సెమిస్టర్‌ పరీక్షల్లో చూసిరాత‘లా’! | - | Sakshi
Sakshi News home page

సెమిస్టర్‌ పరీక్షల్లో చూసిరాత‘లా’!

Mar 14 2025 1:07 AM | Updated on Mar 14 2025 1:08 AM

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో చూసిరాతలు జరగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. 1, 3, 5, 7, 9 సెమిస్టర్లకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల, శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ న్యాయ కళాశాలకు చెందిన 250 మంది వరకు విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించడం వల్ల గూగుల్‌, వాట్సాప్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆస్క్‌ మేటా ఏ–1ల ద్వారా చూసిరాతలు జరగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రెక్టార్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ అడ్డయ్య వద్ద ప్రస్తావించగా పూర్తిస్థాయి నిఘా మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పరీక్ష కేంద్రం పరిశీలన

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలను గురువారం రెక్టార్‌ అడ్డయ్య, పరీక్షల నిర్వహణ డీన్‌ ఉదయ్‌భాస్కర్‌, ప్రత్యేకాధికారి సామ్రాజ్యలక్ష్మి పరీక్షలు పరిశీలించారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఇన్విజిలేటర్లకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement