హుజూర్నగర్: సూర్యాపేట జిల్లాలో ఆదివారం స్వల్ప భూకంపం వచ్చింది. చింతలపాలెం మండలంలోని తమ్మారం, వెల్లటూరు, చింతలపాలెం, గుడిమల్కాపురం, దొండపాడు, వజినేపల్లి తదితర గ్రామాలతో పాటు మేళ్లచెరువు మండలంలో ఉదయం 7.30 గంటల సమయంలో 3 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత సుమారు 3.1 మాగ్నిటూడ్గా నమోదైనట్లు తెలిసింది. గతంలో 2020, జనవరి మొదటి వారంలో 4 మాగ్నిటూడ్గా నమోదైంది. 2022లో కూడా పలు మార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఈ నేపథ్యంలో మళ్లీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment