పిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం చేసిన చాలా నెలల తర్వాత దగా డీఎస్సీగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనన్నారు. చంద్రబాబు, లోకేశ్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ సచివాలయ పరిధిలో ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో జాబితాను ధైర్యంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం, వాస్తవానికి పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను కారు చౌకగా తమ అనుయాయులు కట్టబెడుతూ దోపిడీకి ప్రయత్నిస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల సృష్టి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఊహించని విధంగా సచివాలయ వ్యవస్థను తెచ్చి 1.50 లక్షల ఉద్యోగోలు ప్రత్యక్షంగా కల్పించారని, పరోక్షంగా 2.50 లక్షల వలంటీర్లకు ఉద్యోగ ఉపాధి కల్పించారని కాకాణి గురు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కార్మికుల భద్రతకు, సంక్షేమానికి పెద్ద పీట వేశారని, కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే స్పందించి అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సమీక్షలు గానీ, కార్మికుల భద్రత పట్ల శ్రద్ధ గానీ లేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కార్మికుల భద్రత గాలిల్లో ఉందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గతంలో నినదించిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కార్మికులతో అగౌరవంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలోని యూనిట్లు ఒక్కొక్కటిగా మూత పడుతుంటే.. రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కూటమి నేతల దోపిడీని చూసి పారిపోతున్నాయన్నారు. కంపెనీల వారీగా ఎక్కడెక్కడ ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో జాబితా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్సీపీ కార్మికుల కోరికల సాధన కోసం, వారి కష్టాలు తీర్చడం కోసం ముందుంటామన్నారు. నెల్లూరు సిటీ కార్యాలయంలో... నగరంలోని రాంజీనగర్లో ఉన్న వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ కాంగ్రెస్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్టీయూసీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కేక్ కటింగ్ నిర్వహించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో వైఎస్సార్టీయూసీ ముందుండాలని చంద్రశేఖర్ రెడ్డి సూ చించారు. వైఎస్సార్టీయూసీ కార్మికులకు అండగా పోరాటాలకు వేదిక కావాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లేవ్ పరిశ్రమల పేరుతో భూముల దోపిడీ తప్ప మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఘనంగా వైఎస్సార్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం -
మా ప్రాణాలను కాపాడండి
● రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ ఎదుట పెయ్యలపాళెం గ్రామస్తుల ఆందోళన కొడవలూరు: కాలుష్యం భారీ నుంచి మా ప్రాణాలను కాపాడంటూ మండలంలోని పెయ్యలపాళెం గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలోని రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ (కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్) ఎదుట గ్రామస్తులు శనివారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి ఆనుకొనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని, ఈ ఫ్యాక్టరీలో పేడ, గడ్డి ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్దాలు వస్తూ దుర్వాసన చిమ్ముతోందన్నారు. శబ్ద కాలుష్యంతోపాటు వాయు కాలుష్యం గ్రామాన్ని కమ్మేస్తుందన్నారు. వీటితోపాటు అప్పుడప్పుడు దుర్వాసనతో కూడిన గ్యాస్ను బయటకు వదలడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. రాత్రిళ్లు శబ్దాలకు పిల్లలు చదవ లేకపోతున్నారన్నారు. వాయు కాలుష్యంతో గ్రామస్తులు అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఈ నెల 18న గ్రామ సర్పంచ్ పెనాక అనూష ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటి అధికారులూ ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి చూడలేదని విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్ పెనాక అనూష మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పంచాయతీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగలేదన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో గ్రామం తరఫున కాలుష్యం విషయమై ప్రశ్నిస్తే వైట్ కేటగిరీ పొల్యూషన్ సర్టిఫికెట్ కలిగి ఉన్నామని, అందువల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని ఫ్యాక్టరీ ఇన్చార్జ్ సతీష్ తెలిపారన్నారు. తీరా చూస్తే వివిధ రకాల పొల్యూషన్లతో గ్రామాన్ని చిదిమేస్తోంది. నిర్లక్ష్యంగా ఫ్యాక్టరీ ప్రతినిధి వైఖరి ఫ్యాక్టరీ ఎదుట నిరసన తెలుపుతున్న గ్రామస్తులతో మాట్లాడేందుకు వచ్చిన ఫ్యాక్టరీ ప్రతినిధి శ్రీనివాసన్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వెళ్లారు. గోడు చెప్పుకొంటుంటే ఏమీ పట్టనట్లు ప్రతినిధి నిర్లక్ష్యంగా వ్యవహరించడం గ్రామస్తులకు మరింత ఆవేదన కలిగించింది. -
కామాంధులకు దేవాలయాల్లో పదవులా?
● తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ గ్రామస్తుల మండిపాటు నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వంలో కామాంధులకు దేవస్థానాల చైర్మన్, కమిటీ మెంబర్ల పదవి ఇచ్చి ఆలయాల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని చిల్లకూరు మండలం తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ గ్రామస్తులు మండిపడ్డారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రసిద్ధి గాంచిన కోదండరామస్వామి ఆలయం చైర్మన్గా కోట సతీష్యాదవ్ను ఆరు నెలల క్రితమే నియమించారన్నారు. పదవి దక్కినప్పటి నుంచి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. మహిళలతో రాసలీలలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునే రీతిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలు, గ్రామ ప్రజలు ఈ కమిటీని అసహ్యించుకుంటున్నారని, ఆలయ ప్రతిష్టను దిగజార్చే ఇటువంటి నీచులకు ఒక క్షణం కూడా ఆ పదవిలో ఉండే అర్హత లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా దేవాలయాలు చైర్మన్లు ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతుంటే ప్రజల్లో దైవచింతన ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వంటి వారిపై చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వర్లు, ఎస్ సుబ్రహ్మణ్యం, బి సుబ్రహ్మణ్యం, ఏ వెంకటేశ్వర్లు, ఎం శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసి
కలిగిరి/ఉదయగిరి: ప్రమాదంలో తండ్రి పూర్తి గా కాలిపోయి మాంసం ముద్దలా మారి.. ఆయన వివరాల కోసం రెండు రోజులు నరకయాతన అనుభవించి.. అవశేషాలను ఇంటికి తీసుకొచ్చాక పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరైన ఆత్మకూరి రేష్మ పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. మార్కాపురం వద్ద సంభవించిన ప్రమాదంలో నాగసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన ఆత్మకూరి చిన్నయ్య (45) మృతి చెందిన విషయం విదితమే. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి గుర్తించేందుకు సైతం వీల్లేకుండాపోయింది. ఆయనకు ఐదుగురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె అంజలి ఇటీవల ఇంటర్ పూర్తి చేయగా, రెండో కుమార్తె రేష్మ.. వింజమూరులో పదో తరగతి పరీక్షలను రాస్తోంది. తండ్రి అవశేషాలను చూసి పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. అంత దుఃఖంలోనూ వింజమూరులోని నేతాజీ హైస్కూల్లో సైన్స్ పరీక్షను రేష్మ రాసింది. ఆమెను ఉపాధ్యాయులు, స్థానికులు, తోటి విద్యార్థులు ఓదార్చారు. -
హైస్పీడ్ బోటుతో తీరంలో గస్తీ
● మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశం ● కొత్త బోటు కొనుగోలుకు నిధులు మంజూరు ● మరో బోటును అద్దెకు ఏర్పాటు చేయాలని సూచననెల్లూరు (దర్గామిట్ట): జిల్లా పరిధిలోని సముద్ర జలాల్లో మత్స్యకారుల భద్రతకు, తమిళ జాలర్లు ఆగడాలను అరికట్టేందుకు సముద్ర తీరంలో గస్తీని ముమ్మరం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 450 హెచ్పీ సామర్థ్యం గల హైస్పీడ్ బోటును తక్షణమే కొనుగోలు చేయాలని మత్స్యశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివా రం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మత్స్యశాఖ అధికారులు, తీర ప్రాంతంలోని 9 మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రెండు బోట్లతో గస్తీ నిర్వహిస్తున్నాయని, వీటిని హైస్పీడ్ బోట్స్గా అప్గ్రేడ్ చేస్తామన్నారు. కొత్త బోటులో వీడియో రికార్డింగ్ సదుపాయం కలిగిన రెండు బైనాక్యూలర్లు, అధిక సామర్థ్యం గల తాళ్లు, అగ్నిమాపక నిరోధక సిలిండర్లు, రెండు ఫ్లాష్ లైట్లు, రెండు మెడికల్ కిట్లు వంటి అవసరమైన అన్ని భద్రతా పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొత్త హైస్పీడ్ బోట్ వచ్చే వరకు ఒక హైస్పీడ్ బోట్ను అద్దెకు రెండు రోజుల్లోపు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ శాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్బాషా పాల్గొన్నారు. -
వీఆర్కు సీఐ పాపారావు
● కావలి కొత్త సీఐగా శివశంకర్ కావలి: కావలి రూర ల్ సీఐ పాపారావును వీఆర్కు పంపిస్తూ శుక్రవారం అర్ధరాత్రి గుంటూర్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశా రు. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో తమిళ బోట్లు మాయమైన ఘటన నేపథ్యంలో ఆయన్ను వీఆర్కు పంపినట్లుగా సమాచారం. ఆయన స్థానంలో శివశంకర్ను నియమించారు. శనివారం బాధ్యతలు స్వీకరించిన శివశంకర్ నెల్లూరులో ఎస్పీ అజిత వేజెండ్లను మర్యాదపూర్వకంగా కలిశారు. హార్బర్ భూములు ప్రైవేట్ సంస్థకు కేటాయించడం దారుణం బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నెలోని ఫిషింగ్ హార్బర్ భూములను కొంత మేర సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థకు కేటాయించడం దారుణమని ఏపీ ఫిషర్మెన్ జేఏసీ ప్రతినిధులు ఖండించారు. జువ్వల దిన్నెలోని హార్బర్ను, సాగర్ డిఫెన్స్ సంస్థకు కేటాయించనున్న భూములను స్థానిక మత్స్యకారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హార్బర్ భూ ములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో సముద్ర తీరాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రతిపాదనలు విరమించుకొని, తక్షణమే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకారులకు అండగా నిలవాలని కోరారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల బోట్లు ఏపీ తీరంలో వేట సాగించకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల జువ్వలదిన్నెలో బోట్లు విడిపించుకు వెళ్లిన ఘటనలో బాధ్యులపైన కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణపై ఏపీ తీరంలోని మత్స్యకారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. -
అశ్రునయనాల నడుమ..
పొదలకూరు: పట్టణంలోని వెంకటేశ్వరనగర్లో నివాసం ఉంటున్న ముత్తంగి వెంకటేశ్వర్లు అంత్యక్రియలను అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ఆయన అవశేషాలను నివాసానికి ఉదయం 11.30కు తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి అచ్చెమ్మ, భార్య మమత, పిల్లలు భార్గవి, స్వాతి, శ్రీనాథ్, సోదరి సంపూర్ణ, సోదరుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు మండల స్థాయి అధికారులు, పోలీసులు హాజరయ్యారు. తహసీల్దార్ శివకృష్ణయ్య, ఎంపీడీఓ నరసింహరావు, సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్సై హనీఫ్ దగ్గరుండి అంత్యక్రియలను పూర్తి చేయించారు. అధికారుల రాకను చూసి మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున రోదించి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కడచూపూ కరువాయె బిడ్డా..
దుత్తలూరు: కడచూపునకూ నోచుకోలేదు బిడ్డా.. ఎలాంటి మృత్యువు సంభవించింది.. ఈ కష్టం పగవాడికీ రాకూడదు.. మేమెలా బతికేదంటూ బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో మందాలనాయుడుపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గుండ్లపల్లి వెంకటేష్ మాంసపు ముద్దను అంబులెన్స్ ద్వారా గ్రామానికి తీసుకొచ్చారు. ఆపై అంత్యక్రియలను పూర్తి చేశారు. తల్లిదండ్రులు, భార్యను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చిన్నపిల్లలను చూసిన ప్రతి ఒక్కరి మనస్సు చలించిపోయింది. తహసీల్దార్ యనమల నాగరాజు, ఎస్సై ఆదిలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జున నివాళులర్పించారు. -
గ్యాస్ గండం.. ప్రజలకు తిప్పలు
ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల్లో కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కొందరు హోటళ్లను మూసివేయగా.. మరికొందరు కట్టెలతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా గృహ వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు లభ్యం కాకపోవడంతో కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్స్, నెల్లూరు -
ఎన్నాళ్లీ కష్టాలు
● గూడూరులో కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఏజెన్సీలు ● అవస్థలు పడుతున్న ప్రజలు ● మూతపడుతున్న హోటళ్లుచిల్లకూరు: గూడూరులో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు శుక్రవారం పండగ పూట వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మరో రెండు నెలలు వరకు గ్యాస్, పెట్రో ఉత్పత్తులకు ఎలాంటి ఢోకా లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ స్థానికంగా ఉండే ఏజెన్సీలు, పెట్రోల్ దుకాణాల నిర్వాహకులు కృతిమ కొరతను సృష్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్యాస్ సిలిండర్లను బ్లాక్మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికరేటు పెట్టి బ్లాక్లో కొనలేని కొందరు హోటళ్లను మూసివేశారు. గూడూరులో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా, చిరు వ్యాపారాలు చేసే ఎందరో పేదలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలు తమ సిబ్బందితో ఒక సిలిండర్ను రూ.2 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బారులు తీరి.. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల ఎదుట వినియోగదారులు సిలిండర్లతో బారులు తీరుతున్న పరిస్థితులున్నాయి. గంటలకొద్దీ వేచి చూస్తుండగా నిర్వాహకులు అరకొరగా సిలిండర్లను అందించి చేతులు దులుపుకొన్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లయీస్ అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయడం లేదని ఆరోపణలున్నాయి. వారికి భారీస్థాయిలో ముడుపులు ముడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శివారు ప్రాంతంలోని టిడ్కో ఇళ్ల వద్దకు ఏజెన్సీ సిబ్బంది వచ్చి అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తున్నారని ఓ రెవెన్యూ అధికారికి ఫిర్యాదు అందింది. అంత దూరం తీసుకుని వచ్చి ఇవ్వడమే అదృష్టమని అధికారి అనడంతో వినియోగదారుడు నివ్వెరపోయాడు. గూడూరు ఆర్డీఓ గ్యాస్ ఏజెన్సీలపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. -
బ్రిడ్జి పైనుంచి పడిన ట్రాక్టర్
● వ్యక్తి మృతి మర్రిపాడు: ట్రాక్టర్ బ్రిడ్జి పైనుంచి కేతామన్నేరు వాగులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై కదిరినాయుడుపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం తెల్లగుంట గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (48), ఆత్మకూరు చందు ట్రాక్టర్లో ఫెన్సింగ్ స్తంభాలను వేసుకుని కావలి నుంచి పడమటినాయుడుపల్లి మజారా గ్రామమైన అనంతపురం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ బ్రిడ్జిపై నుంచి వాగులో పడిపోయింది. దీంతో వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతిచెందగా, చందుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు, ఏఎస్ఐ నజీర్ చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఒక బాబు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా నాకాబందీ● డ్రంక్ అండ్ డ్రైవ్పై 33 కేసులు నెల్లూరు(క్రైమ్): జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హైవే ప్రవేశం తదితర ప్రాంతాల్లో 1,502 వాహనాలను తనిఖీ చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 33 మందిపై కేసులు నమోదు చేశారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 19 కేసులు పెట్టారు. రహదారి నిబంధనల ఉల్లంఘనులపై 39 కేసులు నమోదు చేసి రూ.1,41,450ల జరిమానా విధించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే డయల్ 112, పోలీస్ కంట్రోల్రూమ్ నంబర్ 9392903143కు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. -
గూడు చెదిరి.. గుండె పగిలి
కోవూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయా ల్సింది పోయి, ఉన్న గూడును కూలగొడుతున్నారు కూటమి నేతలు. దశాబ్దాలుగా కాలనీల్లో తలదాచుకుంటున్న నిరుపేదలపై పచ్చమూక కక్షగట్టింది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడు పంచాయతీ స్టౌ బీడీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేదల ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. సుమారు 50 ఏళ్లుగా ఆ ప్రాంతంలోనే నివాసముంటున్న తమను ఒక్క నిమిషంలో రోడ్డున పడేశారని మహిళలు బోరున విలపించారు. ‘మా సామాన్లు సర్దుకునే లోపు ఇళ్లను కూల్చేశారు. ఇప్పుడు మేం ఎక్కడికెళ్లాలి’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం ఊసు లేదు. పునరావాసం కల్పించే ఆలోచనే లేదని, కేవలం రాజకీయ కక్షతోనే ఇలా చేశారని వారు ధ్వజమెత్తారు. రోడ్డున పడిన బాధితులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తిరిగిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. గెలిచిన తర్వాత కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చెప్పుకొందామని ఎమ్మెల్యే ఇంటికి నాలుగుసార్లు వెళ్లినా, ఆమె కనీసం కనిపించలేదని వాపోయారు. ప్రజల కష్టాలు వినే తీరిక లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో తమకు ఇళ్ల స్థలాలిచ్చి ఆదుకుందని బాధితులు గుర్తు చేసుకున్నారు. ‘ప్రశాంతిరెడ్డి.. మా కడుపు కొట్టొద్దు. బతకడమే భారమైన మాకు అద్దె ఇళ్లలో ఉండే స్థోమత లేదు. ఒక్కసారి మా బతుకులు వచ్చి చూడండి’ అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అన్యాయంగా ఇళ్లను కూల్చిన చోటే బాధితులు ధర్నాకు దిగారు.పేదలపై కక్ష సాధింపు నోటీసులు ఇవ్వలేదు పునరావాసం ఊసే లేదు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తీరుపై బాధితుల ఆగ్రహం -
వసతుల కల్పనకు అరకు ఎంపీ నిధులు
● రూ.10 లక్షల కేటాయింపు● కృతజ్ఞతలు తెలిపిన ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణికి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విన్నపించారు. ఆమె సానుకూలంగా స్పందించి రూ.10 లక్షల నిధులు కేటాయించారు. దీనిపై ప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కొడవలూరు మండలంలోని నార్తురాజుపాళెంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, విడవలూరు మండలంలోని చౌకిచర్ల గిరిజన కాలనీలో సిమెంట్ రోడ్డు పనుల నిమిత్తం రూ.3 లక్షలు, దంపూరు ఎస్సీ కాలనీలో సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.2 లక్షలను ఎంపీ కేటాయించారు. నిధుల కేటాయింపుంపై కోవూరు నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అక్రమ సంత నిర్వహణపై విచారణ జరపాలి
● సర్వేపల్లిలో అవినీతి కొత్త పుంతలు ● సోమిరెడ్డి అక్రమాలపై రాజీలేని పోరాటం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: అధికారాన్ని అడ్డంపెట్టుకొని గొలగమూడి రోడ్డు వద్ద నిర్వహించిన పశువుల సంతపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని గొలగమూడి రోడ్డు వద్ద నిర్వహిస్తున్న పశువుల అక్రమ సంతను పరిశీలించేందుకు గానూ చలో గొలగమూడి రోడ్డు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పార్టీ నేతలు, గో ప్రేమికులతో కలిసి సంతను నిర్వహించిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డంపెట్టుకొని సోమిరెడ్డి ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తూ, ప్రజల ఛీత్కారానికి గురవుతున్నారని విమర్శించారు. నిబంధనల్లేకుండా ప్రైవేట్ స్థలంలో సంత పెట్టి అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రతి నెలా అక్రమంగా వసూళ్లు సంత నిర్వాహకుల నుంచి రూ.పది లక్షలను సోమిరెడ్డి ప్రతి నెలా అక్రమంగా వసూలు చేసి.. గోవులు, గేదెలను చైన్నె పరిసరాల్లోని వధశాలలకు తరలించడం దౌర్భాగ్యమన్నారు. గోవులను ప్రేమించే ఎంతో మంది మనోభావాలను గాయపరుస్తూ, ఇలా తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతుల్లేకుండా, పంచాయతీకి ఎలాంటి సమాచారమివ్వకుండా భారీ పశువుల సంతను నిర్వహిస్తుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. తాను కార్యక్రమానికి పిలుపునివ్వడంతో సంతను నిర్వాహకులు ఎత్తేశారని చెప్పారు. తమ హయాంలో మనుబోలులో ప్రభుత్వ అనుమతులతో సంత నిర్వహణకు వేలం నిర్వహించిన అంశాన్ని గుర్తుచేశారు. తద్వారా పంచాయతీకి రూ.18 లక్షల నుంచి రూ.32 లక్షలు జమ కావడంతో ఆ నిధులను తాగునీటి అవసరాలకు వెచ్చించామని వివరించారు. అయితే దీనికి విరుద్ధంగా సంతను సోమిరెడ్డి ఏర్పాటు చేయించి రూ.లక్షలను దోచుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కుమ్మకై ్క ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంత నిర్వహణ ద్వారా మీరు చేసే పాపాలను లెక్కిస్తున్నామని, వీటిపై విచారణ జరిగిన రోజున భూ యజమాని బయటకొస్తారని, సంతను నిర్వహించిన వ్యక్తిని పట్టుకుంటే ఎవరెవరికి ఎంతెంత డబ్బులిచ్చారో చెప్తారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, జిల్లా నేతలు కొణిదెన విజయభాస్కర్నాయుడు, బాలయ్యనాయుడు, వెలిబోయిన వెంకటేశ్వర్లు, తుపాకుల కిరణ్కుమార్, మందా కృష్ణ, దూడల మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తేలుస్తారా.. తొక్కేస్తారా..!
సాక్షి, టాస్క్ఫోర్స్: సర్వేపల్లి ముఖ్య నేత అండదండలతో వెంకటాచలం మండలంలోని కాకుటూరులో సాగుతున్న భూ ఆక్రమణలపై కలెక్టర్ ఆరాతీస్తున్నారు. వీటిపై నివేదిక పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఓ వైపు సర్వేపల్లి ముఖ్య నేత, మరోవైపు నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ కీలక నేతల కార్యాలయాల నుంచి రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లొస్తున్న క్రమంలో అక్రమలపై నిగ్గు తేలుస్తారా.. లేక తొక్కేస్తారాననే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వెంటనే నివేదిక పంపండి వెంకటాచలం మండలం కాకుటూరులో జాతీయ రహదారిని ఆనుకొని రూ.రెండు కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత దర్జాగా కజ్జా చేశారు. ఈ విషయమై భూమ్..ఫట్ అనే శీర్షికన సాక్షిలో కథనం గురువారం ప్రచురితమైంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆరాతీశారని సమాచారం. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న విలువైన భూములు కబ్జాకు గురవుతుంటే, ఏమి చేస్తున్నారని.. దీనిపై నివేదికను పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. ఆక్రమణల జోలికెళ్లొద్దు కలెక్టర్ ఆదేశాలతో మండల రెవెన్యూ అధికారుల్లో కదలికొచ్చింది. ఆక్రమిత భూముల్లో జరుగుతున్న నిర్మాణాలను నిలిపేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కబ్జా చేసిన నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ నేత.. సర్వేపల్లి ముఖ్య నేతను ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు. వీరి నుంచి రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏమి జరుగుతోందో పరిశీలించేందుకు సైతం గ్రామానికి వెళ్లేందుకు వీరు జంకుతున్నారు. మండిపడుతున్న గ్రామస్తులు గ్రామంలో అంగన్వాడీ.. పాల కేంద్రాలు, లైబ్రరీ నిర్మాణాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని ఇతరులు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలను చేపట్టడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పార్టీలకతీతంగా ఏకమై కలెక్టర్ కార్యాలయ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. నివేదిక పంపాలనే కలెక్టర్ ఆదేశాలు ఓ వైపు.. ఆక్రమణల జోలికెళ్లొద్దంటూ టీడీపీ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాల్సి ఉంది. కాకుటూరులో భూ ఆక్రమణలపై నివేదికకు కలెక్టర్ ఆదేశాలు రెవెన్యూ అధికారులపై కూటమి నేతల ఒత్తిళ్లు ఆగని నిర్మాణ పనులు -
పచ్చ నేతల అరాచకం
● కోవూరులో పేదల ఇళ్ల కూల్చివేత ● బాధితుల ఆక్రందనకోవూరు: కూటమి నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మండలంలోని పడుగుపాడు నేతాజీనగర్లో దశాబ్దాలుగా తలదాచుకుంటున్న నిరుపేద కుటుంబాలపై ప్రభుత్వం కక్షగట్టింది. ముందస్తు నోటీసుల్లేకుండా.. ప్రత్యామ్నాయం చూపకుండా 15 ఇళ్లను జేసీబీలతో బుధవారం కూల్చేశారు. వివరాలు.. పడుగుపాడు పంచాయతీ సబ్స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన సుమారు 50 ఏళ్లుగా నిరుపేదలు నివాసముంటున్నారు. వీరిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. జేసీబీలను అధికారులు తీసుకొచ్చి ఇళ్లను కూల్చేశారు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏళ్ల తరబడి నివాసముంటున్న తమకు పట్టాలిచ్చి ఆదుకోవాల్సింది పోయి.. రాత్రికి రాత్రే ఖాళీ చేయాలంటూ బెదిరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన ఇళ్ల కూల్చివేతపై బాధిత మహిళలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తమ ఇళ్లను తొలగించారని ఆరోపించారు. గత ప్రభుత్వం తమకు అండగా ఉందని, అయితే ప్రస్తుత సర్కార్ గూడు లేకుండా చేసిందని వాపోయారు. చావడానికై నా సిద్ధమే గానీ ఇళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇక్కడ్నుంచి ఒక్క ఇటుకను సైతం కదలనీయమని చెప్పారు. ఇంటికి నాలుగుసార్లు వస్తే కనీసం పలకరించి సమస్యలు వినే స్థితిలో ఎమ్మెల్యే లేరని ఆరోపించారు. గత సీఎం జగనన్న హయాంలో తమను ఎంతో ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు కక్షసాధింపు చర్యలను మాని సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
టచ్ చేసి చూడు..
అవినీతి అధికారికే అందలం ● ఆయన్ను సరెండర్ చేసే అధికారం నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈకి లేదంటూ స్పష్టీకరణ ● అక్కడే నియమిస్తూ ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ● చక్రం తిప్పిన సర్వేపల్లి ముఖ్య నేత ● ఇరిగేషన్ శాఖలో అవినీతి పారుదలకు లైన్ క్లియర్ ఇరిగేషన్ శాఖలోని నెల్లూరు సెంట్రల్ డివిజన్లో అవినీతి ముద్ర పడిన అధికారిని టచ్ చేస్తే.. స్థానిక అధికారులకు మడతైపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్వేపల్లి ముఖ్యనేత అండతో డిప్యుటేషన్పై డీఏఓ (డబ్ల్యూ) గ్రేడ్–1గా పాగా వేసిన ఓ అధికారి అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. వరదల పనుల బిల్లుల్లో కమీషన్లు దండుకున్నాడు. అసలు పనులే చేయకుండా.. ఒకే పనికి మూడు పథకాల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు. కాంట్రాక్టర్ల నుంచి ఫోన్పే ద్వారా లంచాలు తీసుకుంటూ.. ఫైళ్లలో సంతకాలు చేస్తుండటంతో అదే శాఖలోని అధికారులే విచారణకు సిఫార్సు చేస్తే, రాజకీయ అండతో దీన్ని తొక్కి పెట్టించారు. సరెండర్ చేస్తే.. రెండు నెలలు తిరగకుండానే తిరిగి అదే సీటులో కూర్చొనే స్థాయిలో చక్రం తిప్పడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం అండతో అవినీతిలో కూరుకుపోయిన అధికార్నే అదే స్థానంలో అందలం ఎక్కిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఆయన్ను ఇక్కడి నుంచి సరెండర్ చేసే అధికారం స్థానిక అధికారికి లేదంటూ ఉత్తర్వుల్లోనే ఉటంకించడం చూస్తే.. ఏ స్థాయిలో చక్రం తిప్పారో అర్థమవుతోంది. రెండు నెలల్లోనే తిరిగి అదే స్థానంలోకి రావడానికి ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖలోని కీలక అధికారులకు భారీగానే ముడుపులు అందించారనే ఆరోపణలు లేకపోలేదు. ఇరిగేషన్ శాఖలో నెల్లూరు సెంట్రల్ డివిజనల్ అకౌంటెంట్ అధికారిగా పని చేసే వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడడంతో ఆయన్ను ఇక్కడి నుంచి బదిలీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రాగానే సదరు అధికారిని సర్వేపల్లి ముఖ్య నేత తన రాజకీయ పరపతితో రెగ్యులర్ బదిలీ కాకుండా.. డిప్యుటేషన్పై తిరిగి నియామకం చేయించారు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి కాలువలకు ఫ్లడ్ డ్యామేజ్ పనుల పేరుతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకుని పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని వాటాలు పంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతేడాది వచ్చిన మోంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న సాగునీటి కాలువల మరమ్మతులకు కలెక్టర్ ప్రతిపాదనలు మేరకు రూ.93.27 కోట్ల నిధులను మంజూరు చేయగా సర్వేపల్లిలో 316 పనులను రూ.5 లక్షల లోపు పనులుగా విభజించి నామినేషన్ పద్ధతిలో కొన్ని, టెండర్ ప్రక్రియలో తన అనుచరులకే పనులు దక్కేలా చక్రం తిప్పారు. ఇందుకు సదరు డీఏఓ సంపూర్ణ సహాయ సహకారం అందించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు డివిజనల్ అకౌంటెంట్ అధికారి కాంట్రాక్టర్ల నుంచి తనతోపాటు, తన తనయుడు, సమీప బంధువుల ఫోన్పేలకు లంచాలు బదిలీ చేయించుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. సీఎంఓకు ఫిర్యాదులు చేసినా.. నెల్లూరు ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై అదే శాఖలోని ఓ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయానికి గతేడాది అక్టోబర్ 26న లేఖ రాశారు. ఆ శాఖ ఈఎన్సీతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కలెక్టర్కు ఆ లేఖ ప్రతులు పంపారు. సుమారు రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, గతంలో చేసిన పనులను ఎఫ్డీఆర్ (ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్లు), ఉపాధి హామీ, డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్, ఓఎంఎంలో బిల్లులు చేయించుకున్నారని, మోంథా తుపాన్ పనులు పూర్తిస్థాయిలో అవినీతి చోటు చేసుకుందని, ఆయా అక్రమాల్లో తమ శాఖ ఎస్ఈ ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు చేయడంతో స్పందించిన సీఎంఓ విచారణకు ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. అయితే తీగ లాగితే డొంక కదులుతుండడంతో ఓ సీనియర్ ఎమ్మెల్యే విచారణ అధికారిని మేనేజ్ చేసి నివేదికను తొక్కిపెట్టించారనే ఆరోపణలున్నాయి. విచారణలో జాప్యం అవుతుండడంతో ఆ ఫిర్యాదుపై శాఖ పరమైన నివేదిక ఇవ్వాలని నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఎస్ఈ, ఈఈలకు ఆదేశాలొచ్చాయి. సరెండర్ చేసిన రెండు నెలల్లోనే.. సదరు డీఏఓ అవినీతిపై సీఎంఓ నుంచి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ‘ఫోన్పేలో లంచం.. ఫైళ్లలో సంతకం’ ఇరిగేషన్లో అవినీతి జలగలనే శీర్షికతో ఈ ఏడాది జనవరి 2వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన నెల్లూరు ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అదే నెల 9న సంబంధిత శాఖలను పొందుపరిచి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే సర్వేపల్లి ముఖ్య నేత అండదండలతో చక్రం తిప్పడంతో సదరు డీఏఓను యథాస్థానంలో నియమిస్తూ రాష్ట్ర ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖ డైరెక్టర్ బోగిరి ప్రేమకుమారి మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం ఇరిగేషన్ నెల్లూరు సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి అందాయి. ఇదిలా ఉండగా సదరు డీఏఓను బదిలీ/సరెండర్ చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు లేదంటూ పేర్కొనడం చూస్తే.. ఇకపై ఆయన్ను ఇక్కడి నుంచి కదిలించొద్దని చెప్పకనే చెప్పినట్లుగా ఉందని ఆ శాఖలోని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సీఎంఓ విచారణ ఆదేశాలను తొక్కిపెట్టడం.. సరెండర్ను రద్దు చేయించడం డీఏఓకు సాధ్యపడేది కాదని, సర్వేపల్లి ముఖ్యనేతనే ఈ స్థాయిలో చక్రం తిప్పారనే ప్రచారం జరుగుతోంది. సదరు అధికారిని అడ్డం పెట్టుకుని సర్వేపల్లిలో రూ.కోట్ల దోపిడీకి లైన్ క్లియర్ అయిందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
తల్లీకుమారుడిపై కత్తితో దాడి
కావలి: తల్లీకుమారుడిపై కత్తితో దాడిచేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జలదంకి మండలం చామదాలలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. గతేడాది వినాయకచవితి సమయంలో పందిటి పోలమ్మ, ఆమె కుమారుడిపై అదే గ్రామానికి చెందిన పందిటి పోలయ్య, హరికృష్ణ దాడి చేశారు. ఈ విషయమై అప్పట్లో జలదంకి పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంగళవారం వారి మధ్య మాటామాటా పెరిగింది. పలువురు సర్దుబాటు చేయడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. పోలయ్య, హరికృష్ణ, అమ్ములు అర్ధరాత్రి మారణాయుధాలతో తమపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని పోలమ్మ, ఆమె కుమారుడు తెలిపారు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి వారిని కావలి ఏరియా హాస్పిటల్కు తరలించారు. బాధితులు మాట్లాడుతూ గతంలో దాడి జరిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ విషయమై బుధవారం జలదంకి ఎస్సై లతీఫున్నీసా మాట్లాడుతూ రెండు వర్గాల మధ్య కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. కొద్దిరోజుల క్రితం నిందితులుగా ఉన్నవారిపై బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. హరి, పోలయ్య, అమ్ములుపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. -
సమస్యలు పరిష్కరించాలంటూ..
● డీసీసీబీ చైర్మన్కు వినతి నెల్లూరు(వీఆర్సీసెంటర్): సమస్యలు పరిష్కరించాలంటూ డీసీసీబీ చైర్మన్ ఎం.ధనంజయరెడ్డికి బుధవారం జాయింట్ ఫోరమ్ ఆఫ్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు స్థానిక కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గతేడాది నవంబర్ నెలలో ఉద్యోగుల వేతనాల సవరణ కోసం ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చలు జరిపారన్నారు. అయితే చర్చలు ఆశాజనకంగా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈనెల 23వ తేదీ నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. -
మత్స్యకారుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీకి మత్స్యకారులంటే మొదట్నుంచీ చులకనేనని, గతంలో అధికారంలో ఉన్న సమయంలోనూ వీరి సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. మత్స్యకారులపై అనేక అన్యాయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయంలో సమావేశాన్ని కూటమి నేతలు తూతూమంత్రంగా నిర్వహించి వెళ్లిపోయారని విమర్శించారు. ప్రభుత్వ ఆదేశాలతోనే మిన్నకుండిపోయారు.. తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను ప్రాణాలకు తెగించి మత్స్యకారులు పట్టిస్తే, రెండు ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేసి ప్రభుత్వ ఆదేశాలతో మిన్నకుండిపోయారని విమర్శించారు. పట్టుకున్న నాలుగు బోట్లను ముందస్తు పథకం ప్రకారమే అధికారులు విడిచిపెట్టారని ఆరోపించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణను ఆపడంతో పాటు అపహరించిన బోట్లను యథాస్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు తమ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి జాలర్లు మన జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి 500 మీటర్లలోపే వేట సాగిస్తూ.. ఇక్కడి వారి వలలను తెంపి మత్స్య సంపదను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల రక్షణలో బోట్లు భద్రంగా ఉంటాయని మత్స్యకారులు నమ్మి నిశ్చింతగా ఉన్నారని, అయితే ఇవి అర్ధరాత్రి అక్రమంగా తరలివెళ్లిపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారన్నారు. మొక్కుబడి సమీక్షలెందుకు..? మత్స్యకారులను నమ్మించి గొంతు కోశారని, ఘటనకు ప్రభుత్వ పెద్దలే కారణం కావడంతో, తప్పును పోలీసులపై నెట్టేసి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కలెక్టరేట్లో ప్రభుత్వ పెద్దలు, అధికారులు నిర్వహించిన సమావేశంలో.. బోట్లు అక్రమంగా తరలివెళ్లడంపై సమీక్షించకుండా.. సంబంధిత బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ధారించకుండా, రాజకీయ ప్రసంగాలతో ముగించారని విమర్శించారు. పుదుచ్చేరి, తమిళనాడులోని వ్యక్తులకు ఎవరు సహకరించారు.. బోట్ల అపహరణకు కారణాలేమిటో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలే కుట్రధారులు చంద్రబాబు, లోకేశ్ జోక్యంతో ఈ కుట్రలో స్థానిక టీడీపీ నేతలున్నారని ఆరోపించారు. కొందరి పేర్లను మత్స్యకార పెద్దలు చెప్పారని, వీరిని విచారించి కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ లావాదేవీలను పరిశీలిస్తే కుట్ర కోణాలు బయటపడతాయని చెప్పారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసులు వ్యవహరించారని, ఈ కారణంతోనే వారిపై చర్యలు చేపట్టలేకపోతున్నారని తెలిపారు. మత్స్యకారులను ప్రలోభపెట్టి వారిలో వారికి గొడవలు సృష్టించి.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చుపెట్టేందకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అండగా ఉంటాం బోట్లు, ఫిషింగ్ హార్బర్ విషయంలో మత్స్యకారులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీరికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని భరోసా కల్పించేందుకు నెల్లూరు వచ్చేందుకు తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆలోచిస్తున్నారని వెల్లడించారు. వీరి సమస్యలపై పోరాడతామని ప్రకటించారు. మత్స్యకారులకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆస్తి ఫిషింగ్ హార్బర్ను వారికి విడిచిపెట్టి, డిఫెన్స్ కార్యకలాపాలకు మరో ప్రాంతాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. మంత్రుల మాటలు ఫుల్.. చేతలు నిల్ ప్రాణాలకు తెగించి బోట్లను తెస్తే, సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఖాకీల సంరక్షణలో ఉన్న వాటిని ఎలా విడిపిస్తారు..? ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఇదంతా జరిగింది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
కామాక్షితాయి హుండీ కానుకల లెక్కింపు
● రూ.55 లక్షల ఆదాయంబుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడలో ఉన్న మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. గత సంవత్సరం డిసెంబర్ 3 నుంచి ఈ సంవత్సరం మార్చి 24వ తేదీ వరకు 112 రోజులకు గానూ ప్రధాన హుండీల ద్వారా రూ.55,60,482ల నగదు వచ్చిందన్నారు. యూఎస్ఏ డాలర్లు 11, యూఏఈ థిర్హామ్స్ 10, కువైట్ దినార్స్ 2, బంగారు వస్తువులు 44 గ్రాములు, వెండి వస్తువులు 248 గ్రాముల్ని భక్తులు సమర్పించారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్కు ఉచిత శిక్షణనెల్లూరు(టౌన్): పాలిటెక్నిక్లో ప్రవేశాల కోసం జరిగే పాలిసెట్ ప్రవేశపరీక్షకు సంబంధించి నెల్లూరు దర్గామిట్టలోని మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికలకు ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ ఏసుదాసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఏప్రిల్ 22 వరకు ఇస్తామన్నారు. రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయని, వివరాలకు 99123 42048 ఫోన్ నంబర్ను సంప్రదించాలని తెలియజేశారు.ధాన్యం సేకరణకు సహకరించాలినెల్లూరు (దర్గామిట్ట): ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు, దానికి సంబంధించిన సమస్యలపై అమరావతి నుంచి మనోహర్, మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీరావు బుధవారం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల నుంచి మిల్లులను నెల్లూరు జిల్లాకు అనుసంధానం చేసి ఇక్కడ ధాన్యాన్ని తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పోస్టాఫీసుల్లో పార్సిల్ సౌకర్యంనెల్లూరురూరల్: నెల్లూరు పోస్టల్ డివిజన్లో పలు పోస్టాఫీసుల్లో నాణ్యమైన ప్యాకింగ్తో పార్సిల్ సౌకర్యం అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉందని జిల్లా పోస్టల్ సూపరిండెంటెంట్ కె.శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్క్షాపు, తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజనెల్లూరు(టౌన్): వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో జీఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గంటా రమణయ్య నాయుడు సొంత నిధులతో వర్క్షాపు, తరగతి గదుల నిర్మాణం కోసం బుధవారం భూమిపూజ నిర్వహించారు. రమణయ్య దంపతులను ఐటీఐ ప్రిన్సిపల్ ఏడుకొండలు సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఆవును ఆటోకు కట్టి తరలింపు● మందలించిన ఇన్స్పెక్టర్ నెల్లూరు సిటీ: ఆవును తాడుతో ఆటోకు కట్టి తరలించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవు యజమానిని ఇన్స్పెక్టర్ మందలించడంతో మరో వాహనంలో ఎక్కించుకెళ్లారు. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం డైకస్రోడ్డు నుంచి పొదలకూరు రోడ్డు మీదుగా బుధవారం ఓ వ్యక్తి తన ఆవును తాడుతో ఆటోకి కట్టి వేగంగా తీసుకెళ్తున్నాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి ఆవు యజమానిని నిలదీశారు. ఇలా హింసించడం సరికాదన్నారు. నా ఆవును ఎలాగైనా తీసుకెళ్తానని యజమాని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో అటుగా వెళ్తున్న చిన్నబజారు ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఈ విషయాన్ని గమనించి ఆవు యజమానిని మందలించారు. -
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలని డీఎంహెచ్ఓ సుజాత ఆదేశించారు. బుధవారం మాతాశిశు మరణాల సబ్ కమిటీ సమావేశం నెల్లూరు సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రస్తుత మార్చి నెల వరకు ఒక మాతృ, ఏడుగురు శిశువులు మరణించారని ఇందుకు గల కారణాలు తెలపాలని కోరారు. ఏఎన్ఎం నిర్లక్ష్యం వల్ల మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళ గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించి రిజిస్టర్లో ఆమె వివరాలను నమోదు చేసుకుని ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. రక్తహీనత ఉందా?, బీపీ ఉందా అని పరీక్షించాలన్నారు. ఆస్పత్రిలో సుఖ ప్రసవం జరిగే వరకు ఏఎన్ఎంతోపాటు డాక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పుట్టిన పిల్లలకు తక్షణమే పురిటిపాలు ఇప్పించాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ టీకాలు షెడ్యూల్ ప్రకారం వేయించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి డాక్టర్ పరిమళ, డీఐఓ డా.ఉమామహేశ్వరి, గైనకాలజీ డాక్టర్ మేరీస్నిగ్ధ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శోభారాణి, జీజీహెచ్ అనస్థీషియా హెచ్ఓడీ డాక్టర్ శ్రీనివాసరావు, డా.గ్రేస్ ప్రియాంక, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులు నిర్ణయించారు. నెల్లూరు కలెక్టరేట్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆన్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ సమావేశం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డ్రగ్స్ నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. సరఫరా, డిమాండ్ తగ్గింపు, అవగాహన, పునరావాసం అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ సరఫరా గొలుసును పూర్తిగా గుర్తించి ధ్వంసం చేసే దిశగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాహనాల తనిఖీలు కట్టుదిట్టం చేయడం, అనుమానాస్పద ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం, అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రోడ్లు, రైల్వేలు, సముద్ర మార్గాల్లో తనిఖీలను తప్పనిసరి చేస్తామన్నారు. అంతర్రాష్ట స్మగ్లింగ్పై ముఖ్యంగా విశాఖపట్నం మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నామన్నారు. అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం, డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా విచ్ఛిన్నం చేయడం, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను విస్తరించడం, స్థానిక మీడియా ద్వారా ప్రచారాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీటీఏ నిరసన
నెల్లూరు(టౌన్): ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలంటూ బీటీఏ నేతలు బుధవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేడి రమేష్ మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు ఇంతవరకు బకాయిలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలవుతున్నా ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. కార్యక్రమంలో నేతలు మాస ప్రసాద్, మనోజ్కుమార్, శ్రీనివాసులు, రవి, శంకరయ్య, శ్రీనివాస్, విజయమ్మ, మల్లికార్జునరావు, గణపతి తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్య నేత అండతో..
అక్కడ అంకణం భూమి ధర అక్షరాలా లక్ష రూపాయలకు పైమాటే. అందులోనూ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న బిట్ కావడంతో మరింత రేటు పలికే అవకాశమూ ఉంది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ల్యాండ్పై నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత కన్నుపడింది. ఇంకేముంది సర్వేపల్లి నియోజకవర్గ ముఖ్య నేత అండతో దీన్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. దాదాపు రూ.రెండు కోట్ల విలువజేసే దీన్ని ఆక్రమించడమే కాకుండా నిర్మాణ పనులను జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా, చోద్యం చూడటం జిల్లా ఉన్నతాధికారుల వంతవుతోంది. సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీలో భూ బకాసురుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా, దాన్ని ఆక్రమించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల గవర్నమెంట్ ల్యాండ్స్ అన్యాక్రాంతమవుతున్నా, వాటిని కాపాడే దిశగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. దీంతో కబ్జాదారులు మరింత చెలరేగిపోతూ, ఎక్కడ జాగా కనిపించినా అక్కడే పాగా వేసేందుకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా ఈ ఉదంతానికి సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం వేదికై ంది. ధరలు ౖపైపెకి.. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట, కాకుటూరు గ్రామాలు నెల్లూరు నగరానికి ఆనుకొని ఉన్నాయి. దీంతో జాతీయ రహదారి పక్కన వివిధ పరిశ్రమలు, కార్ల షోరూమ్లను నెలకొల్పుతుండటంతో ఇక్కడ భూముల ధరలు రూ.కోట్లల్లో పలుకుతున్నాయి. కాకుటూరు గ్రామంలో లోపలి భాగంలోనే అంకణం ధర ప్రస్తుతం రూ.లక్ష పలుకుతోందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జాతీయ రహదారిని ఆనుకొని పడమర వైపున సర్వే నంబర్ 84లో 14 సెంట్లు.. సర్వే నంబర్ 85లో 22 సెంట్లు.. ఇలా 36 సెంట్ల (180 అంకణాలు) ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఇది అక్షరాలా రూ.రెండు కోట్లకుపైగా పలుకుతోంది. గతంలో ప్రజావసరాలకు.. ఈ భూమిని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రం, లైబ్రరీ, పాల కేంద్రాల నిర్మాణాల కోసం కేటాయించినట్లు రీ సర్వే రికార్డుల్లో నమోదై ఉంది. అంగన్వాడీ భవనానికి ఐదు.. పాల కేంద్రం కోసం నాలుగు.. లైబ్రరీ కోసం ఐదు సెంట్లను కేటాయించారనే అంశం రికార్డుల్లో ఉంది. ఇదే విషయాన్ని చెప్తున్నా, అక్రమార్కులు ఏ మాత్రం లెక్క చేయకుండా పనులను సాగిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకొని.. ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూ.రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై టీడీపీ నేత కన్ను సర్వేపల్లి ముఖ్య నేత అండతో ఆక్రమణ శరవేగంగా నిర్మాణ పనులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు కాకుటూరులో ఇదీ తంతు ఈ విలువైన భూమిపై నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత కన్ను పడింది. ఎలాగైనా దీన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కుట్రలు పన్నారు. సర్వేపల్లి ముఖ్య నేత అండతో దీన్ని కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. వెంటనే ఇక్కడ ప్రహరీ, రూమ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా, ప్రయోజనం శూన్యమవుతోంది. -
ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్ల ర్యాలీ
నెల్లూరు(అర్బన్): దర్గామిట్టలోని ఎల్ఐసీ డివిజన్ కార్యాలయం నుంచి కిమ్స్ ఆస్పత్రి, కేవీఆర్ పెట్రోల్ బంకు, ఆర్టీసీ మీదుగా తిరిగి సంస్థ కార్యాలయం వరకు ఎల్ఐసీ సిటీ బ్రాంచ్ 1, 2, సీఏబీ బ్రాంచ్ ఉద్యోగులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, పలువురు ఏజెంట్లు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ బి.ప్రసాద్రావు మాట్లాడుతూ బీమా రంగంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ మాత్రమేనన్నారు. ఎల్ఐసీ సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో రకాల పాలసీలను ప్రవేశపెట్టిందన్నారు. నవజీవన్శ్రీ సింగిల్ ప్రీమియం పాలసీకి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ వస్తోందన్నారు. ఒక్కసారి ప్రీమియం చెల్లించి 5, 10, 15, 20 సంవత్సరాలపాటు టర్మ్ తీసుకునే సదుపాయం ఇందులో ఉందన్నారు. రాబడి, రిస్క్ కవర్, గ్యారెంటీ అడిషన్స్ కలిపిన పాలసీ ఈనెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ రామకృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు. -
కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్వాజ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. సీపీఐ కార్యాలయంలో వారు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యాన్ని రైస్మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రైతుల్ని ఆదుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సిరాజ్, లీలామోహన్, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ ప్లాంట్ను కూల్చివేయడం దారుణం
● మంత్రి నారాయణ ఆగడాలకు అంతే లేదు ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరురూరల్: నెల్లూరు 46వ డివిజన్లో ఏసీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ వద్దనున్న వాటర్ ప్లాంట్ను మున్సిపల్ అధికారులు నోటీలివ్వకుండా కూల్చివేయడం దారుణమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ప్లాంట్ను ఆయన నేతలతో కలిసి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా పేద, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ప్యూరిఫైడ్ వాటర్ అందిస్తున్న ప్లాంట్పై కక్ష ఏమిటని ప్రశ్నించారు. మంత్రి నారాయణ విద్యావంతుడై ఉండి పేద ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇటువంటి దుర్మార్గాలకు ఎందుకు పాల్పడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వాళ్ల కార్యకర్తలకు దోచిపెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నగరంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఇలాగైతే పేదల బతుకు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి తన అనుయాయులకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ రోడ్లు తవ్వేందుకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఉపయోగపడే పనులు ఒక్కటైన నారాయణ చేశారా అని నిలదీశారు. పెద్దల పక్షాన నిలబడి పేదలకు ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో త్వరలో బయటపెడతానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఎండీ ఖలీల్ అహ్మద్, 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేశ్వరరావు, పార్టీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు ధనుజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దాడులను అరికట్టడంలో ‘కూటమి’ విఫలం
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ నెల్లూరు(బృందావనం): రాష్ట్రంలో దళితులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆలిండియా వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. నెల్లూరు పురమందిరం ప్రాంగణంలోని వర్థమాన సమాజం సమావేశ మందిరంలో అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్నెన్నడూ లేని విధంగా దళితులపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోయాయన్నారు. అయినా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోసం ఇప్పటికే ఉన్న కోర్టులను ఫాస్ట్ట్రాక్ కోర్టులుగా మార్చి నిందితులకు తక్షణమే శిక్షలుపడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు బెల్లంకొండ గోపి, కె.రమేష్; మధు, వివేక్, పెంచలయ్య, సుధాకర్, చంటి తదితరులు పాల్గొన్నారు. -
కబ్జా కోరల్లో పాతూరు చెరువు
వింజమూరు(ఉదయగిరి):వింజమూరులోని పాతూరు చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఇళ్ల స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కోట్లాది రూపాయల విలువ జేసే చెరువు స్థలాన్ని దర్జాగా ఆక్రమించి ఇళ్లు నిర్మించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కొందరు మీడియేటర్లు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకొని ఇరిగేషన్ అధికారులను మేనేజ్ చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రస్తుతం చెరువులో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయినా ఇరిగేషన్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15 ఎకరాల వరకు ఆక్రమణ పాతూరు చెరువు విస్తీర్ణం అధికారిక లెక్కల ప్రకారం 287 ఎకరాలుండగా, అందులో సుమారు 15 ఎకరాల వరకు కబ్జాకు గురయ్యాయని ఇరిగేషన్ అధికారులే చెప్తున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం కబ్జాకు గురైన స్థల విలువ రూ.పది కోట్లకు పైమాటే. ఆక్రమణల తొలగింపుపై దృష్టి సారించని అధికారులు పాతూరు ఇరిగేషన్ చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా మార్చి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. వచ్చే నెల 1న వింజమూరుకు సీఎం రానున్నారు. ఈ నేపథ్యంలో పాతూరు చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా మార్చేందుకు అవసరమైన నిధులు రాబట్టే యత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో చెరువులోని చెట్లు తొలగించి, గుంతలు పూడ్చి కట్టను శుభ్రం చేస్తున్నారు. అంతేకాకుండా డ్వామా అధ్వర్యంలో బంగ్లా సెంటర్ నుంచి ఇరిగేషన్ కార్యాలయం వరకు వాకింగ్ ట్రాక్, పార్కు పనులు చేపడుతున్నారు. ఇందుకోసం రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు ఆక్రమణల తొలగింపు దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇరిగేషన్ కార్యాలయం నుంచి బాలికల వసతి గృహం వరకు రూ.కోట్ల విలువైన సుమారు 500 అంకణాల చెరువు స్థలంలో ఆక్రమణలున్నాయి. వీటిని తొలగించి పార్కు, వాకింగ్ ట్రాక్ పనులు చేపడితే పట్టణ వ్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదో అంతు పట్టడం లేదు. ఇప్పుడు ఆక్రమణలను తొలగించకపోతే భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగే అవకాశం ఉంది. ఆక్రమణదారులకు గతంలో నోటీసులు చెరువు పైభాగంలో సుమారు ఐదెకరాల వరకు ఆక్రమించి కొందరు పంటలను సాగుచేస్తున్నారు. అలాగే పట్టణ సమీపంలో సుమారు 50 మందికిపైగా చెరువును ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. భారీ వర్షాలు పడి చెరువు నిండితే దాదాపు ఇళ్లు మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా ఆక్రమణదారులకు నోటీసులను సైతం ఇరిగేషన్ అధికారులు గతంలో ఇచ్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో గానీ ఆక్రమణల తొలగింపు దిశగా ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుతం చెరువుల అభివృద్ధి పనులను చేపడుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు చొరవ చూపి ఆక్రమణలను తొలగించి హద్దులను ఏర్పాటు చేసి చుట్టూ కట్టను నిర్మిస్తే భవిష్యత్తులో ఇవి జరిగే అవకాశం ఉండదు. ఈ విషయమై స్థానిక ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ.. ఆక్రమణల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ఈలు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని బదులిచ్చారు. రూ.కోట్ల విలువజేసే చెరువు స్థలం ఆక్రమణ దర్జాగా గృహ నిర్మాణాలు కొన్నేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న పర్వం అయినా పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపడుతున్నా తొలగించకపోవడంపై విమర్శలు -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృత్యువాత
నెల్లూరు సిటీ: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందిన ఘటన నెల్లూరులోని ప్రధాన బస్టాండ్లో మంగళవారం రాత్రి జరిగింది. అధికారుల కథనం మేరకు.. విజయవాడ డిపోకు చెందిన బస్సు తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో నెల్లూరు బస్టాండ్కు చేరుకుంది. డ్రైవర్గా ఉన్న వ్యక్తి.. ఎంఎస్ రావు అనే రెండో డ్రైవర్ను పలుమార్లు పిలిచాడు. అయితే అతని నుంచి స్పందన లేకపోవడంతో వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి అప్పటికే ఎంఎస్ రావు మృతిచెందినట్లు నిర్ధారించారు. అతను గుండెపోటుతో చనిపోయినట్లు ప్రజా రవాణా అధికారిణి షమీమ్ తెలిపారు. బస్సులో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు డిపో 1 మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఉర్దూ స్కూళ్లలో రికార్డుల పరిశీలన
ఆత్మకూరు: పట్టణంలోని ఎల్ఆర్పల్లి, టెక్కే, తూర్పువీధి ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లో రికార్డులను మంగళవారం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (ఉర్దూ) షేక్ ఖాజా మొహిద్దీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. కష్టపడి చదవాలని సూచించారు. ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో బోధించాలన్నారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఈనెల 31 వరకు జీఎఫ్ఎల్ఎన్, లైన్ అసిస్మెంట్ సర్వే ఉంటుందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట హెచ్ఎం రియాజ్, పలు పాఠశాలల టీచర్లున్నారు. -
తమిళనాడు బోట్ల నియంత్రణకు చర్యలు
● మంత్రి కొల్లు రవీంద్ర నెల్లూరు(దర్గామిట్ట): తమిళనాడు బోట్ల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఎకై ్సజ్, గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సముద్రంలో చేపల వేటకు అక్రమ బోట్ల ప్రవేశాన్ని పూర్తిగా నివారించడం, జువ్వలదిన్నె మత్స్యకారుల సమస్యపై నియమించిన కమిటీ సభ్యులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు రవీంద్ర, ఎన్ఎండీ ఫరూఖ్, ఆనం రామనారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ టాస్క్ఫోర్స్ బృందంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ తీరంలో మెకనైజ్డ్ బోటుతో గస్తీని ముమ్మరం చేసినట్లు చెప్పారు. వేట నిషేధ సమయం పూర్తయ్యేలోగా మరో రెండు బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ అజిత, ఫిషరీస్ కమిషనర్ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కబళిస్తున్న క్షయ
● వ్యాధి సోకితే అనారోగ్యంతోపాటు ఆర్థికంగా తీవ్ర నష్టం● జిల్లాలో 15 వేల మందికి పైగా రోగులు ●నెల్లూరు(అర్బన్): టీబీ (క్షయ) వ్యాధి గతంలో జిల్లాలో తగ్గుముఖం పట్టింది. కానీ చాపకింద నీరులా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మురికినీటి ఆవాసాలు, అపరిశుభ్రత ఉండే ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువగా టీబీ బారినపడుతున్నారు. ఇది అంటువ్యాధి. ఒకరినుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. ఇంట్లో పెద్దకు టీబీ సోకినప్పుడు ఆ వ్యక్తి సక్రమంగా వైద్య చికిత్స పొందినా కోలుకోవాలంటే 6 నెలలు నుంచి 9 నెలలు పడుతుంది. ఈలోపు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మార్చి నెల 24వ తేదీని ప్రపంచ టీబీ నివారణ దినోత్సవంగా ప్రకటించింది. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా వస్తుంది క్షయ (టీబీ) అనేది మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా ఊపిరితిత్తులపై (లంగ్స్) దాడి చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఎముకలు, చర్మం ఇలా ఏ భాగానికై న టీబీ రావొచ్చు. దగ్గు, తుమ్ములు, గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధిగా వ్యాపిస్తుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం జిల్లాలో 15 వేల మందికిపైగా టీబీ రోగులున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో గుర్తించిన లెక్కలే ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. తమకు టీబీ ఉన్నట్టు తెలిస్తే సమాజం చులకనగా చూస్తుందన్న భావన కొందరిలో ఉంది. దీంతో ప్రైవేట్ వైద్యశాలల్లో గుర్తించే కేసులు ఎక్కువ శాతం బయటకు పొక్కకుండా రోగులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో టీబీ సోకిన వారిలో ఇమ్యూనిటీ తగ్గి ఇతర వ్యాధులు కూడా త్వరగా సోకి ప్రతి సంవత్సరం సుమారు 100 మంది వరకు మృత్యువాత పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్తో బాధపడేవారు, పౌష్టికాహార లోపంతో బలహీనంగా ఉండే వారు, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడే వారు, మద్యం, ధూమపానం, షుగర్ ఉండే వారికి త్వరగా టీబీ సోకుతుంది. ఇదీ పరిస్థితి జిల్లాలో వైద్యశాఖ 2024లో 83,381 మందికి, 2025లో 1,08,711 మందికి టీబీ పరీక్షలు చేసింది. ఈ సంవత్సరం కొత్తగా 3,883 కేసులను గుర్తించారు. వీరితోపాటు టీబీ, హెచ్ఐవీ కలిగిన వారు 166 మంది, టీబీతోపాటు ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్న వారు 542 మంది ఉన్నారు. ఇప్పటికే వైద్యశాఖ ద్వారా ట్రీట్మెంట్ పొందుతున్న టీబీ రోగులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులను కలిపితే 15 వేల మందికి పైగా వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. టీబీ సోకిన వారు ఆరోగ్య పరిస్థితిని బట్టి 6 నెలల నుంచి 9 నెలల వరకు చికిత్స తీసుకోవాల్సి ఉంది. సక్రమంగా మందులు వాడకపోవడంతో మొండి టీబీగా (ఎండీఆర్టీ) మారిన కేసులు 196 ఉన్నాయి. వీరు రెండు నుంచి మూడేళ్లు చికిత్స పొందాల్సి ఉంది. జిల్లాలో 13 టీబీ యూనిట్స్ ఉన్నాయి. నెల్లూరులో ఒక టీబీ కేంద్రం ఉంది. రోగులను పరీక్షించేందుకు జిల్లా కేంద్రంలో ఒక సీబీ నాట్ జీన్ ఎక్స్పర్ట్ కేంద్రం ఉంది. 24 ఆర్టీపీసీఆర్ (ట్రూనాట్) మెషీన్లు, 92 గళ్ల పరీక్షా కేంద్రాలున్నాయి. -
సమాచారమివ్వకుండా ఎలా కూలుస్తారు?
● వాటర్ ప్లాంట్ కూల్చివేతపై కమిషనర్ను ప్రశ్నించిన కార్పొరేటర్ ● సరైన సమాధానం ఇవ్వని నందన్నెల్లూరు(బారకాసు): ప్రజల దాహార్తి తీర్చేందుకు 2019లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా కూలుస్తారని నెల్లూరు 46వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ కమిషనర్ నందన్ను ప్రశ్నించారు. మంగళవారం కమిషనర్ ఆ డివిజన్లోని చిన్నబజార్ ప్రాంతంలో పర్యటించారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న వాటర్ ప్లాంట్ను సోమవారం కార్పొరేషన్ అధికారులు దుర్మార్గంగా కూలదోసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కమిషనర్ ప్లాంట్ను అధికారులతో కలిసి పరిశీలించారు. అదే సమయంలో అక్కడికి కార్పొరేటర్ చేరుకుని కూల్చివేతపై కమిషనర్తో మాట్లాడారు. కానీ నందన్ మాత్రం ఉమామహేష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. కార్పొరేషన్కు చెందిన స్థలం కాబట్టి అప్పట్లో వాటర్ ప్లాంట్ అవసరమని అనుమతి ఇచ్చాం.. ఇప్పుడు అవసరం లేదని, ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని ప్లాంట్ను తొలగించాల్సి వచ్చిందని కమిషనర్ చెప్పారు. దీంతో ఉమామహేష్ అభివృద్ధి విషయంలో తాను సహకరిస్తానని అయితే కార్పొరేషన్ అనుమతితో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను తొలగించాల్సి వస్తే కనీసం సమాచారం కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారని, అంతేకాకుండా తమ మనోభావాలు దెబ్బతీసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ఇటువంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. -
జాగ్రత్తలు తప్పనిసరి
టీబీపై ప్రజలు ముందుగా అవగాహన పెంచుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. మనిషి శారీరకంగా బలంగా ఉంటే టీబీ సోకదు. ఒకవేళ వచ్చినా భయపడాల్సిన పని లేదు. క్రమం తప్పకుండా మందులు వాడితే తగ్గిపోతుంది. – డాక్టర్ అరుణ, పల్మనాలజిస్ట్, హెచ్ఓడీ ప్రభుత్వ సర్వజనాస్పత్రి, నెల్లూరు ఉచితంగా టీబీ పరీక్షలు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో టీబీ పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. రెండు వారాలకు మించి దగ్గు వస్తున్నా.. గళ్ల పడుతున్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ క్షయ ఉంటే అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచి మంచి మందులు అందించడంతోపాటు పౌష్టికాహారానికి నగదు అందజేస్తున్నాం. – డాక్టర్ ఖాదర్వలీ, జిల్లా టీబీ, ఎయిడ్స్ నివారణాధికారి ● -
ఎస్సీ, ఎస్టీలకు కరెంట్ కట్
● రూ.వేలల్లో బిల్లులు ● చెల్లించాలంటూ సరఫరా నిలిపివేసిన ట్రాన్స్కో అధికారులు ● అల్లాడిపోతున్న వృద్ధులు, చిన్నారులు బిట్రగుంట: బోగోలు మేజర్ పంచాయతీలోని జగనన్న కాలనీల్లో నివసిస్తున్న పేద దళిత, గిరిజనులపై ట్రాన్స్కో అధికారులు అనుచితంగా వ్యవహరించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా రూ.వేలల్లో బిల్లులు చెల్లించాలంటూ ఒక్కసారిగా మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వృద్ధులు, చిన్నారులు చిమ్మచీకట్లో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అధికారుల దురుసు ప్రవర్తనపై దళిత సంఘాల నేతలు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధితుల కథనం మేరకు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు జగనన్న కాలనీల్లో పక్కాఇళ్లు నిర్మించి ఉచిత మీటర్లు బిగించి విద్యుత్ కనెక్షన్లు కూడా మంజూరు చేశారు. అక్కడ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు నివాసముంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కాలనీకి వచ్చిన అధికారులు ఒక్కొక్కరు రూ.వేలల్లో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. అప్పటికప్పుడు బిల్లులు చెల్లించలేని సుమారు పదికి పైగా ఇళ్లకు కరెంట్ కట్ చేసి వెళ్లిపోయారు. కనీసం డిమాండ్ నోటీసు ఇచ్చి గడువు కూడా కేటాయించకుండా దుర్మార్గంగా వ్యవహరించడంతో ఆయా కుటుంబాల్లోని వృద్ధులు, పిల్లలు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో విషసర్పాల బెదడ ఎక్కువగా ఉండటంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు కరెంట్ చేసిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు మద్దిబోయిన వీర రఘు, మేకల శ్రీనివాసులు తదితరులు కాలనీకి చేరుకుని బాధితులతో మాట్లాడారు. కనీస గడువు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మండిపడ్డారు. అధికారుల అనుచిత వైఖరిపై ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి అంకయ్య కావలి: అర్హులైన నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య డిమాండ్ చేశారు. మంగళవారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎలీషాకు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరంం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం అందించాలని కోరారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి, యానాది సమాఖ్య అధ్యక్షురాలు బాపట్ల సత్యవతమ్మ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను బ్యాంకర్లు వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలను మాఫీ చేయకుండా, ఇప్పుడు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం అన్యాయమన్నారు. సచివాలయాల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న పేదలకు సరైన సమాధానం రావడం లేదన్నారు. అర్హత లేదంటూ కుంటిసాకులతో ఆన్లైన్లో దరఖాస్తులు తిరస్కరిస్తున్నారని చెప్పారు. ఆర్డీఓ ప్రత్యేక చొరవ తీసుకుని అర్హులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగరాజు, నాయకులు మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త నియోజకవర్గాల విభజనపై ఊహాగానాలు, చర్చలు
లోక్సభ, శాసన సభల నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీట్ల సంగ్రామం ప్రారంభమైంది. కేంద్రం ప్రతిపాదనల మేరకు జిల్లాలో ప్రస్తుతం ఉన్న స్థానాల్లో 50 శాతం మేర అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరగనున్నాయి. తాజా నిర్ణయాల మేరకు కొత్తగా వచ్చే నియోజకవర్గాల రూపకల్పనపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఏఏ మండలాలతో కొత్త నియోజకవర్గాలు వస్తాయో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన జరిగితే.. 15 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేసే క్రమంలో ఐదు అసెంబ్లీ సీట్లు కచ్చితంగా మహిళలకు దక్కుతాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన షురూ కావడంతో చట్ట సభల్లోకి అడుగు పెట్టాలనే ఆశావహుల్లో ఆనందం వెల్లివిరిసింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గాల పునర్విభజన, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నప్పటికీ 2021లో జనగణన జరగకపోవడంతో ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. 2026–27 మధ్య జనగణన పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ మేరకు 2029 ఎన్నికల నాటికి మారుతాయంటూ అంచనాల్లో ఉన్నారు. అయితే ఊహించని విధంగా 2011 జనాభా ప్రాతిపదికనే ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 50 శాతం స్థానాలు పెరిగే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్నాళ్లు గానో ఊహలు, అంచనాల్లో ఉన్న ఈ ప్రక్రియకు లైన్ క్లియర్ కావడంతో రాజకీయ పార్టీల్లోని ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ఐదు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల పెంపు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, గూడూ రు, సూళ్లూరుపేట నియోజకవర్గాలున్నాయి. జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతో కలిపి నెల్లూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతో కలుపుకొని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో గూడూరు, సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానాలు, తిరుపతి పార్లమెంట్ ఎస్పీ రిజర్వ్ స్థానాలుగా ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రతిపాదనల మేరకు ఒక్కో నియోజకవర్గానికి 1.6 లక్షల ఓటర్ల లెక్కన విభజన చేస్తే కొత్తగా మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు.. మరో పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. మొత్తంగా 15 అసెంబ్లీ స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ సీట్లు ఏ ప్రామాణికంగా విభజన చేస్తారోనని ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఉమ్మడి నెల్లూరులోనే రెండు పార్లమెంట్ స్థానాలు ఇప్పటి వరకు నెల్లూరు పార్లమెంట్ జనరల్గా ఉంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరితోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరుతో కలిపి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంది. ఇక ఉమ్మడి జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి తిరుపతి ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంది. తాజాగా పెరిగే నియోజకవర్గాలతో కలుపుకొంటే.. నెల్లూరు (జనరల్) పార్లమెంట్తోపాటు గూడూరు (ఎస్సీ రిజర్వ్) పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఐదు అసెంబ్లీ స్థానాలు మహిళలకే ఉమ్మడి నెల్లూరులో కొత్తగా 5 అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. ఐదు స్థానాలు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో గూడూరు, సూళ్లూరుపేట ఎస్పీ రిజర్వ్డ్ స్థానాలుగా ఉన్నాయి. మిగతా ఎనిమిది జనరల్ స్థానాలు కావడంతో ఈ స్థానాల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంది. తాజాగా ఐదు స్థానాలు పెరిగితే.. మొత్తం స్థానాల్లో ఐదు కేవలం మహిళలకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర తాజా నిర్ణయంతో ఆశావహుల్లో ఆనందం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఐదు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సీట్ల పెరుగుదల కొత్త నియోజకవర్గాల రూపకల్పనపై రకరకాల అంచనాలు ఏ మండలం ఏ నియోజకవర్గంలోకి వస్తుంది.. కొత్తగా వచ్చే నియోజకవర్గాలపై చర్చలు 33 శాతం మహిళా రిజర్వేషన్తో ఐదు అసెంబ్లీ సీట్లు మహిళలకే 1.6 లక్షల ఓటర్లకు ఒక నియోజకవర్గంగా విభజన చేస్తే జిల్లాలో కొత్త నియోజకవర్గాల పునర్విభజన ఇలా జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గా ల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పాత నియోజకవర్గాల సరిహద్దులు సమూలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పాత అల్లూరు, రాపూరుతోపాటు కొత్తగా నెల్లూరు నగరంలో ఒకటి, బుచ్చిరెడ్డిపాళెం, నాయుడుపేట, కావలి రూరల్, వింజమూరు కేంద్రాలుగా వీటిల్లో కొత్తగా మూడు నియోజకవర్గాలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో ఊహాల ఊసులు ఊపందుకున్నాయి. నెల్లూరు సౌత్, నార్త్, సెంట్రల్, కోవూరు, అల్లూరు, కావలి, వింజమూరు, ఉదయగిరి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, సర్వేపల్లి, గూడూరు, రాపూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట నియోజకవర్గాలుగా ఏర్పడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊహాగానాలు ఊపందుకున్నాయి. -
దిగజారిన ధాన్యం ధరలు
మర్యాదపూర్వకంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి.. ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ● రూ.22 వేల నుంచి రూ.17 వేలకు పతనం ● సిండికేటైన రైస్మిల్లర్లు, దళారులు, వ్యాపారులు ● సీఎమ్మార్కు గోతాలివ్వకుండా జాప్యం ● ఫలితంగా తక్కువ ధరలకే విక్రయిస్తున్న రైతులు ● పుట్టికి 850 కిలోలకు బదులు 950 ● తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు నెల్లూరు(పొగతోట): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించక తక్కవ్లకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో పుట్టి (850 కిలోల) ధా న్యం ధర రూ.22 వేల నుంచి రూ.23 వేల మేర ప ది రోజుల క్రితం వరకు ఉండింది. అయితే మిల్లర్లు, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రేట్లను తగ్గించేశారు. శాసిస్తున్న దళారులు పుట్టి ధాన్యాన్ని రూ.16 వేల నుంచి రూ.17 వేలకు ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశముందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతల తర్వాత ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేందుకు వెసులుబాటు లేకపోవడంతో దళారులు చెప్పిన మొత్తానికే విక్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. చేసేది లేక రైతులు దీనికి అంగీకరించాల్సి వస్తోంది. రేట్లు లేకపోవడం, దిగుబడి తక్కువగా ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని అయోమయ పరిస్థితుల్లో వారున్నారు. మద్దతు ధరేదీ..? జిల్లాలో ఈ సీజన్లో సుమారు 7.7 లక్షలెకరాల్లో వరిని సాగు చేశారు. గ్రేడ్ – ఏ ధాన్యం క్వింటాల్కు రూ.2389 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. అదే సాధారణ రకం క్వింటాల్కు రూ.2369 మేర నిర్ణయించింది. అయితే ఈ రేట్లు రైతులకు లభించడంలేదు. ఇతర జిల్లాల నుంచి రైస్మిల్లర్లు, వ్యాపారులు రాకపోవడంతో ధాన్యం ధరలు పతనమవుతున్నాయి. గతం.. ఎంతో ఘనం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2022 – 24 మధ్య ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి రైస్ మిల్లర్లు, వ్యాపారులను అప్పటి జిల్లా యంత్రాంగం ఆహ్వానించింది. వ్యాపారుల మధ్య పోటీత త్వం పెరిగి పుట్టి ధాన్యాన్ని రూ.27 వేల నుంచి రూ. 28 వేలకు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం దీన్ని విస్మరించడంలో అన్నదాతలు కుదేలవుతున్నారు. మరోవైపు జిల్లాలోని కొంత మంది దళారులు, వ్యాపారులు.. నాణ్యత లేని ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు తీసుకెళ్లి వారికి చూపించారనీ.. ప్రస్తుత సీజన్లో ఇలానే ఉందని నమ్మించడంలో కొనుగోళ్లకు వారు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఇందుకూరుపేట మండలానికి చెందిన రైతు మస్తాన్వలీ నాలుగెకరాల్లో వరిని సాగు చేశారు. కోతల అనంతరం 13 పుట్ల ధాన్యం దిగుబడొచ్చింది. అదే వాతావరణం అనుకూలించి ఉంటే 15 నుంచి 16 పుట్ల వరకు వస్తుంది. పుట్టి ధాన్యాన్ని రూ.17 వేల చొప్పున విక్రయించారు. తేమ శాతం అధికంగా ఉందనే కారణాన్ని చూపుతూ 850 కిలోలకు బదులు 950 కిలోలను తీసుకున్నారు. సంగం మండలానికి చెందిన రామసుబ్బారెడ్డి.. ఐదెకరాల్లో బీపీటీని సాగు చేశారు. సుమారు 17 పుట్ల ధాన్యం దిగుబడొచ్చింది. సీఎమ్మార్కు ఇచ్చేందుకు యత్నించగా, గోతాల్లేవంటూ జాప్యం చేశారు. గత్యంతరం లేక దళారిని సంప్రదించారు. భూములకు సంబంధించిన పత్రాల జిరాక్స్లను తీసుకొని బేరం కుదర్చుకున్నారు. రెండు గంటల్లోపు గోతాలు, లారీ వచ్చి ధాన్యాన్ని లోడ్ చేసుకెళ్లింది. పుట్టికి రూ.16,500ను చెల్లించేలా మాట్లాడుకున్నారు. రైతు బ్యాంక్ ఖాతాలో నగదు జమయ్యాక అదనంగా వచ్చిన నగదు దళారీకి ఇవ్వాల్సి ఉంది. పుట్టికి అదనంగా 90 కిలోల ధాన్యాన్ని తీసుకోవడంతో ఈయన నష్టపోయారు. ఇదే తరహాలో జిల్లాలో వేలాది మంది రైతులు ఏటా ఆర్థికంగా చితికిపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. తక్కువ ధరలకు కొనుగోలు చేసే వారిపై చర్యలు తప్పవు రైతులు వారికి సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రదించి విక్రయించాలి. అక్కడ మద్దతు ధర లభిస్తోంది. అన్నదాతలు నష్టపోకుండా చూస్తున్నాం. – మొగిలి వెంకటేశ్వర్లు, జేసీ -
నష్టం కలిగిస్తే సహించేదిలేదు
నెల్లూరు(పొగతోట): బ్యాంక్ గ్యారెంటీలివ్వకుండా.. గోతాలను సకాలంలో సరఫరా చేయకుండా.. సీఎమ్మార్ విషయంలో రైస్మిల్లర్లు జాప్యం చేస్తున్న తరుణంలో, పలు మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలను జేసీ వెంకటేశ్వర్లు మంగళవారం చేపట్టారు. తమకు మంత్రులు.. ఎమ్మెల్యేలు తెలుసునని.. మంత్రి ఇంట్లో మూడు నెలలు ఉన్నామని.. మాకు రావాల్సిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని మంత్రి ఇప్పించారని.. ఒక్క అవకాశమిస్తే బ్యాంక్ గ్యారెంటీలిస్తామంటూ జేసీని మిల్లర్లు ప్రాధేయపడ్డారు. రికార్డులను చూపాలని ఆయన అడగ్గా, మిల్లర్లు నీళ్లు నమి లారు. ట్రక్ షీట్లు లేకుండా ధాన్యం అన్లోడ్ చేయడం తదితరాలను పరిశీలించారు. అధికార పార్టీ నేతలతో మిల్లర్లు ఫోన్లు చేయించారు. 24 గంటల్లో బ్యాంక్ గ్యారెంటీలిచ్చేందుకు.. గోతా లను సరఫరా చేసేందుకు మిల్లర్లు అంగీకరించారు. అనంతరం జేసీ మాట్లాడారు. ధాన్యానికి మద్దతు ధరలివ్వకుండా నష్టపర్చే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ధాన్యం ధర లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయని పేర్కొన్నారు. డీఎస్ఓ లీలారాణి, డీఎం అర్జున్రావు, ఏఎస్ఓలు లక్ష్మీనారాయణరెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాకాణితో ప్రసన్న భేటీ
నెల్లూరురూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి పలు విషయాలపై చర్చించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ ఏఓ సస్పెన్షన్ నెల్లూరు(పొగతోట): డీపీఆర్సీ నిధులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల విషయంలో అవకతవకలు జరగడంతో జెడ్పీ పరిపాలనాధికారి ఆర్సీఎస్ వర్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి మంగళవారం జారీ చేశారు. శిక్షణకు సంబంధించిన నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడి సమాచారాన్ని అఽధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా, నకిలీ బిల్లులు పెట్టి పక్కదారి పట్టించారు. సీఈఓ చాంబర్లో ఫైల్ ఉండగా, అధికారి లేని సమయంలో తెప్పించుకొని బిల్లులను ప్రాసెస్ చేయించారు. శిక్షణ కార్యక్రమాల విషయంలో మండలాధికారులను ఫోన్ల ద్వారా బెదిరించి అధిక మొత్తాలకు బిల్లులు సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎఫ్ విభాగ ఏఓను సస్పెన్షన్ వేటు విధించారు. డీటీఎం సరెండర్ శిక్షణ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధిక బిల్లులు సమర్పించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ యహేషువాను ఏపీఎస్సైఆర్డీకి సరెండర్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి జారీ చేశారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 81,483 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 30,777 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.5.12 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. హంస వాహనంపై రాములోరి వైభవం సంగం: మండలంలోని సిద్ధీపురం గ్రామంలో ఉన్న సీతారామస్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు సోమవారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. హంస వాహనంపై స్వామివారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమానికి గౌడ సంఘం ఉభయకర్తలుగా వ్యవహరించింది. -
తిరుమల ప్రతిష్టను దిగజార్చారు
● టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత బీఆర్ నాయుడికి లేదు ● వెంటనే రాజీనామా చేయాలి ● కాకాణి పూజిత సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పవిత్రమైన తిరుమల ప్రతిష్టను బీఆర్ నాయుడు దిగజార్చారని, టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఆయనకు లేదని, తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మంగళవారం ఆమె మాట్లాడారు. బీఆర్ నాయుడు సీ్త్రలోలుడంటూ చంద్రబాబుకు ఓ మహిళ స్వయంగా లేఖ రాశారని, ఇవన్నీ తెలిసినా ఆయన్ను టీటీడీ చైర్మన్ను చేశారని ఆరోపించారు. మహిళా భక్తులెళ్లి నిరసన తెలియజేస్తే, వారిపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కూటమి నేతలకు దేవుడంటే భయం, భక్తీ లేవన్నారు. బీఆర్ నాయుడి టీవీ చానల్లో చంద్రబాబుకు భజన చేస్తారని, అందుకే పదవి నుంచి తొలగించలేదని విమర్శించారు. జగనన్నపై తప్పుడు ప్రచారం చేస్తారనే ఆయన్ను వెనుకేసుకొస్తున్నారన్నారు. ఆయన్ను భువనేశ్వరి సైతం సమర్థించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. భారతమ్మపై అనుచిత వ్యాఖ్యలు హేయం రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడటం, విమర్శించడం పరిపాటి అని.. అయితే దీనికి భిన్నంగా కూటమి నేతలు మాట్లాడటం దారుణమన్నారు. ఏ రోజూ ఎవరి గురించి మాట్లాడని భారతిరెడ్డిపై నోటికొచ్చినట్లు వారు మాట్లాడటం బాధాకరమని తెలిపారు. లోకేశ్, చంద్రబాబు నిద్రలేస్తే తమ తల్లిని అన్నారంటూ గింజుకుంటారని, ఇతరులకు తల్లులు ఉండరానని ప్రశ్నించారు. భారతమ్మపై నోరు పారేసుకుంటే చంద్రబాబు, లోకేశ్కు కనిపించడం లేదానని నిలదీశారు. వారి తరహాలో దిగజారి మాట్లాడటం తమకు చేతకాదని, సంస్కారం అడ్డొస్తోందని చెప్పారు. ఆమైపె ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేదిలేదని, తగిన బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. పేదల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గత సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేశారని గుర్తుచేశారు. భారతమ్మ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఆమైపె మాట్లాడే స్థాయి, అర్హత కూటమి నేతలకు లేదని చెప్పారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రజలను ఏమార్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మాట్లాడుతున్న పూజిత -
ధాన్యం సేకరణపై దృష్టి సారించండి
నెల్లూరు(దర్గామిట్ట): రబీ సీజన్లో అన్నదాతలు పండించిన ధాన్యం సేకరణపై మండల ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మండల ప్రత్యేకాధికారులతో జేసీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ చేపడుతున్న సర్వేపై ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలన్నారు. రైస్మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లోని వసతులను పర్యవేక్షించాలన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, ఈ సమావేశంలో డీఆర్వో విజయకుమార్, డీఎస్ఓ లీలారాణి, డీపీఓ వసుమతి, తదితరులు పాల్గొన్నారు. పది పరీక్షలకు 457 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం పది విద్యార్థులకు గణిత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 28,295 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 27,838 మంది రాశారు. 457 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ బాలాజీరావు ఆరు కేంద్రాలను తనిఖీ చేయగా, 53 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. ఓపెన్ పరీక్షకు 183 మంది గైర్హాజరు ఏపీ ఓపెన్ పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 183 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. సోమవారం నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షకు జిల్లాలో వ్యాప్తంగా 1172 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 989 మంది హాజరయ్యారు. సముద్ర అన్వేషణపై దృష్టి సారించాలి వెంకటాచలం: సముద్ర అన్వేషణ, ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని డీప్ ఓషన్ మిషన్ డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి సూచించారు. కాకుటూరు వద్దనున్న విక్రమసింహపురి వర్శిటీ(వీఎస్యూ)లో ఎమ్మెస్సీ మైరెన్ బయాలజీ విద్యార్థులకు ఫెలోషిప్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రమణమూర్తి మాట్లాడుతూ డీప్ ఓషన్ మిషన్ ద్వారా భారతదేశం సముద్ర అన్వేషణ, వనరుల వినియోగం, స్థిరమైన అభివృద్ధిలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అనంతరం రమణమూర్తి, ఎన్ఐఓటీ బృందం వీఎస్యూను సందర్శించి పలు అంశాలపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చలు జరిపారు. వీఎస్యూ ప్రాంగణంలో మొక్కలు నాటారు. వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు, ఎన్ఐఓటీ ప్రొఫెసర్ బాలాజీ రామకృష్ణన్, డాక్టర్ వినీత్కుమార్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 86,091 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,664 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.21 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ స్పాట్లో అధ్యాపకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జవాబుదారీతనంగా ఉండాల్సిన వారు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గుంపులు గుంపులుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ జవాబు పత్రాలను దిద్దుతుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్పాట్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లకూడదన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. మూల్యాంకన ప్రాంగణంలో యథేచ్ఛగా సెల్ఫోన్ను వినియోగిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా, ఉన్నతాధికారి పర్యవేక్షిస్తున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో ఎగ్జామినర్లు, ఏసీఓలు, స్క్రూటినైజర్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. జవాబు పత్రాలు దిద్దే సమయంలో ఏకాగ్రత లేకపోతే తక్కువ మార్కులు వేయడం లేదా కౌంటింగ్లో తప్పులు దొర్లడం జరుగుతుంది. విద్యార్థులు రీవాల్యూయేషన్, రీ కౌంటింగ్ చేయించుకున్న సమయంలో ఈ తప్పులు బయటపడుతాయి. మూల్యాంకనంలో కఠినంగా వ్యవహరించాల్సిన స్పాట్ వాల్యూయేషన్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అధ్యాపకులు ఇష్టమెచ్చినట్లుగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 22 నుంచి ప్రారంభం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం స్టోన్హౌస్పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో ఈ నెల 22వ తేదీ నుంచి మొదటి స్పెల్ జరుగుతోంది. రెండో స్పెల్ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి స్పెల్లో ఇతర జిల్లాలకు సంబంధించి 3,30,628 జవాబు పత్రాలు జిల్లాకు వచ్చాయి. వీటిల్లో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, తెలుగు, హిందీ, సంస్కృతం, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాలు ఉన్నాయి. మొదటి స్పెల్లో 594 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 41 మంది స్క్రూటినైజర్లు, 12 ఏసీఓలతో కలిపి మొత్తం 647 మంది విధులు నిర్వహిస్తున్నారు. రెండో స్పెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటని, జువాలజీ తదితర సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం జరగనుంది. ఇందుకు 766 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 51 మంది స్క్రూటినైజర్లు, 16 మంది ఏసీఓలు విధులు నిర్వహించనున్నారు. అయితే వీరిలో చాలా మంది అధ్యాపకులు రకరకాల సమస్యలు చెప్పి మూల్యాంకనానికి డుమ్మా కొడుతున్నారు. రీకౌంటింగ్కు విద్యార్థులు ఇంటర్ ఫలితాలు వచ్చిన తరువాత ఎక్కువ మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని రీవాల్యూయేషన్, రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో వారికి గతంలో వచ్చిన మార్కుల కంటే అదనంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అసిస్టెంట్ ఎగ్జామినర్ పేపరు దిద్దిన తరువాత స్క్రూటినైజర్ మళ్లీ పరిశీలించి కౌంటింగ్ చేసిన తరువాతే మార్కులను నమోదు చేస్తారు. ఇంత ప్రక్రియ జరుగుతున్నా మూల్యాంకనంలో తప్పులు దొర్లుతు న్న పరిస్థితి. తక్కువ మార్కులు వచ్చాయంటూ కొద్దిమంది విద్యార్థులే రీవాల్యూయేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. మెజార్టీ విద్యార్థులు ఫీజు చెల్లించలేక మిన్నకుండిపోతున్నారు. దీంతో వారు నష్టపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మూల్యాంకన ప్రక్రియలో అధ్యాపకులు బాధ్యతాయుతంగా వ్యవ హరించి పేపర్లు దిద్దేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలు బేఖాతరు మూల్యాంకనంలో ఇంటర్బోర్డు నిబంధనలను అధ్యాపకులు బేఖాతరు చేస్తున్నారు. స్పాట్కు హాజరయ్యే అధ్యాపకులు తమ సెల్ఫోన్లను మూల్యాంకన అధికారి ఉండే గదిలో ఉంచాలి. ఆ తరువాత మూల్యాంకనం చేసే ప్రదేశానికి వెళ్లాలి. అయితే అందరూ సెల్ఫోన్లను నేరుగా మూల్యాంకన ప్రదేశానికి తీసుకెళుతున్నారు. కొంతమంది అధ్యాపకులు ఓ వైపు మూల్యాంకనం చేస్తూ మరోవైపు సెల్ఫోన్లో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మూల్యాంకనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంది. ఒక్కో పేపరుకు రూ.23.66 చెల్లిస్తున్నారు. అయితే కొంతమంది అధ్యాపకులు సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందుగానే బయటకు వెళుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది గుంపుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పేపర్లు దిద్దుతున్న పరిస్థితి. దీంతో పేపర్లు దిద్దే సమయంలో ఏకాగ్రత లోపించి మార్కుల కేటాయింపు, మార్కుల కౌంటింగ్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. అయినా అధ్యాపకులు ఇవేమి పట్టించుకోకుండా తమకిష్టమొచ్చిన విధంగా పేపర్లను దిద్దుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంటర్ స్పాట్లో ఇష్టారాజ్యం జిల్లాకు 3.30 లక్షల జవాబు పత్రాలు కేఏసీ జూనియర్ కళాశాలలో స్పాట్ 1480 మందికిపైగా అధ్యాపకుల విధులు సీసీకెమెరాల సాక్షిగా ఇంటర్బోర్డు నిబంధనలు బేఖాతరు యథేచ్ఛగా సెల్ఫోన్ల వినియోగం కబుర్లు చెప్పుకుంటూ మూల్యాంకనం తరచూ తప్పులు దొర్లుతున్న వైనం రీ వాల్యూయేషన్, రీకౌంటింగ్లో పెరుగుతున్న మార్కులు స్పాట్లో సెల్ఫోన్లు వినియోగించరాదు మూల్యాంకన ప్రదేశంలోకి ఎవరూ సెల్ఫోన్లు తీసుకెళ్లకూడదు. ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ప్రతిఒక్కరికీ ఆదేశాలు జారీ చేశాం. సెల్ఫోన్ వినియోగిస్తూ పట్టుబడితే చర్యలు తీసుకుంటాం. విడివిడిగా కూర్చుని శ్రద్ధగా మూల్యాంకనం చేయాలి. వచ్చే నెల 9వ తేదీ నాటికి మూల్యాంకనాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. అంతకంటే ముందుగానే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – వరప్రసాదరావు, ఆర్ఐఓ -
నేరాలతో అట్టుడుకుతున్న నెల్లూరు
సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లా పోలీస్ యంత్రాంగం ముందు సినిమా డైరెక్టర్లు సైతం దిగదుడుపే. అధికార పార్టీ నేతలను కంటికి రెప్పలా కాపాడుతూ.. ప్రజలను, శాంతిభద్రతలను గాలికి వదిలేశారు. జిల్లాలో హత్యలు, లైంగిక దాడులు జరిగినా.. టీడీపీ నేతలు నేరాల్లో చిక్కుకున్నా.. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నా.. వారిని రక్షించేందుకు అప్పటికప్పు డు.. పొంతనలేని కట్టుకథలు అల్లడంలో కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్లో అరితేరిపోతున్నారు. టీడీపీ నేతలు ఇటు తప్పులు చేయడం అటు దొరికిపోతే.. పోలీసు లు మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సంచలన ఘటనలు జరిగిన ప్రతిసారి.. టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు నగరంలోని బోడిగాడితోట శ్మశాన వాటికలో సగం కాలిన మృతదేహం బయటపడడం సంచలనంగా మారింది. ఆ వెంటనే పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే ఆత్మహత్యేనంటూ హడావుడిగా ప్రకటన చేయడంతో పాటు మీడియా దృష్టిని మరల్చేందుకు హడావుడిగా లాడ్జీల్లో దాడులు చేశారు. అయితే లాడ్జీల్లో వ్యభిచరిస్తూ భారీ సంఖ్యలో జంటలు పట్టుబడడం, ఇందులో టీడీపీ నేత ఉండడంతో ఇది సంచలనమైంది. ఒక సంచలన ఘటనను కప్పిపుచ్చబోయి.. మరో సంచలన ఘటన వెలుగులోకి రావడంతో పోలీసుల పరిస్థితి గొంతులో వెలక్కాయ ఇరుక్కున్నట్లు అయింది. ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే.. దూడ గడ్డి కోసం’ అనే సామెత చందానా ఉంది.. లాడ్జీలో వ్యభిచరిస్తూ పట్టుబడిన ఓ టీడీపీ నేత పరిస్థితి. పక్కాగా విటులతో అడ్డంగా దొరికిపోతే.. లాడ్జీల్లో టీడీపీ కార్యకర్తల మీటింగ్కు వచ్చాడని, ఆస్పత్రికి ట్రీట్మెంట్ కోసం వచ్చాడంటూ ఇలా పొంతనలేకుండా పోలీసులతోనే చెప్పించి నవ్వుల పాలయ్యారు. నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో చిన్నబజార్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాలుగు లాడ్జీలపై ఆదివారం పోలీస్ అధికారులు ఆకస్మిక దాడులను చేపట్టారు. సాయిగ్రాండ్ లాడ్జీలో వెంకటాచలం మండలం నిడుగుంటపాళేనికి చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి అత్యంత ఆప్తుడు, చవటపాళెం ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణనాయుడు ఓ మహిళతో వ్యభిచరిస్తూ పట్టుబడిన విషయం విదితమే. అయితే ఆ వ్యక్తి టీడీపీ నేత అని పోలీసులకు తెలియకపోవడంతో పట్టుకెళ్లి స్టేషన్లో విటుల మధ్యలోనే కూర్చోబెట్టారు. ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో సదరు వ్యక్తి టీడీపీ నేతగా తెలియడంతో పోలీసులపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. సదరు తమ్ముడిని తప్పించేందుకు ఆస్పత్రికి వచ్చి సేదదీరేందుకు లాడ్జీకి వచ్చాడని, ఆస్పత్రికి వెళ్లినట్లు తమ విచారణలో తేలడంతో వదిలేశామంటూ ఓ పోలీస్ అధికారి చేసిన ప్రకటనతో ఆ శాఖ నవ్వుల పాలైంది. వెంకటాచలం మండలం నిడిగుంటపాళేనికి చెందిన రావూరు రాధాకృష్ణనాయుడు ప్రస్తుతం నెల్లూరు నగరంలోనే నివాసం ఉంటున్నాడు. టీడీపీ కార్యకర్తలను కలిసేందుకు వచ్చాడంటూ.. ఏదో జరుగుతుందని చూసేందుకు వచ్చాడంటూ ఇలా రకరకాల ప్రచారం చేశారు. నెల్లూరులోని కాపురం ఉంటున్న ఆయన ఆస్పత్రికి వచ్చి లాడ్జీలో సేదదీరుతున్నాడంటూ పోలీసులు చేసిన ప్రకటన ఇప్పుడు జిల్లాలో హాట్టాపిక్గా మారింది. తమ్ముళ్లను కాపాడేందుకు పోలీసులు పడుతున్న ఆపసోపాలు చూసి జనం నవ్వుతున్నారు. జిల్లా మత్స్యకారులు తమ జీవనోపాధిని కొల్లగొట్టుతున్న తమిళ జాలర్ల మెకనైజ్డ్ బోట్లను ప్రాణాలకు తెగించి పట్టుకుని వారి అహంకారానికి సవాల్ విసిరారు. ఆ బోట్లను పోలీస్ శాఖకు అప్పగించి వారు సైతం కాపలాగా ఉన్నారు. కానీ టీడీపీ పెద్దలు మత్స్యకారులకు ద్రోహం తలపెట్టి ఆ సామాజిక వర్గ కులపెద్దలను తాయిలాలతో లోబరుచుకుని బోట్లను రాత్రికి రాత్రే విడుదల చేయించారు. మత్స్యకారులకు అండగా ఉండాల్సిన పోలీస్ శాఖ ఈ కుట్రకోణంలో భాగస్వామ్యం కావడం ఆ శాఖ ప్రతిష్టకే మాయని మచ్చగా మారింది. ఆరు రోజులుగా తమకు ద్రోహం చేసిన మత్స్యకారుల పెద్దలను తాళ్లతో నిర్బంధించి నిజాలు రాబట్టారు. దీంతో ఈ వ్యవహారం వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల పేర్లు, పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం తీర ప్రాంతంలోకి పోలీసులు అడుగుపెట్టడానికి కూడా సాహసించలేకపోతున్నారు. తమిళబోట్ల వ్యవహారం బూమ్రాంగ్ కావడంతో టీడీపీ నేతలను కాపాడేందుకు సినీ ఫక్కీ డ్రామాకు తెరతీశారు. ప్రభుత్వ పెద్దలకు, టీడీపీ నేతలకు మద్దతుగా ఎవరైనా అక్కడ అడుగు పెడితే.. ఏమి జరుగుతుందో తెలియడంతో పోలీసులు సరికొత్త డ్రామాకు తెరతీశారు. మత్స్యకారులకు ఇక నుంచి అండగా ఉంటామంటూ రాయబేరాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే తీరం పరిస్థితులు అంచనాకు వెళ్లిన క్రమంలో తీరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే తమిళ జాలర్ల మెకనైజ్డ్ బోటు రావడంతో చుట్టుముట్టి పట్టుకున్నామంటూ హడావుడి చేశారు. గతంలో ఎన్నోసార్లు మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి తమిళ జాలర్ల బోట్లను నిర్బంధించినా.. ఎన్నడూ తీర ప్రాంతం ముఖం చూడని అధికారులు.. ఇప్పుడు ఏకంగా మత్స్యశాఖ కమిషనరే రావడం, వచ్చీరాగానే బోటును పట్టుకోవడం, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చూస్తుంటే.. ఒక సినిమాటిక్గా ఉంది. అధికారులు, పోలీసుల డ్రామాలను తెలుసుకున్న మత్స్యకారులు మరింత ఆగ్రహవేశాలతో రగిలిపోతున్నారు. ఏందబయా ఈ రోజు న్యూస్లాడ్జీఅడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత తప్పులు చేసే తమ్ముళ్లను కాపాడేందుకు అష్టకష్టాలు వీరి ముందు సినిమా డైరెక్టర్లు కూడా దిగదుడుపే వ్యభిచారం కేసులో టీడీపీ నేత పక్కాగా పట్టుబడితే ఆస్పత్రికి వచ్చాడంటూ నవ్వులపాలు తమిళ బోట్ల వ్యవహారం బూమ్రాంగ్ కావడంతో టీడీపీ నేతలను కాపాడేందుకు కొత్త డ్రామా మత్స్య శాఖ ఆధీనంలోని బోటును తెచ్చి ఇదిగో తమిళ బోటు పట్టేశామంటూ హడావుడి బోడిగాడితోట శ్మశాన వాటికలో అనుమానాస్పదస్థితిలో సగం కాలిన మహారాష్ట్ర వాసి మృతదేహం ప్రాథమిక విచారణ చేపట్టకుండానే హడావుడిగా ఆత్మహత్య అంటూ ప్రకటన నగరంలో రెచ్చిపోతున్న రౌడీయిజం.. కత్తులతో హల్చల్ చేస్తున్నా చేష్టలుడిగి చూస్తున్న వైనం అటు టీడీపీ నేతల అరాచకాలు.. పోలీసుల శాంతిభద్రతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆపసోపాలు అనుమానాస్పద మరణాలు.. విస్మయ ప్రకటనలు నెల్లూరు స్వర్ణాల చెరువులో రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మరుసటి రోజే బోడిగాడి తోట శ్మశాన వాటికలో మహారాష్ట్ర నాగపూర్కు చెందిన ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పదంగా సగం కాలిన స్థితిలో బయటపడింది. వరుస ఘటనలు జరగడంతో మీడియా దృష్టి అనుమానాస్పద మరణాలపై పడడంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టకుండానే అది ఆత్మహత్య అంటూ పోలీస్ శాఖ ప్రకటన చేయడం విస్మయాన్ని కలిగించింది. ఎవరైనా శ్మశాన వాటికలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడా? ఒక వేళ శరీరానికి నిప్పంటించుకుంటే సగభాగం వరకే కాలుతుందా?.. మరి అతను ఆత్మహత్యకు ఉపయోగించిన మెటీరియల్ను గుర్తించారా?.. ఇలా ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాథమిక ఆధారాలేవీ పరిశీలించకుండానే.. ఇది హత్య అయితే ఎక్కడ పోలీస్ ఫెయిల్యూర్ కనిపిస్తుందోనని ముందుగానే ఆత్మహత్యగా ప్రకటన చేయడం చూస్తుంటే.. పోలీస్శాఖ అసమర్థత, శాంతిభద్రతల వైఫల్యాలు, డైవర్షన్ కట్టుకథలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని పోలీస్ వ్యవస్థ.. అధికార పార్టీని భుజస్కంధాలపై వేసుకుని అభాసుపాలవుతోంది. మద్యం, గంజాయి విచ్చలవిడి అక్రమ అమ్మకాలను కట్టడి చేయలేకపోతున్నారు. నేరస్తులు జూలు విదిలించి..రౌడీయిజం, హత్యలు చేస్తున్నా నియంత్రించలేకపోతున్నారు. టీడీపీ నేతలకు ఏ కష్టం వచ్చినా.. ప్రభుత్వానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మసిపూసి మారేడు కాయ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార పార్టీ నేతల అరాచకాలను, ప్రకృతి సంపద దోపిడీలను, అసాంఘిక కార్యకలాపాల చర్యలను, శాంతిభద్రతల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు. తప్పులు చేసే పచ్చ నేతలు ప్రజల్లో పలచ బడకుండా.. సినిమా డైరెక్టర్లను మించి అప్పటికప్పుడే కట్టుకథలు అల్లేస్తున్నారు. నెల్లూరు నగరం నేరాలతో అట్టుడికిపోతోంది. ఓ వైపు రౌడీ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. ఇంకో వైపు గంజాయి బ్యాచ్లు తగ్గడం లేదు. మరో వైపు హత్యలు, మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీస్శాఖ తామేదో చేస్తున్నట్లు హడావుడి తప్పా రౌడీ మూకల పీచమణచడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. గత నెల రోజులుగా కొన్ని వర్గాలుగా విడిపోయి గ్యాంగ్ వార్కు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి కత్తులతో వీరంగం చేశారు. ముగ్గురు యువకులను పొడిచారు. అందులో ఒకరికి కడుపులో పేగులు కూడా బయటకు వచ్చాయి. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చావుబతుకులతో పోరాటం చేస్తున్నారు. నెల రోజులుగా గ్యాంగ్వార్లు జరుగుతున్నా.. పోలీస్ శాఖ కనిపెట్టలేకపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం డీమార్ట్ షోరూం పక్కన యువత గొడవ పడి వీరంగం చేశారు. ఏటీఎంలా మద్యం ఎనీటైం దొరుకుతోంది. లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు చేయడం కాదు. ఎనీటైం దొరికే మద్యం, గంజాయి అమ్మకాలను నిరోధించే దమ్ము ఆ శాఖలో ఏకోశానా కనిపించడం లేదు. అధికార పార్టీ నేతల మాటలను చట్టాలుగా చేసుకొని రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి అక్రమ కేసులతో పోలీస్ శాఖ చెలరేగి పోతుంది తప్ప లా అండ్ ఆర్డర్ను కంట్రోల్చేయడంలో మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. వారం రోజులుగా జిల్లాలో జరిగే కొన్ని పరిణామాలు చూస్తుంటే పోలీస్ శాఖ తప్పిదాలు జిల్లా పరువు ప్రతిష్టకే భంగం కలిగిస్తున్నాయి.. మత్స్యకారుల బోట్ల విడుదల నుంచి టీడీపీ నేత వ్యభిచార వ్యవహారం వరకు అన్ని విషయాల్లో ఖాకీల చేష్టలు నవ్వులపాలయ్యాయి. -
హత్యా.. ఆత్మహత్యా?
● మహారాష్ట్ర యువకుడి అనుమానాస్పద మృతి నెల్లూరు(క్రైమ్) : మహారాష్ట్రలో అదృశ్యమైన యువకుడు నగరంలోని బోడిగాడితోట శ్మశానవాటికలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉంది. మృతుని వద్ద సెల్ఫోన్, మృతదేహం పక్కన సిమ్కార్డు, మెమోరీ కార్డులున్నాయి. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో నవాబుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల మేరకు.. మహారాష్ట్ర నాగపూర్ జిల్లా బుటిబోరి పోలీస్స్టేషన్ పరిధిలో విక్రాంత్ రవికాంత్ మెష్రామ్(22) కుటుంబం నివాసం ఉంటోంది. అతను ఐటీఐ చదివి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా పనికి వెళ్లడం లేదు. ఈనెల 20న రాత్రి అతను ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లలేదు. బాధిత కుటుంబ సభ్యులు బుటిబోరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోడిగాడితోట శ్మశానవాటికలో.. బోడిగాడితోట శ్మశానవాటికలో పాక్షికంగా కాలిపోయిన ఓ యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి డయల్ 112 ద్వారా ఆదివారం నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. నవాబుపేట, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్లు జి.వేణుగోపాల్రెడ్డి, కె.సాంబశివరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం మొకాళ్ల వరకు కాలిపోయి ఉంది. మృతుని జేబులో సెల్ఫోన్ను, పక్కనే ఖైనీ ప్యాకెట్ కవర్లో సిమ్కార్డు, మెమోరీకార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి సాయంతో మృతుడు విక్రాంత్ రవికాంత్గా గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. విక్రాంత్ కొన్ని రోజులుగా ఎవరితో మాట్లాడకుండా మూడీగా ఉన్నాడని, పనికి సైతం వెళ్లడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. డాగ్స్క్వాడ్ పరిశీలన ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లో డాగ్స్క్వాడ్ కలియ తిరిగింది. క్లూస్టీం ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి నవాబుపేట పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం విభిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహం పాక్షికంగా కాలి ఉండటం, మృతుని వివరాలు తెలిసేలా సిమ్కార్డు, మెమోరీకార్డు వంటివి పక్కనే ఉండటంతో మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మృతుడు నాగపూర్ నుంచి నెల్లూరుకు ఎందుకు? ఎలా వచ్చాడు? బోడిగాడితోటలో శ్మశానం గురించి అతనికి ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా వచ్చాడు.. అనే వివరాలను తెలుసుకునేందుకు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ నుంచి బోడిగాడితోట వరకు ఉన్న సీసీ ఫుటేజ్లను, మృతుని కాల్ డీటెయిల్స్ను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని నగర ఏఎస్పీ దీక్ష వెల్లడించారు. -
తమ్ముళ్ల బాహాబాహీ
కావలి: పట్టణంలో టీడీపీ నేతల మధ్య బాహాబాహీ ఆదివారం జరిగింది. జువ్వలదిన్నెలో బోట్ల మాయంపై చర్చిస్తూ వీరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. వివరాలు.. జువ్వలదిన్నె బోట్ల విషయమై తుమ్మలపెంట రోడ్డులోని ఓ చోట మద్యం సేవిస్తూ చర్చించసాగారు. ఈ క్రమంలో బీద వర్గానికి చెందిన టీడీపీ కావలి 30వ వార్డు ఇన్చార్జి గాదంశెట్టి వేణుగోపాల్కు మద్దతుగా ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఏఎమ్సీ డైరెక్టర్ ఇడుముక్కల పవన్కుమార్ మాట్లాడారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వర్గానికి చెందిన వారు పవన్కుమార్పై దాడికి పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి బాధితుడ్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని రాష్ట్ర నేతలు ఆరోపించడంతో టీడీపీకి చెందిన దేవరకొండ శ్రీనివాసులు అనుచరులు మురళి, సారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్ దర్యాప్తు చేస్తున్నారు. రాజీ చర్చలు విఫలం అందరూ టీడీపీ నేతలే కావడంతో దాడి ఘటనలో రాజీ చేసేందుకు దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే బాధితుడి సామాజికవర్గానికి చెందిన వారు రాష్ట్రస్థాయి నేతలకు సమాచారం అందించారు. వారితో పాటు బాధితుడి బంధువులు సైతం కేసు నమోదు చేయాలని పట్టుబట్టడంతో రాజీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో కేసు నమోదు చేశారు. -
5న హనుమాన్ శోభాయాత్ర
నెల్లూరు(బృందావనం): సమాజంలో హైందవ ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు, హనుమంతుని వ్యక్తిత్వం, శౌర్యం, పరాక్రమం, వినయం వంటి లక్షణాలను పెంపొందించేందుకు గానూ నగరంలో హనుమాన్ భక్త శోభాయాత్రను ఏప్రిల్ ఐదున నిర్వహించనున్నామని హిందూ చైత న్య వేదిక నేతలు వెల్లడించారు. శోభాయాత్ర బైక్ ర్యాలీకి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని విజయమహల్ గేట్ సమీపంలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించారు. వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు జయరామ్, లీగల్ కన్వీనర్ మహేష్, ప్రచార విభాగాధ్యక్షుడు కాకు మురళీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోటపల్లి సాయిశ్రీనివాస్, మోహన్ కిశోర్, స్వామి, మోహన్రావు, బాలాజీ, కోడూరు జయప్రద, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పక్షాన పోరాటం చేస్తాం
పొదలకూరు: జిల్లాలో ధాన్యం ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయని, మద్దతు ధరను ప్రభుత్వం అందజేసేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం మహ్మదాపురంలో ఆదివారం ఆయన పర్యటించారు. పార్టీ నేత కండ్లకూటి రమణారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తనను కలిసిన రైతులతో ముచ్చటించి, ధాన్యం ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. వరి కోతలు పెరిగే కొద్దీ ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉందని చెప్పా రు. ప్రస్తుతం రూ.నాలుగు వేలను తగ్గించారని, కోతలు పెరిగి ధాన్యం దిగుబడి పూర్తిస్థాయిలో పెరిగితే ఈ మాత్రం కూడా లభించదని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదును జమచేస్తామని సర్కార్ ప్రకటించిందని, అయితే అక్కడ కొనడంలేదని వివరించారు. ఇప్పటికే పుట్టి ఒక్కింటికి రూ.నాలుగు వేల మేర తగ్గాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామంటూ జిల్లా అధికారులు ఆర్భాటంగా ప్రకటించారని, అయితే అక్కడ సేకరించడంలేదని విమర్శించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దంటూ మౌఖిక ఆదేశాలను ప్రభు త్వం ఇస్తోందనే గుసగుసలు అధికారుల్లో వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. యూరియా అందక.. పెట్టుబడులు భారీగా పెరిగి ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోతే, ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారో అర్థం కావడంలేదని చెప్పారు. పొలాలకు సాగునీటిని సక్రమంగా అందజేయకుండా, ఇరిగేషన్ పనుల్లో దొంగ బిల్లులు చేసుకొని రూ.కోట్లను కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. ధాన్యానికి మద్దతు ధర లభిస్తోందంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పుట్టికి రూ.24 వేలను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్రెడ్డి, సర్వేపల్లి బూత్ కమిటీల కన్వీ నర్ బచ్చల సురేష్కుమార్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, నేతలు కరిపరెడ్డి కృష్ణారెడ్డి, అశోక్కుమార్రెడ్డి, తిరుపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజురోజుకూ దిగజారుతున్న ధాన్యం ధరలు వరి కోతలు పెరిగితే మరింత పతనమయ్యే అవకాశం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా
కూటమి ప్రభుత్వంలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. ఆకర్షణీయమైన ప్లాస్టిక్ బ్యాగుల్లో పేదల బియ్యం అక్రమ రవాణా జోరుగా జరిగిపోతోంది. కావలి కేంద్రంగా ఈ దందా భారీస్థాయిలో జరుగుతోంది. ఇటీవల కావలిలో అధికారుల వరుస దాడుల్లో బియ్యం పట్టుబడ్డాయి. అయితే గుట్టుచప్పుడు కాకుండా భారీగా పేదల బియ్యం జిల్లా సరిహద్దులు దాటిపోతోంది.నెల్లూరు(పొగతోట): రేషన్ బియ్యం మాఫియా రోజురోజుకు కొత్త రూపు సంతరించుకుంటోంది. గత కొన్ని నెలలుగా బియ్యం మాఫియా కావలిని కేంద్రంగా మార్చుకుంది. స్థానిక నాయకుల సహకారంతో రెచ్చిపోతోంది. కూటమి నేతల కనుసన్నల్లో అధికారులు పని చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాఫియా లీడర్లు అధికారుల కళ్లుకప్పి బియ్యం అక్రమ రవాణాలో నూతన విధానాలు అవలంభిస్తున్నారు. గతంలో ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వచ్చిన సంచులతోనే బియ్యం అక్రమంగా తరలించారు. ప్రస్తుతం అధికారులు, ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నూతన విధానాలు ప్రారంభించింది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ ఆకర్షణీయమైన ప్లాస్టిక్ బ్యాగుల్లో బియ్యం నింపి అక్రమంగా తరలిస్తున్నారు. గతంలో రాత్రి సమయంలో లారీల ద్వారా బియ్యం అక్రమంగా తరలించే వారు. ప్రస్తుతం పట్టపగలు పేదల బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. ఎరవేసి చేపలను పట్టినట్లు కొద్దిపాటి బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని అధికారులకు సమాచారం ఇస్తున్నారు. సమయం.. వాహన నంబర్తో సహా సమాచారం అందిస్తుండడంతో అధికారులు చిన్నపాటి బియ్యం పట్టుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. ఈ క్రమంలో మాఫియా రాచమార్గంలో భారీ స్థాయిలో బియ్యం అక్రమంగా తరలించి సోమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కూటమి నాయకుల నుంచి వస్తున్న ఒతిళ్లకు ఏమీ చేయలేదని స్థితిలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఈ మధ్య కాలంలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో సుమారు 400 టన్నులకు పైగా పేదల బియ్యం పట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల కావలిలో ఏడు టన్నులు, గత మంగళవారం కావలి నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 156 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. రూ.7.56 లక్షల విలువ చేసే బియ్యం, రూ 10 లక్షలు విలువ చేసే లారీని సిజ్ చేశారు. రైస్ మిల్లుల్లో గుట్టుగా పాలిషింగ్ జిల్లాలో 1,513 చౌకదుకాణాలు ఉన్నాయి. 7.21 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా 12.500 మెట్రిక్ టన్నుల బియ్యం కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. కావలి కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కావలికి పేదల బియ్యం తరలిస్తున్నారు. ప్రకాశం, బాపట్ల, కడప తదితర జిల్లాల నుంచి పేదల బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. ఆటోలు, మినీ వాహనాల్లో బియ్యం కావలికి చేరుకుంటున్నాయి. కావలిలో బియ్యానికి పాలిష్పట్టి ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టిక్ బ్యాగులను చైన్నెకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు, రాష్ట్రాలకు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ ప్రక్రియకు సహకరిస్తున్న కీలక నాయకుడికి నెలకు రూ.20 లక్షల వరకు ముట్టచెబుతున్నట్లు సమాచారం. అధికారులకు నెలనెలా మూడుపులు అందడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కావలి చుట్టుపక్కల మండలాల్లో పెద్ద పెద్ద రైస్ మిల్లులు ఉన్నాయి. ఆయా రైస్ మిల్లులు పేదల బియ్యం పాలిష్ పట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కావలి కేంద్రంగా పాలిషింగ్ వరుసగా కావలి, కోవూరులో భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం కేవలం దాడులకే పరిమితమవుతున్న వైనం మూలాల్లోకి వెళ్లని అధికారులు -
మలుపు వద్ద అదుపుతప్పిన టిప్పర్
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం సీతారామపురం: సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్రోడ్డు మార్గంలోని ఓ మలుపు వద్ద శనివారం టిప్పర్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి నారాయణప్పపేట గ్రామ సమీపాన జరుగుతున్న భారతమాల జాతీయ రహదారి టన్నెల్ పనుల వద్దకు బయల్దేరిన టిప్పర్ ఘాట్రోడ్డు మార్గంలోని రెండో మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ప్రొటెక్షన్ వాల్తో పాటు డివైడర్ను ఢీకొని ఆగింది. డివైడర్ లేకుండా ఉండి ఉంటే టిప్పర్ లోయలో పడిపోయేది. ఈ ఘటనతో డ్రైవర్, క్లీనర్ భయభ్రాంతులకు గురై ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న యంత్రాల సహాయంతో టిప్పర్ను వెనుక్కు లాగారు. -
ఆర్టీసీ డిపోను ప్రైవేట్కు కట్టబెట్టడం దుర్మార్గం
నెల్లూరు సిటీ: నెల్లూరు–2 డిపోను ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టాలని చూడడం దుర్మార్గమని, ఈ ప్రయత్నాన్ని వెనక్కు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కె.ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్టీసీ 2–డిపో వద్ద శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. డిపోలో పనిచేసే వారిని మరో డిపోలకు తరలించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా ప్రైవేటీకరణను విరమించుకోకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ యూనియన్ జాయింట్ సెక్రటరీ రమణారావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారావు, ఎన్ఎంయూఏ కార్యదర్శి సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణాల చెరువులో వ్యక్తి మృతదేహం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల వెనుక స్వర్ణాల చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడాన్ని శనివారం స్థానికులు గుర్తించి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం ఉబ్బి దుర్గంధం వెదజల్లుతూ ఉంది. మృతుడు సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడు. 35వ వార్డు ఇన్చార్జి వీఆర్వో మధుసూదన్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్వర్ణాల చెరువుతో పాటు నీలగిరి సంఘం పరిసర ప్రాంతాల్లో మృతుని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు దర్గామిట్ట పోలీసులకు తెలియజేయాలని స్థానిక ఇన్స్పెక్టర్ బి.కల్యాణరాజు కోరారు. కనుల పండువగా శ్రీవారి కల్యాణం రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిల కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు మూలమూర్తికి అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు గోపూజ, పూలంగిసేవ జరిపారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నిత్యకల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కల్యాణాన్ని గావించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్సేవ నిర్వహించారు. గ్రామాల్లో భయం భయం.. కలువాయి(సైదాపురం): రగామాల్లో చెత్త సేకరించుకుంటున్న నేపంతో కొందరు మహిళలు ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల కిందట కలువాయి మండలం పెన్నా బద్వేలు గ్రామంలో చెత్త ఏరుకుంటూ సంచరిస్తున్న నలుగురు మహిళలు పెన్నా బద్వేల్ పాత ఊరు ఎస్సీ కాలనీలో తుమ్మల రమేష్ కుమార్తెకు చాక్లెట్లు ఇస్తూ చూట్టూముట్టడంతో చిన్నారి కేకలు వేసింది. దీంతో కాలనీ వాసులు ఒక్కొక్కరిగా అక్కడకు చేరుకుని నలుగురు మహిళలను అడ్డగించగా దగ్గరలో ఉన్న ఆటో ఎక్కి పరారయ్యారని కాలనీ వాసులు తెలిపారు. ఈ విషయం పట్ల గ్రామంలో ఆందోళన నెలకొంది. కండలేరులో 48.220 టీఎంసీల నీరు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 48.220 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 200, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. పొదలకూరు నిమ్మధరలు(కిలో) పెద్దవి: రూ.90 సన్నవి: రూ.70 పండ్లు: రూ.45 -
పాముకాటుకు గీత కార్మికుడి మృతి
చేజర్ల: పాముకాటుకు గురై గీత కార్మికుడు మృతిచెందిన ఘటన శనివారం చేజర్ల మండలం చీర్లవారికండ్రిక వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన పర్చూరు కృష్ణయ్య (55) రోజులానే గ్రామం దగ్గరలోని చీర్లవారికండ్రికకు వెళ్లి తాటిచెట్టు ఎక్కి కళ్లు కుండలు దింపి తిరుగు ప్రయాణంలో పాముకాటు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించేలోపు మార్గమధ్యలో మృతిచెందారు. ఇంటి పెద్ద కృష్ణయ్య మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన విషాదం మిగల్చగా, పర్చూరి కృష్ణయ్య మృతితో గ్రామంలో మరింత విషాదఛాయలు అలుమున్నాయి. 24న క్యాంపస్ డ్రైవ్ కోవూరు: గంగవరంలోని గీతాంజలి పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 24వ తేదీ భారీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం.మహేంద్రబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఉన్నత విద్యాశాఖ సహకారంతో చైన్నెకి చెందిన ఓ ప్రముఖ సంస్థ ఎంపికలు చేపట్టనుందన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రస్తుతం మూడో సంవత్సరం (ఫైనలియర్) చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థులందరూ హాజరుకావచ్చన్నారు. -
టీడీపీ పాలనలో రైతులకు సంతోషమేదీ..?
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: టీడీపీ ప్రభుత్వంలో రైతు కుటుంబాలకు సంతోషమే కరువైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ గొట్లపాళెంలో శనివారం ఆయన పర్యటించారు. ధాన్యం ధరలను పూర్తిగా తగ్గించేశారని, వీటితో పెట్టుబడులు సైతం చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వా పోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. ధాన్యం ధరలు రోజురోజుకూ దిగజారుతుండటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. ధరలు తగ్గుముఖం పట్టకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పట్టించుకోకపోతే కర్షకుల పక్షాన నిలిచి అధికారులను నిలదీస్తామని స్పష్టం చేశారు. సకాలంలో యూరి యా అందక.. సాగునీరు పారక అష్టకష్టాలు పడి పంటలను పండించిన ఽరైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమన్నారు. ఇరిగేషన్ పనుల పేరిట దొంగ బిల్లు లు చేసుకొని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంపై లేదని విమర్శించారు. వారం వ్యవధిలోనే ధరలు పూర్తిగా పడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వారున్నారని తెలిపారు. గతంలో 25 శాతం అధికంగా.. గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే 25 శాతం అధికంగా రైతులకు లభించిందని గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించి కనీస మద్దతు ధరను కల్పించిన అంశాన్ని ప్రస్తావించారు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో ఏటా రూ.మూడు వేల కోట్లను కేటాయించారని, అయితే ప్రభుత్వ కూటమి ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లనే కేటాయించి చేతు లు దులుపుకొందని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి పరిపాలనను.. చంద్రబాబు పాలనను బేరీజేసుకొని నాటి పాలనే భేష్ అంటూ ప్రశంసిస్తున్నారని తెలియజేశారు. మద్దతు ధరను కల్పించకపోతే జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ నలగర్ల దేవసేనమ్మ పార్థివదేహానికి పూలమాలేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, ఆరుగుంట ప్రభాకర్రెడ్డి, మంచు వెంకటేశ్వర్లునాయుడు, నలగర్ల నరసింహరావు, మందల శీనయ్య, నలగర్ల రంగయ్య, వెలిబోయిన వెంకటేశ్వర్లు, తుపాకుల కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న అంతర్గత పోరు తాజాగా దావానంలా వ్యాపిస్తోంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో భూ జగడానికి మంత్రి నారాయణ కాలుదువ్వడమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. నగరంలోని వివాదాస్పద స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో మంత్రి నారాయణ కయ్యానికి కాలుదువ్వుతుండటం నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి వేమిరెడ్డి సోదరుడు కోటారెడ్డికి.. డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్ ప్రధాన అనుచరుడు దార్ల వెంకటేశ్వర్లు మధ్య స్థల వివాదం జరుగుతోంది. నగర నడిబొడ్డున ఉండే సండే మార్కెట్ మలుపు వద్ద ల్యాండ్ ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి భవనాన్ని నిర్మిస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వివాదం జరుగుతున్న సమయంలోనే సదరు స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేయడం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఇదీ తంతు.. ట్రంక్రోడ్డులో ఎంపీ వేమిరెడ్డి సోదరుడు కోటారెడ్డికి 73 అంకణాల విలువైన స్థలం ఉంది. ఆ పక్కనే ఉన్న 359 – 3ఏ సర్వే నంబర్లో ఇరిగేషన్ కాలువకు సంబంధించిన స్థలమూ ఉంది. ప్రస్తుతం నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం ఇది. అయితే ఈ స్థలంలో రూప్కుమార్యాదవ్ ప్రధాన అనుచరుడు దార్ల వెంకటేశ్వర్లుకు ఎనిమిదంకణాల స్థలానికి గతంలో ప్రభుత్వ వాల్యూతో నగదు కట్టించుకొని పట్టా ఇచ్చారని తెలుస్తోంది. మిగిలిన భూమి ఆయన ఆక్రమణలో ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక్కడే అసలు కత.. మరోవైపు సర్వే నంబర్ 259 – 2ఏ ఉన్న భూమి నిషేధిత జాబితాలో ఉంది. అయితే 259 – 3 బీ 1, 2 సబ్ డివిజన్ చేసినట్లుగా రికార్డులను మార్చి.. పదంకణాల స్థలాన్ని రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయించుకొని తమ ఆధీనంలో ఉంచుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 18 అంకణాల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి జీ + 2గా మున్సిపల్ అనుమతులను పొందారు. వాస్తవానికి ఇరిగేషన్ భూమిలో భవన నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదు. అయితే రాజకీయ ఒత్తిడితో ప్లాన్ అనుమతులను అధికారులు మంజూరు చేయడం దుమారాన్ని రేపింది. భవన నిర్మాణ అనుమతులకు పేదలు వెళ్తే వంద కొర్రీలు పెట్టే అధికారులు.. ఇక్కడ మాత్రం ఇలా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. ఎంపీ సూచనలు బేఖాతర్ వివాదాస్పద స్థలంలో నిర్మాణానికి అనుమతులివ్వొద్దని.. న్యాయపరంగా చూడాలని మున్సిపల్ అధికారులను ఎంపీ ఆదేశించారు. అయితే దీన్ని బేఖాతర్ చేస్తూ.. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే పర్మిషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా వివాదం జరుగుతున్న సమయంలోనే మంత్రి స్వయంగా వెళ్లి శంకుస్థాపనలో పాల్గొనడం ఎంపీపై కయ్యానికి కాలుదువ్వినట్లుగానే ఉందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. న్యాయస్థానంలో ఉన్నా.. ఉయ్యాలకాలువ స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారనే విషయమై హైకోర్టును ఎంపీ సోదరుడు కోటారెడ్డి ఆశ్రయించారు. ఆయన వేసిన పిటిషన్పై విచారణ మరో రెండ్రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో శంకుస్థాపనలో అమాత్యుడు పాల్గొనడంపై తమ్ముళ్లే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఊహాగానాలతోనే ఇలానా..? ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గ మార్పు ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఎంపీ సతీమణి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అమాత్య పదవి వరించే అవకాశాలూ ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. అప్పుడు నారాయణను సీఆర్డీఏకే పరిమితం చేసి, ఆ స్థానంలో ఆమెకు అవకాశం కల్పిస్తారనే చర్చా సాగుతోంది. వీటన్నింటినీ జీర్ణించుకోలేకే వేమిరెడ్డితో నారాయణ కాలుదువ్వుతున్నారని పలు వురు పేర్కొంటున్నారు. ప్రకటనలు ఉత్తుత్తేనా..? నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేదిలేదంటూ మంత్రి నారాయణ తరచూ ఊదరగొడుతుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే, ఇదంతా ఒట్టిదేననే విషయం తేలిపోతోంది. కాలువల వెడల్పు పేరుతో పేదల నివాసాలను కూలదోసిన ఆయన.. ఇరిగేషన్ స్థలంలో ఉన్న భవన శంకుస్థాపనకు వెళ్లడం ద్వారా ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారోనని తమ్ముళ్లే నిట్టూరుస్తున్నారు. పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమానంటూ మండిపడుతున్నారు. కాగా ఈ విషయమై సిటీ ప్లానర్ రఘునాథరావు సంప్రదించగా, న్యాయస్థానం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో జీ + 2 కింద అనుమతులిచ్చామని బదులిచ్చారు. టీడీపీలో నువ్వా.. నేనా..! వేమిరెడ్డితో కయ్యానికి దిగిన నారాయణ వివాదాస్పద స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన ఇది ఇరిగేషన్ భూమంటూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ సోదరుడు న్యాయస్థానంలో ఉన్న తరుణంలో ఎలా పాల్గొంటారంటూ అమాత్యుడిపై రుసరుస -
1297 హెక్టార్లలో పంట నష్టం
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నాలుగు మండలాలు ప్రభావితమై.. 1297 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయ ఏడీఏ నర్సోజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● అనంతసాగరం మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 1071 మంది రైతులకు సంబంధించిన 914 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి.. 140 హెక్టార్లలో పూత దశలో ఉన్న పత్తి పంట దెబ్బతినిందని చెప్పారు. ● రాపూరు మండలంలోని ఓ గ్రామంలో 80 మంది రైతులకు సంబంధించిన 80 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ● కలువాయి మండలంలోని నాలుగు గ్రామాల్లో 26 మంది రైతులకు చెందిన 13 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి పంట దెబ్బతినిందని తెలిపారు. ● మర్రిపాడు మండలంలోని ఐదు గ్రామాల్లో 250 మంది రైతులకు సంబంధించిన 150 హెక్టార్లలో కోతకొచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు నివేదికలను సిద్ధం చేశామని వివరించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలకు జిల్లాలోని ఏ ప్రాంత రైతులకు నష్టం జరిగినా, అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. ● రాపూరు: మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయాధికారి సోమసుందర్ పరిశీలించారు. గాలీవాన, వడగండ్లతో గోనుపల్లిలోని వరి, మామిడి, నిమ్మ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేలా నివేదికను సమర్పించనున్నామని తెలిపారు. -
ఈద్ – ఉల్ – ఫిత్ర్ శుభాకాంక్షలు
నెల్లూరు రూరల్: ఈద్ – ఉల్ – ఫిత్ర్ను పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలను మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి.. ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటనలను శుక్రవారం విడుదల చేశారు. నెల్లూరు(దర్గామిట్ట): ఈద్ – ఉల్ – ఫిత్ర్ను జిల్లాలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల ని కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటన లో కాంక్షించారు. ఈ మేరకు పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. నేటి పదో తరగతి పరీక్ష వాయిదా నెల్లూరు (టౌన్): పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ రెండో తేదీకి వాయిదా వేశారని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ పరీక్ష శనివారం జరగాల్సి ఉందని, అయితే రంజాన్ కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనుందని వివరించారు. ● ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతికి సంబంఽధించి శనివారం నిర్వహించాల్సిన గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వ పరీక్షను వచ్చే నెల మూడుకు వాయిదా వేశారని డీఈఓ పేర్కొన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు జరగనుందన్నారు. జలాశయ ఆప్రాన్ పరిశీలన సోమశిల: సోమశిల జలాశయాన్ని ప్రాజెక్ట్ ఎస్ఈ వెంకటరమణారెడ్డి శుక్రవారం సందర్శించారు. నిలిచిపోయిన ఆప్రాన్ పనులను ప్రాజెక్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇవి మూడు రోజుల్లో ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. శివాలయ పక్కన ఉన్న రక్షణ గోడ ఎత్తు పెంచే విషయమై ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి, సంబంధిత అధికారులతో చర్చించారు. పెంచలకోనలో వేలం పాటలు రాపూరు: పెంచలకోనలో వచ్చే నెల్లో నిర్వహించనున్న లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటలను శుక్రవారం నిర్వహించారు. దేవస్థానానికి రూ.20.78 లక్షల ఆదాయం లభించిందని ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 26 నుంచి జూన్ ఏడు వరకు 49 తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు గానూ వేలాన్ని నిర్వహించామని వివరించారు. ప్రభుత్వ భూమిని పరిశీలించిన జేసీ సీతారామపురం : మండలంలోని పెద్దనాగంపల్లిలో సర్వే నంబర్ 54 – 4లో గల 14 ఎకరాల ప్రభుత్వ భూమిని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్ నిర్మాణానికి అటవీ భూమిని కేటాయించారు. దీనికి ప్రత్యామ్నాయంగా అటవీశాఖకు కేటాయించేందుకు పెదనాగంపల్లిలోని ప్రభుత్వ భూమిని పరిశీలించామని తెలిపారు. తహసీల్దార్ ఫాజిహా, మండల సర్వేయర్ శ్రీకాంత్, వీఆర్వో మురళి, తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్రెడ్డి గోవర్ధన్రెడ్డి -
దర్శనమిచ్చిన నెలవంక
● వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు ● మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక దువా ● ఈద్ – ఉల్ – ఫిత్ర్ నేడు వినీలాకాశంలో నెలవంక శుక్రవారం రాత్రి కనిపించింది. ఈ విషయమై మతపెద్దల ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా ఈద్ – ఉల్ – ఫిత్ర్ను ఆనందోత్సాహాలతో శనివారం జరుపుకొనేందుకు ముస్లింలు సమాయత్తమయ్యారు. నెల రోజుల ఉపవాస దీక్షలను ప్రత్యేక ప్రార్థనలతో విరమించారు. నగరంలోని జెండావీధి, కోటమిట్ట తదితర ప్రాంతాల్లో బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకొని ఆత్మీయ ఆలింగనంతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. నగరంలోని మసీదులు, ఈద్గాల వద్ద పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. నెలవంక దర్శనంతో మసీదులు, ఈద్గాలు, గృహాల్లో దువా చేశారు. నగరంలో సందడి పండగకు అవసరమైన సామగ్రి, వస్త్రాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో నగరంలో సందడి నెలకొంది. ప్రధాన కూడళ్లు, వీధులు రద్దీగా మారాయి. – నెల్లూరు(బృందావనం) -
24న కలిగిరిలో జాబ్మేళా
నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్తంగా ఈనెల 24వ తేదీన కలిగిరి ఏపీ మోడల్ స్కూల్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన నిరుద్యోగులు హాజరుకావొచ్చన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 99888 53335, 87126 55686 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకావలి(జలదంకి): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జలదంకి మండలం 9వ మైలులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. 9వ మైలు ఎస్సీకాలనీకి చెందిన రామయ్య (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.పొదలకూరు నిమ్మ ధరలు (కిలో) పెద్దవి: రూ. 90 సన్నవి: రూ. 70 పండ్లు: రూ. 45 -
అధికలోడు.. ప్రాణాలకు ముప్పు
నిత్యం ప్రమాదాలుచిల్లకూరు: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మట్టి, ఇసుక, గ్రావెల్, సిలికా, బొగ్గు, క్వార్ట్ ్జ తరలింపు ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ప్రధాన రహదారిపై ఖనిజాలను రవాణా చేసే సమయంలో నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే వాహనాల యజమానులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చిల్లకూరు మండలంలో సాగరమాల రహదారి నిర్మాణం చేపట్టడంతో నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు అధికలోడుతో మట్టిని తరలిస్తున్నాయి. అలాగే తీర ప్రాంతంలో ఉన్న గనుల నుంచి ఇతర రాష్ట్రాలకు సిలికాను లారీలు, టిప్పర్లలో మోతాదుకు మించి లోడు చేసి తరలించేస్తున్నారు. ఇంకా సైదాపురం, గూడూరు రూరల్ ప్రాంతాల్లోని గనుల నుంచి నిత్యం పదుల సంఖ్యలో తెల్లరాయిని తరలించే లారీలు కనీస నిబంధనలు పాటించడం లేదని విమర్శలున్నాయి. కృష్ణపట్నం పోర్టు నుంచి చైన్నెతోపాటుగా శ్రీసిటీలోని పలు పరిశ్రమలకు బొగ్గును తరలించే లారీలు, టిప్పర్లు కూడా మోతాదుకు మించి అధికలోడుతో నిత్యం వెళ్తుంటాయి. పట్టించుకోకుండా.. నిత్యం అధికలోడుతో వాహనాలు తరలి వెళ్తున్నా గనులు, రెవెన్యూ, రవాణా, పోలీస్ శాఖలు కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో మాత్రమే హడావుడి చేసి లారీలు, టిప్పర్ల యజమానులతో చర్చించి వ్యవహారం పెద్దది కాకుండా జాగ్రత్తలు పాటించి సర్దుబాటు చేస్తున్నారని విమర్శలున్నాయి. దీంతో వాహనాల యజమానులు కూడా ఆయా శాఖల అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు నెలవారీ మామూళ్లను సమర్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతోనే వాహనాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. స్పష్టత లేకపోవడంతో.. ఖనిజ సంపద పెద్ద మొత్తంలో తరలించే సమయంలో ప్రమాదాలు జరిగితే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత రవాణా శాఖాధికారులు ఆ వాహనాన్ని తనిఖీ చేసి నిబంధనలు పాటించారా?, లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అయితే వాటికి తిలోదకాలు ఇచ్చినట్లు విమర్శలున్నాయి. అధికలోడుతో వెళ్తూ ప్రమాదానికి గురైన వాహనంలో ఎలాంటి ఖనిజ సంపద ఉంది?, దీనికి అనుమతులున్నాయా? అనే విషయాలతోపాటు ఎంతమేర రవాణా చేయాలి?, ఎంత చేస్తున్నారు? అనే అంశాలను గనుల శాఖాధికారులు పరిశీలించాల్సి ఉంది. దీనిపై వారికి స్పష్టత లేకపోవడంతో దృష్టి పెట్టడం లేదని చెబుతున్నారు. పోలీస్ శాఖ తూతూమంత్రంగా కేసు నమోదు చేయడం అటు తర్వాత వాహనాన్ని వదలి వేయడంతో బాధితులకు సరైనా న్యాయం జరగడం లేదనే విమర్శలున్నాయి. అన్ని శాఖల ఉన్నతాధికారులు అధికలోడు వాహనాలను కట్టడి చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇష్టారాజ్యంగా వాహన రాకపోకలు కూటమి ప్రభుత్వంలో ఇదీ పరిస్థితి లోడు అధికంగా వేస్తున్నా చోద్యంచూస్తున్న అధికారులు తరచూ రోడ్డు ప్రమాదాలు మామూళ్లే కారణమా?మట్టి, ఇసుక, గ్రావెల్, సిలికా, బొగ్గు, తెల్లరాయిని అధిక మోతాదులో తరలించే లారీలు, టిప్పర్లతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల మండల తీర ప్రాంతంలోని చింతవరం గ్రామం వద్ద గొర్రెల మందపైకి మట్టిని తరలించే టిప్పర్ దూసుకెళ్లింది. దీంతో పదికిపైగా జీవాలు మృతిచెందాయి. గూడూరు రూరల్ ప్రాంతంలో అధికలోడుతో తెల్లరాయి తరలించే సమయంలో బ్రేక్లు పడకపోవడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే చిల్లకూరు మండలం సాగరమాల రహదారి నిర్మాణంలో భాగంగా మట్టిని అధికలోడుతో తీసుకెళ్తున్న టిప్పర్ తిక్కవరం గ్రామంలో బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో చనిపోయాడు. అదేవిధంగా 17వ తేదీన కృష్ణపట్నం నుంచి శ్రీసిటీకి అధికలోడుతో వెళ్తున్న బొగ్గులారీ రోడ్డు పక్కనున్న ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణించే ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం
● ఏఐవైఎఫ్ నేతలు నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీఎం చంద్రబాబు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మరోసారి మోసం చేశాడని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మున్నా విమర్శించారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేశాడని ఆరోపించారు. ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలిస్తామని, ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ద్వారా ఇస్తామని చంద్రబాబు, లోకేశ్లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నేడు 10,060 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ నెలలో విడుదల చేస్తామని చెప్పడం దారుణమన్నారు. అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే డీఎస్సీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. వెంటనే 50 వేల పోస్టుల ప్రక్రియను జాబ్ క్యాలెండర్ ద్వారా చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే లోకేశ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు బాదుల్లా, మీరా, గౌస్బాషా, షాన్వాజ్, సుబ్బరాయుడు, వాసుదేవరెడ్డి, శిరీషా తదితరులు పాల్గొన్నారు. -
పండగను ఆనందంగా జరుపుకోవాలి
నెల్లూరు(పొగతోట): పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలకు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల ద్వారా పవిత్ర మాసం సహనం, సేవాభావాన్ని పెంపొందిస్తుందన్నారు. పండగను ఆనందంగా జరుపుకోవాలని తెలియజేశారు. ● నెల్లూరు(క్రైమ్): రంజాన్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సేవాభావం, సామరస్యానికి ప్రతీక అయిన రంజాన్ పండగను ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.చికెన్ వ్యర్థాల వాహనం స్వాధీనంపొదలకూరు: బెంగళూరు నుంచి రాపూరు, పొదలకూరు మీదుగా సంగంలో చేపల గుంతల వద్దకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న మినీలారీని పొదలకూరు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై హనీఫ్ కథనం మేరకు.. రాపూరు నుంచి మినీలారీ వస్తుందనే సమాచారం తెలియడంతో మత్స్య, రెవెన్యూ శాఖల సహకారంతో పోలీసులు సీజ్ చేశారు. వాహనంలో 66 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వ్యర్థాలున్నట్టు గుర్తించారు. వాటిని డంపింగ్ యార్డు వద్ద గుంత తీసి పాతిపెట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు.ఆదిలక్ష్మీదేవికి వజ్రాల మంగళసూత్రం బహూకరణ రాపూరు: పెంచలకోనలో ఉన్న ఆదిలక్ష్మీదేవికి హైదరాబాద్కు చెందిన వసంతపు శ్రీనివాస్, మాధవి దంపతులు రూ.11 లక్షల విలువైన ఆభరణాలు శుక్రవారం బహూకరించినట్లు ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు మంగళసూత్రం, వెండి కాలిపట్టీలు, వెండి మెట్లు అందించినట్లు వెల్లడించారు. దాతలకు మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించినట్లు వెల్లడించారు. -
ఇంటర్ మూల్యాంకనం వాయిదా
నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన జవాబుపత్రాల మూల్యాంనాన్ని రంజాన్ పండగ సందర్భంగా ఈనెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు ఆర్ఐఓ వరప్రసాద్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత స్పెల్లో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనానికి విధుల్లో నియమించిన ఇన్విజిలేటర్లు ఆదివారం జరిగే స్పాట్ క్యాంపు కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. 25వ తేదీ నుంచి రెండో స్పెల్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, బయాలజీ, కామర్స్, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం జరుగుతుందని వెల్లడించారు.కంటైనర్ లారీ ఢీకొని..● వ్యక్తి దుర్మరణం మనుబోలు: కంటైనర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మల్లాంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కలువాయికి చెందిన చిట్టేపల్లి రమేష్ (38) గురువారం రాత్రి మోటార్బైక్పై బయలుదేరాడు. మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్రోడ్డు సమీపంలో వెనుక వస్తున్న కంటైనర్ లారీ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని..● యువకుడి మృతి చిట్టమూరు: మండల పరిధిలోని మల్లాం పంచాయతీ కోటిగుంట గిరిజన కాలనీకి వెళ్లే ములుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వాదనాల మహేష్ (25) అనే యువకుడు శుక్రవారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కోట మండలం తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన మహేష్ వాకాడు మండలం బుసపాళెం గ్రామంలో తమ బంధువుల వద్దకు వెళ్లాడు. తిరిగి బస్సు ఎక్కేందుకు నడిచి వస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొని తలపైకి ఎక్కింది. దీంతో తల ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా మారింది. మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. బుసపాళెంలోని బంధువుల ద్వారా మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాలిరెడ్డిపాళెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారును ఢీకొట్టిన బైక్● ఒకరికి తీవ్రగాయాలు కోవూరు: మండల కేంద్రమైన కోవూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. రామన్నపాళెం గ్రామానికి చెందిన నాగేంద్ర తన మోటార్బైక్పై నెల్లూరు వైపు నుంచి కావలి వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోవూరులోని బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలోకి వచ్చేసరికి, అదే దిశలో వెళ్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నాగేంద్ర ఎగిరి రోడ్డుపై పడటంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. కండలేరులో 48.480 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 48.480 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,050, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 255, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
అంగన్వాడీల్లో మెరుగైన విద్యాబోధన
● పీడీ హేనాసుజన్ మనుబోలు: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యాబోధన చేస్తారని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనాసుజన్ అన్నారు. మనుబోలు మండల కేంద్రలోని పలు అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం ఆమె సందర్శించారు. చిన్నారులకు అందజేసే పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ అంగన్వాడీల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ఆటపాటల ద్వారా విద్యాబోధన చేస్తారని తెలిపారు. ఆమె వెంట ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్లు ఆదినారాయణమ్మ, పద్మజ తదితరులున్నారు. -
రైలెక్కే సమయంలో..
● పట్టు తప్పి కిందపడి యువకుడి మృతి చిల్లకూరు: కదిలే రైలును ఎక్కే క్రమంలో పట్టు తప్పి కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఓడూరు గ్రామానికి చెందిన పారిచెర్ల చరణ్ (28) కొంతకాలంగా తన అమ్మమ్మ గ్రామమైన నాయుడుపేట సమీపంలోని మన్నెమాలలో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి పనుల నిమిత్తం రోజూ నెల్లూరుకు రైలులో వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం పనులు ముగించుకుని మెమూ రైల్లో నాయుడుపేటకు బయలుదేరాడు. ఓడూరు రైల్వేస్టేషన్ వచ్చిన తర్వాత తాగునీటి కోసం ప్లాట్ఫారంపైకి దిగాడు. తిరిగి రైలు బయలుదేరే సమయంలో వచ్చి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పట్టు తప్పి కిందపడటంతో అతను మృతిచెందాడు. ప్రయాణికులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అలాగే రైల్వేస్టేషన్ మాస్టర్ గూడూరు రైల్వే పోలీసులకు విషయం తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు. -
హౌసింగ్ కార్యాలయంపై మద్యం బాటిళ్లతో దాడి
● మందుబాబులా లేక ఆ శాఖ బాధితులా? ● పోలీసులకు ఏఈ ఫిర్యాదుపొదలకూరు: పట్టణంలోని హౌసింగ్ కార్యాలయంపై శుక్రవారం మద్యం బాటిళ్లతో గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. వరండాలో పగిలిన బాటిళ్లు పెద్ద సంఖ్యలో పడ్డాయి. ఇది మందుబాబుల పనా లేక బిల్లులు సకాలంలో చేయలేదన్న కోపంతో ఎవరైనా బాధితులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారా? అనే అనుమానాలున్నాయి. ఉదయం కార్యాలయ సమయంలో వచ్చిన ఏఈ మహేష్, వర్క్ ఇన్స్పెక్టర్ దాసు సంతకాలు చేశారు. ఏఈ మరుపూరుకు, వర్క్ ఇన్స్పెక్టర్ తోడేరుకు క్యాంపునకు వెళ్లారు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వారు పదుల సంఖ్యలో బీరు, బ్రాందీ బాటిళ్లను కార్యాలయంపైకి విసిరారు. అంతటితో ఆగకుండా వరండాలో ఉన్న కుర్చీని విరగ్గొట్టి వెళ్లారు. ఈ కార్యాలయం పొదలకూరు – మనుబోలు మెయిన్రోడ్డు పక్కనే ఉంటుంది. ప్రహరీ పొడవునా దుకాణాలున్నాయి. పగటి వేళ జన సంచారం ఉంటుంది. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంపై దాడికి పాల్పడటం వింతగా ఉందని స్థానికులు అంటున్నారు. గృహ నిర్మాణ శాఖలో సకాలంలో బిల్లులు చేయకపోవడం లేదా పక్కాఇళ్లను మంజూరు చేయకపోవడం వంటి కారణాలతో ఎవరైనా ఈ దాడికి పాల్పడ్డారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల హౌసింగ్ కార్యాలయం ప్రహరీ దారి మూసివేయడం తదితర కారణాలతో కూడా ఇలాంటి ఘటన జరిగి ఉండొచ్చని చెప్పుకొంటున్నారు. ఏఈ మహేష్ పీడీ, ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి పొదలకూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. -
అవగాహనతోనే దంత వ్యాధులకు చెక్
అప్రమత్తంగా ఉండాలి ● దంతాల ఇన్ఫెక్షన్తో ఓరల్ కేన్సర్ రిస్క్ ● జిల్లాలో 3 లక్షల మందికి వివిధ సమస్యలు ● నేడు ప్రపంచ ఓరల్ హెల్త్ డే నెల్లూరు(అర్బన్): మనం తినే ఆహారం నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాంటి నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో దంతాలు పుచ్చిపోతాయి. చిగుళ్లు గట్టిగా ఉండవు. చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. ఫలితంగా నోటి జబ్బులతోపాటు గుండె జబ్బులు, షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని శాస్తవేత్తలు పేర్కొంటున్నారు. నోటిలో పలు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అంతేకాకుండా పుచ్చి పళ్లతో నలుగురిలో సక్రమంగా మాట్లాడలేక మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నోటి వ్యాధులను తగ్గించేందుకు మార్చి 20వ తేదీని ప్రపంచ ఓరల్ డేగా ప్రకటించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా జిల్లాలో శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ, ఇతర వైద్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతాయి. అనేకమందికి.. భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు దంత, నోటి సమస్యలతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో సుమారు 3 లక్షల మందికి పైగా ఏదో ఒక దంత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లో ఎక్కువగా దంత క్షయ సమస్యలు కనిపిస్తున్నాయి. మారిన జీవనశైలి, జంక్ఫుడ్స్ వల్ల శుభ్రత లోపించి పిల్లల నుంచి పెద్దల వరకు దంత సమస్యలతో బాధపడుతున్నారు. నోటిలో పుండ్లు, పొక్కడం, చిగుళ్లు వాపు, గమ్ డిసీజెస్, దుర్వాసన వంటి సమస్యలు పెరుగుతున్నాయి. సమస్యలు తగ్గాలంటే.. దంత సమస్యలు లేకుండా ఉండాలంటే డాక్టర్ల సలహాలు పాటించాలి. వాటిలో ప్రధానంగా గుట్కా, ఖైనీ, పాన్పరాగ్, చుట్ట, బీడీ, సిగరెట్ లాంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిని వినియోగిస్తే నోటి కేన్సర్లు ఎక్కువగా వస్తాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకోబోయే మందు రోజూ రెండు దఫాలుగా బ్రష్ చేసుకోవాలి. బ్రష్ను ప్రతి మూడునెలలకో దఫా మార్చాలి. ఆహారం తిన్న తర్వాత నోటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే దంత శుభ్రత అలవాటు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే.. దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్లలో చీము కారడం కేన్సర్కు నేరుగా కారణం కాదు. అయితే నోటిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల కారణంగా చిగుళ్లు వాచి, దవడ ఎముక మెత్తబడొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నోటి టిష్యూలు దెబ్బతింటాయి. ఇలా జరగడం వల్ల నేరుగా కేన్సర్ను కలిగించకపోయినప్పటికీ ఆ రిస్క్ ను పెంచే ఫ్యాక్టర్గా మారొచ్చు. అందువల్ల దంత సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. నోరు పొక్కినా, పుండు ఏర్పడినా, దంతాలు జిల్లుమని పిస్తూ చల్లటి వస్తువులను తినలేకపోయినా డాక్టర్ను సంప్రదించేలా ప్రోత్సహించాలి. ప్రతి ఆరునెలలకోసారి దంతాలు చెక్ చేయించుకోవాలి.దంత సమస్యలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. జంక్ ఫుడ్వల్ల చిన్నపిల్లలో కూడా పాలదంతాలు త్వరగా పుచ్చిపోతున్నాయి. మారిన జీవనశైలి వల్ల పెద్దల్లో సైతం ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. దంతాలు రంగు మారుతున్నా, కొంచెం పుచ్చిపోయినా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. ప్రాథమిక దశలో సులభతరంగా క్లీన్ చేసి సిమెంట్ పెట్టేస్తాం. నిర్లక్ష్యం చేస్తే రూట్ కెనాల్ లాంటి ఖరీదైన వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. పొగాకు అలవాటు పూర్తిగా మానాలి. గార, చిగురు తినేయడం లాంటి సమస్యలున్నప్పుడే డాక్టర్ ద్వారా వైద్య చికిత్స పొందాలి. ఆరునెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో పళ్లను క్లీన్ చేయడం, జ్ఞాన దంతాలను తొలగించడం, పుచ్చిన పళ్లకు సిమెంట్ పెట్టడం లాంటి సేవలు ఉచితంగా చేస్తున్నాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ ఎం.హిమబిందు, ఎండీఎస్, డెంటిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, నెల్లూరు -
గంగ కాలువలో మృతదేహం
సైదాపురం: రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు గురువారం గంగ కాలువలో చనిపోయి కనిపించడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని చాగణం గ్రామానికి చెందిన బంకాపూరి సుబ్బయ్య కుమారుడు మణికంఠ (19) గూడూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆంజనేయ స్వామి గుడి వద్దకు వెళ్లి వస్తానంటూ ఇంట్లో నుంచి బైక్ తీసుకుని బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారమిచ్చారు. మర్లపూడి సమీపంలో ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువ వద్ద బైక్ను గుర్తించారు. దీంతో ఎస్సై క్రాంతికుమార్ స్థానికుల ద్వారా కాలువలో గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం మధ్యాహ్నం డక్కిలి సమీపంలో ప్రవహిస్తున్న కండలేరు ప్రధాన కాలువ వద్ద మణికంట మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి మృతదేహాన్ని బయటకు తీయించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో రాగివైరు చోరీ● ముగ్గురు దొంగల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో రాగివైరును చోరీ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నెల్లూరులోని చిన్నబజారు పోలీస్స్టేషన్లో స్థానిక ఎస్సై అబ్దుల్ రజాక్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఇటీవల గుర్తుతెలియని దొంగలు 200 మీటర్ల రాగివైర్ను చోరీ చేశారు. బీఎస్ఎన్ఎల్ ఇంజినీర్ రమేష్ ఈ ఘటనపై బుధవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు నేతృత్వంలో ఎస్సై అబ్దుల్ రజాక్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితులు ముత్తుకూరుకు చెందిన కుమార్, రాజుపాళేనికి చెందిన వెంకయ్య, అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన ఖలీంగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సీఏఎం హైస్కూల్ ప్రాంగణంలో నిందితులను అరెస్ట్ చేసి 40 మీటర్ల రాగివైరును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన ఎస్సై, హెచ్సీ సురేష్, పీసీలు వర్ధన్, సుబ్బారావు, దయాశంకర్, దేవాయ నాయుడును ఉన్నతాధికారులు అభినందించారు. -
కూల్డ్రింక్స్ లారీ బోలా్త
● రోడ్డుపై పడిపోయిన శీతల పానీయాలు ● నిమిషాల వ్యవధిలో ఎత్తుకెళ్లిన స్థానికులునెల్లూరు(క్రైమ్): కూల్డ్రింక్స్ లారీ బోల్తా పడిన ఘటన బుజబుజనెల్లూరు జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. సౌత్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. కూల్డ్రింక్స్ లోడ్తో లారీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి బుచ్చిరెడ్డిపాళేనికి బయలుదేరింది. వరికోత మెషీన్ను చైన్నె నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్న లారీ బుజబుజనెల్లూరు వద్ద కూల్డ్రింక్స్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొంది. దీంతో కూల్డ్రింక్స్ లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొంటూ వెళ్లి బోల్తా పడింది. ఆ లారీ డ్రైవర్, క్లీనర్కు ఎలాంటి గాయాలు కాలేదు. కూల్డ్రింక్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికులు, అటుగా వెళ్తున్న వారు నిమిషాల వ్యవధిలో బాటిళ్లను తీసుకెళ్లిపోయారు. ప్రమాద ఘటనతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకున్నారు. కూల్డ్రింక్స్ లారీ డ్రైవర్ మోహిత్కుమార్ రామ్ ఫిర్యాదు మేరకు సౌత్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తిని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన నెల్లూరులో చింతారెడ్డిపాళెం క్రాస్రోడ్డు సమీపంలో చైన్నె వైపు వెళ్లే రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. 13/1వార్డు వీఆర్వో చిన్న ధనయ్య ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 00095, 98856 67799, 94414 44399 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ కోరారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,332 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,852 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేనివారు 12 గంటల్లో, ప్రత్యేక టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.కండలేరులో 48.740 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 48.740 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,800, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 255, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
పరిహారం.. రైతులతో చెలగాటం
చిల్లకూరు: క్రిస్సిటీకి సేకరించిన భూములకు సంబంధించి పరిహారం అందించే విషయంలో అధికారుల తీరును రైతులు తప్పు పడుతున్నారు. కోట మండలంలో ఒకలా.. చిల్లకూరు మండలంలో ఒకలా ధరలు నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 116 ఎకరాలు, కోట మండలం కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 105 ఎకరాల వరకు పట్టా భూములను రెండు సంవత్సరం క్రితం సేకరించారు. వీటికి పరిహారం అందించే విషయంలో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. దీంతో రైతులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అలాగే ఆ భూముల్లో సాగుకు సిద్ధమయ్యారు. పట్టా భూములకు ఎట్టకేలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఎంత ఇవ్వాలనే విషయంపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోలేదు. అధికారులే రియల్ ఎస్టేట్లో ప్లాట్ ధరలు ఏ విధంగా ఉంటాయో అలా ధరలు నిర్ణయించి పరిహారం అందించాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో తాతల కాలం నుంచి సాగు చేసుకునే పట్టా భూములకు ఈ విధంగా ధరలు పెట్టడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద బుధవారం మొరపెట్టుకోగా అవార్డు పూర్తి చేశాం. తీసుకెళ్లండి. లేకుంటే కోర్టులో జమ చేస్తాం. అక్కడ తీసుకోండని చెప్పడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతుల అసంతృప్తి పట్టా, సీజేఎఫ్ఎస్, డీకేటీ, అసైన్మెంట్, ఇలా పలు రకాల కేటగిరీల్లో ఉన్న భూములను చిల్లకూరు, కోట మండలాల్లో ఏపీఐఐసీ సేకరించింది. క్రిస్సిటీ కోసం సేకరించిన భూములు అధిక భాగం చిల్లకూరు మండలంలోనే ఉన్నాయి. అయితే కోట మండలంలో పట్టా, సీజేఎఫ్ఎస్ భూములకు పరిహారం ఒకేలా ఇస్తున్నారు. కానీ చిల్లకూరు మండలంలో పట్టా భూమికి ఒక ధర, సీజేఎఫ్ఎస్ భూమికి ఒక ధర నిర్ణయించడంపై రైతులు మండిపడుతున్నారు. సేకరించిన భూములన్నీ క్రిస్సిటీ కోసమే అయితే రెండు మండలాల్లోని రైతుల మధ్య విభేదాలు సృష్టించేలా అధికారులు వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు మండలాలకు ఒకేలా పరిహారం ఇవ్వాలని గతంలో ఆందోళనలు చేపట్టిన సమయంలో అంగీకరించిన అధికారులు నేడు గుట్టుచప్పుడు కాకుండా ధరలు నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. చెక్కులు తీసుకెళ్లాలని చెప్పడం సరైన నిర్ణయం కాదని రైతులు అంటున్నారు. పక్క మండలంలో పట్టా భూములు, సీజేఎఫ్ఎస్ భూములకు పరిహారం ఎలా ఇస్తున్నారో అలానే చిల్లకూరు మండలంలో కూడా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని చెబుతున్నారు. కోట మండలంలో ఒకలా.. చిల్లకూరు మండలంలో మరోలా.. అధికారుల నిర్ణయంపై విస్మయం రియల్ ఎస్టేట్ ధరల్లా పరిహారం చెల్లింపు అవార్డు తీసుకెళ్లాలని ఒత్తిడి -
టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలంటూ..
● పోలీస్స్టేషన్ ఎదుట దళిత సంఘాల నిరసన ● డీఎస్పీకి వినతిపత్రం అందజేత విడవలూరు: మండలంలోని ముదివర్తి గ్రామం దళితవాడకు చెందిన పట్టపు రోహిత్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు కారణమైన టీడీపీ నాయకుడు ఫేక్ రఫీపై బలమైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం స్థానిక పోలీస్స్టేషన్ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు సాల్మన్ రాజ్, బీఆర్మీ రాష్ట్ర నాయకుడు పొంగులూరు ప్రసాద్ మాట్లాడుతూ రోహిత్ విషయంలో పోలీసుల వైఖరి మార్చుకోవాలన్నారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. బీఎస్పీ నాయకురాలు అరుణమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. యువకుడిని కులం పేరుతో దూషించి ఆత్మహత్యాయత్నం చేసుకునేలా ప్రేరేపించిన రఫీపై స్టేషన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. న్యాయం చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామన్నారు. న్యాయం చేయాలి రోహిత్ను అవమానించిన వ్యక్తిని పోలీసులు చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పట్టపు నాగరత్నం, ప్రశాంతి, తమ్ముడు రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు రఫీపై బలమైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే పోలీస్స్టేషన్ ఎదుట గడ్డిమందు తాగి చనిపోతామని తెలియజేశారు. రఫీని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని స్థానికులు కోరారు. డీఎస్పీకి వినతి పోలీస్స్టేషన్కు వచ్చిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుకు రోహిత్ తల్లితండ్రులు, స్థానికులు, దళిత సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. దళితులమని తమపై చిన్నచూపు చూడటం తగదన్నారు. రఫీని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. సెల్ఫీ వీడియో ఆధారంగానే కేసు నమోదు చేయడం జరిగిందని, కేసును పూర్తిగా విచారిస్తామని, అవసరమైతే వేరే సెక్షన్లు కూడా కలిపి న్యాయం చేస్తామని డీఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు దానం మాల్యాద్రి, నాయకులు ముసలి నరేంద్ర, స్థానిక మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
రచ్చబండను ఢీకొట్టిన బైక్
● ఇద్దరు యువకుల దుర్మరణం ● చిత్తలూరులో విషాదం చేజర్ల: మోటార్బైక్ అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి రచ్చబండను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి మండలంలోని చిత్తలూరులో జరిగింది. చేజర్ల పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిత్తలూరు ఎస్సీ కాలనీకి చెందిన సిద్ధి మురళి (25), సిద్ధి హరీష్ (26) పని నిమిత్తం పొదలకూరు పట్టణానికి బైక్పై వెళ్లి అర్ధరాత్రి స్వగ్రామానికి వస్తున్నారు. బైక్ వేగంగా గ్రామంలోకి ప్రవేశించగానే అదుపుతప్పి ఆర్అండ్బీ రోడ్డు పక్కనే ఉన్న రచ్చబండను ఢీకొట్టింది. దీంతో హరీష్, మురళి అక్కడికక్కడే మృతి చెందారు. తెల్లవారుజామున ఆ దారిన వెళ్లే వాహనచోదకులు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. హరీష్కు ఇటీవల వివాహమైంది. మురళీకి వివాహమై చిన్నబాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని గురువారం ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సంగం సీఐ శ్రీనివాసులురెడ్డి, చేజర్ల ఎస్సై తిరుమలరావు పరిశీలించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కావలి రూరల్: కావలి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొండాయగారిపాళేనికి చెందిన మన్నెం మాల్యాద్రి (50) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కథనం మేరకు.. మాల్యాద్రికి మద్యం తాగే అలవాటు ఉంది. బుధవారం ఉదయం బుడంగుంట నక్కల కాలనీలో ఉన్న తన అక్క మల్లేశ్వరి ఇంటికి వెళ్లాడు. తిరిగి రాత్రి తన ఇంటికి వచ్చి వరండాలో నిద్రపోయాడు. 11 గంటల సమయంలో భార్య నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. అయితే అతని నుంచి స్పందన లేకపోవడంతో బంధువులకు సమాచారం ఇచ్చింది. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా మృతిచెందినట్లు నిర్ధారించారు. మల్లేశ్వరి తన తమ్ముడి మృతిపై అనుమానాలున్నటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు.సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం● జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నెల్లూరు(పొగతోట): గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య అన్నారు. గురువారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీల సమస్యల పరిష్కారం విషయంలో నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకలవ్య విద్యాలయాల స్థాపనకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. గిరిజనుల సమస్యలను నేరుగా లేదా ఈ – మెయిల్ ద్వారా కమిషన్ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. వచ్చే నెలలో ఏపీలో గిరిజనుల సమస్యలు, బడ్జెట్ వినియోగంపై ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. ఎస్టీల అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఉదయగిరి, కోవూరు, సర్వేపల్లి ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎస్టీల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు తమ పరిధిలో జరిగే కార్యక్రమాలను వివరించారు. ఎన్జీఓలు, గిరిజనుల సంక్షేమ సంఘం నాయకులు సమస్యలను చైర్మన్కు వివరించారు. సమావేశంలో ఎస్పీ అజిత, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
చలో జువ్వలదిన్నెను జయప్రదం చేయండి
● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా శుక్రవారం జరిగే చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కోరారు. కావలిలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు 70 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేశారన్నారు. 29.5 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థ అయిన సాగర్ డిఫెన్స్ సంస్థకు అప్పజెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. వారికి స్థలాన్ని వేరేచోట ఇచ్చి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తే మంచిదన్నారు. కానీ హార్బర్ కోసం సేకరించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. శుక్రవారం కావలి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి చలో జువ్వలదిన్నె కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, నాయకులు విచ్చేస్తారన్నారు. తీర ప్రాంత ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రూరల్ మండల అధ్యక్షుడు వాయిల తిరుపతి, సీఆర్పాళెం సర్పంచ్ గిరిబాబు, జువ్వలదిన్నె సర్పంచ్ గోవిందస్వామి, అన్నగారిపాళెం ఎంపీటీసీ సభ్యులు పి.శ్రీనివాసులు, గంగన్నగారి యోధశ్రీ, పెద్దపట్టపుపాళెం ఎంపీటీసీ వాయిల రాధాకృష్ణ, వెంకట్రావు, పౌలు తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది
కలెక్టరేట్లో ఉగాది సంబరాలు ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): ఉగాది.. పండగ మాత్రమే కాదని, సంప్రదాయాల సుగంధం, మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే వేడుక అని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఉగాది సంబరాలను వేడుకగా గురువారం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను గతేడాదిలో విజయవంతంగా కొనసాగించామని, ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది మరింత అభివృద్ధి సాధించాలని కాంక్షించారు. బాల్య వివాహాల నిర్మూలన, ప్రతి ఒక్కరికీ విద్య అందేలా కృషి చేయడం తదితర అంశాల్లో ప్రజలందరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఉత్సాహంగా.. పరాభవ నామ సంవత్సరాది ఉగాది పంచాంగాన్ని ఆలూరి శిరోమణిశర్మ వినిపించారు. ప్రముఖ వేద పండితులను దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్క రించారు. కవులు, కళాకారులు, వివిధ రంగాల ప్రము ఖులను సన్మానించారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇన్చార్జి డీ ఆర్వో మహేశ్వరరెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ, ఆర్డీఓ అనూష, మెప్మా పీడీ లీలారాణి పాల్గొన్నారు. -
కూటమి పాలనలో అల్లాడుతున్న అన్నదాతలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: ‘ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ మాటలు బోగస్. క్షేత్రస్థాయిలో మద్దతు ధర లభించక అన్నదాతలు అల్లాడుతున్నారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మనుబోలు కోదండరామపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అన్నదాతల సంక్షేమం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం మొక్కుబడిగా రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ధాన్యం పుట్టి రూ.20,306కి కొనుగోలు చేయాల్సి ఉండగా బీపీటీ కేవలం రూ.17 వేలకే వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని తెలిపారు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేసి 24 గంటల్లో నగదు రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మిన్నకుండిపోయారన్నారు. అధికారులను ఫోన్ ద్వారా సంప్రదిస్తే ప్రభుత్వం మాకు టార్గెట్ ఇచ్చిందని, అంతకు మించి కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ జమ కాలేదని, తుఫాన్ సమయంలో నాసిరకం విత్తనాలు సరఫరా చేశారని, అధికారులు సహకరించడం లేదని రైతులు తమ వద్ద గొల్లుమంటున్నారని తెలిపారు. సోమిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కు కాకుండా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బండేపల్లి బ్రాంచ్ కెనాల్కు సంబంధించి తాము సేకరించిన భూములకు పరిహారం అందజేశామన్నారు. సోమిరెడ్డి మాత్రం కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు తీసుకుని మట్టి పనులకు డబ్బులు చెల్లించాడని తెలిపారు. బోగస్ జాబ్మేళా జాబ్మేళాల పేరుతో సోమిరెడ్డి నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని కాకాణి ధ్వజమెత్తారు. వెయ్యి మందికి పైగా ఉద్యోగాలిచ్చామని డబ్బాలు కొట్టుకుంటున్నారని, వారి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాము విచారణ చేసి నిగ్గుతేలుస్తామన్నారు. బోగస్ ఉద్యోగాలిచ్చి నిరుద్యోగుతో ఆటలాడుకోవడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, గుర్రం ప్రభాకర్, బందిల వేణుగోపాల్, గిద్దంటి రమణయ్య, గుంజి రమేష్, ఆవుల తులసీరామ్, దాసరి భాస్కర్గౌడ్, కేవీఆర్ గౌడ్, చల్లా నవకోటి, తుపాకుల గిరి, భాస్కర్రెడ్డి, కోటేశ్వరగౌడ్, పార్థూ, సుధాకర్రెడ్డి, సుమంత్రెడ్డి, కమాలాకర్రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సత్తా
నెల్లూరు(లీగల్): ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) బలపరిచిన అభ్యర్థి సీనియర్ న్యాయవాది సత్తు అంకయ్య సత్తా చాటారు. గత నెల 13వ తేదీ పోలింగ్ జరిగింది. బుధవారం ఫలితాలు వెల్లడించారు. నెల్లూరు నుంచి ఐదుగురు పోటీ చేశారు. ఏపీ బార్ కౌన్సిల్ మాజీ సభ్యులు సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్రెడ్డి.. అంకయ్య మధ్య పోటీ తీవ్రంగా సాగింది. చివరికి అంకయ్యకు విజయం దక్కింది. ప్రస్తుతం ఆయన ఐలు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంకయ్యను సీనియర్ న్యాయవాదులు బీవీ రమణరెడ్డి, పి.విజయకుమార్రెడ్డి, కటారి అజయ్కుమార్, జి.బాలసుబ్రహ్మణ్యం, కుడుమల రవికుమార్, జల్లి పద్మాకర్, వేలూరు రంగరావు, సలీం అభినందించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఐలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంకయ్యను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐలు నాయకులు రమేష్, పీఎన్ సాయి, పి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
నెల్లూరురూరల్: జిల్లా ప్రజలకు ఉగాది పండగ శుభాకాంక్షలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అధ్యాపకులను రిలీవ్ చేయాలినెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనానికి ఎగ్జామినర్లుగా నియమించిన అధ్యాపకులను ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ రిలీవ్ చేయాలని ఆర్ఐఓ వరప్రసాద్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసిన నేపథ్యంలో నెల్లూరులోని స్టోన్హౌస్పేటలో ఉన్న కేఏసీ కళాశాలలో ఈనెల 21వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టులు, 25వ తేదీ నుంచి రెండో విడతలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, బయాలజీ, కామర్స్, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతుందన్నారు. స్పాట్ వాల్యుయేషన్కు హాజరుకాని అధ్యాపకులు, రిలీవ్ చేయని కళాశాలల యాజమాన్యాలపై ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వగ్రామానికి రాజశేఖర్ మృతదేహం ఆత్మకూరురూరల్: పాపసాని రాజశేఖర్ మృతదేహాన్ని దుబాయ్ నుంచి బుధవారం స్వగ్రామమైన మండలంలోని నారంపేటకు తీసుకొచ్చారు. స్థానికుల కథనం మేరకు.. రాజశేఖర్ దుబాయ్లో సైబర్ గేట్ డిఫెన్స్ సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను కొద్దిరోజులుగా కుటుంబ సభ్యుల ఫోన్కు స్పందించలేదు. వారు ఆందోళన చెంది వివిధ మార్గాల ద్వారా అక్కడి కాన్సులేట్ను సంప్రదించారు. రాజశేఖర్ తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం వచ్చింది. అతని పాస్పోర్ట్ గదిలో లేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. అంత్యక్రియలు నిర్వహించారు.విధుల్లో ఉండగా..● గుండెపోటుతో ఎకై ్సజ్ కానిస్టేబుల్ మృతి ఆత్మకూరు: ఎకై ్సజ్ కానిస్టేబుల్ కె.రాఘవరావు (52) విధుల్లో ఉండగా తీవ్ర గుండెపోటుకు గురై మృతిచెందాడు. కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది మంగళవారం రాత్రి పలు గ్రామాల్లో దాడులు నిర్వహించేందుకు వెళ్లారు. ఈక్రమంలో రాఘవరావు కార్యాలయంలోనే సెంట్రీ విధులు నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున తీవ్ర గుండెనొప్పితో బాధపడుతుండగా విధుల్లో ఉన్న మరో వ్యక్తి వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాఘవరావు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నరసయ్యపాళెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఏడునెలల క్రితం కనిగిరి ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం నుంచి బదిలీపై ఆత్మకూరుకు వచ్చాడు. అతడికి భార్య, కుమా రుడు ఉన్నారు. కానిస్టేబుల్ మృతి విషయం తెలుసుకున్న ఎకై ్సజ్ సీఐ కిశోర్, సిబ్బంది కృష్ణయ్య, విజయ్బాబు, మరికొందరు బుధవారం ప్రభుత్వాస్పత్రికి వచ్చి సంతాపం తెలిపారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నుడాలో అక్రమాలు
● కొనసాగిన ఏసీబీ తనిఖీలు ● పలు ఫైళ్ల పరిశీలన నెల్లూరు(బారకాసు): నగరంలోని నుడా కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు బుధవారం కూడా కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో రెండు బృందాలు సోదాలు చేశాయి. పలు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక బృందం కార్యాలయంలోని ప్రణాళికా విభాగంలో కీలకమైన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులను విచారించారు. మరో బృందం ఆర్అండ్బీ, ప్రణాళికా విభాగాధికారుల సహకారంతో పలు భవనాలను పరిశీలించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు చదరపు గజానికి రూ.165 నుంచి రూ.250లు వరకూ ఉండాలి. అయితే నుడా అధికారులు రూ.1 నుంచి రూ.93 వరకూ రేట్లు తక్కువగా అంచనా వేసి 45 భవనాలకు అనుమతులు మంజూరు చేశారని డీఎస్పీ తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వా ఖజానాకి రూ.కోట్లలో నష్టం వచ్చిందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ పది శాతానికి మించిన వ్యత్యాసాలున్న అనేక భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేశారన్నారు. తుడా పరిధిలో ఉన్న పలు లేఅవుట్లపై నుడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యాలయంలో ముఖ్యమైన అనేక రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించలేదని గుర్తించామన్నారు. అదేవిధంగా ఫైల్ ప్రాసెసింగ్లో అసాధారణ జాప్యాలు జరిగినట్లుగా తెలుస్తుందన్నారు. అక్రమాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నామని డీఎస్పీ తెలిపారు. ఏసీబీ ఆకస్మిక తనిఖీలతో తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని నుడా కార్యాలయ అధికారులు, ఉద్యోగుల్లో గుబులు పట్టుకోగా మరోవైపు ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తనిఖీల ప్రక్రియలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, విజయ్కుమార్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆత్మహత్యలు
● నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వాకాడు: ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం వారిపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి విమర్శించారు. బుధవారం వాకాడులోని తన నివాసంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, రైతులతో రామ్కుమార్రెడ్డి ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు మండలాలకు చెందిన రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మిల్లర్లు ఒక్కటై రైతుల కష్టాన్ని అందినకాడికి దోచుకుపోతున్నారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో 22 నెలల్లో దాదాపు 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాడ్పినట్లు అధికార గణాంకాల ద్వారా తెలిసిందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వంలో జిలకర మసూరి ధాన్యం పుట్టి రూ.25 వేలు ధర పలికిందన్నారు. నేడు రూ. 18 వేలకు పడిపోయిందన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తుందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదని నేదురుమల్లి భరోసా ఇచ్చారు. ఆయన తిరుపతి, నెల్లూరు జిల్లాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వాకాడు, చిట్టమూరు మండల కన్వీనర్లు ఏనుగు సుధాకర్నాయుడు, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, నేతలు ఎన్.హిమకుమార్రెడ్డి, పి.రాజశేఖర్రెడ్డి, డి.నాగూర్రెడ్డి, జి.సుధాకర్రెడ్డి, జి.వెంకటేశ్వర్లురెడ్డి, ఎన్.శ్రీధర్రెడ్డి, పి.శశిరెడ్డి, ఎన్.పెంచలరెడ్డి, రవి, ఈ.వెంకటయ్య, శేషురెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు. -
చలో జువ్వలదిన్నె రేపు
● ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుందాం ● మత్స్యకారుల భవిష్యత్కు అండగా నిలుద్దాం.. తరలిరండి బిట్రగుంట: మత్స్యకారుల జీవితాలను ఉజ్వలం చేసేందుకు బోగోలు మండలం జువ్వలదిన్నెలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను దొడ్డిదారిన ప్రైవేట్ పరం చేస్తున్న టీడీపీ నేతల కుట్రలను ఎదుర్కొనేందుకు చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జువ్వలదిన్నెకు ఉత్తర, దక్షిణంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని తీర ప్రాంతాల మత్స్యకారులతో పాటు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు.. ఉపాధి కోసం చైన్నె, గుజరాత్, మంగుళూరు వంటి దూరప్రాంతాలకు వలస వెళుతున్న మత్స్యకార యువకులకు స్థానికంగానే ఉపాధి కల్పించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టారన్నారు. దీని ద్వారా ఒక మత్స్యకారులకే కాకుండా వేలాది మందికి ఇతరులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుదన్నారు. శరవేగంగా నిర్మాణం పూర్తి చేయించారని, ఎన్నికలు రావడంతో వాయిదా పడిందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఫిషింగ్ హార్బర్ను వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినప్పటికీ మత్స్యకారులకు అంకితం చేయకుండా, కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాల ద్వారా వారి నోట్లో మట్టికొట్టే యత్నం చేస్తోందన్నారు. హార్బర్లో ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనం అప్పగిస్తే స్థానిక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తీరంపై ప్రైవేట్ పెత్తనాన్ని అడ్డుకునే లక్ష్యంతో చలో జువ్వలదిన్నెకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డితో పాటు పలువురు జిల్లా నేతలు పాల్గొననున్నట్లు తెలిపారు. -
మల్లాం ఆలయ ఆదాయానికి గండి
● దేవుడి సొమ్ము స్వాహా ● పాలకమండలి వ్యవహారశైలి వివాదాస్పదంచిట్టమూరు: మండలంలోని మల్లాం గ్రామంలో వెలసిన వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అలాగే వివిధ అంశాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజలకు సంబంధించిన ధరలను దేవదాయ శాఖ నిర్ణయించి బోర్డుపై ఉంచింది. అయితే అందుకు విరుద్ధంగా భక్తుల నుంచి అదనంగా వసూలు చేసి నిలువు దోపిడీ చేస్నున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో అన్నదాన పథకానికి రూ.13 వేలు తీసుకునేవారు. ప్రస్తుత రూ.20 వేలు తీసుకుంటున్నా సక్రమంగా కార్యక్రమం చేపట్టడం లేదని ప్రచారం జరుగుతోంది. పాలకమండలి కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువ కావడంతో అన్నదానానికి ఉపయోగించే బియ్యం బస్తాలు కూడా విక్రయాలు జరుగుతున్నట్లు సమచారం. కొద్దిరోజుల క్రితం పలువురు నగదు కట్టి కల్యాణం జరిపించుకున్నారు. అయితే స్వామికి ఒకే పట్టువ స్త్రాలతో కల్యాణం జరిపించడాన్ని ఒకరు ప్రశ్నించి పాలకమండలి, పూజారులు, ఈఓకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. సమస్యలపై భక్తులు ప్రశ్ని స్తే మా ప్రభుత్వం.. మా ఇష్టం.. మీక్కు దిక్కున్నచోట చెప్పుకోండటంటూ సమాధానం వస్తోంది. గతంలో దర్శనానికి ఉచితంగా వెళ్లేవారు. ప్రస్తుతం టోకన్లు పెట్టి నగదు వసూలు చేస్తున్నట్లు భక్తులు తెలిపారు. బలవంతంగా ఖాళీ ఆలయానికి అనుసంధానంగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయిన్నట్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు తమ వర్గం వారికి చౌకగా రూ.4 వేలకే గదులు బాడుగకు ఇప్పిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. గతంలో ఆలయం ముందు పలువురు చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారు. వారిని ఖాళీ చేయించి నూతనంగా అద్దె గదులు నిర్మిస్తున్నారు. అవి కూడా అధికార పార్టీకి చెందిన వారికి తక్కువ రేటుకు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. హుండీ కానుకల లెక్కింపులో, వందల ఎకరాల మాగాణి భూముల ఆదాయంపై గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలపై ఆలయ ఈఓ పెంచల వరప్రసాద్రావును వివరణ కోరగా తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని, అన్ని లోపాలను గుర్తించి సరిచేసి దేవదాయ శాఖ నిబంధనల మేర పూజలను చేయిస్తామని చెప్పారు. -
పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు
● జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి నీరజ వింజమూరు(ఉదయగిరి): పాలు కల్తీ చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అఽధికారిణి డాక్టర్ నీరజ తెలిపారు. వింజమూరులోని పలు పాల సేకరణ కేంద్రాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. శాపింల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. ఈ సందర్భంగా పాలు సేకరించే ఏజెంట్లకు అవగహన కల్పించారు. సేకరణ సమయంలో కల్తీ పాలను గుర్తించే విధానం గురించి తెలిపారు. కల్తీ పాలు సేకరించినట్లు రుజువైతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
ఆటోను ఢీకొట్టిన బొగ్గు లారీ
● ఐదుగురికి తీవ్రగాయాలుచిల్లకూరు: బొగ్గు లారీ వేగంగా ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు మహిళలకు తీవ్రగాయాలైన ఘటన మంగళవారం చిల్లకూరు పోలీస్స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ముత్యాలపాడు పంచాయతీ పరిధిలో రైటార్ సత్రానికి చెందిన సుగుణ, లక్ష్మమ్మ, బుజ్జమ్మ, వెంకటరమణమ్మ చిల్లకూరులోని పొదుపు కార్యాలయానికి వెళ్లారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన శ్రావణి గూడూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుని కార్యాలయానికి వచ్చింది. వీరంతా పని ముగించుకుని ఇంటికి తిరిగి ఆటోలో ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పోలీస్స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి జ్యూస్ తాగి బయలుదేరారు. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు నుంచి శ్రీసిటీకి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో చిల్లకూరు 108 సిబ్బంది కృష్ణ, పెంచలయ్య ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వివరాలు తెలుసుకుని ప్రమాదానికి కారణమైన బొగ్గు లారీని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బంధువే.. రాబందువు
● బస్సెక్కిస్తానంటూ తీసుకెళ్లి వృద్ధురాలి నిలువు దోపిడీ ● ఆ తర్వాత కాలువలోకి తోసేసిన వైనంకోవూరు: బంధువే.. రాబందువై ఓ వృద్ధురాలిని నిలువు దోపిడీ చేసి.. కాలువలోకి నెట్టిన ఘటన మండలంలోని జమ్మిపాళెంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన జలదంకి లక్ష్మీరాజ్యం ఆదివారం మండలంలోని వేగూరులో ఉన్న తన అక్క ఇంటికొచ్చింది. సోమవారం ఆమె తిరిగి కావలికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంతలో అక్క కుమారుడు సతీష్ లక్ష్మీరాజ్యంను ఆటోలో ఎక్కించుకుని ఆత్మకూరు బస్టాండ్లో బస్సు ఎక్కిస్తానని బయలుదేరాడు. కానీ ఆమెను దగదర్తి, అల్లూరు, కోవూ రు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తిప్పా డు. తర్వాత జమ్మిపాళెంలోని హైవే బ్రిడ్జిపైకి తీసుకెళ్లాడు. వృద్ధురాలి వద్ద ఉన్న బంగారు నగలను లాక్కొన్నాడు. ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న పంట కాలువలోకి తోసేసి పరారయ్యాడు. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ముత్యాలరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో వృద్ధురాలిని క్షేమంగా బయటకు తీశారు. కేసు నమోదు చేశారు. సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
12 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని పలు హోటళ్లు, క్యాటరింగ్లు, టీ కేఫ్లు, ధాబాలపై మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. సబ్సిడీపై అందజేసే గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాల నిమిత్తం అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. 12 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయీస్ అధికారులకు అప్పగించారు. సంబంధిత యజమానులపై నిత్యావసరాల సరుకుల చట్టం సెక్షన్ 6 (ఏ) ప్రకారం చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు. పొదలకూరు నిమ్మధరలు (కిలో) పెద్దవి: రూ.75 సన్నవి: రూ.65 పండ్లు: రూ.40 -
టీచర్ల సమస్యలపై కలెక్టర్కు వినతి
నెల్లూరు(దర్గామిట్ట): ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్లాను మంగళవారం ఏపీ వైఎస్సార్ టీఏ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ అమలయ్యే వరకు ఉద్యోగులకు కనీసం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్ కరువు భత్యాలను వెంటనే ఇవ్వాలన్నారు. ఉద్యోగుల సంపాదిత సెలవు బకాయిలను విడుదల చేయాలని, ఉద్యోగులు తమ అవసరాల కోసం దరఖాస్తు చేసిన పీఎఫ్ లోన్లు ఆలస్యం లేకుండా మంజూరు చేయాలన్నారు. ఈ సమస్యలను అత్యవసరంగా పరిగణించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఒ.శివశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ జాన్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
పోలీసులకు ఉగాది సేవా పతకాలు
నెల్లూరు(క్రైమ్): ఉగాది పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన పోలీస్, విజిలెన్స్, సీఐడీ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందికి సేవా పతకాలను ప్రకటించింది. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకాలు లభించిన వారిలో ఎస్సై ఎన్.శ్రీనివాస్ సింగ్ (డీసీఆర్బీ), లీడింగ్ ఫైర్మెన్ జి.శ్రీనివాసులు (రాపూరు ఫైర్స్టేషన్), సేవా పతకం లభించిన వారిలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు (నెల్లూరు రూరల్), ఆర్ఐ జె.హరిబాబు (డీఏఆర్), ఏఎస్సైలు వి.చెంగయ్య (సంతపేట), ఈ.శ్రీనివాసులు (డీసీఆర్బీ), ఎస్డీ జిలానీబాషా (ఏఆర్ ఎస్సై), హెచ్సీలు కె.హజరత్ (కొడవలూరు), ఒ.శ్రీనివాసులు (సీఐడీ), జి.చంద్రశేఖర్ (డీఏఆర్), పి.మాలకొండయ్య (డీఏఆర్), కానిస్టేబుళ్లు బి.జయంతికుమార్ (బిట్రగుంట), షేక్ సుల్తాన్ మొహిద్దీన్ (నవాబుపేట), పి.సన్యాసినాయుడు (డీఏఆర్), ఎస్ఎఫ్ఓ డి.హరిబాబు (ఉదయగిరి ఫైర్స్టేషన్), ఎల్ఎఫ్లు ఎ.సుధాకర్ (ఆత్మకూరు ఫైర్ స్టేషన్), జి.వెంకటేశ్వర్లు (మర్రిపాడు ఫైర్స్టేషన్), డ్రైవర్ ఆపరేటర్ బి.హరిబాబు (మర్రిపాడు ఫైర్స్టేషన్) ఉన్నారు.వి.చెంగయ్య, ఏఎస్సై, సంతపేట కె.నరసింహారావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ డీఎస్పీ -
కావలి కాలువలో మృతదేహం
సంగం: మండలంలోని సంగం సమీపంలో ఉన్న కావలి కాలువలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి వివరాలు సేకరించారు. మృతుడిని సంగం తిరమణతిప్ప ఎస్టీ కాలనీకి చెందిన కొమరగిరి పెంచలయ్యగా గుర్తించారు. మృతి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఆర్థిక విభేదాలో?, కుటుంబ కలహాలో?, ఇతర కారణాలో తెలియదుగానీ చైన్నె టు పూరి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో నెల్లూరు వైపు వెళ్లే పట్టాలపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు సుమారు 5.4 అడుగుల ఎత్తు ఉన్నాడు. ఎరుపు రంగు గళ్ల ఫుల్ హ్యాండ్స్ చొక్కా, బులుగు రంగు గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 49.230 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 49.230 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,050, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 255, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంగూడూరురూరల్: ఎల్ఐసీ కార్యాలయం సమీపంలోని రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. గూడూరు రూరల్ ఎస్సై తిరుపతయ్య కథనం మేరకు.. మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామానికి చెందిన బత్తల ముత్యాలయ్య కుమారుడు చిన ముత్యాలయ్య అలియాస్ రఘు (35) గూడూరులోని ఆస్పత్రి రోడ్డులో ఉన్న ఓ ఫొటో ల్యాబ్లో పనిచేస్తున్నాడు. పట్టణంలోని గమళ్లపాళెం ప్రాంతంలో నివాసముంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు అతను ల్యాబ్లో పనిచేసి యశ్వంత్ అనే స్నేహితుడితో కలిసి మోటార్బైక్పై జాతీయ రహదారి వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయారు. అదే సమయంలో ఎదురుగా నడిచి వస్తున్న ఓ వ్యక్తిని తప్పించబోయి ఢీకొనడంతో బైక్పై నుంచి ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. వెనుక కూర్చొని రఘు అక్కడికక్కడే మృతిచెందాడు. యశ్వంత్కు స్వల్ప గాయాలయ్యారు. 108 అంబులెన్స్లో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేశారు. రఘు మృతి విషయం తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. -
వినతుల వెల్లువ
● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 140 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్ల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఫిర్యాదుల విభాగం సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా కొడుకు సాయివినయ్ ఉద్యోగ నిమిత్తం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఇంతవరకూ తిరిగి రాలేదు. కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారుని ఆచూకీ కనుక్కోవాలని ఓ మహిళ కోరారు. ● వెంకట్ అనే వ్యక్తి నా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తన దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విచారించి చర్యలు తీసుకోవాలని వేదాయపాళెం ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. ● ఉద్యోగం ఇప్పిస్తానని ఎన్టీఆర్ నగర్కు చెందిన రమేష్ నా వద్ద రూ.4.80 లక్షలు తీసుకుని మోసగించాడు. నగదు అడిగితే అంతు చూస్తామని బెదిరిస్తున్నాడని చిన్నబజారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● భర్త చెడు వ్యసనాలకు బానిసై నన్ను, ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లాడు. కుటుంబ పోషణ భారంగా మారింది. అతని ఆచూకీ కనుక్కోవాలని గూడూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. -
మోటార్బైక్పై వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతివింజమూరు(ఉదయగిరి): మండలంలోని ఇందిరా నగర్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మూలె జనార్దనరెడ్డి (39) సొంతూరు చేజర్ల మండలం నూతక్కివారికండ్రిక. వింజమూరు పట్టణంలోని యర్రబల్లిపాళెంలో వివాహం చేసుకుని కొన్నేళ్ల నుంచి ఇక్కడే కాపురముంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయగిరికి కోర్టు పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఊరికి బైక్పై బయలుదేరాడు. నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటి పెద్ద మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఏఎస్సై జయరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. గ్యాస్ సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ నెల్లూరు(పొగతోట): గ్యాస్ సమస్యల పరిష్కారానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం, అధిక ధరల వసూలు, బుకింగ్లో సమస్యలు ఉంటే వినియోగదారులు 94922 73897 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు. భర్త వేధింపులు తాళలేక.. ● వివాహిత ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): భర్త తీరుతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు అనగుంటకు చెందిన ప్రతాప్, మహిత (20)లు దంపతులు. వారిది ప్రేమ వివాహం. కొద్దిరోజులు సజావుగా సాగిన కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. భర్త తరచూ ఆమెను నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ మానసికంగా వేధించడంతోపాటు కొడుతుండేవాడు. దీంతో గతేడాది సెప్టెంబర్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహితను ఆమె పెద్దమ్మ వెంకటసుబ్బమ్మ తన వెంట కడపకు తీసుకెళ్లింది. కొంతకాలం తర్వాత ప్రతాప్ అక్కడికెళ్లి బాగా చూసుకుంటానని నమ్మించి భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. అయినా అతని తీరులో మార్పురాలేదు. పదిరోజుల క్రితం మహిత తన పెద్దమ్మకు ఫోన్ చేసి భర్త తీరును వివరించి కన్నీటి పర్యంతమైంది. ఆదివారం మహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని వెంకటసుబ్బమ్మకు ప్రతాప్ ఫోన్ చేసి చెప్పా డు. ఆమె ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉంటున్న మహిత అన్న మంజునాథ్కు తెలియజేసింది. అతను నెల్లూరుకు చేరుకుని సోదరి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిత మృతికి ప్రతాప్ కారణమని అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సోమవారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మా భూములు మాకే ఇప్పించండి● మోకాళ్లపై కూర్చుని పొదుపు మహిళల నిరసన కావలి రూరల్: మా భూములు మాకే ఇప్పించడంటూ కావలి మండలం చెన్నాయపాళెం పంచాయతీ పరిధిలోని పెద్దపట్టపుపాళేనికి చెందిన సుమారు 300 మంది పొదుపు మహిళలు సోమవారం వినూత్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గ్రామంలోని నిరుపేదలకు మహిళలకు ప్రభుత్వం భూములు మంజూరు చేసిందని తెలిపారు. అప్పట్లో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో తాము గ్రామాన్ని వీడి బయట ప్రాంతాలకు వెళ్లామని చెప్పారు. ఆ సమయంలో కొందరు నాయకులు తమ భూములను ఆక్రమించుకుని వారి పేర్లపై అడంగళ్లు చేయించుకుని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారుల చెర నుంచి తమ భూములను విడిపించాలని కోరుతూ పోరాటం సాగిస్తున్నామని తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అధికారులు స్పందించకపోతే మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.రత్నమ్మ, ప్రళయకావేరి తిరుపతమ్మ, కాటంగారి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పట్టపగలు.. యథేచ్ఛగా..
● అక్రమంగా గ్రావెల్ తరలింపు ● ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీ సీజ్ పొదలకూరు: పట్టపగలు పొదలకూరుకు సమీపంలోని చిట్టేపల్లి తిప్ప నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో గ్రావెల్ను తరలిస్తుండగా సోమవారం పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై ఎస్కే హనీఫ్ గ్రావెల్ అనుమతులను అడిగితే ఏఎంఆర్కు నగదు చెల్లించి తోలుతున్నట్టు వెల్లడించారు. అయితే రోడ్డు ఎక్కిన తర్వాత ట్రిప్పునకు ఏఎంఆర్కు రూ.300 వంతున చెల్లిస్తుండగా క్వారీ నిర్వహణకు మాత్రం అనుమతి లేకపోడంతో ఎస్సై ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఇప్పటికే చిట్టేపల్లి తిప్పను అక్రమార్కులు తవ్వేశారు. కొండ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ఇక్కడి నుంచి రేయింబళ్లు ఏఎంఆర్ పేరు చెబుతూ గ్రావెల్ను తరలించేస్తున్నారు. హౌసింగ్ గ్రావెల్ కూడా.. తిప్పపై హౌసింగ్ శాఖ ద్వారా నిర్మించిన ఇళ్లకు సంబంధించిన రోడ్లు, లెవలింగ్ గ్రావెల్ను కూడా అక్రమార్కులు వదిలిపెట్టలేదు. ఇటీవల దానిని సైతం తరలించి సొమ్ము చేసుకున్నారు. హౌసింగ్ అధికారులు పోలీసుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. విద్యుత్ స్తంభాల చుట్టూ ఉన్న గ్రావెల్ను కూడా లోడేసి తరలించడంతో స్తంభాలు బలహీనంగా మారినట్టు తెలుస్తోంది. -
టీడీపీ నేత వేధింపులు
● దళిత యువకుడి ఆత్మహత్యాయత్నం విడవలూరు: ఓ టీడీపీ నేత వేధింపులతో దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం మండలంలోని ముదివర్తిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముదివర్తి దళితవాడకు చెందిన పట్టపు రోహిత్ అనే యువకుడు.. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఈ వ్యవహారం నచ్చని యువతి తల్లిదండ్రులు అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో రోహిత్పై పోక్సో కేసు పెట్టించారు. అయితే ఈ కేసు హియరింగ్కు వచ్చిన క్రమంలో ఆ టీడీపీ నేతను రోహిత్ సోమవారం కలిసి న్యాయం చేయాలని కోరాడు. ఈ క్రమంలో అతడిని ‘నువ్వు దళితుడివి.. నీకు మా అమ్మాయి కావాలా?’ అంటూ కులవివక్షతో దూషించారు. ‘ఇక నీకు 14 ఏళ్లు జైలు శిక్ష పడటం ఖాయం.. ఆ జైలుకెళ్లి కుళ్లిపోవడం కంటే, గడ్డిమందు తాగి చావడం మేలు’ అంటూ కర్కశంగా మాట్లాడటంతో రోహిత్ తీవ్ర మానసికక్షోభకు గురయ్యాడు. టీడీపీ నేత హెచ్చరికలతో భయపడి, జీవితంపై విరక్తి చెందిన రోహిత్ సోమవారం గడ్డిమందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు టీడీపీ నేతనే కారణమని పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసి రోహిత్ను కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తతరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత దళితులు తమ బిడ్డను కులం పేరుతో అవమానించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన టీడీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ కోసం వినతి సైదాపురం: ‘మా అమ్మ ఏడాది క్రితం చనిపోయింది. డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి’ అంటూ చీకవోలు గ్రామ సర్పంచ్ బట్టా వెంకటయ్య తహసీల్దార్ సుభద్రకు విన్నవించుకున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తమ పొలాన్ని మరొకరు ఆక్రమించుకున్నారు. సర్వేయర్ వచ్చినా కూడా సమస్య పరిష్కారం కావడం లేదంటూ రైతులు విన్నవించారు. -
విషాదం నింపిన రోడ్డు ప్రమాదం
● లారీని ఢీకొట్టిన ఆటో ● మహిళ దుర్మరణం కోవూరు: మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. యల్లాయపాళెం గ్రామానికి చెందిన ఆయేషా (40)కు వివాహమైంది. ఆమె కుమార్తె సోఫియా అనారోగ్యంతో ఉంది. దీంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు చూపించేందుకు ఆయేషా, సోఫియా, ఇద్దరు కుటుంబ సభ్యులు ఆటోలో బయలుదేరారు. డాక్టర్ వద్ద చూపించాక తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో కోవూరు సమీపంలోని చౌదరి (ఆర్కే) పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో అదుపుతప్పి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయేషా చనిపోయింది. ముగ్గురూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. -
నగరంలో ఎక్కడి సమస్యలక్కడే..
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ● ఎన్ఎంసీ కార్యాలయం ఎదుట మహా ధర్నా నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ పరిధిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, వాటి పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మహా ధర్నా జరిగింది. తొలుత బారాషహీద్ దర్గా నుంచి ప్రజలతో కలిసి నాయకులు ర్యాలీగా బయలుదేరి కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారుల నిర్లక్ష్యంపై నినాదాలు చేశారు. దీంతో అదనపు కమిషనర్ హిమబిందు వచ్చి ప్రజలు తీసుకొచ్చిన అర్జీలను స్వీకరించారు. ఎప్పటిలోగా సమస్యలు పరిష్కరిస్తారో హామీ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. మూడు వారాల్లోగా పరిష్కరిస్తామన్నారు. సమస్యలు గాలికి.. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ మంత్రి నారాయణ అమరావతి జపం చేస్తూ ప్రజా సమస్యలు గాలికొదిలేశారన్నారు. నగరంలో ఏ వార్డులో చూసినా కుళాయిల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందన్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించలేని పాలకులు కోర్టు నోటీసులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో పన్నులు వసూలు చేయడం, దానిని ఘనతగా చెప్పుకోవడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. నగరంలో 70 శాతానికి పైగా ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోవడం అత్యంత దారుణమన్నారు. ప్రజల నుంచి దౌర్జన్యంగా పన్నులు వసూలు చేసి ప్రైవేట్ ట్రాక్టర్లు, చెట్లు నాటే పేరుతో రూ.కోట్లను అధికార పార్టీ కార్యకర్తలు దోచుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. 53, 54 డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. కాలువ కట్టలపై ఉన్న నిరుపేద దళితుల ఇళ్లను దౌర్జన్యంగా తొలగించే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు కత్తి శ్రీనివాసులు, జి.నాగేశ్వరరావు, షేక్ మస్తాన్బీ, పి.సూర్యనారాయణ, నరసింహ, కత్తి పద్మ, మూలం ప్రసాద్, ఎన్వీ సుబ్బమ్మ, అల్లంపాటి శ్రీనివాస్రెడ్డి, ఎం.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
నిత్యం గంజాయి, మద్యం విక్రయాలు
మా గ్రామంలో నిత్యం గంజాయి, మద్యం విక్రయిస్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈనెల 14వ తేదీన గ్రామంలోని దేవాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయించవద్దని చెప్పినా పక్కరోజు ఆటోలో ఐదుగురు వ్యాపారులు మద్యం బాటిళ్లు దించుకుని బెల్టు షాపులు నిర్వహస్తున్నారు. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తున్నారు. స్థానిక పోలీసులకు నెల మామూళ్లు ఇస్తున్నాం ఏం చేసుకుంటారో చేసుకోండంటున్నారు. – రాపూరు మండలం సైదాదుపల్లి గ్రామ బీసీకాలనీ వాసులు -
అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి
నెల్లూరురూరల్: అధికారం శాశ్వత కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరురూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ కలిసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వ్యవస్థలను అడ్డు పెట్టుకొని అరాచకాలు చేస్తే ఏదో ఒక రోజు ఆ వ్యవస్థ మీకు భూమ్రాంగ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. భవిష్యత్లో నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు వ్యవస్థలను తయారు చేస్తున్నారన్నారు. టీడీపీలోని రెండు వర్గాలు కొట్టుకుని చనిపోతే పిన్నెల్లిపై అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు, ఆయన కుమారుడు పైశాచికానందం పొందుతున్నారన్నారు. ఇదే విషయం అప్పటి ఎస్పీ చెప్పారన్నారు. పిన్నెల్లికి మధుమేహ వ్యాధి ఉందని, ఆయనకు సక్రమంగా మందులు జైలు అధికారులు అందించడం లేదన్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని బరువును కూడా కోల్పోయారన్నారు. ఇది ఒక దుశ్చర్య అని, ఫలితం త్వరలోనే అనుభవిస్తారని హెచ్చరించారు.రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీలోని బలమైన నాయకులను ఎన్నుకుని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి ఈ ప్రభుత్వం పైశాచికానందం పొందుతుందన్నారు. పోలీసులు చార్జ్షీట్ వేసి 96 రోజులైందని, బెయిల్ రాకుండా అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. పిన్నెల్లి సోదరులను జైల్లో హింసిస్తున్నారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని జైలు అధికారులు గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి వ్యవహరిస్తే, అధికారం కోల్పోయిన రోజు కాపాడడానికి ఎవరూ రారని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి పాలకులు అరాచకం అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వికృత క్రీడకు తెరదీశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
అమరజీవికి నివాళి
నెల్లూరు(దర్గామిట్ట): పొట్టి శ్రీరాములు జయంతిని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. అమరజీవి చిత్రపటానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివుడి వద్ద నాగేంద్రుడి దర్శనం ● విశ్వనాథస్వామి ఆలయంలో వింత మనుబోలు: మనుబోలులోని చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్న విశ్వనాథస్వామి ఆలయంలో సోమవారం విశిష్టతగా అర్చకుడు శ్రీనివాసులు శివ లింగానికి పూజలు చేస్తుండగా నాగేంద్రుడు మళ్లీ దర్శనమిచ్చాడు. ఇటీవల కాలంలో తరచూ ప్రత్యేక సందర్భాల్లో శివలింగం వెనుకనే ఉన్న పుట్టలో నుంచి నాగుపాము వచ్చి శివలింగం పక్కన పడగ విప్పి చాలాసేపు ఉంటుంది. సోమవారం కూడా అదే తరహాలో నాగేంద్రుడు శివలింగం వద్ద పడగ విప్పి ఉండగా ఫొటోలను కొందరు యువకులు తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ విషయం సంచలనంగా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నాగేంద్రుడిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 25న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 25న పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లుగా జిల్లా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోఆర్డినేటర్ ఎస్ రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది రాపూరు, వెంకటగిరిలో కూడా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 1 నుంచి నెల్లూరులోని వెంకటేశ్వపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశ పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, డీసీసీపీ, తదితర సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి కచ్చితంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల సమాచారాన్ని 99123 42016 నంబరును సంప్రదించి పొందవచ్చని తెలిపారు. 28న జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్నట్లుగా జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగుతుందని చెప్పారు. విద్య, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, తదితర శాఖలపై సమీక్షించనున్నట్లుగా తెలిపారు. జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. వెబ్సైట్లో సీనియారిటీ జాబితా నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన రెండో సీనియారిటీ జాబితాను http://deonellore.50.we bs.com వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తగిన ఆధారాలను సమర్పించాలని కోరారు. -
ప్రశాంతంగా పది పరీక్షలు
● తొలిరోజు 260 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 174 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 28,131 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 27,871 మంది రాశారు. 260 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకు గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు. హాల్ టికెట్ నంబర్లను పరీక్ష కేంద్రాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబరును ఏ గదిలో కేటాయించారో చూసుకుని లోపలికి వెళ్లారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతించారు. కలెక్టర్ హిమాన్షుశుక్లా సంతపేటలోని సెయింట్ జోసెఫ్ బాలికల హైస్కూల్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్ లెవల్ ఆఫీసరు రవీంద్రారెడ్డి ఏడు కేంద్రాలను తనిఖీ చేయగా, డీఈఓ బాలాజీరావు ఐదు కేంద్రాలు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ 4 కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం తొలిరోజు పరీక్షకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. తొలుత పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష రాసి వచ్చేంత వరకు తల్లి,దండ్రులు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చెట్ల కింద సేద తీరారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ను అమలు చేశారు. ఎక్కువ మంది అక్కడ లేకుండా పోలీసులు దూరంగా పంపించారు. ఓపెన్ స్కూల్ పది పరీక్షలకు 139 మంది గైర్హాజరు ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు సోమవా రం జిల్లా వ్యాప్తంగా 139 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. మొత్తం 1130 మందికి గానూ 991 మంది అభ్యాసకులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 15 సెంటర్లలో పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరిగాయి. -
అమరజీవి త్యాగం చిరస్మరణీయం
నెల్లూరురూరల్: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగరంలోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం కాకాణి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు అని స్మరించుకున్నారు. ఆయన బలిదానం వల్లే 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ఆయన త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాలేదని, భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు మహనీయుని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పొట్టి శ్రీరాములు నడయాడిన నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం లేదన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ అమరజీవి అభిమానుల కోరిక మేరకు మన జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి ఆయన పేరును ప్రతినిత్యం స్మరించుకునే అవకాశాన్ని మనకు కల్పించారన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను గౌరవిస్తూ, ఆయనను స్మరించుకోవడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. -
జర్నలిస్టులపై ఇసుక మాఫియా దాడి
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంతాల్లో అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణాను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన జర్నలిస్టులపై ఇసుక మాఫియా ముఠా దాడికి తెగబడిందని, ఈ దౌర్జన్యంపై నెల్లూరు జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జేఏసీ ప్రతినిధులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు జయరాజ్ మాట్లాడుతూ ఓ టీవీ చానల్ ప్రతినిధులు సురేంద్ర, కమలాపస్ మనోజ్, మహమ్మద్ షాహీన్, వెంకటగిరి, ఆత్మకూరు రిపోర్టర్లు కలిసి కలువాయి మండలంలోని రాజపాళెం, తెలుగురాయపురం, పొదలకూరు మండలంలోని విరువూరు రీచ్ల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లారన్నారు. విరువూరు రీచ్ వద్ద విజువల్స్ తీసుకుంటున్న సమయంలో కొందరు వ్యక్తులు జర్నలిస్టులను అడ్డుకున్నారన్నారు. బెదిరింపులతో పాటు దౌర్జన్యం చేస్తూ జర్నలిస్టుల కారును అడ్డగించి జర్నలిస్టులపై అసభ్య పదజాలంతో విరుచుకు పడ్డారన్నారు. ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు.. విజువల్స్ ఎందుకు తీస్తున్నారు.. మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాం’ అంటూ బెదిరించరని విన్నవించారు. కారు అద్దాలు పగులగొట్టే ప్రయత్నం చేయడమే కాకుండా, విధుల్లో ఉన్న జర్నలిస్టులను భయాందోళనలకు గురిచేశారన్నారు. ఈ ఘటనపై బాధితులు పొదలకూరు ఎస్సైకు సమాచారం అందించగా, ఆయన స్పందించిన తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. ఇసుక మాఫియా వ్యక్తులకు వత్తాసు పలుకుతూ, జర్నలిస్టులనే ప్రశ్నించడం గమనార్హమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు కూడా తమ వద్ద ఉన్నాయని మీడియా ప్రతినిధులు వివరించారు. నిజాయతీగా వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వారు కలెక్టర్ను కోరారు. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సురేంద్ర, సునీల్, సాగర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
పక్షి.. అడ్రస్ మారింది
పాలపిట్ట కింగ్ ఫిషర్ కాలగమనంలో చాలా మార్పులు వచ్చాయి. విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అనేక ఊర్లు కాంక్రీట్ జంగిల్గా మారిపోయాయి. సెల్ టవర్ల సంఖ్య పెరిగింది. వాహన కాలుష్యం రాజ్యమేలుతోంది. దీనికితోడు ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్నిరకాల పక్షులు కనిపించడం అరుదుగా మారింది. గతంలో పట్టణాలు, నగరాల్లో అడపాదడపా కనిపించిన కొన్ని జాతుల పక్షులు నేడు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఈ జనరేషన్ పిల్లలు కొన్నింటిని నేరుగా చూసిన పరిస్థితి లేదు. జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో తీసిన చిత్రాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
మోటార్బైక్ను ఢీకొట్టిన వ్యాన్
● ఒకరి మృతి కలిగిరి: మోటార్బైక్ను వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో మూకిరి రత్నరాజు (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా వలపర్లకు చెందిన రత్నరాజు వింజమూరు మండలం గుండెమడకలలో పొగాకు బ్యారెన్ల వద్ద క్యూరింగ్ పనులు చేస్తున్నాడు. జాతీయ రహదారిపై కావలి వైపు నుంచి గుండెమడకలకు బైక్పై బయలుదేరాడు. అదే సమయంలో కావలి నుంచి కలిగిరి వెళ్తున్న మినీ పార్సిల్ వ్యాన్ పెద్దపాడు సమీపంలో వెనుక వైపు నుంచి బైక్ను ఢీకొట్టింది. దీంతో రత్నరాజు తలకు తీవ్రగాయాలై అక్కడికిక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో వచ్చిన 108 సిబ్బంది రత్నరాజు మృతిచెందినట్లు నిర్ధారించారు. కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రత్నరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. -
భళా.. చిత్రకళ
దారంతో వివిధ రకాల చిత్రాలు ● మర్రిపాడు మండల వాసి ప్రతిభ ● ఎన్నో అవార్డులు సొంతం వేంకటేశ్వర స్వామి చిత్రం ఆత్మకూరు: ఆ మాస్టార్ దారం పట్టుకుంటే అద్భుత చిత్రాలు తయారవుతాయి. దేవుళ్లు, రాజుల చిత్రాలను దారంతో తయారు చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఇప్పటికే ఆ కళను గుర్తించిన ‘అకాడమీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ వారు అవార్డు అందజేశారు. పలువురు సినీనటులు అవార్డులు అందజేసిన సందర్భాలున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం బూదవాడకు చెందిన మున్నెళ్లి శివశంకర్ అనంతసాగరం మండలం చిలకలమర్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే వందలాది దారపు చిత్రాలు తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. వినాయకచవితి, కృష్ణాష్టమి, వరలక్ష్మీవ్రతం, హనుమాన్ జయంతి, ఛత్రపతి శివాజీ జయంతి తదితర సందర్భాల్లో దారపు చిత్రాలను తయారు చేయడం శివశంకర్ ప్రత్యేకత. ఇలా చిత్రాలు రూపొందించే కళ జిల్లాలో మరెవరికీ లేకపోవడం గమనార్హం. ఈయన కళను గుర్తించిన అమెరికన్ విజ్డమ్ పీస్ అకాడమీ – బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వారు గత నెల 28న అవార్డును ప్రకటించి తమిళనాడులోని హోసూరులో ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో సృజనాత్మక కళను ప్రదర్శించి గుర్తింపు పొందిన వారికి ఈ సంస్థ అవార్డులు అందస్తుంది. ఎక్కడా చూడలేదు గతేడాది నెల్లూరుకు వచ్చిన ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ శివశంకర్ తయారు చేసిన చిత్రాలను చూసి అభినందించారు. ఈ కళ గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దారపు చిత్రకళ తాను ఎక్కడా చూడలేదని బాబుమోహన్ అన్నారు. దారం ఎక్కడ ప్రారంభించారో, చిత్రం పూర్తయ్యి తిరిగి అక్కడే అంతమయ్యేలా రూపొందించడం అభినందనీయమని కొనియాడారు.అదృష్టంగా భావిస్తున్నా అరుదైన ఈ కళ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆసక్తి గల వారికి నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నా. – శివశంకర్ -
కొనసాగుతున్న అధికారుల దాడులు
● 22 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం నెల్లూరు(క్రైమ్)/నెల్లూరు(పొగతోట): గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న పలు హోటళ్లు, క్యాటరింగ్ సెంటర్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయీస్ అధికారుల తనిఖీలు ఆదివారం కూడా కొనసాగాయి. సబ్సిడీపై అందజేసే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రూ.51,250ల విలువైన వివిధ కంపెనీలకు చెందిన 22 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్ఓ లీలారాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేశామన్నారు. సబ్సిడీపై అందజేసే గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నేరమన్నారు. నగరంలోని కృష్ణా గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసి సకాలంలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెండు రోజుల్లో 21 మందిపై కేసులు నమోదు చేసి, 141 సిలిండర్లను సీజ్ చేసి గ్యాస్ ఏజెన్సీల వద్ద భద్రపరిచామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి, సీఎస్ డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వయోజన అభ్యాసకులకు అసెస్మెంట్ టెస్ట్నెల్లూరు(టౌన్): వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా వయోజన అభ్యాసకులకు అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించారు. దీనికి 1,00,528 మందికి గానూ 1,00,115 మంది హాజరయ్యారు. వారికి 100 గంటలపాటు శిక్షణా తరగతులు జరిపి టెస్ట్ నిర్వహించినట్లు వయోజన విద్యాశాఖ అక్షరాంధ్ర నోడల్ ఆఫీసర్ మస్తాన్రెడ్డి తెలిపారు. డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు, విద్యాశాఖాధికారులు, మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొని విజయవంతం చేసినట్లు వెల్లడించారు.ప్రాణం తీసిన ఈత సరదాపొదలకూరు: మండలంలోని మరుపూరు ఎస్టీ కాలనీలో ఉంటున్న వెందోటి ప్రదీప్ (14) ఆదివారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. నరసింహులుకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమై ంది. కుమారుడు ప్రదీప్ తండ్రి వద్దే ఉంటున్నాడు. అతను నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని శ్మశానం వద్ద ఉన్న పాత బావిలో సరదాగా ఈత కు వెళ్లాడు. ఈ క్రమంలో మునిగిపోవడంతో మిగిలిన వారు గ్రామంలో చెప్పగా పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నీటిని తోడి ప్రదీప్ మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేశారు. -
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
నెల్లూరు(క్రైమ్): నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. హైవే ప్రవేశం, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై 19, బహిరంగంగా మద్యం తాగడంపై 24 కేసులు నమోదు చేశారు. మూడు వాహనాలను సీజ్ చేశారు. రహదారి భద్రత నిబంధనల ఉల్లంఘనపై 49 కేసులు నమోదు చేసి రూ.1,81,260ల అపరాధరుసుము విధించారు. లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వ్యక్తుల వివరాలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు తదితరాలపై డయల్ 112, కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 93929 03143కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
శాంతి, సహనం, దయాగుణంతో మెలగాలి
● ఇఫ్తార్ విందులో కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు(పొదలకూరు) : శాంతి, సహనం, దయాగుణంతో మెలగాలని ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం సందేశాన్ని ఇస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ముత్తుకూరులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ముత్తుకూరులోని ముస్లింలు గత 12 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇఫ్తార్ విందులో తనను భాగస్వామిని చేస్తున్నట్టుగా తెలిపారు. నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ముస్లిం సమాజమంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారని తెలిపారు. ముస్లిం కుటుంబాల బాగు కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ముస్లిం కుటుంబాలు నివశించే ప్రాంతాల్లో సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించానని గుర్తుచేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాకాణికి ముస్లింలు ఘనస్వాగతం పలికారు. మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, శివప్రసాద్, షేక్ అబ్దుల్ రహీం, జావీద్బాషా, షమ్ము, రవూఫ్, సిరాజ్, తాజ్, బచ్చల సురేష్కుమార్రెడ్డి, ఎం వెంకటశేషయ్య, చెంగారెడ్డి తదితరులు ఉన్నారు. -
కేంద్రం సృష్టించిన కృత్రిమ సంక్షోభమే గ్యాస్ కొరత
● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు ● మహిళలతో కలిసి రోడ్డుపై కట్టెల పొయ్యిలపై వంటా వార్పుతో నిరసన ● ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ర్యాలీ నెల్లూరు (వీఆర్సీసెంటర్): పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కేంద్రం సృష్టించిన కృత్రిమ సంక్షోభమే గ్యాస్ కొరత అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, పుష్కలంగా నిల్వలు ఉన్నాయని ఒక పక్క చెబుతూనే మరో పక్క గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం, బుకింగ్లపై కాల పరిమితి విధించడం, దేశ రాజధానిలో కట్టెల పొయ్యిలపై ఆంక్షలు సడలించడం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించడంతోపాటు అందరికి అందుబాటులో గ్యాస్ను ఉంచాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలతో కలిసి రోడ్డుపై కట్టెల పొయ్యిలు పెట్టి వంటా, వార్పు చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాదాల వెంకటేశ్వర్లు, నెల్లూరు రూరల్ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ వంట గ్యాస్ కొరతతో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల కోసం ప్రజలు పనులు మానుకుని గ్యాస్ గోదాముల వద్ద పడికాపులు కాస్తున్నారన్నారు. కొరత కారణంగా నగరంలోని పలు హోటళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయని ఆరోపించారు. పరీక్షల సమయంలో వంట గ్యాస్ లేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, హోటళ్లలో పనిచేసే కార్మికులు పని లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రికల్ కుక్కర్లు, వంటనూనె, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు అవస్థ పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పెంచలనరసయ్య, అబ్దుల్ అజీజ్, షాహీనాబేగం, అరిగెల రమమ్మ, నాగేశ్వరరెడ్డి, శివాజీ, సురేష్, నాగేశ్వరరావు, షంషాద్ తదితరులు, పాల్గొన్నారు. -
జనసేన నేతల బాహాబాహీ
● పోటాపోటీగా బలప్రదర్శన ● నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్, టిడ్కో చైర్మన్ అజయ్కుమార్ మధ్య ఆధిపత్య పోరు ఆత్మకూరు: ఆత్మకూరు జనసేన పార్టీ నేతలు ఆదివారం బాహాబాహీకి తలపడ్డారు. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ కొద్ది రోజులుగా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. శనివారం పది వేలకుపైగా సభ్యత్వాలు పూర్తి చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాసులు స్వయంగా ఆత్మకూరుకు వచ్చి శ్రీధర్ను అభినందించారు. ఈ నేపథ్యంలో పార్టీలోని మరో వర్గంగా కొనసాగుతున్న టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్ అనుచరులు చదలవాడ హరీష్కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్ బస్టాండ్ వద్ద పార్టీ సభ్యత్వ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేములపాటి అజయ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నలిశెట్టి శ్రీధర్ వర్గీయులు బహిరంగ సభ జరుగుతున్న వేదిక వద్దకు చేరుకుని తమ అనుచరులతో బలప్రదర్శన చేస్తూ సభలో పాల్గొన్న వారిని తరిమేస్తూ కుర్చీలను తోసేశారు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ జీ గంగాధర్, ఎస్సైలు ఎస్కే జిలానీ, బీ సాయిబాబా నలిశెట్టి శ్రీధర్ వర్గీయులను బహిరంగ సభ నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. అయితే వారు అక్కడ రోడ్డుపై బైఠాయించి అజయ్కుమార్ గోబ్యాక్ అంటూ నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బహిరంగ సభ జరిగినంతసేపు నలిశెట్టి శ్రీధర్ వర్గీయులు అజయ్కుమార్కు వ్యతిరేక నినాదాలు చేస్తూనే ఉన్నారు.ఆత్మకూరులో జనసేన బహిరంగ సభను అజయ్కుమార్ వర్గీయులు నిర్వహిస్తుండగా గొడవ పడుతున్న నలిశెట్టి శ్రీధర్ వర్గీయులుఒక వైపు జనసేన బహిరంగ సభ జరుగుతుండగా ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీధర్ వర్గీయులు -
డ్రగ్స్కు అడ్డాగా ఏపీ
● పోలీసులపైనే కాల్పులకు తెగబడడం అత్యంత దారుణం ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరురూరల్: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారిపైనే కాల్పులకు తెగబడడం అత్యంత దారుణమైన విషయమని వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఖండించారు. నగరంలోని వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు జరిపిన రైడ్లో ఎంపీ మహేష్యాదవ్ ముఠా వారిపైనే కాల్పులకు తెగబడడం చూస్తే ఒక ప్రజాప్రతినిధిగా సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సమాజంలో శాంతిభద్రతల కోసం పాటు పడుతున్న పోలీసులపైన కాల్పులు జరపడం అత్యంత దుర్మార్గమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో డ్రగ్స్ కల్చర్ పెచ్చుమీరిపోయిందని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతూనే వస్తుందన్నారు. అడ్డూఅదుపు లేకుండా పోలీసుల కళ్లు గప్పి చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి ఏపీకి పెద్ద మొత్తంలో గంజాయి దిగుమతి అవుతుందన్నారు. ఈ గంజాయి టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారానే ఏపీలో అన్ని జిల్లాల్లో హోమ్ డెలివరీ జరుగుతోందన్నారు. ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు నగరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయన్నారు. యువత డ్రగ్స్కు బానిసై పీకలు కోయడాలు, హత్యలు చేయడాన్ని మనమంతా చూస్తున్నామన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి డ్రగ్స్ సేవిస్తూ, ఒక డ్రగ్స్ ముఠాను తయారు చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. దీనికి హోం మంత్రి సమాధానం చెప్పాలన్నారు. గతంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకున్నారని, పోలీసులకు పట్టుబడ్డారనే విషయాలు విన్నాము.. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటూ రోడ్ల మీదకు వచ్చి రూ.200, రూ.300లకు పీకల కోయడం హత్యలు చేయడం చూస్తున్నామన్నారు. కొంత మంది దారి దోపిడీలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని కత్తులతో పొడిచి చంపేయడం కూడా చూస్తున్నామన్నారు. జరుగుతున్న ఈ పరిణామాలకు సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ప్రజలకు ఏమని సమాధానం చెబుతారో చూడాలన్నారు. హోం మంత్రి అనిత అనేక సందర్భాల్లో మాట్లాడుతూ డ్రగ్స్ను మేము లేకుండా చేస్తాం, నిర్మూలిస్తామని చెప్పారని, దీనికి మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎంపీ పుట్ట మహేష్యాదవ్ చేత రాజీనామా చేయించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. -
నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం
జిల్లాలో 16 సమస్యాత్మక కేంద్రాలు నెల్లూరు (టౌన్): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ 27,910, ప్రైవేట్ 679 మంది కలిపి మొత్తం 28,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 174 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏ సెంటర్లు 95, బీ సెంటర్లు 55, సీ సెంటర్లు 24గా విభజించారు. ఇప్పటికే పోలీసు స్టేషన్లలోని స్ట్రాంగ్రూముల్లో ప్రశ్న పత్రాలను భద్రపరిచారు. పరీక్షకు ముందుగా ప్రశ్న పత్రాలను కేంద్రాలకు చేర్చనున్నారు. విద్యార్థులను పరీక్ష సమయానికి అరగంట ముందుగా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ 83414 08109 నంబర్ను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు మెడికల్ కిట్, ఏఎన్ఎంను అందుబాటులో ఉంచనున్నారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పది పరీక్షలకు 1532 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. అయితే ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారు. అయితే ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమిస్తే ప్రైవేట్ పాఠశాలల్లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా 174 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 174 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా 9 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. సీ సెంటర్లకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతోపాటు మరో 24 మంది గ్రేడ్–2 హెడ్మాస్టర్లను కస్టోడియన్లుగా నియమించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సమీపంలోని జెరాక్స్, ఆన్లైన్ సెంటర్లను మూసివేయనున్నారు. 8 కేంద్రాలకే సీసీ కెమెరాలు సాధారణంగా సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో కేవలం అతి సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్న 8 పరీక్ష కేంద్రాల్లోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి 8 కేంద్రాలకే అనుమతి వచ్చినట్లుగా చెబుతున్నారు. వెబ్సైట్లో హాల్టికెట్లు పదో తరగతి విద్యార్థుల హాల్టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్ bse.ap.gov.inలో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ జిల్లా, స్కూల్, పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ మీద స్కూల్ హెడ్మాస్టర్ సంతకం అవసరం లేదు. ఆల్ ద బెస్ట్ జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు (పొగతోట): సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరువుతున్న విద్యార్థులకు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆదివారం ఒక ప్రకటనలో ఆల్ ద బెస్ట్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 28,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారన్నారు. విద్యా శాఖ 174 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి హాజరుకావాలన్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని పరీక్షలకు హాజరుకావాలన్నారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్కు మార్గం ఏర్పరుచుకోవాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నిలపాలని కోరారు. జిల్లాలో 174 సెంటర్ల ఏర్పాటు హాజరుకానున్న 28,589 మంది విద్యార్థులు 1532 మంది ఇన్విజిలేటర్లు 174 మంది సీఎస్లు, 174 మంది డీఓలు 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియామకం తొలిసారి ఇన్విజిలేటర్లుగా ప్రైవేట్ ఉపాధ్యాయులు జిల్లాలో 16 సమస్యాత్మక కేంద్రాలు అందులో 8 అతి సమస్యాత్మక కేంద్రాలు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రజారవాణాశాఖ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సుల్లో హాల్ టికెట్ను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. జిల్లా వ్యాప్తంగా 8 సమస్యాత్మక కేంద్రాలు, మరో 8 అతి సమస్యాత్మక కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. అతిసమస్యాత్మక కేంద్రాలుగా విడవలూరు జెడ్పీహెచ్ఎస్, పొదలకూరు మండలం మహ్మదాపురం జెడ్పీహెచ్ఎస్, కలువాయి జెడ్పీహెచ్ఎస్లోని ఏ, బీ సెంటర్లు, నెల్లూరు రూరల్లోని సౌత్మోపూరు జెడ్పీహెచ్ఎస్, మర్రిపాడు జెడ్పీహెచ్ఎస్, అనంతసాగరం మండలం రేవూరు జెడ్పీహెచ్ఎస్, ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ ప్రభుత్వ హైస్కూల్, కందుకూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మ క కేంద్రాలుగా నెల్లూరు రూరల్ నారాయణరెడ్డిపేట జెడ్పీహెచ్ఎస్, ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని రత్నం ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, ఇందుకూరుపేట మండలం నరసాపురం జెడ్పీహెచ్ఎస్, బోగోలు మండలం బిట్రగుంట జెడ్పీహెచ్ఎస్, జెడ్పీజీహెచ్ఎస్, జలదంకి జెడ్పీహెచ్ఎస్, అనంతసాగరం జెడ్పీహెచ్ఎస్, వరికుంటపాడు జెడ్పీహెచ్ఎస్, ఉదయగిరి మండలం గండిపాళెంలోని ఏపీఆర్ఎస్ కేంద్రాలు ఉన్నాయి. -
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి
కావలి : తీరప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మైరెన్ సీఐ సీహెచ్వీ శేషయ్య అన్నారు. కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపాళెంలో తీరప్రాంత భద్రతపై మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీరప్రాంత మత్స్య కారులు సైనికుల్లా వ్యవహరించాలన్నారు. దేశంలోకి సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్నారు. అందువల్ల తీరంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బోట్లు కనిపిస్తే వెంటనే మైరెన్ పోలీస్ టోల్ఫ్రీ నంబర్ 1093 లేదా కోస్ట్గార్డ్ టోల్ఫ్రీ నంబర్ 1554కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం సీఆర్జెడ్ యాక్ట్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి, వీఆర్ఏ వెంకటేశ్వర్లు, గ్రామ కాపులు కొండూరి యానాది, ఆవుల వెంకయ్య, నరసయ్య, మైరెన్ పోలీసులు కృష్ణ, రమేష్ , బాలసుబ్రహ్మణ్యం, శామ్యూల్, సిబ్బంది పాల్గొన్నారు. గ్రావెల్ అక్రమ తరలింపు నిలిపివేత ఉదయగిరి: దుత్తలూరులోని ఓ లేఅవుట్కు ముత్తరాశిపల్లి చెరువు నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘అవినీతి ఒరవడి..చెరువుల దోపిడీ’ పేరుతో ఆదివారం కథనం ప్రచురితం కావడంతో ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్ స్పందించారు. గ్రావెల్ అక్రమ తరలింపును నిలిపివేయించారు. శనివారం చెరువు నుంచి గ్రావెల్ తరలింపు విషయమై ఇరిగేషన్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ఎవరూ స్పందించలేదు. ‘సాక్షి’లో కథనం వచ్చినా స్థానిక ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంతో అక్రమార్కులు ఆదివారం ఉదయం కూడా గ్రావెల్ తరలింపును కొనసాగించారు. అయితే విషయం తెలుసుకున్న ఎస్ఈ వెంటనే గ్రావెల్ తరలింపును నిలిపివేయించి తగిన చర్యలు తీసుకోవాలని కావలి ఈఈ ఖాన్ను అదేశించారు. అంతేగాకుండా శనివారమే గ్రావెల్ తరలింపును నిలిపివేయాలని స్థానిక ఏఈ వెంకటసుబ్బయ్యన ఆదేశించినా ఖాతరు చేయకపోవడంపై సోమవారం వ్యక్తిగతంగా తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలిసింది. చెరువు చేపల ధారాదత్తం ● వేలం నిర్వహించకుండానే టీడీపీ నాయకుడికి అప్పగింత ● పంచాయతీ ఆదాయానికి గండి కొండాపురం : మండలంలోని గరిమెనపెంట పంచాయతీ పరిధిలోని చల్లగిరగల చెరువు చేపలను ఇరిగేషన్ అధికారులు ధారాదత్తం చేశారు. బహిరంగ వేలం పాట నిర్వహించకుండానే టీడీపీ నాయకుడికి అప్పగించి పంచాయతీ ఆదాయానికి గండికొట్టారు. బహిరంగ వేలం పాట నిర్వహించి అత్యధిక ధరకు పాడిన వారికి చెరువు ను అప్పగించాలి. కానీ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడి సిఫార్సు మేరకు ఇరిగేషన్ అధికారులు వరికుంటపాడు మండలం శాసు్త్రలవారిపల్లి గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడికి రూ.20వేలకు అప్పగించారు. చెరువు చేపల వేలం ద్వారా గతేడాది రూ.50వేలు, అంతకుముందు ఏడాది రూ.లక్ష ఆదాయం పంచాయతీకి లభించింది. ఈ ఏడాది టీడీపీ నాయకుడికి రూ.20వేలకే అప్పగించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును వివరణ కోరగా తనకు తెలియదని, ఇరిగేషన్ అధికారులే వేలం నిర్వహించారని తెలిపారు. ఇరిగేషన్ ఏఈ వెంకట్రావును వివరణ కోరగా పంచాయతీ తీర్మానంతోనే చెరువును రూ.20వేలకు అప్పగించామని, సాగునీటి సంఘం అధ్యక్షుడు దొడ్డ గంగయ్య ఖాతాలో నగదు జమచేశామని తెలిపారు. -
రాజీ మార్గమే లోక్ అదాలత్ లక్ష్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ నెల్లూరు (లీగల్): రాజీ మార్గమే లోక్అదాలత్ లక్ష్యమని, కక్షిదారులు రాజీపడి వస్తే లోక్అదాలత్లో సత్వర న్యాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.శ్రీనివాస్ అన్నా రు. నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఆ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. జాతీయ లోక్అదాలత్లో కేసును రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపా రు. ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ రాజీ మార్గంతో ఇరుపక్షాలకు స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జాతీ య లోక్అదాలత్లో 66,376 కేసులు పరిష్కారం కా గా, లబ్ధిదారులకు రూ. 10,39,34,942 పరిహారం చెల్లించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. న్యాయమూర్తులు ఎల్.తేజోవతి, కె.శ్రీనివాస్, ఎంఏ సోమశేఖర్, సిరిపిరెడ్డి సుమ, కరుణాకర్, ఎస్. శ్రీనివా స్, శారదరెడ్డి, ఎస్కే నిషాద్నాజ్ ప్రిసైడింగ్ అధికారు లుగా వ్యవహరించి 32,916 కేసులు పరిష్కరించారు. పలు కోర్టుల న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ మాజీ సభ్యులు వేనాటి చంద్రశేఖర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యపరెడ్డి, పోలీస్, బీమా, బ్యాంకు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి జిల్లావ్యాప్తంగా పర్యవేక్షించారు. -
వ్యవసాయమంటే చంద్రబాబుకు గిట్టదు
● అన్నదాతలను గాలికొదిలేశారు ● అన్నదాత సుఖీభవ’ పథకంలో భారీ కోత ● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ధ్వజం కోవూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, చంద్రబాబుకు వ్యవసాయమంటే ఆది నుంచి గిట్టదని, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అన్నదాతలను పూర్తిగా గాలికొదిలేస్తారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మండి పడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సాగుకు ముందే పెట్టుబడి సాయం అందేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఏకంగా ఏడు లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద కోత విధించారని ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. గతంలో 53.58 లక్షల మందికి సాయం అందగా, ఇప్పుడు కేవలం 46.85 లక్షల మందికే పరిమితం చేయడం దారుణమన్నారు. జిల్లాలో సుమారుగా జగనన్న ప్రభుత్వంలో 2.15 లక్షల మంది రైతులకు న్యాయం జరిగిందని, అయితే కూటమి కుట్రలతో 1.95 లక్షలకు కుదించి వేలాది మంది రైతులను ఏరివేసిందన్నారు. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు కాకుండా, రాష్ట్రం రూ. 20 వేల లెక్క ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 వేల మందికి పైగా రైతు కూలీలు చనిపోయారని ప్రసన్నకుమార్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు మొండిచేయి మీరు చేసిన మోసాలకు కౌలు రైతులు అప్పులో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కౌలు రైతులకు పైసా కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ప్రసన్న దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కౌలు రైతులకు సైతం భరోసా కల్పించారని, కానీ ఇప్పుడు వారిని పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ఏపీ రైతుల రుణభారంలో దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ధరల స్థిరీకరణ నిధి లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, కనీసం పంటల బీమా ప్రీమియం కూడా కట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఫలితంగా రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నారు. జగన్ హయాం సువర్ణాధ్యాయం వైఎస్ జగన్ పాలనలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని ప్రసన్న గుర్తుచేశారు. రైతులకు సున్నా వడ్డీ కింద సకాలంలో రుణాలు చెల్లించిన 84.66 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చారన్నారు. ఉచిత పంటల బీమా ద్వారా 54.55 లక్షల మంది రైతులకు రూ. 7,802 కోట్ల బీమా సాయం అందించారన్నారు. విపత్తులు సంభవిస్తే అదే సీజన్లో త్వరితగతిన పరిహారం అందించడమే కాకుండా, దురదుష్టవశాత్తు రైతు ఆత్మహత్య చేసుకుంటే 48 గంటల్లోనే రూ. 7 లక్షల పరిహారం అందించిన ఘనత జగన్దే అని కొనియాడారు. -
విజయదీపికతో ఉత్తమ విజయాలు
● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు (పొగతోట): జెడ్పీ ప్రత్యేక నిధుల తో పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించి విజయదీపిక ద్వారా పరీక్షలు బాగా రాసి మంచి ర్యాంకుల సాధించాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆకాంక్షించారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా.. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మర్రిపాడు మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, సైకిల్పై కూడా వెళ్లడానికి కూడా వీల్లేకుండా దెబ్బతిన్నాయని, గ్రామాలకు వెళితే ప్రజలు తిడుతున్నారని జెడ్పీటీసీ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ పనులు పూర్తి చేసి న బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రోడ్లకు త్వరితగతిన మరమ్మతులు చేయించేలా చర్యలు తీసు కోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జెడ్పీటీసీలకు గౌరవ వేతనం మంజూరు చేసి 25 నెలలు కావొస్తుందని త్వరగా చెల్లించకపోతే సభ్యులందరం సమావేశంలో ధర్నా చేస్తామని మర్రిపాడు జెడ్పీటీసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని త్వరలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి సమాధానమిచ్చారు. జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని, అనుమతి లేకుండా సమావేశాలకు హాజరుకాని అధికారులకు నోటీసులు ఇవ్వా లని ఆదేశించారు. వరి కోతలు ప్రారంభమయ్యాయ ని రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించా లన్నారు. ఈ సమావేశాల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్రావు, వివిధ మండలాలు జెడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఒంటిపూట బడి
నెల్లూరు (టౌన్): ఎండలు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు సోమవారం నుంచి ఒంటిపూట నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట రాగిజావ, మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులకు అందజేయాలన్నారు. విద్యుత్ తీగలు పడి రైతు మృతి మనుబోలు: పొలంలో గడ్డి కోసుకుని వస్తుండగా విద్యుత్ తీగలు పైన పడడంతో ఓ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బండేపల్లిలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల చినపోతయ్య (54) గేదెలు, గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తాడు. పశువుల మేత కోసం పొలంలో గడ్డి కోసుకుని తిరిగి వస్తుండగా పొలాల్లోని ఓ విద్యుత్ స్తంభం గాలికి ఒరిగిపోవడంతో కరెంట్ తీగలు పైన పడ్డాయి. దీంతో పోతయ్య అక్కడికక్కడే షాక్నకు గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. గడ్డి కోసమని ఇంటి నుంచి వెళ్లిన పోతయ్య గంటల వ్యవధిలోనే విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి మనుబోలు: అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మనుబోలులోని చెర్లోపల్లి రోడ్డు పక్కన శనివారం వెలుగుచూసింది. మనుబోలుకు చెందిన దాసరి రఘురామయ్య (55) కుటుంబంతో గొడవల కారణంగా ఐదారేళ్లుగా ఒంటరిగా మరో ఊరిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవా రం అతిగా మద్యం తాగి మనుబోలులోని ఇంటికి వచ్చి భార్య, కోడలుతో గొడవ పడినట్లు సమాచారం. తర్వాత ఏమి జరిగిందో కానీ శనివారం ఉదయం హైవే పక్కన ఉన్న ఆంధ్రా విలాస్ హోటల్ సమీపంలో మృతి చెందిన ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అతిగా మద్యం తాగడంతో గొంతు తడారిపోయి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పకడ్బందీగా పది పరీక్షలు
● డీఈఓ ఆర్.బాలాజీరావు నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే విధంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు తెలిపారు. శనివారం స్థానిక దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 174 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు రెగ్యులర్ 27,910 మంది, ప్రైవేట్ 679 కలిపి మొత్తం 28,589 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 24 మంది కస్టోడియన్స్, సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 174 మంది చీప్ సూపరింటెండెంట్లు, 174 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 1,532 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు ఉంటుందన్నారు. పరీక్షల్లో విద్యార్థుల సమస్యలు, ఇబ్బందుల పరిష్కారం కోసం స్థానిక దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. సమస్యలపై 8341408109 నంబర్కు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను బీఎస్ఈ (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) వెబ్సైట్ నుంచి హాల్టికెట్ ఆప్షన్కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్ టికెట్పై సంబంధిత హెడ్మాస్టరు సంతకం అవసరం లేదన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో నేరుగా పరీక్షకు హాజరు కావచ్చన్నారు. రేపటి నుంచి పది ఓపెన్ స్కూల్ పరీక్షలు నెల్లూరు (టౌన్) : ఏపీ ఓపెన్ స్కూ ల్ పదో తరగతి పరీక్షలు సోమవా రం నుంచి ఈ నెల 28వ తేదీ వర కు నిర్వహించనున్నారు. జిల్లా వ్యా ప్తంగా 15 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 1291 మంది అభ్యాసకులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 61 మంది ఇన్విజిలేటర్లు, 15 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. -
కార్పొరేషన్కు ఉత్తమ ర్యాంక్ వచ్చేలా కృషి
● పట్టణ పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ హరికృష్ణ నెల్లూరు(బారకాసు): స్వచ్ఛ సర్వేక్షణ్లో నెల్లూరు నగరపాలక సంస్థ ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు కృషి చేయాలని పట్టణ పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ హరికృష్ణ ఆదేశించారు. ఎన్ఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ వైఓ నందన్తో కలిసి శానిటేషన్ విభాగంపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీ స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి పూర్తిగా ఎంతమందికి తెలుసు? తదితర అంశాలపై శానిటరీ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు. వంద శాతం డోరు టు డోర్ చెత్త సేకరణ జరిగేలా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అడగ్గా అందుకు సరైన జవాబు చెప్పలేకపోయారు. దీంతో నగరాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయడం మానుకుని, చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రెవెన్యూ విభాగంతో ఆర్డీ సమీక్ష నిర్వహించారు. మొండి బకాయిలున్న వారిని గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుని పన్నులు వసూలు అయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ రహంతు జానీ, టీపీఆర్వో వాసుబాబు, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నమ్మకంగా ఉంటూ.. నగదు దోచేసి..
● చోరీ కేసులో సహాయకుడి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): యజమాని వద్ద నమ్మకంగా ఉంటూ నగదు, బంగారు గొలుసును అపహరించిన సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. కొండాయపాళెం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎ.శ్రీధర్రెడ్డి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. అతని వద్ద సత్యసాయి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన కె.శ్రీనివాసులురెడ్డి సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శ్రీధర్రెడ్డి తల్లి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన శ్రీధర్రెడ్డి వ్యాపారానికి సంబంధించిన రూ.16.50 లక్షల నగదును ఇంటికి తీసుకొచ్చి శ్రీనివాసులురెడ్డికిచ్చి బీరువాలో భద్రపరచమని చెప్పాడు. 6వ తేదీన అతను నిద్ర లేచి చూడగా సహాయకుడితోపాటు నగదు, 55 గ్రాముల బంగారు గొలుసు కనిపించలేదు. శ్రీధర్రెడ్డి గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ సాంకేతికత ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. శుక్రవారం భగత్సింగ్ కాలనీ సమీపంలో శ్రీనివాసులురెడ్డిని అరెస్ట్ చేసి. రూ.15.70 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని నగర ఏఎస్పీ దీక్ష అభినందించారు. -
చెల్లీ.. వెళ్లిరా..
● వీడ్కోలు పలికిన ముత్యాలమ్మ ● ముగిసిన జాతర ● పోటెత్తిన భక్తులుచిల్లకూరు: మండలంలోని తూర్పుకనుపూరులో జరుగుతున్న పోలేరమ్మ జాతర శుక్రవారం ముగిసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. ముత్యాలమ్మ చెల్లిగా భావించే పోలేరమ్మ జాతరను నాలుగురోజులపాటు వైభవంగా నిర్వహించారు. చివరిరోజున వెళ్లనంపు కార్యక్రమంలో భాగంగా పోలేరమ్మను నిలిపిన చోట ముందుగా కుంభం పోసి మొక్కులు చెల్లించారు. పొలి, బలి కార్యక్రమం ముగిసిన అనంతరం అమ్మవారిని వెళ్లనంపేందుకు గ్రామస్తుల నుంచి గణాచారి అనుమతి పొందారు. తర్వాత పోలేరమ్మను సప్పరం పీటపై ఉంచి తలపై మోసుకుంటూ పురవీధుల్లో నడుస్తుండగా మొక్కులున్న వారు కొత్త చీరలు ఆ మార్గంలో కింద పరిచారు. వాటిపై అమ్మవారిని సాగనంపారు. మార్గమధ్యలో పోలేరమ్మ తన అక్క ముత్యాలమ్మను పలకరించి వెళ్లేందుకు గుడి వద్దకు రాగా గణాచారి సాగనంపుతున్నట్లుగా చెప్పిన ఽకథ ఆకట్టుకుంది. అనంతరం ముత్యాలమ్మ ఆలయం వెనుక వైపున ఉన్న ద్వారం నుంచి పోలేరమ్మను పంబలోళ్ల వాయిద్యాల నడుమ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆసాదులు పోలేరమ్మకు సంప్రదాయంగా కథ వినిపించి మెప్పించే సన్నివేశాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం గ్రామానికి పడమటి వైపున ఉన్న జీడిమామిడి పొదల్లోకి తీసుకెళ్లి పోలేరమ్మను నిమజ్జనం చేసారు. కార్యక్రమాన్ని అదికారులు, పర్యవేక్షించారు. -
కౌలురైతులకు మొండిచేయి
నేను ఐదు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకు ని పంటలు సాగుచేస్తున్నా. గత ప్రభుత్వం రైతుభరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా అందించడంతో కొంత ఊరట లభించింది. కూటమి ప్రభుత్వంలో కూడా అన్నదాత సుఖీభవ అందుతుందని అనుకున్నా. అయితే జాబితాలో పేరు లేదు. ఈ ప్రభుత్వం కౌలురైతులను పూర్తిగా విస్మరించింది. కౌలురైతులకు కూడా అన్నదాత సుఖీభవ నగదును అందించి ఆదుకోవాలి. – చేను వెంకటయ్య, కౌలురైతు, వాకాడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా. ఏటా ఐదెకరాలు మాగాణి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. గత ప్రభుత్వం కౌలురైతులకు కూడా రైతుభరోసా పథకం కింద క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందించి ఆదుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారు. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదు. – దుగ్గన రామచంద్రయ్య, కౌలురైతు, మనుబోలు నేను ఏటా నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తు న్నా. గత ప్రభు త్వం కౌలురైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కౌలురైతులను చిన్నచూపు చూస్తోంది. రెండు పర్యాయాలు కౌలురైతుగా దరఖాస్తు చేసుకున్నా అన్నదాత సుఖీభవ నగదు అందలేదు. పెట్టుబడికి అప్పులు చేయాల్సి వచ్చింది. పంటలకు మద్దతు ధరలు కూడా లేక నష్టపోతున్నాం. – వెందోటి సుధాకర్, కౌలురైతు, చిట్టమూరు చిన్నచూపు తగదు -
పిల్లలు లేరు..వంట చేయలేదు
వెంకటాచలం: మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ లక్ష్మిరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. తొలుత వెంకటాచలం మండలం లింగంగుంటలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రానికి పేరు బోర్డు లేకపోవడం, కేంద్రంలో పిల్లలు, సిబ్బంది ఎవరూ లేకపోవడం, ఉదయం 11 గంటలు దాటినా వంట చేయకపోవడాన్ని గుర్తించారు. రికార్డులను తనిఖీ చేయగా 12వ తేదీ హాజరు నమోదు చేయకపోవడం, కేంద్రంలో 16 మంది పిల్లలు నమోదై ఉండగా, కేవలం ముగ్గురు మాత్రమే హాజరైనట్లుగా నమోదు చేయడాన్ని పరిశీలించారు. స్టాక్ రిజిస్ట్టర్ను సక్రమంగా నిర్వహించకపోవడం, స్టాక్ రిజిష్టర్, భౌతిక స్టాక్ మధ్య 183 గుడ్లు తేడా, ఫేజ్ –ఐకు చెందిన 46 బ్లూ కలర్ గుడ్లు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. అనంతరం టీహెచ్ఆర్ లబ్ధిదారులకు ఫోన్ చేసి ఆరాతీయగా ఇప్పటి వరకు గుడ్లు ఇవ్వలేదని తెలిపారు. దీంతో అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్, పీడీ అనురాధకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సర్వేపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో ఫేజ్–ఐకు చెందిన 131 బ్లూ కలర్ గుడ్లు నిల్వ ఉండడం, గతేడాది అక్టోబరు నుంచి సూపర్వైజర్ కేంద్రాన్ని సందర్శించకపోవడాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం సర్వేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో 540 కలర్ మార్కింగ్ లేని గుడ్లు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. ఇలాంటి స్టాక్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. అనంతరం గుడ్ల సరఫరాదారుడితో మాట్లాడగా తన వద్ద కలర్ మార్కింగ్ చేసిన గుడ్లు లేవని సమాధానం ఇచ్చాడు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని, పాఠశాల హెచ్ఎం, ఎగ్ వెండర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట జిల్లా సరఫరాల అధికారిణి లీలారాణి, జిల్లా మేనేజర్ అర్జున్రావు, ఆర్ఐ సుస్మిత తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార కమిషన్ తనిఖీలు వెలుగులోకి పలు అక్రమాలు అంగన్వాడీలు, సూపర్వైజర్లు, హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు -
గ్యాస్ కొరత వదంతులను నమ్మొద్దు
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో గ్యాస్ కొరత ఉందని వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని జాయింట్కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి లీలారాణితో కలిసి గ్యాస్ సరఫరా సంస్థల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన మేర గ్యాస్ నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద వీఆర్వోతో పాటు కానిస్టేబుల్ను నియమించి గ్యాస్ సిలిండర్ల డెలివరీని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. డీలర్లు కూడా ప్రతిరోజూ స్టాక్ వివరాలు, బుకింగ్, డెలివరీ స్టేటస్లను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు, ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు నిరంతర పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఆయిల్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్సిలిండర్లను సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత ఏజెన్సీలు లేదా అధికారులకు తెలియజేయాలని సూచించారు. హెచ్పీ, భారత్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ల గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పీఎం కిసాన్ పథకానికి భారీగా కోతలు
అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు రాలేదు అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు ప్రభుత్వం పథకానికి అనేక కొర్రీలు వేసి.. గుండె కోతను మిగిల్చింది. అర్హులు ఎవరైనా ఉంటే.. నెల రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే తిరిగి సాయం అందిస్తామంటూ ప్రతిసారి చెబుతున్నా.. ఆ దరఖాస్తులకు మూడో విడత జమవుతున్న నేటికీ దిక్కులేని పరిస్థితి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హత ఉండీ పథకం డబ్బులు రాకపోతే.. తిరిగి దరఖాస్తు చేయించి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం పథకాన్నే కాకుండా.. ప్రణాళికను కాపీ కొట్టినా చివరకు వెన్నుపోటు పేటెంట్ను నిలబెట్టుకుంటోంది. చంద్రబాబు చరిత్రలో రైతుల కోసం అమలు చేసిన పథకం ఒక్కటీ లేదు. అధికారం కోసం గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టి.. పీఎం కిసాన్ సాయం కాకుండా అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ ప్రచారం చేశారు. తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపి అంటూ నాలుక మడతేసి.. రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తామన్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న కౌలు రైతు పేరు బందెల ప్రసాద్. చేజర్ల మండలం యనమదల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రెం డున్నర ఎకరాల కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా (పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ) ఇవ్వలేదు. గతంలో జగనన్న ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 చొప్పన మూడేళ్లు రైతు భరోసా అందిందని, అది వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఎంతో ఆదరువుగా ఉండేదంటున్నాడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌలుకు రైతులకు పథకం వర్తించదని అధికారులు చెప్పడంతో హతాశుడయ్యాడు. నిమ్మ, మామిడి, తదితర ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు అన్నదాత సుఖీభవ జమ కావడం లేదు. అయ్యా..నాకు సుఖీభవ డబ్బులు పడడం లేదయ్య..నేనేమంటానంటే.. కొందరికేనయ్య... ఇక పడవ్.. వెళ్లిపో...!సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని లబ్ధిదారులను అనేక కారణాలు చూపించి ఏరివేసింది. అధికారంలోకి రాక ముందు కౌలురైతులకు పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పినా.. అమల్లోకి వచ్చే సరికి కౌలురైతుల ఊసే ఎత్తకుండా.. అర్హులైన లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టింది. అర్హత ఉండీ పథకం వర్తించని లబ్ధిదారులకు నెల రోజులు గడువు ఇస్తున్నామని అర్హతలతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సాయం అందిస్తామని నిధుల విడుదల ప్రతిసారి చెబుతోంది. కానీ అర్హత ఉండీ లబ్ధి చేకూరని 84,134 మంది రైతులకు నేటికీ దిక్కులేదు. ‘సూపర్’ మోసం చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదిడ్డంగా.. అలవి కాని హామీలిచ్చారు. గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండీ కూడా ఏనాడు రైతుల సంక్షేమానికి ఒక్క పథకాన్ని అమలు చేయని ఆయన సూపర్ సిక్స్లో భాగంగా పీఎం కిసాన్ సాయం కాకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఎగనామం పెడితే.. మలి ఏడాది సగం మందికే ఇచ్చి సరిపుచ్చారు. రెండో ఏడాదిలో తొలి విడతలో ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత 1,98,514 మంది రైతులను అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించినప్పటికీ చివరకు 1,95,866 మందిని ఫైనల్ చేశామని చెప్పారు. ఆ తరువాత ఈకేవైసీ, ఆధార్లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదని, తదితర కారణాలు చూపి మరి కొంత మందిని తగ్గించి.. చివరకు 1,86,368 మందికి జమ చేశారు. ఆ తర్వాత 1,95,866 మందిని నికరంగా నిర్ధారించి.. మూడు విడతల్లోనూ అంతే మందికి జమ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకేలో రైతుల జాబితాలను నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి పారదర్శకతకు పాతరేసింది. జిల్లాలో సుఖీభవ కొందరికే వర్తిపు 1,95,866 మందిని అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకుంటే సాయమందిస్తామని చెప్పినా.. ఫలితం శూన్యం 84,134 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్ కౌలు రైతులకు పంగనామాలు పెట్టిన కూటమి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,14,667 మందికి రైతు భరోసా ఏటా రూ.20 వేలిస్తామన్న చంద్రబాబు తొలి ఏడాది పూర్తిగా ఎగనామం రెండో ఏడాది నుంచి పీఎం కిసాన్తో కలిపి అంటూ నాలుక మడత జిల్లాలో వైఎస్సార్సీపీ హయాంలో 2,14,667 మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా జమ అయితే.. అందరికీ పీఎం కిసాన్ పథకం కూడా అమలవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలో కూడా అన్నదాత సుఖీభవ జమ కాకపోయినా.. ప్రతీ ఒక్కరికీ గతంలో మాదిరిగానే పీఎం కిసాన్ పథకం సాయం రైతుల ఖాతాల్లో జమ అయింది. రెండో ఏడాది తొలి విడత సమయానికి కూడా పీఎం కిసాన్ సాయం ప్రతి ఒక్కరికీ జమ అయితే.. గడిచిన రెండు విడతలుగా భారీగా కోత పడింది. ఆధార్ తరహాలో విశిష్ట సంఖ్యతో కూడిన కార్డులు అంటూ ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ను చేపట్టింది. ఈ క్రమంలో పీఎం కిసాన్ డేటాలో అర్హులైన రైతులకు సంబంధించిన డేటాను తొలగించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రెండో విడతతోపాటు, తాజాగా విడుదల చేసే జాబితాల్లో అర్హులైన రైతులు ఎగిరిపోయారు. ప్రస్తుతం పీఎం కిసాన్ కింద 1,63,125 మందికి జమ చేస్తున్నట్లు వ్యవసాయశాఖాధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య తగ్గించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందనే ఆరోపణలు లేకపోలేదు. పీఎంకిసాన్లో అర్హత ఉంటేనే.. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హతగా మార్చే కుట్రగా ఉందని రైతులు విమర్శిస్తున్నారు. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్ అర్హతనే ప్రామాణికంగా తీసుకుంటే రైతుల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని తొలి విడతలో ఎంత మందికి ఇచ్చారో మూడో విడతలోనూ అంతే మందికి సుఖీభవ నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం. వీరిలో అందరికీ సుఖీభవ పడుతుందా? లేదా? అనేదానిపై కూడా రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అర్హులైన రైతుల జాబితాలను రైతు సేవా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) ప్రదర్శించకపోవడం దీనికి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. -
గ్యాస్ గుది ‘బండ’
● కొనుగోలు ‘భారం’.. దొరకడం కష్టం ● గృహ వినియోగ సిలిండర్లపై రూ.60 ● వాణిజ్య సిలిండర్లపై రూ.115 పెంపు ● జిల్లాలో ఏటా రూ .47 కోట్ల భారం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్ ధరలపై పడింది. జిల్లాలో గ్యాస్ వినియోగం అధికంగా ఉండడంతో ఈ పెంపు ప్రభావం మరింత ఎక్కువగా కనిపించనుంది. అంచనాల ప్రకారం జిల్లాలో వినియోగదారులపై ఏటా సుమారు రూ.47 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు గ్యాస్ ధరల పెంపు మరో భారంగా మారింది. ఉదయగిరి: ప్రభుత్వం వంట గ్యాస్ ధర మరో సారి పెంచింది. గృహ వినియోగదార్లు ఉపయోగించే (14.2 కేజీలు) సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.60 పెంచి సామాన్య ప్రజల్లో గుండెల్లో మంటలు రేపింది. వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్ల ధరను కూడా రూ.115 పెంచింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గత ఏప్రిల్ రూ.50 పెంచితే.. తాజాగా ఇప్పుడు మరో రూ.60 పెంచింది. ఒక వైపు నిత్యావసర సరుకుల ధరలు చాపకింద నీరులా పెరుగుతూ పోతున్నాయి. దానికి తోడు గ్యాస్ ధర కూడా పెరగడంతో సామాన్య జనం నెత్తిన భారం గుది బండగా మారుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా గ్యాస్, చమురు ధరలు పెరిగినా, రాష్ట్ర ప్రజల ఆర్థిక, జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని పెరిగిన ధర ప్రభుత్వం భరించకపోగా పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నెత్తిన మోపింది. దీంతో సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.47 కోట్ల భారం జిల్లా వ్యాప్తంగా 7,87,483 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగదార్లకు సంబంధించి సాధారణ కనెక్షన్లు 4,64,871, దీపం కనెక్షన్లు 2,67,421, ఉజ్వల పథకం కనెక్షన్లు 18,986, సీఎస్ఆర్ కనెక్షన్లు 33,589 ఉన్నాయి. ఇవి కాకుండా వాణిజ్య కనెక్షన్లు మరో 2,616 వరకు ఉన్నాయి. ఇంతకు ముందు గృహ వినియోగ సిలిండరు ధర రూ.890 ఉండగా, పెరిగిన ధర ప్రకారం రూ.950 వరకు చేరుకుంది.అదే వాణిజ్య సిలిండర్ ధర రూ.2,066కు చేరింది. ప్రస్తుతం పెరిగిన ధర ప్రకారం జిల్లా వ్యాప్తంగా వినియోగదార్లపై ఏడాదికి సుమారు రూ.47 కోట్ల భారం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ రంగాలు కుప్పకూలాయి. దీంతో జిల్లాలో పేదవర్గాల వారికి పనులు దొరక్క చేతిలో చిల్లగవ్వలేక, కొనుగోలు శక్తి క్షీణించింది. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసింది. చౌక దుకాణాల్లో సబ్సిడీపై ఇచ్చే కందిపప్పు కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వంట గ్యాస్ ధర పెరగడం సామాన్యలకు గుదిబండగా మారింది. వణికిస్తున్న గ్యాస్ కొరత.. గ్యాస్ ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరో పక్క గ్యాస్ కొరత ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో హోటళ్లు, దేవాలయాల్లో ప్రసాదాల తయారీ నిలిచిపోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంతో పాటు గ్యాస్ ఏజెన్సీల్లో స్టాక్ లేదని సమాచారం ప్రజల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. మరో వైపు కొన్ని హాటళ్లల్లో తిన్న ఫుడ్కు గ్యాస్ వినియోగ బిల్లులు యాడ్ చేస్తుండడం, కట్టెల పొయ్యిలపై వంటలు చేయడం వంటి రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకో వైపు గ్యాస్ బుకింగ్ ఆన్లైన్ కావడంతో.. ఆన్లైన్ బుకింగ్లు కూడా కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పరేషాన్ చెందుతున్నారు. ఆఫ్లైన్లో గ్యాస్ కొనుగోలు చేసే ఏజెన్సీల వద్ద జనం సిలిండర్లు పట్టుకుని పోటెత్తుతున్నారు. సామాన్యులపై పెనుభారం పెంచిన గ్యాస్ ధరలతో సామాన్యులపై భారం పడుతోంది. ఇప్పటికే సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నారు. రోజువారీగా కుటుంబం గడవడమే కష్టంగా మారింది. పేదల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. సంక్షేమ పథకాలు పూర్తిగా గాలికి వదిలేయడంతో పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పడు మళ్లీ గ్యాస్ ధరలు పెంచడం గోరు చుట్టుపై రోకలి పోటు చందంగా మారింది. పెరిగిన గ్యాస్ ధరను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించి పేదలను ఆదుకోవాలి. – మేకపాటి రాజగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఉదయగిరి పెరిగిన సిలిండర్ ధర తగ్గించాలి ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి. ఏడాదిలో రెండు సార్లు ధరలు పెంచారు. మాలాంటి రోజు వారి కూలీ పనులు చేసుకునే జనాలకు భారంగా మారింది. అసలే నిత్యావసర సరుకులఽ ధరలు పెరిగి ఏ వస్తువు కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్యాస్ ధర పెరగడంతో కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరను తగ్గించి పేదలను ఆదుకోవాలి. – ఎన్.లక్ష్మీదేవి, గృహిణి -
వైకల్యం ఓడింది.. సంకల్పం గెలిచింది
● జాతీయ స్థాయిలో పొదలకూరు దివ్యాంగుడి ప్రతిభ ● తల్లి ప్రోత్సాహంతో విజయ తీరాలకు.. దివ్యాంగుడిగా ఎన్నో బాధలు.. అవమానాలు.. కష్టాలు.. కన్నీళ్లు ఉన్నా తన తల్లి అందించిన ప్రోత్సాహం వల్ల జాతీయ స్థాయి దివ్యాంగుల వాలీబాల్ పోటీల్లో రాణించారు పొదలకూరుకు చెందిన వ్యక్తి. తండ్రిని కోల్పోయినా.. క్రీడలపై మక్కువతో ఆత్మ విశ్వాసాన్ని విడవకుండా వృద్ధురాలైన తల్లితో జీవిస్తూ విజయ తీరాలను అందుకునేందుకు ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడు. ఉపాధ్యాయుడిగా ఎంపికై తన తల్లిని బాగా చూసుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు.పొదలకూరు: పొదలకూరు పట్టణంలో నివసిస్తున్న కంభాపు పెంచలయ్య చిన్న వయస్సు లోనే తండ్రి రామయ్యను కోల్పోయారు. అప్పటి నుంచి తల్లి అంకమ్మ పెంపకంలో పెరిగారు. బిడ్డ భవిష్యత్తే లక్ష్యంగా ఆమె తమ కుల వృత్తి అయిన దుస్తులు ఉతికి ఐరన్ చేస్తూ బిడ్డను ఉన్నతంగా చదివించారు. అయితే పెంచలయ్య 80 శాతం వికలత్వంతో జన్మించినా ఏనాడు ఆ తల్లి నిట్టూర్చలేదు. లేకలేక జన్మించిన పెంచలయ్య తమ గారాలపట్టిగా పెంచుకుంది. దీనికితోడు అంకమ్మకు చెవుడు రావడంతో జీవితం మరింత ఇబ్బందిగా మారింది. అయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. కుమారుడిని పొదలకూరులో ఇంటర్, డిగ్రీ వరకు చదివించారు. ఆ తర్వాత ఎంఏ, బీఈడీ నెల్లూరులో అష్టకష్టాలు పడి చదివించారు. క్రీడలపై ఆసక్తి చదువుల తర్వాత పెంచలయ్య దివ్యాంగుల క్రీడలపై ఆసక్తి పెంపొందించుకున్నారు. దీంతో తనకు ఇష్టమైన క్రీడలపై నిరంతరం శ్రమించి పట్టు సాధించాడు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ చాటుతూ చివరకు జాతీయ స్థాయికి ఎదిగాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై ఆడిన పెంచలయ్య అద్భుత ప్రతిభ కనబరిచారు. జట్టు విజయానికి తన వంతు కృషి చేసి రాష్ట్ర జట్టు ప్రథమ స్థానాన్ని సాధించేందుకు ఒకడిగా నిలిచారు. దీంతో జాతీయ స్థాయిలో అభినందనలు అందుకున్న పెంచలయ్య పొదలకూరుకు చేరుకున్నాడు. అమ్మను బాగా చూసుకోవాలి క్రీడల్లో ఎన్ని విజయాలు సాధించినా అమ్మను బాగా చూసుకునేందుకు ఇన్ని కష్టాలు పడుతున్నానంటాడు పెంచలయ్య. వైకల్యం శరీరానికే కాని పట్టుదలకు కాదంటున్నాడు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించేందుకు వీలు కలుగుతుందని, అవకాశాలు తలుపు తట్టవని.. మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాలని ఇప్పటి యువతకు మార్గదర్శకంగా చెబుతున్నారు. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించి ఎనిమిది పదుల వయస్సులో ఉన్న తన తల్లి అంకమ్మను బాగా చూసుకోవడం తన ముందున్న పెద్ద లక్ష్యంగా చెప్పాడు. పారా సిట్టింగ్ వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బోడపాటి శివదత్ తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. అయితే పెంచలయ్య పట్టణంలోని నరసారెడ్డి కాలనీ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ప్రోత్సహిస్తే క్రీడాకారునిగా మరింత ప్రతిభ చూపేందుకు అవకాశం ఉంటుందంటున్నాడు. -
మాకు కోడిగుడ్లు అందలేదు
● ఆహార కమిషన్ తనిఖీల్లో వెలుగులోకి.. ● వివిధ ప్రాంతాల్లో సభ్యుడు లక్ష్మీరెడ్డి పర్యటన ● కోడిగుడ్ల నిల్వపై ఆగ్రహం ● టీచర్లు, హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులుకోవూరు: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి గురువారం కోవూరు నియోజకవర్గంలో పర్యటించారు. కోవూరు మండలం పాటూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. 147 కాలం చెల్లిన గుడ్లు నిల్వ ఉండటాన్ని ఆయన గుర్తించారు. లబ్ధిదారులకు ఫోన్ చేయగా, తమకు గుడ్లు అందలేదని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ సుమిత్రకు షోకాజ్ నోటీసులివ్వాలని ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్ అనురాధను ఆదేశించారు. పాటూరు జెడ్పీ బాలుర హైస్కూల్లో తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని మరోచోట తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి లిఖితపూర్వక అనుమతి లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, హెచ్ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. అనంతరం దామరమడుగు హైస్కూల్కు వెళ్లారు. ఇక్కడ కూడా గుడ్లు పెద్ద సంఖ్యలో నిల్వ ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో స్టాక్ ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పలేక సిబ్బంది నీళ్లు నమిలారు. అలాగే, బుచ్చిరెడ్డిపాళెం బాలికల హైస్కూల్లో ఆయన తనిఖీ చేయగా స్టాక్ రిజిస్టర్ ప్రకారం ఉండాల్సిన దానికంటే 760 గుడ్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తూ, బాధ్యులైన హెచ్ఎంలకు నోటీసులివ్వాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో.. నెల్లూరు(పొగతోట): ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి గురువారం జిల్లాలోని చౌకదుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు నిల్వ ఉన్న ట్లు గుర్తించారు. సంబంధిత సిబ్బందికి షోకాజు నోటీసులివ్వాలని అధికారులను ఆదేశించారు. నగరంలో చౌకదుకాణాలను పరిశీలించి కార్డుదారులకు రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ఓ లీలారాణి, సివిల్ సప్లైస్ డీఎం అర్జున్రావు, ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 50.580 టీ ఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 50.580 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
బారులు తీరి.. అమ్మవారిని దర్శించుకుని..
చిల్లకూరు: మండలంలోని తీర ప్రాంతమైన తూర్పుకనుపూరులో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర సందర్భంగా అమ్మవారికి గురువారం బంగారు చీరను అలంకరించారు. దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తూర్పుకనుపూరుకు చేరుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన వారు మొక్కుల తీర్చుకునే క్రమంలో పొంగళ్లు పెట్టి చీర, సారె సమర్పించారు. ఆలయంలో క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో అమ్మ వారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. దీంతో కొందరు ఇలా ఎప్పుడూ జరగలేదని వాపోయారు. సాయంత్రానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అధికారులు చర్యలు చేపట్టారు. వైభవంగా గ్రామోత్సవం జాతర సందర్భంగా పోలేరమ్మ గుడికి సమీపంలో కొలువుదీరిన యారా గురునాథస్వామికి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇసుక తిన్నెలపై ఉన్న గురునాథస్వామి వద్ద ఉన్న అక్క దేవతలు, గంగపెట్టెకు గొల్లలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణాచారి ముందు ఉండగా, గంగపెట్టెను ఎత్తుకుని గొల్లలు నడుస్తుండగా గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా చేశారు. ఈ సందర్భంగా గొల్లలు వేసిన వీరతాళ్లు అందరిని అలరించాయి. పోలీసుల పెత్తనం జాతర సందర్భంగా ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే బాధ్యత మొత్తం దేవదాయ శాఖ చూసుకోవాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పెత్తనం మొత్తం పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తమకు కావాల్సిన వారిని ఇష్టానుసారంగా పంపి అమ్మవారి దర్శనం చేయించారు. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయ పాలకమండలి కూడా గతంలో ప్రత్యేక పాస్ సౌకర్యం కల్పించేది. అయితే ఈసారి పోలీసులు పాస్లు ఇచ్చే ఆనవాయితీని ఆపేశారు. తాము ప్రత్యేక పాస్లను నచ్చిన వారికి ఇచ్చారని విమర్శలున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జాతర సందర్భంగా మాతమ్మల చేత చిందులు వేయించడంతో గుర నాథస్వామి గ్రామోత్సవంలో తోపులాట జరిగింది. అయినా పోలీసులు పట్టించుకున్న దాఖలాల్లేవని మహిళా భక్తులు విమర్శించారు. -
కొలతలు వేసి.. క్షుణ్ణంగా పరిశీలించి..
● ముగిసిన ఏసీబీ అధికారుల తనిఖీలు ● నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరంలో ఏసీబీ అధికారుల తనిఖీలు ముగిశాయి. గురువారం కూడా ఆర్అండ్బీ, టౌన్ ప్లానింగ్ అధికారులను వెంట బెట్టుకుని మినీబైపాస్, మాగుంట లేఅవుట్, వనంతోపు సెంటర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు. భవనాలను కొలతలు వేసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆదేశాల మేరకు సీఐ వెంకటేష్, విజయ్కుమార్ పర్యవేక్షణలో రెండు బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో 10 భవన నిర్మాణాలను పరిశీలించారు. వాటిలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఇప్పటికే కార్యాలయంలోని రికార్డులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు, అక్రమాస్తులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై నివేదికలు తయారు చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపనున్నారు. అనంతరం బాధ్యు లపై కఠిన చర్యలు ఉంటాయని తెలిసింది. -
ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు
● రూ.5,43,649ల రికవరీకి ఆదేశం సీతారామపురం: మండలంలోని 14 పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలను అధికారులు గుర్తించారు. రూ.5,43,649ల రికవరీకి ఆదేశించారు. సీతారామపురంలోని సీ్త్రశక్తి భవన ప్రాంగణంలో గురువారం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ఉపాధి హామీ పనులపై నెలరోజులుగా విచారణ చేపట్టిన డీఆర్పీలు నివేదికలను డ్వామా పీడీ గంగా భవాని ముందు వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలో సుమారు రూ.10 కోట్లతో పనులు జరిగాయన్నారు. వాటిలో రూ.6.65 కోట్లు కూలీలకు చెల్లించినవి కాగా రూ.2.90 కోట్లు ఇతర పనులకు వినియోగించారన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో తప్పులు జరిగాయన్నారు. కొలతల్లో తేడాలున్న ప్రతి పనికి రికవరీ విధించామన్నారు. పలు పంచాయతీల్లో వంద రోజులు పూర్తయినా కూడా అదే కుటుంబానికి సింగిల్ జాబ్కార్డులను కొత్తగా తయారుచేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు కల్పించడం వంటివి గుర్తించామన్నారు. అలాంటి వాటికి కూడా రికవరీ రాశామన్నారు. ఎం బుక్ల్లో తేడాలకు టీఏ, ఈసీలు, మస్టర్లలో తేడాలకు ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీవీఓ విజయలక్ష్మి, ఎస్సార్పీ భాస్కర్, డీఆర్పీలు నూతన్, నాగరాజు, మల్లికార్జున్, ఏపీఓలు శ్యామల, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ప్రభుత్వంతో ఒరిగేదేమీలేదు
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు ఇలా అన్ని పథకాల్లో ప్రభుత్వం కోతలు విధిస్తోంది. దీంతో సర్కార్పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. సన్నకారు రైతులకు ఏ మాత్రం లబ్ధి చేకూరడంలేదు. – బొద్దుకూరు జయమ్మ, నెల్లూరు జిల్లాలోని రైతులకు అందుతుంది జిల్లాలో 1,95,866 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్లో 1,63,125 మంది అర్హులుగా ఉన్నారు. వీరందరికీ నగదు జమవుతుంది. – సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి


