-
బీఆర్ఎస్, కాంగ్రెస్ల దుష్ప్రచారం నమ్మొద్దు
చందుర్తి (వేములవాడ): రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుస్తుందని సర్వేలు చెబుతుండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్ అన్నారు. దీనిని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఆదివారం బండి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కట్టలింగంపేటలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచారం నమ్మొద్దని కోరారు. స్వయం ప్రకటిత మేధావి గత ఎన్నికల్లో ఎక్కడి నుంచో వచ్చి కరీంనగర్లో పోటీ చేశాడని, ఇప్పుడు సైతం ఇక్కడ ఎంపీగా గెలుస్తానని కలలు కంటున్నాడని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యత లోపించి కూలేందుకు సిద్ధమైందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు నెలల పాలనతో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయామని భావి స్తున్నారని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. -
నేటి నుంచి ‘బండి’యాత్ర
కరీంనగర్ టౌన్: ‘మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న ఈ మహాయాగంలో మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా మీ గడపకొస్తున్నా.. ఆశీర్వదించండి’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. యా త్రను విజయవంతం చేయాలని కోరారు. శనివారం ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రారంభమయ్యే తొలివిడత యాత్ర ఈనెల 15 వరకు కొనసాగనుంది. తొలిరోజు యాత్ర మేడిపల్లి, కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడ, బొమ్మెన, దూలూరు, సరికొండ, కథలాపూర్ గ్రామాల్లో జరగనుంది. రాత్రి కథలాపూ ర్లో సంజయ్ బసచేస్తారు. తొలివిడతలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే క్రమంలో వాహనం వాడతారు. గ్రామాల్లో మా త్రం పాదయాత్రగా ముందుకు సాగుతారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్మ్యాప్ రూపొందించారు. నియోజకవర్గం మొత్తం పర్యటించేలా రూట్మ్యాప్ ప్రజాహిత యాత్ర పేరిట కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేసేలా ఇప్పటికే సంజయ్ రూట్మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మొదట కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి సంజయ్ తనయాత్రను ప్రారంభించనున్నారు. తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి తంగళ్లపల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నారు. తొలిదశలో మొత్తం 119 కి.మీ. మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రతీ మండలం కవర్ చేస్తూ.. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు యాత్రను కొనసాగించేలా షెడ్యూల్ను రూపొందించారు. -
అయోధ్యకు చేరువలో పాదయాత్రికురాలు షబ్నం!
మతపరమైన ఆంక్షలన్నింటినీ దాటుకుని ముంబై నుంచి శ్రీరాముని దర్శనానికి కాలినడకన బయలుదేరిన షబ్నం ఇప్పుడు అయోధ్యకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. ఆమె హలియాపూర్లోని అయోధ్య సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇది తన కల నిజమవుతున్న తరుణమని అన్నారు. కొద్దిసేపటిలో రామ్లల్లా దర్శనం చేసుకోబోతున్నానన్నారు. షబ్నం షేక్కు హాలియాపూర్లో స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ముంబైలో ఉంటున్న షబ్నమ్ షేక్ (23) బీకామ్ విద్యార్థిని. రామునిపై ఆమెకు ఉన్న భక్తిప్రపత్తులను ఆమె సోషల్ మీడియాలో వెల్లడిస్తుంటారు. 38 రోజుల క్రితం ఆమె తన ముగ్గురు హిందూ స్నేహితులైన రమణ్ రాజ్ శర్మ, వినీత్ పాండే, శుభమ్ గుప్తాలతో కలిసి అయోధ్యకు కాలినడకన బయలుదేరారు. శనివారం సాయంత్రం హాలియాపూర్లోని ఎక్స్ప్రెస్వే దగ్గర స్థానికులు వారికి స్వాగతం పలికారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రతాప్ ధాబా నిర్వాహకుడు హరి ప్రతాప్ సింగ్, అతని భార్య ప్రీతి సింగ్ షబ్నం బృందానికి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని వారు కోరారు. షబ్నం వారి అభ్యర్థనను అంగీకరించారు. ఈ సందర్భంగా షబ్నం మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి శ్రీరామ భక్తురాలినని, అయోధ్యకు సమీపానికి చేరుకోవడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను రెండు రోజుల పాటు అయోధ్యలో ఉండి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలుసుకుని, ఆ తర్వాత తిరిగి ముంబైకి చేరుకుంటానన్నారు. -
కరువు, చంద్రబాబు కవలపిల్లలు
పుట్టపర్తి: కరువు, చంద్రబాబు కవలపిల్లలని, ఆయన హయాం మొత్తం కరువు రాజ్యమేలిందని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపే పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన తొమ్మిది రోజులపాటు చేపట్టిన ‘వైఎస్సార్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర’ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ముగింపు సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో పంటలు ఎండిపోయి రైతులు అల్లాడిపోయారన్నారు. వైఎస్సార్ చలువతో హంద్రీ–నీవా కాలువ తవ్వడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం అనేక చెరువులకు నీరందుతుండడంతో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులను నింపితే రెండు లక్షల ఎకరాలు సాగులోకి రావడమే కాకుండా సుమారు రెండు లక్షల జనాభాకు తాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. -
ఏంటో యువగళం గందరగోళం..లోకేష్ పాదయాత్రపై పేర్ని నాని పంచులు
-
భారత్ న్యాయయాత్ర.. రాహుల్ మళ్లీ పాదయాత్ర
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర ద్వారా జనంలో వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్ న్యాయయాత్ర పేరుతో రాహుల్ ఈసారి పాదయాత్ర చేయబోతున్నారని.. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. రెండో విడతలో.. ఈశాన్యం నుంచి పశ్చిమ భారతం వైపు రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అయ్యి 14 రాష్ట్రాలు.. 85 జిల్లాల గుండా ఉంటుంది. మణిపూర్లో మొదలై.. ముంబై దాకా దాదాపు 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. మార్చి 20వ తేదీతో యాత్ర ముగుస్తుంది. అయితే ఈసారి యాత్రకు భారత్ జోడో యాత్ర అని కాకుండా.. భారత్ న్యాయయాత్ర అని పేరు పెట్టినట్లు తెలిపారాయన. రాహుల్ యాత్ర ఈసారి హైబ్రీడ్ మోడల్లో సాగనుంది. అంటే.. బస్సు ద్వారా, కాలి నడక ద్వారా రాహుల్ యాత్ర కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారు. భారత్ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో రాహుల్ భారత్ న్యాయయాత్ర చేయబోతున్నారు. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదు. ఈసారి యువతను, మహిళలను, అణగారిన వర్గాలతో రాహుల్ ముఖాముఖి అవుతారని వెల్లడించారు. #WATCH | Congress General Secretary KC Venugopal says, "Now Rahul Gandhi is doing a yatra with great experience from the first Bharat Jodo Yatra. This Yatra is going to interact with youth, women and marginalised people. This Yatra will cover a distance of 6,200 kms. It travels… pic.twitter.com/ICfR4jDExA — ANI (@ANI) December 27, 2023 జోడో యాత్ర సాగిందిలా.. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకేనని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ‘మిలే కదం.. జుడే వతన్ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో రాహుల్ యాత్ర మొదలైంది. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా.. 12 రాష్ట్రాల్లో సాగింది. 145 రోజుల (దాదాపు 5 నెలలు)పాటు దాదాపు 3970 కి.మీ మేర రాహుల్ యాత్ర కొనసాగించారు. కశ్మీర్లోని లాల్చౌక్లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది. -
జంపింగ్ జపాంగ్ యాత్ర..పవన్ కు అవమానం
-
యువగళం వేదికపై పగటి వేషగాళ్లు
-
ఇంతేనా.. ఇంక వీళ్లు మారరా??
నారా లోకేష్ యువగళం-నవశకం సభ అట్టర్ ప్లాప్. ఈ మాట రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్ కాదు.. స్వయంగా టీడీపీ హార్డ్కోర్ అభిమానులే చెబుతున్న మాట. అంతకు మించి సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ అభిమానులు చర్చించుకుంటున్న విషయం. అందుకు కారణాల్ని విశ్లేషిస్తే.. సహాజంగా వేదిక ఎక్కితే ఊగిపోయే పవన్.. నిన్నటి సభలో తగ్గి మాట్లాడాడు. బహుశా తాను చంద్రబాబుకి బానిసే అని విషయం ఇలా చెప్పాలనుకున్నారో ఏమో. ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వడం లేదు అంటూనే.. చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని తెగ ఫీలైపోయారు. నమ్ముకున్నవాళ్లు ఏమైపోతే నాకేంటి.. బాబు కోసమే తాను పని చేసేది, చేయబోయేది అని తన స్పీచ్ ద్వారా పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఇదే వేదిక నుంచి జనసైనికులు, అభిమానులకు ఊరట ఇచ్చేలా ఏదైనా సందేశం ఇస్తాడా? అని ఆశిస్తే.. అదీ జరగలేదు. ఇక బాలయ్య స్పీచ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉచితాలకు, సంక్షేమ పథకాలకు తేడా గుర్తించలేకపోతున్నారాయన. పవన్ కల్యాణా? అతనెవరో తెలియదు!. అలగా బలగా పార్టీలు, సంకర పార్టీలు అంటూ పలికిన నోరు.. ఇప్పుడు ‘తమ్ముడు పవన్ కళ్యాణ్.. ఇక తెగిద్దాం’.. ‘మా ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి’’.. అనే సరికి వినలేక ‘‘అయ్య బాబోయ్..’’ అనుకున్నాయి. అక్కడి నుంచి తెలుగుదేశం కార్యకర్తలు నవ్వుతూ బయటకు వెళ్లిపోవడం కనిపించింది. ఇక జనసేన సైనికుల ముఖచిత్రాల్లో ఎక్స్ప్రెషన్ గురించి చెప్పనక్కర్లేదు. పాదయాత్ర అనుభవాలతో ఎంతో నేర్చుకున్నాడట నారా లోకేష్. గతంలో పలువురు నాయకులు చేసిన యాత్రకు.. ఆగి ఆగి సాగిన చినబాబు యాత్రకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. లోకేష్ తన యాత్రలో ఎక్కువ సమూహాలను కలిసిందే లేదు. కేవలం ప్రభుత్వాన్ని తిట్టాలి.. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని ఆలోచనతో త్వరగతిన ముగించారే తప్పా.. సీరియస్గా సాగని ఆ యాత్రను, నిన్న జరిగిన ముగింపు సభలో లోకేష్ ప్రసంగాన్ని ఏపీ ప్రజలు కూడా అంతే లైట్ తీసుకున్నారు. లోకేశ్ ప్రసంగం.. రోజూ వారీ యాత్రలో చేసిన ప్రసంగంలానే సాగింది. మాట తీరులో ఎలాంటి మార్పూ రాలేదు. మొత్తంగా.. టీడీపీకి తెల్లజెండా ఎత్తేంత వరకు నిద్రపోను అనే రీతిలో సాగింది లోకేష్ స్పీచ్. ఇక జనసేనలో నెంబర్ టూగా చెప్పుకునే నాదెండ్ల అయితే ఏకంగా, ఊహించని రీతిలో లోకేష్ భజన చేశారు. పొరపాటున పొత్తు ప్రభుత్వం గెలిస్తే.. నారా లోకేష్ సీఎం!! అవుతాడంటూ అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ మాటలకు ‘ష్..’ విస్తుపోవడం చాలామంది వంతు అయ్యింది. ఇక నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం గురించి చెప్పాలి. ఎన్నికల నిమిత్తం తాను గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి గుర్తుచేశారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి.. మంచిని మచ్చుకైనా ప్రస్తావించలేదు. ఎందుకంటే.. అక్కడ ఏం లేదు కాబట్టి. గత వారం పదిరోజులుగా పొత్తుపై అసంతృప్తిగా ఉంటూ వస్తున్న పవన్ను ఊరడించేలా మాట్లాడారు. నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం ఉందంటూనే.. వ్యక్తిగతం దూషణలతో దిగజారి ప్రసంగించారు. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నేతగా చంద్రబాబు అంత పేలవంగా మాట్లాడతారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. నారా లోకేష్ బాబు ఒక ఐరన్ లెగ్.. కాలు పెట్టాడు. కాస్త దూరం నడిచాడు. ఇంక ఏముంది.. ఫసక్!. కట్ చేస్తే.. భోగాపురం మండలం పోలిపల్లి సభ వేదికపై ఒక్కరి మొహంలో కూడా నవ్వు లేదు. చంద్రబాబు సహా ఒక్కరి ప్రసంగంలో పస లేదు. ఒంటరిగా వచ్చి 151 సీట్లు కొట్టి బాహుబలిలా ఎదిగారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. నాలుగున్నరేళ్లలో ప్రజలకు చేరువలోనే ఉన్నారాయన. అలాంటిది ఇప్పుడు జగన్ను ఓడించగలమా? ఇంతమంది కలిసినా ఓడిపోతే తల ఎక్కడ పెట్టుకోవాలి?.. ఇదే భయం వాళ్ల కళ్లలో స్పష్టంగా కనిపించింది. ::: సాక్షి వెబ్, పొలిటికల్ డెస్క్ -
అయ్యా బాబోయి లోకేష్ స్పీచ్...ఉన్న నలుగురు జంప్
-
నారా లోకేష్ పాదయాత్ర పై సర్వత్రా విమర్శలు
-
యువగళం..ఓ అట్టర్ ప్లాప్ షో
-
మాలోకం గారి విహార యాత్ర
-
ప్రజా స్పందన కరువైన లోకేష్ పాదయాత్ర
-
ప్రగల్బాలకే పరిమితమైన నారా లోకేష్
-
విషయం చాలా వీక్..
-
పాయకరావుపేట రోడ్డు కూడా తాకలేవు
-
పాదయాత్ర పేరుతో లోకేష్ ఇక్కడ అడుగుపెడితే
-
మాలోకంపై మహిళా లీడర్ వేరే లెవెల్ ర్యాగింగ్
-
లోకేష్ పాదయాత్రలో వంగలపూడి అనిత పరువు తీసిన టీడీపీ కార్యకర్తలు
-
చిన్నపిల్లల లాగులు తడుపుతున్న లోకేష్..
-
Nara lokesh: లోకేష్ వస్తే మరింత నష్టం తప్పదని టీడీపీ నేతల్లో ఆందోళన
-
లోకేష్ పాదయాత్రకు మంగళం
రాష్ట్రమంతా నడుస్తానంటూ నానా హంగామా చేసిన నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను మరో పది రోజుల్లో ముగించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నడవాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎంతగా సూచించినా.. లోకేష్ మాత్రం తన వల్ల కాదని తేల్చిచెప్పినట్టు సమాచారం. పాదయాత్రకు పార్టీ చాలా ప్రచారం చేసిందని, ఇప్పుడు మధ్యలోనే నిలిపివేస్తే మైలేజీ రాదని పార్టీ సీనియర్లు చెప్పినా.. లోకేష్ ససేమిరా అన్నట్టు తెలిసింది. ఇప్పటికే చాలా నడిచాను, ఇంకా నడవాలంటే తన వల్ల కాదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. అవకాశం దొరికితే పాదయాత్రకు బ్రేక్ ఏ నాయకుడికయినా జనంలో ఉండడం గొప్ప అవకాశం. దాన్ని సరిగా నిర్వహించుకోగలిగితే.. అన్ని వర్గాలకు చేరువ కావడం సులభం. పైగా తెలుగునాట ఇప్పటివరకు పాదయాత్రలు చేసిన వారందరికి అద్భుతమైన అవకాశాలు వచ్చాయి, ప్రజలు అంతేస్థాయిలో ఆదరించారు. అదే ఉద్దేశ్యంతో లోకేష్ను పాదయాత్రకు దించారు చంద్రబాబు. కానీ, ఆరంభం నుంచి ఈ పాదయాత్రను ఎప్పుడు ఆపేద్దామా అన్నట్టు సాగింది. చంద్రబాబు అరెస్టయినప్పుడు లోకేష్ వెంటనే పాదయాత్ర నిలిపివేశారు. నిజానికి పార్టీ కార్యకలపాలు స్తంభించినప్పుడు.. లోకేష్ జనంలోకి వెళ్లి నడిచి ఉంటే.. మంచి మైలేజీ వచ్చేదేమో. అయితే పాదయాత్ర ఆపేసి ఢిల్లీ వెళ్లిపోవడంతో లోకేష్ నాయకత్వంపై సందేహాలొచ్చాయి. బెయిల్ తర్వాతా అదే పరిస్థితి చంద్రబాబు అక్టోబర్ 31న విడుదలయ్యాడు. ఆ తర్వాతయినా లోకేష్ కదులుతాడా.. అంటే అతి కష్టమ్మీద నెట్టాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తీరా ఎన్నికల సమయంలో ఇచ్ఛాపురం వరకు నడిచి ఉంటే.. కనీసం డ్యామేజీకంట్రోల్ అయ్యేది. కానీ మొదటి నుంచి ఉత్తరాంధ్ర అంటే చిన్నచూపు చూసే లోకేష్.. తన యాత్రను పోలిపల్లితో సరిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. పోలిపల్లిలో యువగళానికి మంగళం మరో పది రోజుల్లో, డిసెంబర్ 17న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం పాదయాత్రను ముగించాలని లోకేష్ నిర్ణయించారు. విశాఖ నుంచి భోగాపురం మద్య దూరం దాదాపు 60 కిలోమీటర్లు. అదే ఇచ్ఛాపురం నుంచి భోగాపురం మధ్య దూరం దాదాపు 200 కిలోమీటర్లు. అంటే చివరి 200 కిలోమీటర్లను లోకేష్ తన యాత్ర నుంచి కత్తిరించేశారు. ఇక ఇప్పటివరకు చేసిందేమీ లేకున్నా.. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముగింపు సభ నుంచే చంద్రబాబు రాజకీయం ప్రారంభం 52 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు.. బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు పాటు కోర్టు ఆంక్షల వల్ల ఇంటికే పరిమితమయ్యారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెరవెనక మంత్రాంగాలతో సరిపెట్టారు. ఆ తర్వాత ఆంక్షలు ముగిసినా.. ఆధ్యాత్మిక యాత్రలతో పర్యటనలు జరిపారు. ఒక భారీ బహిరంగ సభ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ముగింపు సభను అవకాశంగా తీసుకుని మళ్లీ రాజకీయాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభకు పవన్ కళ్యాణ్కు కూడా ఆహ్వానం పంపారు. డిసెంబర్ 17న ఆదివారం రానుంది. ఇన్నాళ్లు మ్యానిఫెస్టోను ఆలస్యం చేసిన చంద్రబాబు, పవన్ ఆ రోజు కనీసం మినీ మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా? -
6 రోజుల పాటు కాలినడకన తిరుమలకు పాదయాత్ర
-
సీఎంకు కృతజ్ఞతతో..శబరిమలకు పాదయాత్ర
పెనుగొండ: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న తన కూతురికి లక్షలాది రూపాయల వ్యయంతో అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి అవసరమని, పేద ప్రజలకు అండగా నిలిచే నాయకుడు జగనే మళ్లీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఓ అయ్యప్ప మాలధారుడు శబరిమలకు పాదయాత్రను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తూర్పుపాలెంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఆచంట మండలం అయోధ్యలంకకు చెందిన కొప్పాడి రాంబాబు కుమార్తె హనీ చిన్న వయసులోనే అరుదైన వ్యాధికి గురైంది. వ్యవసాయం చేసుకొంటూ జీవించే రాంబాబు వైద్యం చేయించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో 2022 జూన్ 23న గంటి పెదపూడి వచ్చిన సీఎం జగన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో సత్వర వైద్యానికి ఆర్థికంగా అండగా నిలుస్తానని సీఎం భరోసా ఇచ్చారు. హనీకి ప్రతి నెలా రూ.1.50 లక్షలతో ఇంజక్షన్ చేయించవలసి ఉంది. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందంటూ సీఎం భరోసా ఇచ్చి అక్టోబర్లో వైద్య సహాయం ప్రారంభించారు. దీనికి గాను ఒకేసారి 40 ఇంజక్షన్లను అందజేశారు. అవి ఇప్పటివరకు రావడంతో మరోసారి 24 ఇంజక్షన్లు 2 రోజుల్లో పంపించనున్నారని రాంబాబు శుక్రవారం తెలిపారు. వైద్యం అందించడమే కాకుండా, కోనసీమ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలోనూ చదువుకునేందుకు ఏర్పాటు చేసి, నెలకు రూ.10 వేలు పింఛన్ సౌకర్యం కల్పించారని తెలిపారు. అందుకే సీఎంగా జగనే కావాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ శబరిమల వరకు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
డర్టీ ఫెలో ట్రైలర్ రిలీజ్
ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
షుగర్ వచ్చిందా? పరగడుపున మెంతి నీళ్లు ట్రై చేశారా?
మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..
అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
‘మిరల్’ మూవీ రివ్యూ
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
తప్పక చదవండి
- ట్విటర్ రీ బ్రాండింగ్పై మస్క్ ట్వీట్
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement