బండి సంజయ్‌ పాదయాత్ర–3 వాయిదా  | Bandi Sanjay Padayatra 3 postponed | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ పాదయాత్ర–3 వాయిదా 

Jun 2 2022 4:19 AM | Updated on Jun 2 2022 8:32 AM

Bandi Sanjay  Padayatra 3 postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈనెల 23 నుంచి చేపట్టనున్న ప్రజా సంగ్రామయాత్ర–3 తాత్కాలికంగా వాయిదా పడింది. వచ్చేనెల 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీ ముగిశాక వారం, పదిరోజుల వ్యవధిలో సంజయ్‌ పాదయాత్ర–3ను మొదలుపెడతారని పార్టీ వర్గాల సమాచారం.

తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా జరగనున్న ఈ సమావేశాలకు పార్టీపరంగా అత్యంతప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నాయకత్వం దీని నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి చెందిన అగ్రనాయకత్వం, హేమాహేమీల వంటి నేతలు, బీజేపీ పాలిత సీఎంలు,, ముఖ్యనేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నందున దానికి తగ్గట్టుగా రవాణా, వసతి, భోజనం, ఆహ్వానం, ప్రొటోకాల్, తదితర ఏర్పాట్ల నిమిత్తం పలు కమిటీలను ఏర్పాటు చేసే సన్నాహాల్లో రాష్ట్ర పార్టీ నిమగ్నమైంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement