30 నుంచి వీఎస్‌యూలో సాఫ్ట్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

30 నుంచి వీఎస్‌యూలో సాఫ్ట్‌బాల్‌ పోటీలు

Apr 23 2025 8:15 AM | Updated on Apr 23 2025 8:51 AM

30 నుంచి వీఎస్‌యూలో సాఫ్ట్‌బాల్‌ పోటీలు

30 నుంచి వీఎస్‌యూలో సాఫ్ట్‌బాల్‌ పోటీలు

వీసీ అల్లం శ్రీనివాసరావు

వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో ఈనెల 30 నుంచి మేనెల 8 తేదీ వరకు ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్‌ (మహిళలు, పురుషులు) టోర్నమెంట్‌ జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం కాకుటూరులో ఉన్న వర్సిటీలో వీసీ అల్లం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 93 మహిళా జట్లు 30 నుంచి మే నెల 3 తేదీ వరకు పాల్గొంటాయని తెలిపారు. మేనెల 4 నుంచి 8 తేదీ వరకు 95 పురుషు జట్లు పోటీ పడతాయన్నారు. వీఎస్‌ యూ క్రీడా విభాగం ఆధ్వర్యంలో ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సునీత, ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హనుమారెడ్డి, స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ డాక్టర్‌ సీహెచ్‌ వెంకట్రాయులు, పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్‌ ఆర్‌.మధుమతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement