31న రాత్రి 12 గంటల దాకా వైన్‌షాపులు ఖుల్లా | Liquor Sales Hours Have Been Extended Till Midnight On December 31 In Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

31న రాత్రి 12 గంటల దాకా వైన్‌షాపులు ఖుల్లా

Dec 28 2024 6:25 AM | Updated on Dec 28 2024 10:32 AM

Liquor sales on till midnight on December 31 in Telangana

నూతన సంవత్సరం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు 

బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లు రాత్రి ఒంటిగంట వరకు పొడిగింపు 

రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌:  నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రంలో మద్యం విక్రయ వేళలను పొడిగించారు. 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు జరుపుకొనేందుకు అను­మ­తినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మవచ్చు. అదే విధంగా అన్ని వైన్‌షాపులను ఆ రోజు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇక ఈ వేడు­కల్లో డ్రగ్స్‌ వినియోగించకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జరిగే ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల జిల్లాల అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి ఆదేశా­లు జారీ చేశారు. ఎలాంటి అ­వాం­ఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ సిబ్బందికి సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement