
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చాప్రా–సికింద్రాబాద్, గోరఖ్పూర్–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు చాప్రా–సికింద్రాబాద్ (05179) ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీన ఉదయం 5.20 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. గోరఖ్పూర్–సికింద్రాబాద్ (05023) ప్రత్యేక రైలు ఈ నెల 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment