కిటకిటలాడిన తిరువణ్ణామలై గిరివలయం
వేలూరు: తమిళ మాసి మాస పౌర్ణమిని పురష్కరించుకుని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. పంచ భూత స్థలమైన అరుణాచలేశ్వరాలయంలో ప్రతినెలా పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గిరివలయం రోడ్డులోని 14 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా పౌర్ణమి గురువారం ఉదయం 11.40 గంటలకు ప్రారంభమై శుక్రవారం మధ్యాహ్నం ముగియడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. పౌర్ణమి సమయంలో తిరువణ్ణామలై చేరుకొని భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు నాలుగు గంటల పాటు క్యూలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించడంతో భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment