Bandi Sanjay
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్కు బండి సంజయ్ సవాల్
సాక్షి, కరీంనగర్ జిల్లా: కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇది నాల్గో విజయం.. సమన్వయంతో పని చేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ నీతివంతమైన పాలనను ఓటర్లు గుర్తించారన్నారు.ఈవీఎంలను తప్పుబడుతున్న రాహూల్ గాంధీ ఈ బ్యాలెట్ విజయంపై ఇప్పుడు మాట్లాడాలి. ఓటుకు 5 వేలు పంచారు కాంగ్రెస్ వాళ్లు. బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది. బీఎస్పీ అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడంతోనే ఆయన మూడో స్థానానికి పడిపోయాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి పన్నిన కుట్రలను ప్రజలు గమనించారు. సొమ్మొక్కడిది సోకొక్కడిదన్నట్టు కేంద్రం నిధులిస్తే ఇక్కడి ప్రభుత్వం తానే గొప్పలు పోతోంది. కాంగ్రెస్ దిగిరావాలి.. మీకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో తీర్పునిచ్చారు. మీ ఆరు గ్యారంటీలపై సమాధానం ఏంటో కాంగ్రెస్ ఇప్పటికైనా చెప్పాలి‘‘శాసనమండలిలో గడగడలాడించేందుకు మా ముగ్గురు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్పై బీసీలు వ్యతిరేకత చూపారు. ముస్లింలను కలపడాన్ని బీసీలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్సీ గెలుపు.. రాబోయేది బీజేపీ కాలమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకానికి ఇది నిదర్శనం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. ఉపాధ్యాయులందరికీ వందనం. ఈ విజయాన్ని ప్రధాని మోదీ, ఉపాధ్యాయులకి అంకితం చేస్తున్నాం. బీజేపీని విమర్శించిన వారికి ఇదొక గుణపాఠం.కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయి.. బీజేపీని ఓడించాలని చూశారు. ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒక వర్గానికి కొమ్ము కాసింది. నితీకి నిజాయితీకి నిదర్శనం ఈ విజయం. రాబోయేది బీజేపీ కాలమే. తెలంగాణలో రామరాజ్యం, మోదీ రాజ్యం రానుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి నేతృత్వంలో పార్టీకి ఇది మూడో విజయం. కిషన్రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాం. తెలంగాణలో టీచర్లు అందరూ తపస్లో చేరాలి అని సూచించారు. -
భారత్, పాక్ మ్యాచ్తో ఏం సంబంధం?
కరీంనగర్ కార్పొరేషన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు, దుబాయిలో జరిగిన భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు సంబంధం ఏమిటని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్పై భారత్ విజయం సాధిస్తే ప్రతి భారతీయుడు సంతోషపడ్డాడని, కానీ అదేదో బీజేపీయే మ్యాచ్ను గెలిపించినట్లు దానికీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముడిపెట్టడం సిగ్గుచేటన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన మాట్లాడారు.ఎన్నిక ఏదైనా హిందూ.. ముస్లిం, భారత్..పాకిస్తాన్ ముచ్చట తీయకుండా బీజేపీ ఓటడగదని విమర్శించారు. 2014లో శ్రీరాముడి పేరిట అధికారంలోకి వచి్చన బీజేపీ చేసిందేమీ లేదని, తర్వాత రెండుసార్లు దేవుడి పేరునే వాడుకుందని ధ్వజమెత్తారు. బీజేపీకి లాభం చేసేందుకే బీఆర్ఎస్ పోటీలో లేదన్నారు. బీసీలను అణగదొక్కే బీజేపీ ఒక వైపు, రెడ్డి సీఎంగా ఉన్నా బీసీలకు న్యాయం చేసే కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సంజయ్ది అవగాహనా రాహిత్యం దేశంలో అన్ని ధరలు పెరిగాయని, పేదలకు మోదీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో సంజయ్ చెప్పాలన్నారు. ఈ ఫార్ములా రేసు కేసులో ఒక పక్క విచారణ జరుగుతుంటే, కేటీఆర్కు నోటీసు కూడా ఇవ్వలేదని అనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ఫోన్ ట్యాపింగ్పై ఎందుకు సీబీఐ విచారణ జరిపించకూడదని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని 3.1 శాతం కుటుంబాలు కూడా వివరాలు నమోదు చేసుకోవాలని, 28వ తేదీ వరకు కేసీఆర్, హరీశ్లాంటి వారికి కూడా అవకాశం ఇచ్చామని చెప్పారు. -
మాది భారత్.. కాంగ్రెస్ది పాక్ టీం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ భారత జట్టు.. ఎంఐఎంతో అంటకాగే కాంగ్రెస్ పాకిస్తాన్ జట్టు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్కు ఓటెయ్యాలి. బీసీ కులగణనకు మేం వ్యతిరేకం కాదు. కానీ అందులో ముస్లింలను చేర్చడాన్ని అంగీకరించం. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే. అందుకే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా–ఈ రేసు కేసుల్లో అవినీతి జరిగిందని చెబుతున్నా.. సీఎం కనీసం వారికి నోటీసులైనా ఇచ్చే సాహసం చేయడం లేదు..’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్పై దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి ⇒ ‘దూదేకుల కులాలకు రిజర్వేషన్లను మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. కానీ ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణ జరిపించాలని కోరితే అడ్వకేట్ జనరల్ ఒప్పుకోని విషయం నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారు. మీరు విదేశాలకు పంపిస్తే..మేం పట్టుకురావాలా? మేం లిక్కర్ కేసులో కవితను జైల్లో వేశాం. ట్యాపింగ్ కేసులో మీకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి. దోషులందరినీ అరెస్టు చేసి బొక్కలో వేస్తాం..’అని సంజయ్ అన్నారు. బీసీ సమాజాన్ని సీఎం అవమానించాడు ⇒ ‘పేదరికం ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తుంది.. ఆదాయాన్ని బట్టి కాదు. యూపీఏ పదేళ్ల పాలనలో 2.94 కోట్ల ఉద్యోగాలిస్తే, పదేళ్లలో మోదీ 17.19 కోట్ల కొలువులిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్రపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరితే, తోకముడిచి పారిపోయారు. ప్రధాని మోదీని పెద్ద బీసీ, నన్ను చిన్న బీసీ అంటూ సీఎం బీసీ సమాజాన్ని అవమానించాడు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షల కోట్లకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలి?..’అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఓడిపోతే ముక్కు నేలకు రాస్తారా? ఆరు గ్యారంటీలు సహా మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేశారని భావిస్తే కాంగ్రెస్ పార్టీకే ఓటెయ్యాలని, సమస్యలపై నిరంతరం పోరాడుతూ సర్కార్ మెడలు వంచేది బీజేపీ అనుకుంటే తమకు మద్దతివ్వాలని సంజయ్ కోరారు. ‘కాంగ్రెస్ పాలన బాగుందనుకుంటే మీ 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుందామా? కాంగ్రెస్ ఓడిపోతే ముక్కు నేలకు రాసి సీఎం పదవి నుంచి తప్పుకుంటారా?..’అని నిలదీశారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. -
బీజేపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
-
బండి సంజయ్ పై కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: ‘ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్కు ఓటేయ్యండి’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఈ మేరకు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో జత చేసింది కాంగ్రెస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టే విధంగా బండి సంజయ్ కామెంట్స్ ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ ను పాకిస్తాన్ పోలుస్తూ కామెంట్స్ చేయడాన్ని ప్రధానంగా పేర్కొంది. బండి సంజయ్ పై , బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది కాంగ్రెస్. కాగా, ఈరోజు(మంగళవారం) కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గా అభివర్ణించారు బండి సంజయ్, ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయ్యాలని, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇంకా బండి సంజయ్ ఏమన్నారంటే.. బీఆర్ఎస్ కులగణనకు అనుకూలం. బీఆర్ఎస్ 51 శాతం బీసీ జనాభా, కాంగ్రెస్ చేస్తే 46 శాతం లెక్క.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు..?. 12 శాతం ముస్లిం జనాభాకు, 10 శాతం రిజర్వేషన్ ఇస్తే.. 80 శాతం లాభం వారికే జరుగుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదు. సీబీఐ విచారణ కోరండి, మేము అరెస్టు చేస్తాం. ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే. కారు రేస్లో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు అన్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసు ఎందుకు ఇస్తలేరు?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలు విచారణ ఎందుకు బయట పెట్టడం లేదు..?. కేసీఆర్కు నోటీసు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్కు లేదు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు?. సీఎం రేవంత్ అరెస్టు అయింది.. జైల్లో ఉంది.. జన్వాడ కేసులోనే.. బీఅర్ఎస్, కాంగ్రెస్ది చీకటి ఒప్పందం. 15 వేల కోట్ల రూపాయలే మూసీ ప్రక్షాళన అంచనా. రాబర్ట్ వాద్రా కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయం. అధి నాయకురాలు అల్లుడి ఆనందం కోసం మూసీ ప్రక్షాళన అంచనా లక్ష కోట్లకు పెంచింది సీఎం రేవంతే. నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 20 వేల ఉద్యోగాల కోసమైతే.. 51 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఎలా చెబుతున్నారు..?’’ అని బండి సంజయ్ నిలదీశారు. -
కాంగ్రెస్ను చిత్తుగా ఓడించే అవకాశం బీజేపీకి ఇవ్వాలి: బండి సంజయ్
-
పాక్ గెలవాలంటే కాంగ్రెస్కు ఓటేయ్యండి: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ‘ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్కు ఓటేయ్యండి’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచి నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలు తీర్చుతున్నాం. అల్ఫోర్స్ వార్షికోత్సవ సభలాగా నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు.‘‘బీఆర్ఎస్ కులగణనకు అనుకూలం. బీఆర్ఎస్ 51 శాతం బీసీ జనాభా, కాంగ్రెస్ చేస్తే 46 శాతం లెక్క.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు..?. 12 శాతం ముస్లిం జనాభాకు, 10 శాతం రిజర్వేషన్ ఇస్తే.. 80 శాతం లాభం వారికే జరుగుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదు. సీబీఐ విచారణ కోరండి, మేము అరెస్టు చేస్తాం. ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే. కారు రేస్లో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు అన్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసు ఎందుకు ఇస్తలేరు?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలు విచారణ ఎందుకు బయట పెట్టడం లేదు..?. కేసీఆర్కు నోటీసు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్కు లేదు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు?. సీఎం రేవంత్ అరెస్టు అయింది.. జైల్లో ఉంది.. జన్వాడ కేసులోనే.. బీఅర్ఎస్, కాంగ్రెస్ది చీకటి ఒప్పందం. 15 వేల కోట్ల రూపాయలే మూసీ ప్రక్షాళన అంచనా. రాబర్ట్ వాద్రా కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయం. అధి నాయకురాలు అల్లుడి ఆనందం కోసం మూసీ ప్రక్షాళన అంచనా లక్ష కోట్లకు పెంచింది సీఎం రేవంతే. నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 20 వేల ఉద్యోగాల కోసమైతే.. 51 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఎలా చెబుతున్నారు..?’’ అని బండి సంజయ్ నిలదీశారు. -
బీసీలపై పెద్ద కుట్ర.. బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తప్పు తప్పు అంటూ బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి.. ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలంటూ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.‘‘రాష్ట్ర పార్టీ నేతలకు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు. బీసీలు మౌనంగా ఉంటే మీకే నష్టం. బీసీలు నిలదీస్తే.. తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్లో రెండు వర్గాల వారు కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి కొస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘కేసీఆర్ ఒక్క రోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారు. ఆ వివరాలు బయటకు చెప్పకుండా దాచి పెట్టుకున్నారు. రాజకీయాలకు ఆ వివరాలను కేసీఆర్ వినియోగించుకున్నారు. కానీ మేము అలా చేయలేదు. ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే చేశాం. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే తప్పుడు సర్వే. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే 86 కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారు. మేము చేసిన సర్వేను కొందరు తప్పుపడుతున్నారు. ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుల్లో కేసులు వేసి కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంటుంది. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేశాంమోదీ బీసీ అని చెప్పుకుంటారు. 2011లో కాంగ్రెస్ చేసిన బీసీ సర్వే లెక్కలు బయట పెట్టాలి. బండి సంజయ్కు ప్రేమ ఉంటే ఆ లెక్కలు బయట పెట్టండి. బీసీలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని బయట పెట్టడం లేదు. ప్రతీ రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తే దేశం మొత్తం చేయాల్సి వస్తుంది. బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు వారి వివరాలు నమోదు చేసుకోలేదు. 50 శాతం ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్ల భయం. అందుకే బీసీల సర్వేకు వారు సహకరించడం లేదు. కేసిఆర్ నాలుగు కేటగిరీల్లో లెక్కలు తీస్తే మేము ఐదు కేటగిరీల్లో వివరాలు తీశాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘తప్పుడు లెక్కలు అని తప్పుడు మాట్లాడొద్దు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పండి. మేము పారదర్శకంగా సర్వే చేశాం. ఇది చరిత్రలో నిలిచి పోతుంది. మేము చేసిన సర్వే దేశానికే ఆదర్శం. సర్వే లెక్కలు బయట పెట్టొద్దని నా మీద కొందరు ఒత్తిడి కూడా తెచ్చారు. అయినా నేను పట్టించుకోలేదు. మన లెక్కలు తప్పని కొందరు తప్పుడు ప్రచారం చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉండటం సరికాదు. రాహుల్ గాంధీ బీసీ కులగణనకు డిమాండ్ చేస్తే మోదీకి నష్టం. మోదీ పదవి పోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి పదవులు పోతాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి సర్వే తప్పు అనడం కాదు. ఎక్కడ తప్పు ఉందో చూపించండి. ఇదంతా బీసీలపై జరుగుతున్న పెద్ద కుట్ర. సర్వే లెక్కల ప్రకారం ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నా’’సెకండ్ ఫేజ్ సర్వే పూర్తి అయిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పిస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జనాభా లెక్కలలోనే లేరు. వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండి. లెక్కలు చెప్పకుండా ఫామ్ హౌస్ లో పన్నోడు మంచోడు. మీ లెక్కలు తీసిన నేను మంచోడిని కాదా. మీరు కూడా నన్ను విలన్గా చూస్తే ఎలా?. అసెంబ్లీలో సర్వేకు చట్టబద్ధత కల్పించే వరకే నా బాధ్యత.. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక బీసీల మీదే ఉంది. బీజేపీకి నా డిమాండ్. కేంద్రం చేసే జనగణనలో కుల గణన చేయండి. నేను చెప్పిన లెక్కలు తప్పని తేల్చండి. మార్చి 10 వరకు అన్ని కుల సంఘాల సమావేశాలు పెట్టుకోండి. తీర్మానాలు చేయండి. బీసీల లెక్కలు మోదీ వద్దంటున్నారు కాబట్టే.. బండి సంజయ్ వద్దు అంటున్నారు.‘‘మనం చేసిన సర్వేకు ప్రజామోదం కూడా ముఖ్యం. అన్ని సామాజిక వర్గాల సమావేశాలు పెట్టీ తీర్మానాలు చేయండి. యూనివర్సిటీల్లో విద్యార్థులు సెమినార్ లు నిర్వహించండి. బలహీన వర్గాలకు ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్, ఇదే బైబిల్. ఇంతకంటే మించిన పాలసీ డాక్యుమెంట్ ఏది లేదు.’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
-
బీసీ రిజర్వేషన్ వార్
-
ఎల్ఆర్ఎస్ పేరుతో 50కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే కేంద్ర బడ్జెట్పై చర్చకు రావాలని సవాల్ విసిరారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా?. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఇదే(ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియో). ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు?. కాంగ్రెస్ పార్టీ బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్పై దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయండి. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 27న మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతోపాటు వరంగల్- ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. -
ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసిందో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. 2025–26 కేంద్ర బడ్జెట్లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై సంజయ్ గురువారం ఓ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం ఉండబోదని చెబుతున్నారు కదా దానికి ఆధారాలున్నాయా అన్న ప్రశ్నకు సంజయ్ సమాధానమిస్తూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. టాప్–5 మంత్రులు తప్ప రేవంత్రెడ్డి ప్రభుత్వంపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడం లేదు కాబట్టి తాము ప్రజల్లో తిరగలేకపోతున్నామంటూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం’అని చెప్పారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెబుతున్నారు కదా దానిపై ఏమంటారన్న ప్రశ్నకు... ‘బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారు... ఇక ఆ పార్టీ యాడుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ చీకటి మిత్రులు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్తో రాజీ కుదుర్చుకున్నది నిజం కాదా? మాపై కేసులు పెట్టొద్దు... కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అడ్డుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారు. కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేందుకే అభ్యర్థులను నిలబెట్టకుండా కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు’అని సంజయ్ బదులిచ్చారు. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కులగణన తప్పులతడక ‘కులగణన తప్పులతడక... జనాభా లెక్కలే తప్పు. రాష్ట్రంలో 3.95 కోట్ల ఆధార్ కార్డులుంటే... జనాభా 3.7 కోట్లు ఎట్లా ఉంటుంది? నిజానికి 4.30 కోట్ల జనాభా ఉంటే 60 లక్షల ప్రజలు ఏమైపోయారు?’అని సంజయ్ చెప్పారు. ‘బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్ధం. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది’అని మండిపడ్డారు.దేశ బడ్జెట్లో ఒక రాష్ట్రం పేరును ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి నిధులివ్వలేదనడం సరికాదన్నారు. కృష్ణా జలాల వాటా లో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీఆర్ ఎస్లేనని, ఈ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొదటి ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు. -
140 మంది భారతీయులను విడిపిస్తాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి పేరుతో బ్యాంకాక్ వెళ్లి అక్రమంగా మయన్మార్లో చిక్కుకుపోయిన 140 మంది భారతీయ యువకుల కుటుంబాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో విదేశాంగశాఖ స్పందించింది. బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్రమంగా సైబర్ కేఫ్ల నిర్వహణ, అక్కడ యువకులను నిర్బంధించడం, హింసించడం వంటి ప్రతికూల చర్యలతో మయన్మార్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. మాయ్ సాట్ ద్వారా ఇండియాకు.. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో మయన్మార్ అధికారు లు భారత దౌత్య కార్యాలయానికి సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోపు బాధితులను ఇండియాకు పంపించేందుకు దౌత్య కార్యాలయం కూడా రోడ్మ్యాప్ రూపొందించుకునే పనిలో ఉంది. వాస్తవానికి వీరిని బ్యాంకాక్ నుంచి దాదాపు 505 కి.మీ.ల దూరంలో ఉన్న మయన్మార్లోని మైవాడీ జిల్లాకు బలవంతంగా తరలించారు. తిరిగి వీరిని బ్యాంకాక్ కాకుండా.. మైవాడీలోని మోయే నది దాటి కేవలం 11 కి.మీ.ల దూరంలో ఉన్న థాయ్లాండ్లోని మాయ్సాట్ ప్రావిన్స్ ద్వారా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భారత యువకులంతా మైవాడీలోని కేకే2 పార్క్లో బందీలుగా ఉన్నారు.‘సాక్షి’కి మెయిల్మయన్మార్లోని మైవాడీ జిల్లాలో భారతీయ యువకులు చిక్కుకున్న విషయమై ‘సాక్షి’దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ విషయమై సాక్షి మయన్మార్ రాజధాని యంగాన్లోని దౌత్య కార్యాలయాన్ని సంప్రదించింది. బాధితుల పాస్పోర్టులు పంపి వారిని కాపాడాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన దౌత్య కార్యాలయం కాన్సులర్ ఆర్సీ యాదవ్ బందీల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం ‘సాక్షి’కి మెయిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు స్థానిక అధికారులతో చర్చలు మొదలుపెట్టామని తెలిపారు. -
‘తకిట తధిమి తందాన’ హిట్ కావాలి: కేంద్రమంత్రి బండి సంజయ్
తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ చేతుల మీదుగా "ఫస్ట్ లుక్ పోస్టర్" ఆవిష్కారం జరుపుకున్న వినూత్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "తకిట తధిమి తందాన" చిత్రం తాజాగా భాజపా అగ్రనేత - కేంద్రమంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టీజర్ విడుదల జరుపుకుంది. యూత్ తోపాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకునేలా టీజర్ ఉందని ప్రశంసించిన బండి సంజయ్... "తకిట తధిమి తందాన" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు."మర్డర్" ఫేమ్ ఘన ఆదిత్య - కొత్తమ్మాయి ప్రియ జంటగా.. యువ ప్రతిభాశాలి రాజ్ లోహిత్ దర్శకత్వంలో ఎల్లో మ్యాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై.. చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన "తకిట తదిమి తందాన" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సినెటేరియా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో విడుదల కానుంది. -
‘కేంద్ర మంత్రులే అలా మాట్లాడి చిచ్చుపెడుతున్నారు’
హైదరాబాద్: కేంద్ర మంత్రులైన బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడటం సరైంది కాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. బీసీలలో మైనార్టీలను కలిపారని వారు చెప్పడం సరికాదన్నారు. సాధారణ వ్యక్తి చదువుకుని మాట్లాడితే వదిలేయొచ్చు..కానీ కేంద్ర మంత్రులే అలా మాట్లాడి చిచ్చు పెడుతున్నారన్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు.‘కిషన్ రెడ్డి... బండి సంజయ్ లకు పోస్టు లో వివరాలు పంపిస్తున్న.హంటర్ కమిషన్ ..1882 లో వేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. 1918 లో మిల్లర్ కమిషన్ .. స్టడీ చేసింది. 1953 లో కాక కాలేకర్ రిపోర్ట్ లో కూడా కొన్ని కులాలు బీసీ జాబితా లో ఉన్నాయి. గుజరాత్ లో కూడా obc ముస్లిం లు ఉన్నారు.ఎక్కడా లేదు..తెలంగాణ లో ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులే కదా... బీసీ ల జాబితాలో ఉన్న ముస్లిం లను తొలగించి..గుజరాత్ లో కూడా తొలగించండి. మతంలో కూడా పేదరికం లేదా..? , మీరు పిలిస్తే...మీ పార్టీ కార్యాలయంకి వచ్చి కూడా ప్రజెంటేషన్ ఇస్తా. కానీ మాతల మధ్య చిచ్చు పెట్టొద్దు. మనం అంతా భారతీయులం. వెనకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా...వెనకబడిన తరగతులు.బీసీల మీద అంత ప్రేమ ఉంటే... బీసీ కుల గణన చేయించండి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. -
రాహుల్ గాంధీపై బండి సంజయ్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్
-
ఉద్యోగాల ఎర.. ‘సైబర్’ వెట్టిలో చెర!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్స్టర్లు ఆన్లైన్లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.విమాన టికెట్ పంపి మరీ..కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్రెడ్డి పాస్పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.గత్యంతరం లేకపోవడంతో..అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. అయితే పాస్పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్లో పరిస్థితులు మారడంతో స్కామ్స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్కు, థాయ్లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.కాపాడాలని వేడుకోలు..అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్ను సంపాదించిన మధుకర్రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు. -
రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కులం, మతంపై చర్చ జరుగుతుండటం దురదృష్టకరం. 1994లో మోదీ కులాన్ని బీసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.‘‘రాహుల్ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్. రాహుల్ తాత ఫిరోజ్ఖాన్ గాంధీ. రాహుల్ మాత్రం బ్రాహ్మణ్ అంటున్నారు. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే.. రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారు. తండ్రి కులమే కొడుకుకు వస్తుందన్న కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ పక్కా ఇండియన్’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.10 శాతం ముస్లింలను బిసీలుగా మార్చారు. బీసీలకు ఇచ్చేది 32 శాతమే. 42 శాతం ఎలా అవుతుంది?. లవ్ జిహాదీ, మత మార్పిడిలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం రావాలి. హిందూ బీసీలకు 42 శాతం ఇస్తే కేంద్రం సహకరిస్తుంది. మమ్మల్ని మతతత్వ వాదులు అన్నా పర్వాలేదు’’ అని బండి సంజయ్ చెప్పారు. -
రేవంత్.. రాహుల్ గాంధీ కులమేంటి?: బండి సంజయ్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్.. ప్రధాని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు కేంద్రమంత్రి బండి సంజయ్. దేశ ప్రధాని ఎవరైనా ఆయనను బాధ్యతతో గౌరవించాలి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశ ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాలి. రేవంత్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మోదీ కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో 27 మంది బీసీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా ప్రధాని మోదీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 46 శాతం బీసీలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంత మంది బీసీలను మంత్రులుగా చేశారు?. అగ్రవర్ణాల్లో పేదలను మోదీ గుర్తించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రాహుల్ కుటుంబం గురించి చర్చ జరగాలి. కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే. రాహుల్ గాంధీ కులం, మతం, దేశం మీద.. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా?. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ చేయడానికే ఈ చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలపై మాట్లాడటం లేదు. 317 జీవోపై మాట్లాడింది కేవలం బీజేపీ మాత్రమే. నిరుద్యోగ మార్చ్ చేసింది బీజేపీనే పార్టీనే. ఉద్యోగుల కోసం మేము పోరాటం చేశాం.పది శాతం ముస్లీంలను తీసివేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి పంపితే మోదీని ఒప్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలలో ముస్లింలే గెలిచే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఘోరమైన తప్పిదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. కుల గణన సక్రమంగా చేస్తే రీ సర్వే ఎందుకు చేస్తారు?. కాంగ్రెస్ కుల గణన తప్పుల తడకగా ఉందన్నారు.ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘వ్యక్తి కోసం పార్టీ రూల్స్ మారవు. పార్టీ అంతర్గతవిషయాల్లో కులాలు చూడరు. ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే ఆయనతో రోజు మాట్లాడతాను’ అని అన్నారు. -
60 లక్షల మందిని ఏం చేశారు?: బండి సంజయ్
సాక్షి,నల్గొండజిల్లా:తెలంగాణలో జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి9) నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు.‘దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులే కరువైంది తెలంగాణలో మాత్రమే.కాంగ్రెస్,బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. కాళేశ్వరం కేసులో కేసీఆర్,హరీష్ రావు జైలుకి పోతారని అన్నారు ఏమైంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు,ఫాంహౌస్ కేసులో జైలు అన్నారు ఏమైంది.ఈ ఫార్ములా కేసులో సుప్రీం కోర్టు చెప్పినా ఎందుకు విచారణ ఆగింది.నిరుద్యోగ భృతి నాలుగువేలు ఏమైంది. ఒక్కో నిరుద్యోగికి కాంగ్రెస్ ప్రభుత్వం 56 వేల అప్పు ఉంది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైంది. తెలంగాణలో విద్యాశాఖ మంత్రే లేడు.స్కూళ్లలో చాక్పీసులు కొనుగోలుకు నిధులు లేవు. విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్స్ చేతిలోకి వెళ్లింది. మోదీ ప్రభుత్వం అంబేద్కర్,భగత్ సింగ్,ఆజాద్ వీర్ సావర్కార్ను తయారు చేయాలని అనుకుంటోంది.రేవంత్ సర్కార్ చండ్ర పుల్లారెడ్డి లాంటి నక్సలైట్లను తయారు చేయాలనుకుంటోంది. 317 జీవోపై కొట్లాడి జైలుకు పోయింది మేమే. కులగణన పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. కేసీఆర్ సకల జనులసర్వే చేయించి రిపోర్ట్ను సంకలో పెట్టుకున్నాడు.కేసీఆర్ సర్వేలో బీసీల శాతం 51 ఉంటే రేవంత్ సర్వేలో 46 శాతం వచ్చింది.కుల గణనే ఒక బోగస్.తెలంగాణలో ఓటర్లు 3.34 కోట్లు ఉంటే జనాభా 3.7 కోట్లు ఉండటం ఏంటి. తెలంగాణలో 4.3 కోట్లు జనాభా ఉండాల్సి ఉంది.మిగతా 60 లక్షల మందిని కాంగ్రెస్ హత్య చేసిందా? ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ముప్పై మంది బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లీంలు గెలిచారు.బీసీ సంఘాలు ఎటుపోయాయి. తెలంగాణలో హిందువులు అడుక్కోవాలా. రేవంత్ రెడ్డి గ్యాంగ్,ఓవైసీ కుటుంబం హిందువులను రాచిరంపాన పెడుతున్నారు’ అని బండి సంజయ్ ఫైరయ్యారు. -
ఢిల్లీలో కాంగ్రెస్ కు మిగిలింది గాడిదగుడ్డు: బండి సంజయ్
-
‘ఆప్’ను చీపురుతో ఊడ్చేశారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలను ప్రజలు దూరంగా పెట్టారు. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. భారీ విజయం అందుకునే దిశగా వెళ్తున్నాం.తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి ఫలితమే రిపీట్ అవుతుంది. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలోని మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలి. శాసనసభలో మీ సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే’ అని చెప్పుకొచ్చారు. -
రేవంత్.. ఇదేమైనా పిల్లల ఆటనా?: బండి సంజయ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ను జీవితాంతం అవమానించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు కేంద్రమంత్రి బండి సంజయ్. గద్దర్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా సీఎం రేవంత్ చిల్లర రాజకీయాలు మానేసి ఆరు గ్యారంటీలు.. 420 నకిలీ వాగ్దానాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని హితువు పలికారు. దీంతో, మరోసారి బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్కు కౌంటరిచ్చారు. ఈ సందర్బంగా బండి సంజయ్ ట్విట్టర్లో..‘పద్మా అవార్డులు ఇవ్వనందుకు నాంపల్లి ఏరియా పేరు మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు నవ్వకుండా ఉండలేకపోతున్నాను. ఇదేమైనా చిన్న పిల్లల ఆటా సీఎం చెప్పాలి. గద్దర్ను జీవితాంతం అవమానించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా?. గద్దర్పై ఉపా కేసు ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీనే కదా. గద్దర్ పై 21 కేసులు పెట్టింది ఎవరు?. గద్దర్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా.Couldn’t help but laugh at Congress CM who thinks renaming a street is some kind of revenge for not giving a Padma award. Is this child’s play?Who insulted Gaddar throughout his life? Congress.Who used Gaddar as an interlocutor and called naxals for meeting? Congress.Who…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 31, 2025పార్టీలను పక్కన పెడితే దుద్దిల్ల శ్రీపాదరావు.. చిట్టెం నరసింహారెడ్డి వంటి నాయకులు.. ఇంకా చాలామంది ఐపీఎస్ అధికారులు.. పోలీసు కుటుంబాలు నక్సలిజానికి బాధితులు కాదా?. తెలంగాణ హోంమంత్రిగా కూడా ఉన్న సీఎం మాట్లాడే మాటలు ఇవేనా?. సీఎంకు తన ఈగో ప్రదర్శించాలనుకుంటే నాంపల్లి పేరు మార్చుకోవచ్చు. అలాగే సీఎంకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మొదట హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా.. నిజామాబాద్ పేరును ఇందూరుగా.. మీ సొంత జిల్లా పేరుని పాలమూరుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాను. ఇకనైనా సీఎం చిల్లర రాజకీయాలు మానుకుని ఆరు గ్యారంటీలు.. 420 నకిలీ వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం మీ జాగీరు కాదు మీరిచ్చిన హామీల అమలు చేసేంత వరకు బీజేపీ మిమ్మల్ని వెంటాడుతుంది’ అంటూ హెచ్చరించారు. -
ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా ఆపొద్దు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా డబ్బులు నిలిపి వేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇది కొనసాగుతున్న పథకమే.. ఎన్నికల పేరుతో రైతుల పొట్టకొట్టకండి అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అర్హులందరికీ రేషన్కార్డులు ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ ప్రకటనలో.. ‘రైతు భరోసా డబ్బులు వేయండి. ఇది కొనసాగుతున్న పథకమే. ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్టకొట్టకండి. ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితం. రైతు భరోసాతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశమే లేదు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగొట్టారు. అసలే అన్నదాతలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేయాల్సిందే. రేషన్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాల్సిందే.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. రైతు కూలీల అకౌంట్స్లో వేయాల్సిందే. ఎన్నికల కోడ్ సాకుతో ఆపితే ఊరుకునేది లేదు. ప్రభుత్వ చేతకానితనాన్ని ఎన్నికల కోడ్ పేరుతో ముడి పెట్టకండి. ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను కొనసాగించండి. అవసరమైతే బీజేపీ పక్షాన ఎన్నికల సంఘానికి లేఖ పంపిస్తాం. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించండి. అవసరమైతే అందరం కలిసి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేద్దాం’ అని కామెంట్స్ చేశారు. -
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
-
‘బండి సంజయ్.. నువ్వు కార్పొరేటర్ కాదు కేంద్రమంత్రి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుడు బండి సంజయ్ కార్పొరేటర్ కాదు.. కేంద్రమంత్రి అని గుర్తు పెట్టుకోవాలని చురకలంటించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇదే సమయంలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కేంద్రమంత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడటానికి ఆయనేం కార్పొరేటర్ కాదు. పద్మశ్రీ అవార్డుల విషయం పార్లమెంట్ జీరో అవర్లో లేవనెత్తుతాను. అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ నేతలను ఎంపీలుగా గెలిపించారు. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు?. జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలన్నారు. కేంద్రం బీహార్, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు. అందుకే బడ్జెట్లో మొండి చేయి చూపిస్తున్నారు. కిషన్ రెడ్డి దావోస్ పర్యటనను, కంపెనీలపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లారో కేటీఆర్ను అడిగితే వ్యంగ్యంగా చెప్పాడు. ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని రాష్ట్రానికి పెద్దన్నలాగా ఉండమన్నారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లైఫ్ లైన్ ఆర్ఆర్ఆర్కు 45వేల కోట్లు అవసరం. ఆర్ఆర్ఆర్, మెట్రోతో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు. నల్లగొండలో రైతులు ఎవ్వరు కేటీఆర్ ధర్నాను పట్టించుకోలేదు. మూసీ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ఎంపీలందరూ పార్లమెంట్లో కొట్లాడాలి. మహారాష్ట్ర కంటే మన రాష్ట్రం ఎక్కువగా కేంద్రానికి జీఎస్టీ పన్నులు కడుతోంది. పదేళ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది. హరీష్ రావు ముందు కేసీఆర్ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
-
పొలిటికల్ హీట్.. రేవంత్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యద్ధం నడుస్తోంది. తెలంగాణలో రేషన్ కార్డులపై, రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) లేఖ రాశారు. దీంతో, మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది.కేంద్రమంత్రి బండి సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్బంగా లేఖలో..‘తెలంగాణలో రేషన్కార్డులపై, రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం పేరును కొనసాగించాలని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అర్హులకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు.జనవరి 26 నుంచి అమలు చేసిన నాలుగు పథకాలు.. రాష్ట్రంలో మూడు శాతం మందికి కూడా చేరలేదని తెలిపారు. అలాగే, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పిన రైతు భరోసా ఎక్కడ? అని ప్రశ్నించారు. 10లక్షల మంది రైతు కూలీల కుటుంబాలకు ఇస్తామని చెప్పిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు?. కొత్తగా ఇస్తామని చెప్పిన 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారని లేఖలో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. మోదీ సర్కారు మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో కచ్చితంగా పెట్టాలని, లేదంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. అవసరమైతే కేంద్రమే పేదలకు ఉచిత బియ్యం పంపిణీపై ఆలోచిస్తుందన్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల బాటలో నడుస్తోందని ఆరోపించారు. ఫాంహౌస్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్ కేసులన్నీ మరుగునపడ్డాయని విమర్శించారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు అన్ని ఆధారాలున్నాయని సీఎం చెప్పిన తర్వాత కూడా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం హాట్ టాపిక్గా మారింది. -
అర్హులకే పద్మ అవార్డులు వచ్చాయి: బండి సంజయ్
-
‘బండి సంజయ్.. బీజేపీ భావజాలం ఉంటేనే అవార్డ్ ఇస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. అలాగే, నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వొచ్చు కానీ.. పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికి రారా? అని ప్రశ్నలు సంధించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మా అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా. నక్సలైట్ భావజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. మావోయిస్టులకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వొచ్చు కానీ, పద్మా అవార్డులకు పనికి రారా?.లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికోసం ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే ఈటల కూడా బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడా?. ఈ విషయం బండి సంజయ్ చెప్పాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు గద్దర్ను అవమానిస్తున్నట్లు ఉన్నాయి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో బండి సంజయ్కు ఎంపీ చామల కిరణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎంపీ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ..‘గద్దర్ భావజాలానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం. బీజేపీ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డ్ ఇస్తారా?. గద్దర్ అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. బీజేపీ పాట పాడిన వారు.. బీజేపీ గొంతు పలికిన వారికి ఇకపై అన్నీ అన్నట్టు బండి సంజయ్ మాటలు ఉన్నాయి. గద్దర్పై బండి సంజయ్ మాట్లాడిన మాటలను విత్ డ్రా చేసుకోవాలి అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ దగ్గర ఆయన దిష్టి బొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ సందర్బంగా గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో గద్దర్ అభిమానులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: గద్దర్కు పద్మ అవార్డుపై బండి సంజయ్ వ్యాఖ్యలు -
బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం(జనవరి26) జరిగిన సెమినార్లో కవిత మాట్లాడారు.‘నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా.ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని. కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదా. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదు. పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారు.. నేను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్న. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి.కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్లో మతకల్లోలాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు. ఆసిఫాబాద్ లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదు... ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు కనీసం అటు వైపు చూడలేదు. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు’అని కవిత ఫైరయ్యారు.కాగా, శనివారం కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై ఇందిరమ్మ బొమ్మ పెడితే కేంద్రం నుంచి ఇళ్లు ఇవ్వమని, ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదీ చదవండి: బీజేపీపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బండి సంజయ్(Bandi Sanjay) ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా?.. ఎలా ఇవ్వరో తామూ చూస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.10 నెలల కాలంలో జీఎస్టీ రూపంలో రూ.37 వేల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసింది. మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత? అంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు?. వీల్లేమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా?. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయన్న కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా?’’ అంటూ పోన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ప్రధాని ఫొటో పెడితేనే నిధులు..కాగా, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తామంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్ స్మార్ట్సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. -
ప్రధాని ఫొటో పెడితేనే నిధులు..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్ స్మార్ట్సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్లో నగర మేయర్ సునీల్రావు, పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్రెడ్డికి గురువు కేసీఆరేనని, అందుకే.. ఆయన బాటలోనే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ‘సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలను తొలుత కేసులతో భయపెట్టి, ఆపై కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వగానే.. వాటిని పక్కనబెడుతున్నారు. గతంలో పెట్టిన కేసులన్నీ ఇలాగే నీరుగార్చారు’అని ధ్వజమెత్తారు. కంపెనీలు, నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలి‘పార్టీలకు చందాలిచ్చిన గ్రీన్కో లాంటి సంస్థపై ఏసీబీ దాడులు చేయడం రాష్ట్రానికి నష్టం. ఫలితంగా పలు కంపెనీలు రాష్ట్రం నుంచి తరలివెళ్తున్నాయి. అసలు 2014 నుంచి రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, నిధులు, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చినా.. కరీంనగర్కు స్మార్ట్సిటీ ప్రాజెక్టు ఇచి్చనా, ఏ కార్యక్రమానికీ నన్ను పిలవలేదు. బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతిమయం. సునీల్రావు చేరికతో రాబోయే బల్దియా ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ విజయబావుటా ఎగరేస్తుంది’అని సంజయ్ అన్నారు. అనంతరం సునీల్రావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి గంగుల కమలాకర్పై పలు ఆరోపణలు చేశారు. -
బండి సంజయ్పై జగ్గారెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై చేసిన వ్యాఖ్యలకుగాను కేంద్ర మంత్రి బండి సంజయ్పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయమై జగ్గారెడ్డి శనివారం(జనవరి25) మీడియాతో మాట్లాడారు.‘బండి సంజయ్కి రాజకీయ అనుభవం లేకుండానే మినిస్టర్ పోస్ట్ వచ్చింది. బండి సంజయ్కి అనుభవం లేదు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడుతా అంటే కుదరదు. కొందరు నేతలు న్యూస్ బ్రేకింగ్ కోసం మాట్లాడుతున్నారు. బండి సంజయ్ బ్రేకింగ్ లీడర్.. ఆయన మాట్లాడితే తలా తోక ఉండదు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వారి ఫోటోనే ఉంటది. మోదీ ఫోటో పెట్టకపోతే పైసలు ఇయ్యరా.బండి సంజయ్ తెలంగాణ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బియ్యానికి పైసలు ఇయ్యమని బండి సంజయ్ ఎలా అంటారు. ఇళ్ళ కు నిధులు ఇవ్వమని బెదిరిస్తారా...ఇంత డైరెక్ట్ గా బెదిరింపులా నిధులు ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తున్నారా..తెలంగాణ ప్రజలకే కదా. మోదీకి గులాం చేస్తేనే నిధులు ఇస్తారా. బండి సంజయ్ వాఖ్యలను కిషన్ రెడ్డి సమర్దిస్తారా’చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. -
బండి సంజయ్కి టీపీసీసీ చీఫ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్రమంత్రి బండి సంజయ్కి పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(జనవరి25) మహేష్కుమార్గౌడ్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ని గౌరవిస్తాం. ఇంధిరమ్మ త్యాగం ముందు మీరు, మీ మోదీ ఎంత. ఇంధరమ్మను బండి సంజయ్ అవమానిస్తున్నారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని రేపు నాలుగు పథకాలు ప్రారంభించి మరోసారి నిరూపించుకోబోతున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ జరుపుకోవాలి. పదేళ్లలో బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో అయినా గత పాలకులకు కనివిప్పు కలగాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అనుచరులకే సంక్షేమ పథకాలు వచ్చాయి. మా ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలే లబ్ధిదారుల లిస్ట్లో పేరు లేదని ఫిర్యాదు చేస్తున్నారు. మేం ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. తప్పు చేస్తే మాత్రం చర్యలు తప్పవు’అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. కాగా, ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్లో ఉన్న సునీల్రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్లో మీటింగ్లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారని బండి సంజయ్ చెప్పారు. -
ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్లో ఉన్న సునీల్రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్లో మీటింగ్లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారు..కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనకుండా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి అవినీతే తప్ప మంచి లేదు. ఇప్పుడు పెనం మీద నుంచి పొయిలో పడినట్లయింది. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తుండు. డ్రగ్స్ కేసు, ఈ-ఫార్ములా కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇలా అన్ని కేసులు పేర్లతో డైవర్షన్ తప్ప చేసిందేమీ లేదు. ఇప్పుడు దావోస్ ఇష్యూ ముందుకు తెచ్చారు...గ్రీన్కో వంటి సంస్థలపై దాడులు చేస్తే ఇవాళ తెలంగాణాకు వచ్చేందుకు భయపడుతున్నాయి. గ్రీన్కో నుంచి కాంగ్రెస్కు పైసలు ముట్టినై. 2014 నుంచి ఇప్పటివరకు దావోస్లో జరిగిన ఒప్పందాల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చియో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ? -
పసుపు రైతు కల సాకారం
నిజామాబాద్ సిటీ: దేశంలోని పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ బోర్డును ఎంపీ అర్వింద్తో కలిసి ఢిల్లీలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా ప్రారంభించారు. పసుపు బోర్డు తొలి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డిని నియమించారు. బోర్డును ఏర్పాటు చేసినందుకు పీయూష్ గోయల్కు ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు తెలిపి, పసుపు కొమ్ముల దండను బహూకరించారు. నిజామాబాద్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో జిల్లాకు బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. పసుపు ఉత్పత్తులు పెరుగుతాయి: గోయల్సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి పసుపును ప్రత్యేక బోర్డుగా ఏర్పాటు చేయడంతో పసుపు, పసుపు ఉత్పత్తులు బాగా పెరుగుతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. బోర్డును నిజామాబాద్లోనే ఏర్పాటు చేయాలని ఎంపీ అర్వింద్ ప్రధాని మోదీని సైతం ఒప్పించారని అభినందించారు. ప్రధాని మాట ఇస్తే నెరవేరుస్తారు: బండి సంజయ్ప్రధాని నరేంద్రమోదీ వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ అర్వింద్ కొన్నేళ్లుగా శ్రమించి విజయం సాధించారని ప్రశంసించారు. ఆయన కరీంనగర్ నుంచి ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు.ప్రజలు రుణపడి ఉంటారు: ఎంపీ అర్వింద్ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటు జిల్లా రైతుల దశాబ్దాల కల అని ఎంపీ అర్వింద్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చానని తెలిపారు. తెలంగాణ రైతులు ప్రధాని మోదీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను జాతీయ పసుపు బోర్డు తొలి చైర్మన్గా నియమించడం తన అదృష్టమని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. నిజామాబాద్లో వర్చువల్ కార్యక్ర మంలో పల్లె గంగారెడ్డితో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి: పసుపు బోర్డు ఏర్పాటు తో నిజామాబాద్ జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. గుంటూరులో పొగాకు బోర్డు, కేరళలోని కొచ్చిలో స్పైసెస్ బోర్డు ఉంది. ఇప్పుడు పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చే శారు. ప్రపంచంలో పండించే మొత్తం పసుపులో మన దేశంలో నే 62% పండుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత నిజా మాబాద్లోనే అత్యధికంగా నాణ్యమైన పసుపు పండిస్తున్నారు. -
‘కాంగ్రెస్ వినాశకర పాలన.. ఏడాది మొత్తం దారుణాలే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్(bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ(AICC) ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ దారులు, విధ్వంసకారులు, అబద్ధాల పార్టీగా మారిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్(Congress Party) వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సంజయ్ ట్విట్టర్లో..‘ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు. మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. అంతేకాకుండా ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం గర్భిణీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు. ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనలో అత్యాచార కేసులు 28.94%, మహిళల హత్యలు 13%పెరిగాయి. కిడ్నాప్లు, అపహరణలు 26% పెరిగాయి. కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది?. మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోంది. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారు. కాంగ్రెస్ దోపిడి దారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. AICC is filled with fake news peddlersTelangana women didn’t get even ₹1 from Congress govt. Instead of empowering women, they are crushing them - demolishing homes, targeting vegetable vendors, and forcing pregnant women onto the streets.This isn’t governance - it’s… https://t.co/mfkOGU1rF7— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 8, 2025 -
కేసీఆర్ .. మీకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?
సాక్షి,హైదరాబాద్ : రైతు భరోసా చెల్లింపుల కోసం భూముల్ని తాకట్టుపెట్టి వేలకోట్లు అప్పుగా తెచ్చారు. మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలిందని కాంగ్రెస్పై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పోలిటిక్స్. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్ (kcr).ఆయన బాటలోనే రేవంత్ (revanth reddy) ప్రభుత్వం నడుస్తోంది.ఒక్కో రైతుకు ఏడాది బకాయితో కలిసి ఎకరాకు రూ.18 వేల బకాయి చెల్లిస్తారా?.70 లక్షల మంది రైతులకు రూ.12 వేల 600 కోట్లు జనవరి 26న చెల్లిస్తారా? లేదా?.రైతు భరోసా (rythu bharosa) సొమ్ము చెల్లించేందుకు టీఎస్ఐఐసీ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారు? మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలింది?లోకల్ బాడీ ఎలక్షన్లలో ఓట్లేయించుకునేందుకే అప్పు తెచ్చి రైతు భరోసా చెల్లిస్తున్నారు. ఎన్నికల తర్వాత రైతు భరోసా ఆపేయడం ఖాయం.తెలంగాణ ప్రజాలారా..కాంగ్రెస్ మోసాలను తెలుసుకోండి.ఫాంహౌజ్లో పడుకునే కేసీఆర్..మీకు ప్రతిపక్ష నేత పదవి ఎందుకు?.ప్రజా సమస్యలపై స్పందించని మీరే ప్రతిపక్ష నేత? చేతనైతే ఆ పదవిని హరీష్, గంగుల, తలసాని, జగదీష్ రెడ్డిలలో ఎవరికైనా ఇచ్చే దమ్ముందా?.ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, పేదలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయింది’అని బండి సంజయ్ ఆరోపించారు. 👉ఇదీ చదవండి : ‘రేవంత్ను వదిలిపెట్టం’ -
అల్లు అర్జున్ పై పవన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
-
‘పవన్కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనబడ్డారో?’
సాక్షి,కరీంనగర్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు.పవన్కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనబడ్డారో?. ఆరు గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకే.. అల్లు అర్జున్పై పవన్ వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్, రేవంత్రెడ్డికి మధ్య ఎక్కడో చెడింది. 14 శాతం కమిషన్ వద్ద చెడిందేమో?’ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచులతో కలిసి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘సర్పంచుల బతుకులు నిర్వీర్యం కావాడానికి బీఅర్ఎస్, కాంగ్రెస్ కారణం. బకాయిలు మొత్తం చెల్లిస్తానంటే జెండాలు పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీకి సర్పంచులు మద్దతు ఇచ్చారు. గ్రామాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చెందాయి. సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మాజీ సర్పంచులు బ్రతుకుదెరువు కొసం దుబాయ్ పోయే పరిస్థితి వచ్చింది. రూ.1300 కోట్ల సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చెయ్యాలి. గ్రామపంచాయతి ఎన్నికల్లో జెండాలు ప్రక్కన బెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ది వస్తుంది.’‘14% శాతం కమీషన్ల మీద ఈ ప్రభుత్వం నడుస్తోంది. ముగ్గురు మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారు. సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకి అడ్డాగా మారాయి. ఇక్కడి కమీషన్లతో ఢిల్లీలో కప్పం కడుతున్నారు. ఇప్పుడున్న మంత్రులందరికి ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లనే సీఎం పదవి నిలబడుతుంది’ అని ఆరోపించారు. -
‘ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించం’
నిజామాబాద్: చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడం తగదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్. మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పద్మాలయ, రామానాయుడు స్టూడియలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి చిత్ర పరిశ్రమను ప్రోత్సహించిందన్నారు.తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, ప్రభుత్వానికి అంతా సమానమన్నారు మహేష్కుమార్గౌడ్.తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయి, ఆమె కొడుకు చావుబతుకల మధ్య ఉంటే దానిపై బీజేపీ, బీఆర్ఎస్లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు.ఫార్ములా ఈ-రేస్లో అడ్డంగా దొరికిన కేటీఆర్ మొన్నటివరకూ జైలకు వెళ్లేందుకు సిద్ధమన్నారని, ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని ఎద్దేవా చేశారు.ఫ్యాన్స్కు అల్లు అర్జున్ రిక్వెస్ట్అల్లు అర్జున్కు అండగా బండి సంజయ్ -
అల్లు అర్జున్కు అండగా బండి సంజయ్
సాక్షి, ఢిల్లీ: తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కామెంట్స్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్కు బాసటగా నిలిచారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద ఘటనలో మహిళ మరణాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించారు. శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ కోరుకోవడంతోపాటు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని మరీ.. సినిమా లెవల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోంది. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచింది. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుంది. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చనిపోతుంటే ఏనాడైనా పరామర్శించారా?. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా బాధ్యత వహించారా?. మీకో న్యాయం.. ఇతరులకు ఒక న్యాయమా?. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. లేనిపక్షంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఆ కుట్రలేవో తమమీద చేసినా అధ్యక్షులం అయ్యేవాళ్లం అని చాలా మంది వచార్సార్!
-
మళ్లీ పార్టీ పగ్గాలు..?బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్:తాను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో లేనని, తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ అన్నారు. ఈ విషయమై బండి సంజయ్ ఆదివారం(డిసెంబర్ 15) మీడియాతో మాట్లాడారు.‘పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా. నాకు తెలంగాణ రాష్ట్ర పార్టీ పగ్గాలు మళ్లీ అప్పగిస్తారనేది ఊహాగానాలే. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి నాకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారు.హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి.ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నా’అని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. -
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే
సాక్షి, కరీంనగర్ జిల్లా: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగిస్తుందని.. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపి ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని.. యూపీలో ఏడు స్థానాలలో ముందంజలో ఉందన్నారు. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమినే మహారాష్ట్ర ప్రజలు నమ్మారన్నారు. మహారాష్ట్రలో హిందూ సమాజం ఐకమత్యాన్ని చాటారన్నారు.కర్ణాటక, తెలంగాణ నుంచి మహారాష్ట్రకి కాంగ్రెస్ డబ్బులు పంపింది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాలే మహారాష్ట్రలో గెలుపు వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వాస్తవాన్ని గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసింది. ఇండియా కూటమి చీలీపోవడం ఖాయం. తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఇదే గతి పడుతుంది’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.‘‘మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలను మేము ప్రచారం చేశాం. ఇప్పటికైనా తెలంగాణలో ఇచ్చిన హామీ నెరవెర్చండి.. లేదంటే మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుంది. ఇచ్చింది ముఫ్ఫై వేల నోటిఫికేషన్ లు.. చెప్పింది మాత్రం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇక్కడి డబ్బులతో మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు’’ అని బండి సంజయ్ మండిపడ్డారు. -
‘ది సబర్మతి రిపోర్ట్’కు ట్యాక్స్ మినహాయించాలి: బండి సంజయ్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ చరిత్రను కనుమరుగు చేస్తోందని, ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ చేశారు. శుక్రవారం(నవంబర్22) హైదరాబాద్ జీవీకేమాల్లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని బండి సంజయ్ పలువురితో కలిసి వీక్షించారు.‘కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేసిన సినిమా ఇది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కాంగ్రెస్ చరిత్రను కనుమరుగు చేస్తూనే ఉంది. క్రికెట్లో పాకిస్తాన్ గెలిస్తే ఇండియాలో సంబరాలు చేసుకునే వాళ్లను ఏమనాలి?ఇండియా గెలవొద్దని కోరుకునే వాళ్లను ఏమనాలి?ఇప్పటికీ మినీ పాకిస్తాన్,మినీ బంగ్లాదేశ్,మినీ ఆఫ్ఘనిస్తాన్ బస్తీలున్నాయి.సమాజంలో ఇకనైనా మార్పు రావాలి. సబర్మతి వంటి సినిమాలు మరెన్నో రావాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలి. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలి’అని బండిసంజయ్ హితవు పలికారు. -
ఢిల్లీలో సెంటిమెంట్.. కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి : బండి సంజయ్
-
ఒక్కరు కాదు.. తెలంగాణకు ఇద్దరు సీఎంలు: బండి సంజయ్
సాక్షి,సంగారెడ్డి:లగచర్ల ఫార్మాసిటీకి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. సంగారెడ్డిలో ఆదివారం(నవంబర్17) బండి సంజయ్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.‘రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. రైతుల గురించి ఆలోచించకుండా దౌర్జన్యం చేయడానికి ఇది రాచరిక పాలనా? గతంలో బీఆర్ఎస్ కూడా ఇలానే చేసింది. కలెక్టర్పై దాడి అనేది దారుణం. రైతులు కలెక్టర్పై దాడి చేయలేదు. ఈ దాడి వెనుక కేటీఆర్,బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. అయినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇది ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం.కేటీఆర్ నక్క వినయం ప్రదర్శించి అన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసీఆర్ కొడుకు నటసార్వభౌముడు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ను కలిశారు. గతంలో కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్ కేసును ఇలానే నీరు గార్చారు. ఫోన్ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. కేటీఆర్కు తెలియకుండా ఇది జరుగుతుందా. అప్పుడు,ఇప్పుడు సీఎం కేటీఆరే.దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయి. ఫార్ములా-ఈ కేసు,ధరణి కేసు,జన్వాడ ఫామ్ హౌస్ కేసు,డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయి.జనాలని,మీడియాని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లను పిచోళ్ళు చేస్తున్నారు. తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు కేటీఆర్, ఇంకొకరు రేవంత్రెడ్డి’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
కల్లు తియ్యగున్నదన్న బండి సంజయ్..
-
ఆరు గ్యారంటీలు.. రేవంత్కు బండి సంజయ్ సవాల్
సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల అమలుపై తెలంగాణలో పాదయాత్ర చేసే దమ్ముందా?. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా?’’ అంటూ విమర్శలు గుప్పించారు.కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించిన కేంద్ర మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసోళ్లను కూడా నక్సలైట్లు దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా?. సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్లు?. తక్షణమే విద్యా కమిషన్ను రద్దు చేయాలి. ప్రజాస్వామ్యవాదులారా.. కమిషన్ రద్దు కోసం రోడ్డెక్కండి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఎఫ్పుడో మర్చిపోయారు?. జనం కష్టాల్లో ఉన్నా ఫాంహౌజ్కే పరిమితమైనోడిని లీడర్గా గుర్తిస్తారా?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి.. కేటీఆర్ రియాక్షన్ -
కేటీఆర్కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై బండి సంజయ్ శుక్రవారం(నవంబర్ 8) హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు.‘బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రేవంత్,నేను కొట్లాడాం. అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నాం. డైవర్షన్,కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్కే ఉంది. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు,ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల్లో హంగామా చేసి చివరకు కాంగ్రెస్,బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యాయి. కేటీఆర్ ట్విటర్లో తప్ప ఎక్కడా కనిపించడు. కేటీఆర్ కళ్లు నెత్తికెక్కాయి. బీఆర్ఎస్లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ హరీశ్రావు మాత్రమే’అని బండి సంజయ్ అన్నారు. ఎక్కడో భువనగిరిలో కాకుండా మూసీ పక్కన ఇల్లు కూలగొట్టే దగ్గర సీఎం రేవంత్రెడ్డి పాదయాత్ర చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి పాద యాత్ర చేయాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: హ్యాపీ బర్త్డే రేవంత్: కేటీఆర్ -
అప్పుడే రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టాలి: బండి సంజయ్ సవాల్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఎన్నో హామీలు ఇచ్చారన్న సంజయ్.. వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందన్నారు. మంగళవారం సిరిసిల్లా జిల్లా రుద్రంగిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండానే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణాలో అన్నీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందని మండిపడ్డారు. ఏ గ్యారంటీలు అమలు చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర డబ్బంతా తీసుకెళ్లి మహారాష్ట్రలో యాడ్స్ ఇస్తోందని ఆరోపించారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ కూడా ఇక్కడి రైతులను ఎండబెట్టి పంజాబ్ రైతులకు ఇక్కడి డబ్బులిచ్చాడని విమర్శలు గుప్పించారు. ‘స్వయానా వ్యవసాయశాాఖ మంత్రే ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. ఆ విషయాన్ని అక్కడి యాడ్స్ లో ఎందుకు పేర్కొనలేదు..? ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేశారో చెప్పాకే రాహూల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలి.దమ్ముంటే ఇప్పుడు రాహూల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేయాలి. లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్. కాంగ్రెస్ అధినేత్రి అల్లుడికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ఓ పెద్ద స్కీమ్. దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సర్పంచుల సమస్యలకు కారణమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ బీఆర్ఎస్సే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనడం హాస్యాస్పదం. సర్పంచులను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందూ దొందే’ అని మండిపడ్డారు. -
కేంద్రానికి రాష్ట్రం సహకారం
మల్యాల (చొప్పదండి): రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల తర్వా త అందరూ అభివృద్ధే ల క్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రానికి సహక రిస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం క్రాస్రోడ్డు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం కాచారం వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.రోడ్డు విస్తరణ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగానే రూ.25 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సత్యం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు మంజూరు చేయించాలని కోరారు. గత ప్రభుత్వం పగ, ప్రతీకారాలతో ప్రొటోకాల్ పాటించలేదని, అభివృద్ధికి సహకరించలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మీ విధ్వంసంతో చీకట్లోకి రాష్ట్రంసీఎం రేవంత్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఉదయిస్తున్న సూర్యుడిలా పురోగమిస్తోందంటూ సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’లో చేసిన పోస్ట్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను పునరి్నరి్మంచే బదులు రేవంత్రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని చీకట్లలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉదయించట్లేదని.. కాంగ్రెస్ శుష్క వాగ్దానాలనే నీడల మాటున నిలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచి్చన అంతులేని నకిలీ హామీల చిట్టా ఈ జన్మకు నెరవేరదని ఎద్దేవా చేశారు.ఒకవేళ ఆరు గ్యారంటీలను నిజంగా అమలు చేశామని రేవంత్ నమ్మితే పాదయాత్ర చేపట్టి ప్రజల నుంచి నిజాలు తెలుసుకోవాలని మరోసారి సూచించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ఖాతాలో సీఎం రేవంత్ను ఉద్దేశించి బండి సంజయ్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘రేవంత్రెడ్డి గారు... మీరు యావత్ తెలంగాణను మోసగించారు. మీరిచ్చిన గ్యారంటీ కార్డు మాటున షరతులు వర్తిస్తాయనే విషయాన్ని అమాయకులైన తెలంగాణ ప్రజలు గుర్తించలేకపోయారు.6 గ్యారంటీలను నెరవేర్చడానికి 100 రోజులు, 1,000 రోజులు కాదు కదా.. 10 వేల రోజులైనా సరిపోవు’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హామీల అమలును కాంగ్రెస్ బోగస్గా మార్చిందని దుయ్యబట్టారు. ‘6 గ్యారంటీల అమలుకు నిధుల్లేని మీవద్ద మూసీ ప్రాజెక్టు కోసం రూ. 1.50 లక్షల కోట్లు మాత్రం ఉన్నాయి. మూసీ ప్రాజెక్టును మరో కాళేశ్వరం తరహా ఏటీఎంగా మారుస్తున్నారు’అని బండి సంజయ్ ‘ఎక్స్’లో ఆరోపించారు. ఒవైసీపై ధ్వజం: టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలంటున్న ప్రధాని మోదీ సర్కార్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడం ఏమిటంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు. -
రాహుల్.. ప్రధాని కావడం కలే: బండి సంజయ్
సాక్షి, బెజ్జంకి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడు.. అది ఆయన కల మాత్రమే అని ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇదే సమయంలో బీఆర్ఎస్పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తాను అనడం హాస్యాస్పదం అంటూ సెటైర్లు వేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు బెజ్జంకిలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుపుతున్నాయి. మూసీ ప్రక్షాళన పేరిట లక్షా యాభై వేల కోట్లను ఖర్చు పెట్టే కంటే కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేస్తే బాగుండేది. రేవంత్ రెడ్డి ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తాడు?.ప్రజాసమస్యలు పట్టించుకోకుండా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి మోదీపై యుద్ధం చేస్తాడట రేవంత్. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేడు. అది కేవలం కల మాత్రమే. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే హిందూ ఆలయాలు, హిందువులుపైనే దాడులు జరుగుతాయి. కేటీఆర్ పాదయాత్ర చేస్తాను అనడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ ఇప్పుడు నాయకుడు లేని నావలా నడుస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
లీగల్ నోటీసులపై బండి సంజయ్ డిమాండ్
-
కేటీఆర్ లీగల్ నోటీసులకు బండి సంజయ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం(అక్టోబర్ 29) రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీసుకుగాను కేటీఆర్కు కౌంటర్ నోటీసు పంపించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పులేదని బండిసంజయ్ తన రిప్లైలో స్పష్టం చేశారు.రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. లీగల్ నోటీసు అంటూ బెదిరిస్తే భయపడేది లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ను కోరారు. కేటీఆర్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, ఇటీవల బండి సంజయ్ గ్రూప్ వన్ అభ్యర్థులతో కలిసి ఆందోళనల్లో పాల్గొని అరెస్టయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి బండి సంజయ్ని చర్చలకు పిలిచారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ చదువులేని బండిసంజయ్ని గ్రూప్వన్పై చర్చలకు పిలిస్తే ఏం లాభం అని విమర్శించారు. రేవంత్, బండి సంజయ్ కలిసి డ్రామా చేస్తున్నారని ఆరోపించారు.దీనికి ఆగ్రహించిన బండి సంజయ్ కేటీఆర్పై వ్యక్తిగతంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకుగాను బండిసంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఇదీ చదవండి: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో -
జన్వాడపై బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజీ: కేంద్ర మంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజీపడుతున్నట్లు జన్వాడ రేవ్ పార్టీ విషయంలో మరోసారి రుజువైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడు తూ ట్విట్టర్ టిల్లు బామ్మర్ది ఫామ్ హౌజ్లో రేవ్పార్టీ కేసు నీరుగార్చే కుట్ర మొదలైందని, ఆ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని పోలీసులతో చెప్పించేలా కాంగ్రెస్ నుంచి ఒత్తిడి కొనసాగుతోందని, లిక్కర్ పార్టీయే తప్ప రేవ్పార్టీ కాదని బుకా యించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్ పార్టీపై సుద్దపూస ఏమంటాడో వేచి చూస్తున్నట్లు తెలిపారు.రేవ్పార్టీ పంచనామాలోనే డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేశారని, విదేశీ మద్యం బాటిళ్ల పేర్లను మాత్రమే ప్రస్తావించినట్లు తెలిసిందని అన్నారు. ట్విట్టర్ టిల్లు, ఆయన కుటుంబ సభ్యులను తప్పించి, ఈ కేసులో అనామకుల పేర్లను చేర్చుతున్నారని, తద్వారా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి బహుమతి ఇస్తోందని పేర్కొన్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీధోరణి ప్రదర్శిస్తోందని, సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. సీసీ ఫుటేజీ సహా ఇతర ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని, బడా నేతలతోసహా రేవ్పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జన్వాడ పార్టీ వివరాలు బయటపెట్టాలిగజ్వేల్: జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్పార్టీ వివరాలన్నీ బయట పెట్టాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. -
సీఎం రేవంత్కు బండి సంజయ్ సహాయమంత్రి: ఎమ్మెల్యే వివేకానంద
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డికి బండి సంజయ్ సహాయమంత్రిలా తయారయ్యాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత వివేకానంద ఎద్దేవా చేశారు. తాజాగా రేవంత్, బండిసంజయ్ బంధం మరోసారి బయటపడిందన్నారు. అనుమతి లేకుండా పోలీసులు కేటీఆర్ బావమరిదికి చెందిన జన్వాడ ఫాంహౌజ్లో సోదా చేయడంపై వివేకానంద ఆదివారం(అక్టోబర్ 27) స్పందించారు.‘రాజ్ పాకాల పార్టీలో కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. రాజ్పాకాల ఇంట్లో గెట్ టు గెదర్ పార్టీ చేసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారంట్ లేకుండా ఇంట్లోకి వెళ్లారు. అక్కడ జరిగింది ప్రైవేట్ పార్టీ. లిక్కర్ ఎవరి ఇంట్లో ఉండదు. సీఎం, మంత్రుల ఇళ్లలో ఉండదా? తెలంగాణలో సంప్రదాయం ప్రతి ఇంట్లో లిక్కర్ ఉంటుంది. రేవంత్ చేతిలో అధికారులు కీలు బొమ్మలయ్యారు. ఇప్పుడు ఓవర్యాక్షన్ చేస్తున్న అధికారులు రిటైర్ అయినా సరే మేం అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టం’అని వివేకానంద హెచ్చరించారు. ఇదీ చదవండి: కేటీఆర్ బావమరిది ఫామ్హౌజ్లో రేవ్పార్టీ భగ్నం -
జన్వాడలో రేవ్ పార్టీపై స్పందించిన బండి సంజయ్
-
జన్వాడ రేవ్ పార్టీ.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేపు పార్టీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ సీసీ టీవీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు.జన్వాడ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో. బావ మరది ఫామ్ హౌస్లోనే రేవ్ పార్టీలా?. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. ‘సుద్దపూస’ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి.సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్పై రాజీ ధోరణి ఎందుకు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటు. చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సీసీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలి. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలు ఉండాలని’ డిమాండ్ చేశారు. -
మోడీ రూట్ లోనే కేటీఆర్..
-
Bandi Sanjay: మస్కా బన్ తిని.. చాయ్ తాగి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా హిమాయత్ నగర్లోని నీలోఫర్ కేఫ్లో ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్తో కలిసి నీలోఫర్ కేఫ్కు వచ్చారు. సాదాసీదాగా కేఫ్లోకి వెళ్లి కూర్చుని ‘మస్కాబన్’ తిన్నారు. ఛాయ్ తాగారు. బండి సంజయ్ వచ్చారని తెలుసుకున్న నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నారు. తాము ఈ మధ్య చిట్టిముత్యాలతో తయారు చేసిన సాంబార్ రైస్ను బాబూరావు అభ్యర్థన మేరకు సంజయ్ రుచిచూసి బాగుందని పేర్కొన్నారు. కేఫ్కు నీలోఫర్ పెట్టడానికి కారణమేంటని ప్రశ్నించడంతో.. ‘తాను చాలా పేదరికం నుండి వచ్చానని, 1976లో నీలోఫర్ ఆస్పత్రి వద్ద రూ.2 రూపాయలకు చిన్న ఉద్యోగం చేసి.. అక్కడే టీ, బిస్కట్లు అమ్మానని, వాటికి గిరాకీ ఉండటంతో కేఫ్ స్థాపించానని తెలిపారు. అందుకే నీలోఫర్కు వచ్చే రోగులకు తనవంతు సహకారం అందిస్తున్నాని తెలపడంతో బండి సంజయ్ బాబూరావును ప్రత్యేకంగా అభినందించారు. -
కిలోమీటర్కు రెండు వేల కోట్లా.. మూసీపై క్లారిటీ ఉందా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. మూసీపై సీఎం రేవంత్కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల హామీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు అంటూ ఆరోపించారు.ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మొన్నటి వరకు హైడ్రా జరిగింది. ఆ బాధితుల్లో జేసీబీ, బుల్డోజర్లు అనే భయం కనిపించాయి. ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోంది. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతాం. మూసీ ఒకప్పుడు మంచినీళ్లు అందించింది.. ఇప్పుడు విషం కక్కుతోంది. నేను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశా. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్. పరిశ్రమలకు అడ్డగోలుగా పెట్టుకోవాలని చెప్పి అనుమతి ఇచ్చింది వారు కాదా?.మొన్న రేవంత్ లండన్ పోయి ఒక నది చూశాడు.. అది చూసే లక్షన్నర కోట్లు అన్నాడు. నిన్న సియోల్కు నేతలను పంపాడు.. వాళ్ళు ఎంత చెప్తారో మరి. రేవంత్.. ముందు మంత్రులను మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరగమని చెప్పు. అలా వెళ్తే ప్రజలు వాళ్లను గంప కింద కమ్ముతారనే భయం ఉంది. రేవంత్ మూసీ సుందరీకరణ అని ఒకసారి అంటాడు.. పునరుజ్జీవనం అని మరోసారి అంటాడు.. ఏంటో ఆయనకే క్లారిటీ లేదు. లక్షన్నర కోట్ల ఖర్చు అన్నాడు.. మళ్ళీ నేను అనలేదు అంటున్నాడు. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదు.. ఇదంతా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా అల్లుడి కోసమే.బీఆర్ఎస్ నేతలకు దీనిపై మాట్లాడే హక్కు లేదు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలు. సబర్మతి ఖర్చు రూ.7వేల కోట్లు. నమామి గంగ ఖర్చు రూ.40వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా?. ఒక్క కిలోమీటర్కు 2వేల కోట్లా?. ఇంతకంటే ఖరీదైన ప్రాజెక్టు.. స్కామ్ ప్రపంచంలో లేదు. దోషులు ప్రజలు కాదు.. అక్రమంగా కూల్చుతున్న ప్రభుత్వమే దోషి. మాకు కేసులు, లాఠీలు కొత్త కాదు. ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో రేవంత్.. మేము కొట్లాడేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లపై తిరగకుండా చేస్తాం. సోనియా అల్లుడికి పైసలు కావాలంటే కాంగ్రెస్ నేతలు దోచుకున్న వాటిలో నుంచి ఇవ్వండి.. పేదల వద్ద నుంచి లాక్కుంటామంటే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. -
ఇందిరా పార్క్ ధర్నా చౌక్.. నేడు బీజేపీ నేతల ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ ప్రాంత ప్రజలకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద నేడు బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు.తెలంగాణ బీజేపీ నేతలు రెండు రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం, వారికి మద్దతుగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు బీజేపీ నేతలు ధర్నా చేయనున్నారు. బీజేపీ ధర్నాకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కానున్నారు. -
మూసీ పేరిట కాంగ్రెస్ భారీ దోపిడీ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి ప్లాన్ చేసిందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన రేపు(శుక్రవారం) ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మూసీ బాధితులు, ప్రజలు పెద్దఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు...మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసింది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది. రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి మూసీని కాంగ్రెస్కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైందిసంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ నిధులు కూడా ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదు. పాలకులు చేస్తున్న అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంది. తెలంగాణలో 92 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం’ అని పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ నోటీసులు
-
కేటీఆర్ లీగల్ నోటీసుకు బండి సంజయ్ కౌంటర్
-
మోదీ బాటలోనే నడుస్తా: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ బుధవారం(అక్టోబర్ 23) మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు.ప్రతిపక్షనేత రాహుల్గాంధీకి ప్రధాని మోదీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మోదీ బాటలోనే నడుస్తానని కేటీఆర్ చెప్పారు. కాగా, తనపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని అందులో పేర్కొన్నారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ ఇలాంటి తాటాకు చప్పుల్లకు భయపడేది లేదన్నారు. ఇదీ చదవండి: కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు -
కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు అంటూ కేటీఆర్కు కౌంటరిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్..‘కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశాను. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే నేను మాట్లాడాను. ఆయన మంచి వాడు అనుకుంటన్నాడు. ఆయన భాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళ్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.అలాగే, కేటీఆర్ నోటీసులపై తెలంగాణ బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాను. లీగల్ నోటీసులతో కేటీఆర్ రాజకీయ జీవితానికి చరమ గీతం పడటం ఖాయం. దద్దమ్మ, సన్యాసి అంటూ కేసీఆర్, కేటీఆర్ కొన్ని వందల సార్లు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పారిపోయే రోజులు వచ్చాయి. లీగల్ నోటీసులతో ఆట మీరు మొదలుపెట్టారు. రోజు లీగల్ నోటీసులు అందుకోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ..‘లీగల్ నోటీసులకు బండి సంజయ్ భయపడరు. బండి సంజయ్ను ఎన్నో సార్లు కేసీఆర్, కేటీఆర్ అవమానించారు. భాషను మార్చుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. -
రేవంత్,బండి సంజయ్ రహస్య మిత్రులు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్,బండి సంజయ్లు రహస్య మిత్రులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 21)మీడియాతో మాట్లాడారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్కి బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు.‘రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలి. ముత్యాలమ్మ గుడిపై దాడిని నేను ఖండిస్తే తప్పేంటి? నేను ట్వీట్ చేసినందుకు నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు లేఖ పంపారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు.ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడు.మూసీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులు. లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? లక్షన్నర కోట్లు జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? జర్నలిస్టులపై బీఆర్ఎస్కు ఎనలేని గౌరవం ఉంది. ఎన్నడూ నేను అవమానించలేదు.ఉద్యమంలో మాకంటే ఎక్కువ జర్నలిస్టుల పాత్ర ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.గ్రూప్ వన్పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..‘గ్రూప్ వన్పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.రిట్ పిటిషన్పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది.జీవో 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే నిరుద్యోగులు.స్థానికుల కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనటనం అన్యాయం. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది. గ్రూప్ - 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్.కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్ ఇంటివద్ద భారీగా పోలీసులు -
పరీక్షలను రీషెడ్యూల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రూపొందిన జీవో 29ను వెంటనే ఉపసంహరించుకోవాలని, గ్రూప్–1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెల్లవారితే పరీక్ష అని తెలిసి కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారంటే.. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని లేఖలో కోరారు. నిరుద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి, వారి డిమాండ్ మేరకు మార్పులు చేయాలన్నారు.జీవో 29 వల్ల 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారని.. 563 పోస్టులకు గుండుగుత్తగా 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం అన్యాయమని సంజయ్ పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించిన రిజర్వ్డ్ అభ్యర్థులను.. రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తుండటాన్ని గుర్తించాలని లేఖలో కోరారు. అసలు రిజర్వేషన్లనే రద్దు చేస్తున్నారన్న చర్చకు ఈ జీవో దారితీసిందని పేర్కొన్నారు. -
రేవంత్ రహస్య మిత్రుడు బండి సంజయ్: బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అంటూ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బండి సంజయ్, పోలీసులకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ షేర్ చేసింది.బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా..‘నిరుద్యోగులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్ట్ చేయించిన రేవంత్ సర్కార్. కానీ తన రహస్య మిత్రుడు బండి సంజయ్కి భారీ భద్రత కల్పించి డ్రామా స్టంట్ చేయించాడు రేవంత్’ అంటూ వీడియోను షేర్ చేసింది.నిరుద్యోగులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్ట్ చేయించిన రేవంత్ సర్కార్. కానీ తన రహస్య మిత్రుడు బండి సంజయ్ కి భారీ భద్రత కల్పించి డ్రామా స్టంట్ చేయించాడు రేవంత్. pic.twitter.com/JI9h8EHF7Z— BRS Party (@BRSparty) October 19, 2024అంతకుముందు బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్న వీడియోను ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో ఓపెన్ కేటగిరీ పోస్టులను కేవలం అగ్రవర్ణాల్లో కొందరికే పరిమితం చేయడానికి @revanth_anumula ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి GO 29 కి వ్యతిరేకంగా వేలాదిమంది నిరుద్యోగ బిడ్డల తరపున పోరాడుతున్నందుకు సంతృప్తి గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55 ఈ రోజు ఉండి ఉంటే నా… pic.twitter.com/iCSB3UuW3d— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 19, 2024 -
కమలం మంత్రుల ‘లోకల్ పాలిటిక్స్’!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రుల ‘లోకల్ పాలిటిక్స్’ రాష్ట్ర రాజకీయాలకు వేడెక్కిస్తున్నాయి. శనివారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిష¯Œ రెడ్డి, గ్రూప్–1 అభ్యర్థులు, నిరుద్యోగులకు మద్దతుగా హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మెరుపు నిరసన లు చేపట్టడంతో.. ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో మూసీ పరీవాహక, హైడ్రా ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్యే లు క్షేత్రస్థాయి పర్యటనలు, 24న రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల ఆందోళనలు చేపట్టడానికి ముందే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా దీర్ఘ, స్వల్ప, తక్షణ కార్యాచరణ చేపట్టేందుకు, నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇవి దోహదపడినట్టుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాపై బుల్డోజర్లు తెచ్చాక కూల్చండి: కిషన్రెడ్డి మూసీ నది పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అనా లోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్రెడ్డిని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రాజెక్ట్కు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్న సీఎం.. ముందుగా పేదల ఇళ్లు కూల్చ కుండా మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. తమపై బుల్డోజర్లు తీసుకొచ్చి.. అప్పుడు పేదల ఇళ్లు కూల్చాలని.. వారి ఇళ్లను కూల్చాలనుకునే ముందు తమను జైలులో పెట్టాలని కోరారు. పాత సంజయ్ గుర్తొచ్చారుప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. ఒక్కసారిగా రాష్ట్రపార్టీ అధ్యక్షునిగా వ్యవహరించిన రోజుల్ని గుర్తుకు తెచ్చారు. ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనడం, రోడ్ల బైఠాయింపు, ఇతర రూపాల్లో ఉద్యమ కార్యాచరణను గుర్తుకు తెచ్చేలా శనివారం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటా నికి దిగారు. ప్రస్తుతం తాను హోంశాఖ సహాయమంత్రినన్న విషయాన్ని కూడా పక్కనపెట్టి.. బీజేపీ కార్యాలయంలో తొలుత గ్రూప్–1 అభ్యర్థులు, నిరుద్యోగులతో సమావేశ మయ్యారు.ఆ వెంటనే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు అశోక్నగర్కు పయనమయ్యా రు. వెంటనే పార్టీ నాయకులు, శ్రేణులు వెంటరాగా, గ్రూప్–1 బాధితులను కలుసుకున్నారు. నిరుద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తేగానే, వారిపై ఇటీవల జరిగిన లాఠీచార్జీకి నిరసనగా అక్కడే రోడ్డుపై బైఠాయించి మెరుపు నిరసన తెలిపారు. తాను కేంద్రమంత్రినైనా.. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా బీజేపీ కార్యకర్తగా వారికి అండగా ఉంటా నని ప్రకటించారు. జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్–1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలన్న అభ్యర్థుల డిమాండ్ను పునరుద్ఘాటించారు. భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద వదిలివెళ్లారు. అక్కడ కొంత సేపు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యాక.. గ్రూప్–1 అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తా మంటూ ‘చలో సెక్రటేరియట్’కు బయలుదేరారు. ఆయనతో పాటు నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిమంది ర్యాలీగా ముందుకు కదలడంతో పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మధ్యలో చర్చలకు ప్రభుత్వం పిలిచిందనే ప్రచారం జరిగినా.. అది రూఢీ కాలేదని పార్టీ నాయకులు తెలిపారు. ఈ దశలో జీవో 29 రద్దు చేయాల్సిందేనంటూ సంజయ్ ప్లకార్డ్ను ప్రదర్శించారు. అక్కడి నుంచి ఆయనను పోలీసు బందోబస్తు మధ్య రామకృష్ణమఠం వైపు తీసుకురాగా.. అక్కడికి దగ్గరలోని ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై సంజయ్ మరోసారి బైఠాయించారు. జీవో 29 రద్దుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి నిరుద్యోగులతో కలిసి లిబర్టీ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సంజయ్ను అదుపులోకి తీసుకుని వాహనంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడి.. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటుగా విమర్శలు సంధించారు. -
ఇంత నిరంకుశ, నిర్బంధ పాలనా?
లాలాపేట (హైదరాబాద్): ‘‘గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను ఒక నెలో, రెండు నెలలో, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేవరకో వాయిదా వేస్తే మీ కొంపలేమీ మునిగిపోవు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 అభ్యర్థులను పిలిచి వారి సహేతుకమైన కారణాలను అడిగి తెలుసుకోవాలి..’’అని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను పశువుల్లా చూస్తుండటం చాలా దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కుతూ, కేంద్ర మంత్రి బండి సంజయ్ను మాత్రం రాచమర్యాదలతో అశోక్నగర్కు వెళ్లనిచ్చారని.. సీఎం రేవంత్, బండి సంజయ్ దోస్తులేనని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. శనివారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జీవో నంబర్ 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులు భారీగా నష్టపోతున్నారు. కేసీఆర్ హయాంలో తీసుకువచ్చిన 95శాతం లోకల్ రిజర్వేషన్ను తుంగలో తొక్కుతున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలను కాకుండా వికీపీడియాను ప్రామాణికంగా తీసుకోవాలనే అర్థం లేని వాదనలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ. అభ్యర్థులు 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం. వారిలో కాబోయే డీఎస్పీలు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. అలాంటి వారిని పశువుల్లాగా ప్రభుత్వం చూస్తుండటం దారుణం. అభ్యర్థులతో ముఖ్యమంత్రిగానీ, చీఫ్ సెక్రెటరీ, పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్గానీ ఎవరైనా చర్చలకు పిలిచి మాట్లాడాలి. ఏమిటీ నిరంకుశ, నిర్బంధ పాలన? గతంలో రాహుల్ గాం«దీ, రేవంత్రెడ్డిలో అశోక్నగర్కు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటైన తొలి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంకనాలు కొట్టారు. నేడు కనీసం అభ్యర్థుల మాటలను ఆలకించని పరిస్థితి ఉంది. తెలంగాణ భవిష్యత్కు సారథులుగా వ్యవహరించే గ్రూప్–1 అభ్యర్థులనే ప్రభుత్వం ఇలా చూస్తుంటే.. మిగతా యువత పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. గ్రూప్–1 అభ్యర్థుల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. సోమవారం వాదనలు జరగనున్నాయి. గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మొండిగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది. కోర్టు తీర్పుతో మళ్లీ నిర్వ హించాల్సి వచ్చిందని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవా లి. తమది ప్రజాపాలన అని, తమ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ ఫోజులు కొట్టిన రేవంత్రెడ్డి.. ఇప్పు డు ఎందుకింత నిరంకుశ, నిర్బంధ పరిస్థితులు తీసుకువచ్చారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.బండి సంజయ్కు గ్రూప్–1 పరీక్ష గురించే అర్థంకాదు.. రాష్ట్ర ప్రభుత్వం శిఖండి రాజకీయాల్లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ను ముందుపెట్టి గ్రూప్–1 అభ్యర్థుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోంది. బండి సంజయ్ ఏమన్నా చదువుకున్నారా.. పరీక్ష రాసింది ఉందా? గ్రూ ప్–1 పరీక్షపై ఆయనకు చెప్పినా అర్థంకాదు, పేపర్ లీకులు మాత్రం చేస్తారు. రాష్ట్ర ప్రభు త్వం బండి సంజయ్ వంటి వారితో కాదు. ఓ 10 మంది గ్రూప్–1 అభ్యర్థులతో మాట్లాడాలి. రైతు బంధు ఏదీ? రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. ఇప్పటికీ రైతు బంధు ఇవ్వలేదు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి. తప్పకుండా రైతుల తరఫున పోరాడుతాం... -
‘తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అందుకు జీవో నంబర్ 29 ఓ సంకేతమన్నారు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘ తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. సోనియా జన్మదినం... నిరుద్యోగుల బలిదినం కాబోతోంది.ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందే. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా?, నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర, కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?. డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది. నా జోలికొస్తే... నీ చీకటి బతుకులను బయటపెడతా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా. కాంగ్రెస్తో కుమ్కక్కు రాజకీయాలు చేస్తోంది మీరు కాదా?, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసులు రాకుండా చీకటి రాజకీయాలు చేస్తోంది మీరే. కాంగ్రెస్ తో పగలు ఫైటింగ్... రాత్రిళ్లు లవ్వింగ్ బతుకు మీది. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది. జేసీబీ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు. 2028లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సికింద్రాబాద్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా. ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకుని హింసను సృష్టించడం దారుణం.. పోలీసుల తీరు దుర్మార్గం’ అని ధ్వజమెత్తారు.చదవండి: TG గ్రూప్-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత -
రేవంత్, బండి సంజయ్లది డ్రామా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ 1పై సీఎం రేవంత్, బండి సంజయ్ డ్రామా ఆడుతున్నారని, బండి సంజయ్కి భద్రత ఇచ్చి రేవంత్ రోడ్లపైకి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.గ్రూప్-1 పరీక్షపై బండి సంజయ్ని సీఎం రేవంత్ చర్చలకు పిలవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బండి సంజయ్ని చర్చలకు పిలిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. పేపర్ లీక్ చేసిన ఆయనను చర్చలకు ఎలా పిలుస్తారని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: గ్రూప్ 1 రగడ.. సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత -
TG గ్రూప్-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
Updatesసచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తతపోలీసులు, గ్రూప్-1 అభ్యర్థుల మధ్య తోపులాటగ్రూప్-1 వాయిదా వేయాలంటూ ఆందోళనజీవో 29 రద్దు చేయాలంటూ డిమాండ్బీజేపీ నేత బండి సంజయ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్గ్రూప్-1 అభ్యర్థులతో సచివాలయానికి వెళ్తుండగా అరెస్ట్సచివాలయం వైపు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్, దాసోజు శ్రవణ్లు అరెస్టుబండి సంజయ్ను బీజేపీ ఆఫీస్కు తరలించిన పోలీసులుసచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరింపుసచివాలయం గేట్లు మూసేసిన పోలీసులుఅంతకుముందు హైదరాబాద్ అశోక్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ మద్దతు పలికారు. వారిని పరామర్శించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్కు ర్యాలీగా బయల్దేరారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గ్రూప్-1 బాధితులకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు చెప్పేందుకే సచివాలయానికి వెళ్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి తీరుతామని చెప్పారు. దీంతో పోలీసులు బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్నగర్ చౌరస్తాకు ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు. తక్షణమే జీవో 29ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్కు ర్యాలీగా వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులను ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అశోక్ నగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.