పల్లెలకు పాలనాధికారులు | - | Sakshi
Sakshi News home page

పల్లెలకు పాలనాధికారులు

Mar 28 2025 1:55 AM | Updated on Mar 28 2025 1:51 AM

జీపీఓ పేరుతో కొత్త పోస్టులు మంజూరు

జీపీఓ పోస్టులకు

దరఖాస్తుల ఆహ్వానం

గ్రామ పాలనాధికారి పోస్టుల నియామకాల కోసం పూర్వ వీఆర్‌ఏ వీఆర్‌ఓ తిరిగి మాతృసంస్థకు వచ్చేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి ఈ ఏడాది జనవరిలోనే దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో 297 మంది జీపీఓ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో వీఆర్‌ఏలు 159, వీఆర్‌ఓలు 138 మంది ఉన్నారు. అయితే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో.. ఎంత మందిని నియమిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు.

రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి కొత్త సిబ్బంది

నియామకానికి జనవరి నుంచే

దరఖాస్తుల ఆహ్వానం

పూర్వ వీఆర్‌ఓలు,

వీఆర్‌ఏలకు అవకాశం

నాగారం: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలకు రెవెన్యూ సేవలు అందించేలా గ్రామ పాలనాధికారి(జీపీఓ) పేరుతో ఉద్యోగులను నియమించేందుకు సిద్ధమైంది. ఇది వరకు గ్రామాల్లో సేవలందించిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏల వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యవస్థ రద్దయ్యాక.. రెవెన్యూ పరంగా గ్రామాల్లో భూ సమస్యలు, సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపు, ఇతర సర్వేలకు ఇబ్బందిగా మారింది. ఇది గమనించిన ప్రభుత్వం గ్రామాల్లో సేవల కోసం ఉద్యోగులు ఉండాలని భావించి కొత్త పోస్టులకు శ్రీకారం చుట్టింది.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా..

అయితే గత ప్రభుత్వ హయాంలో ఇతర శాఖల్లో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను సర్దుబాటు చేశారు. ఇందులో 2022 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం 207 మంది వీఆర్‌ఓలు రెవెన్యూతో పాటు 37 శాఖల్లో, 2023 ఆగస్టులో వీఆర్‌ఏలు 416 మందిని ఎనిమిది శాఖల్లో సర్దుబాటు చేశారు. దీంతో గ్రామాల్లో భూ సర్వేలు, భూమి హక్కులు, విద్యార్హత ధ్రువపత్రాల జారీ, విచారణలు, సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపు, విపత్తుల సమాచారం అందజేయడం, తదితర వాటిపై ప్రభావం చూపింది. ఫలితంగా కొన్నింటిని పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేలా ఆర్థిక శాఖ జీపీఓ పోస్టులు మంజూరు చేసింది. జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా వీటితో 279 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు తిరిగి జీపీఓలుగా నియమించాలని నిర్ణయించింది. కాగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓని నియమిస్తారా? అనేది ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

గతంలో ఉన్న గ్రామ రెవెన్యూ సిబ్బంది ఇలా..

వీఆర్‌ఓలు 207

వీఆర్‌ఏలు 416

జీపీఓ పోస్టులకు

అందిన దరఖాస్తులు 297

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే..

గ్రామ పాలనాధికారి (జీపీఓ) నియామకాలపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. జీపీఓల అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. వీరి నియామకాల గురించి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వేస్తే నియామకాల ప్రక్రియ ప్రారంభిస్తాం.

– రాంబాబు,

జిల్లా అదనపు కలెక్టర్‌, సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement