Liquor Sales
-
మద్యం అమ్మకాలు పెరుగుతూ.. తగ్గుతూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నెలల వారీగా చూస్తే పెరుగుతూ.. తగ్గుతూ ఉంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ప్రతి నెలా 10 శాతం మేరకు పడుతూ..లేస్తూ అమ్మకాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత 10 నెలల కాలంలో రూ.29,648 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే 2023–24 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల కాలంలో అమ్ముడైన మద్యం విలువ రూ. 30,696 కోట్లు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.1000 కోట్ల మేర మద్యం అమ్మకాలు తగ్గాయని అర్థమవుతోంది.కానీ, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలలో కొత్త మద్యం షాపులకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ దరఖాస్తుల కింద రూ.2,400 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని మినహాయిస్తే 10 నెలల కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు రూ.1400 కోట్ల మేర పెరిగాయని తెలుస్తోంది. ఇక, నెలల వారీగా చూస్తే రూ. 2700 కోట్ల నుంచి రూ.3300 కోట్ల మేరకు అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం. కాగా గత ఏడాదిలో మొత్తం 12 నెలలకు రూ. 35,586 కోట్ల మేర మద్యం అమ్మకాలు రాష్ట్రంలో జరిగాయి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అమ్మకాలుంటాయని, వాటి విలువ రూ.36 వేల కోట్ల వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.(నోట్: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చి నెలల అమ్మకాల విలువను ఈ పట్టికలో లెక్కించలేదు. ఈ రెండు నెలలు కలిపి మొత్తం అమ్మకాల విలువ రూ.36వేల కోట్లకు పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.) -
APలో ఏరులై పారిన మద్యం.. 3 రోజుల్లో రూ.400 కోట్లు
-
జనం చచ్చినా.. చంద్రబాబుది అదే ట్రెండ్ !
-
కిక్కుతో వీడ్కోలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,523 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, చివరి ఆరు రోజుల్లోనే రూ.1,220 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి ఆరు రోజుల్లో దాదాపు 40 శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి 2024 సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడ్కోలు పలికినట్లు అర్థమవుతోంది. ఎక్సైజ్ గణాంకాల ప్రకారం ఒక్క సోమవారమే (డిసెంబర్ 30) రికార్డు స్థాయిలో 7.7 లక్షలకు పైగా కేసుల మద్యం, బీర్లు డిపోల నుంచి షాపులకు వెళ్లాయి. ఆ మద్యం విలువ రూ. 402 కోట్ల పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.117 కోట్ల విలువైన మద్యం అమ్ముకాలు జరగ్గా.. సోమవారం దాదాపు నాలుగింతలు అమ్ముడయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆదివారం (డిసెంబర్ 29) కూడా మద్యం డిపోలు తెరచే ఉంచారు. బ్యాంకులు లేకపోయినా వైన్షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో రూ.50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లారు. ఇక, గత ఆరు రోజుల విక్రయ గణాంకాలు 2023 సంవత్సరం డిసెంబర్లోని చివరి ఆరు రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ నెల మొత్తంతో పోలిస్తే మాత్రం 2023 కంటే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోవడం గమనార్హం. 2023, డిసెంబర్ నెలలో రూ.4,147.18 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోగా, ఈ డిసెంబర్లో రూ.3,523 కోట్లకే పరిమితమైంది. -
విచ్చలవిడి బెల్టు షాపులు.. ఏపీలో ఏరులై పారుతున్న మద్యం
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టు షాపుల ద్వారా ప్రభుత్వం భారీగా తాగించడంతో.. అక్టోబర్ 16 నుంచి నిన్నటి వరకు 6312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 26,78, 547 కేసుల బీర్లు, 83,74, 116 కేసులు మద్యం అమ్మకాలు సాగాయి. న్యూ ఇయర్కి రూ. 1000 కోట్లు మద్యం వ్యాపారులు టార్గెట్ పెట్టుకోవడంతో గత ఏడాది డిసెంబర్ కంటే భారీగామద్యం అమ్మకాలు పెరిగాయి.విచ్చలవిడి బెల్టు షాపులతో మందుబాబులు భారీగా మద్యం తాగేస్తున్నారు. 2023 డిసెంబర్లో 25,83,530 కేసుల మద్యం.. 6,4,370 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్లో 30,46,362 కేసుల లిక్కర్.. 9,11,815 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్లో 4,62,832 కేసుల లిక్కర్.. 2,87,438 కేసుల బీర్ల అమ్మకాలు పెరిగాయి. 18 శాతం లిక్కర్, 40 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: చిత్తూరులో ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్పై దాడిదుకాణాలతో పాటు వాటి వద్ద అనధికార పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు పెరగడంతో మద్యం వినియోగం అధికమైంది. దీనికి తగ్గట్టుగా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి ఉంటాయని వ్యాపారులు నమ్మకంతో ఉన్నారు. ఇందుకు తగినట్టుగానే డిపోలకు అక్కడ నుంచి మద్యం దుకాణాలకు మద్యం రావాణా జోరుగా సాగుతోంది. కోనసీమ జిల్లా అమలాపురం మద్యం డిపోకు పెద్ద ఎత్తున మద్యం లోడులు చేరుకున్నాయి.ఇక్కడ బైపాస్ రోడ్డులోని మద్యం డిపో వద్దకు ఒకేసారి 15 నుంచి 20 వరకు మద్యం లారీలు రావడం, వెంటనే దుకాణాలకు తరలించేందుకు చిన్న చిన్న వ్యాన్లు రోడ్డు మీదనే ఉంచడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందంటే, నూతన సంవత్సర వేడుకల్లో మద్యం అమ్మకాలపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయనేది తేటతెల్లమవుతోంది. -
31న రాత్రి 12 గంటల దాకా వైన్షాపులు ఖుల్లా
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రంలో మద్యం విక్రయ వేళలను పొడిగించారు. 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు జరుపుకొనేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మవచ్చు. అదే విధంగా అన్ని వైన్షాపులను ఆ రోజు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల జిల్లాల అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు. -
బాలకృష్ణ ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం
-
దసరాకు రూ.312 కోట్లపైనే మద్యం విక్రయాలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చాయి. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి 10వ తేదీతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో (పది రోజుల్లో) అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రియల్ ఎస్టేట్ పడిపోవడం, మూసీ ముంపు బాధితుల్లో దసరా సంబురాలు తగ్గాయి. హైడ్రా కూలి్చవేతలతో మెజారిటీ అపార్ట్మెంట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాల అమ్మకాలు నిలిచిపోయాయి. రిజి్రస్టేషన్లు కాకపోవడం, మార్కెట్లో పెద్దగా ఆర్థిక లావాదేవీలు లేకపోవడం, నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడం తదితర కారణాలతోనూ మద్యం అమ్మకాల తగ్గుదలకు మరో కారణమని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, శంషాబాద్, సరూర్నగర్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 674 మద్యం దుకాణాలు ఉండగా, గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.317.23 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం రూ.312.05 కోట్లే సమకూరింది. గతంతో పోలిస్తే.. ఎక్సైజ్ ఆదాయం పెరగక పోగా.. రూ.5.18 కోట్ల మేర ఆదాయం తగ్గడం గమనార్హం. కాగా.. గతంతో పోలిస్తే.. మద్యం ప్రియుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏళ్లుగా మద్యం అలవాటు ఉన్న వాళ్లను అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో మెజారిటీ మద్యం ప్రియులు లిక్కర్కు దూరంగా ఉంటున్నట్లు తెలిసిందే. -
ధూంధాం... దసరా.. ఐదు రోజుల్లో 25 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈసారి రాష్ట్రంలో ధూంధాంగా జరుగుతోందని మద్యం విక్రయ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో 25 శాతం, అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది దసరాతో ఆయన పోలిస్తే.. ఈ ఐదు రోజుల్లో 15 శాతం మేర అమ్మ కాలు పెరగ్గా, ప్రతిరోజు రాష్ట్రంలో సగటున రూ.124 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. రికార్డు విద్యుత్ స్థాయిలో ఈనెల 10వ తేదీన ఏకంగా రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్షావు లకు తరలించారు. అదే రోజున ఏకంగా 2.35 లక్షల కేసుల బీర్లు వైన్షాపులకు చేరడం గమనార్హం . ఈ స్థాయిలో బీర్ అమ్మకాలు ఏడాది కాలంలోనే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా వాస్తవానికి, సాధారణ రోజుల్లో సగటున రోజు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. లక్ష కేసుల వరకు లిక్కర్ అమ్ముడవు తుంది. కానీ, దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు పెరిగింది. ఐదు రోజుల సగటు చూస్తే రోజుకు 1.20 లక్షల కేసుల లిక్కర్, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక, ఈనెల 1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపో యింది. ఇందులో 8.37లక్షల కేసుల లిక్కర్ ఉం డగా, 14:53 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అదే గత ఏడాది అక్టోబర్1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లో కూడా 6.55 శాతం మేర మందుబాబులు పుల్లుగా లాగించేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. -
ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు
సాక్షి, విజయవాడ: ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను(సెబ్) ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.సెబ్ విభాగానికి కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. సెబ్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని, ఫర్నిచర్, వాహనాలను, సీజ్ చేసిన వస్తువులను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని పేర్కొంది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.అయితే త్వరలో మద్యం అమ్మకాలను ప్రైవేటు పరం చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెబ్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం గత ప్రభుత్వం ఈ సెబ్ను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా సెబ్ పని చేసింది. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం ఉద్యోగులను.. సిబ్బందిని సెబ్కు కేటాయించింది. బెల్టు షాపులు, గంజాయి నియంత్రణ కోసం సెబ్ పనిచేసింది. -
రమణా.. లోడ్ ఎత్తరా
ఇదేం ఖర్మరా బాబు.. ఎక్సైజోళ్ల బాధ పడలేకుంది. టార్గెట్.. టార్గెట్ అంటూ నిత్యం సంపుతున్నారు. మద్యం అమ్మితే నాలుగు డబ్బులు మిగిలేది మాకే కదా.. ఎంత అమ్మితే అంత వస్తుంది.. కానీ ఇప్పుడు వాళ్లకు సంపాదించి పెట్టాలట.. ఒక్కో షాప్నకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అదనంగా మద్యం కొని అమ్మాలట. మాకేమైనా అదనంగా వస్తుందా అంటే అది లేదు. రూ.లక్ష మందు సమాను కొంటే రూ.15 వేలు పోతున్నాయి. ఏంటో మరి..! ..ఇది మహబూబ్నగర్ జిల్లాలోని ఓ వైన్స్ యజమాని ఆవేదన. అతను ఒక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణదారులందరి పరిస్థితి ఇదే.సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, మహబూబ్నగర్, కరీంనగర్: ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభంలోనే ఎక్సైజ్ అధికారులకు కష్టాలు వచి్చపడ్డాయి. ఈ ఏడాది జూలై మాసంలో మద్యం అమ్మకాల లక్ష్యాన్ని చేరేందుకు నెల చివరి రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు నానాతంటాలు పడ్డారు. ఈ నెల టార్గెట్ పూర్తి కాలేదని, పైఅధికారులు టార్గెట్ పెట్టారని, వీలున్నంత మేర స్టాక్ తీసుకెళ్లాలని వైన్షాప్ల యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వాస్తవానికి, గత మూడు నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రూ.3వేల కోట్లు మించి జరుగుతున్నాయి.జూన్ నెలలో రూ.3,175 కోట్లు దాటింది. కానీ, జూలై నెలలో ఈ అమ్మకాలు రూ.3వేల కోట్లలోపు ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యం చేరాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానికంగా ఉండే ఎక్సైజ్ అధికారులు రిటైలర్లపై ఒత్తిడి పెంచారు. గోదాముల్లో సరుకు రెడీగా ఉందని, ఈ నెలలో అమ్మకాల లక్ష్యం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని, ఎంతోకొంత సరుకు తీసుకెళ్లాలంటూ వైన్షాప్ యజమానులకు ఫోన్లు చేసినట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో చేసేదేమీ లేని పరిస్థితుల్లో వైన్షాపుల యజమానులు అందుబాటులో ఉన్న నగదును బట్టి డీడీలు చెల్లించి గోదాముల నుంచి స్టాక్ తీసుకెళ్లారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ ప్రతిసారీ ఈ టార్గెట్లు ఉంటాయని, ఇప్పుడు ప్రభుత్వానికి నిధులు కూడా అవసరమైనందున ఉన్నతాధికారుల సూచన మేరకు సరుకు తీసుకెళ్లాలని వైన్షాపులను కోరామే తప్ప ఒత్తిడి తేలేదని, వీలునుబట్టి వైన్షాపుల నిర్వాహకులు సరుకు తీసుకెళ్లారే తప్ప...గొంతు మీద కత్తి పెట్టలేదని చెప్పడం గమనార్హం. తలపట్టుకుంటున్న వైన్స్ యజమానులు.. జనాభా ప్రాతిపదికన స్లాబ్ల ప్రకారం టెండర్ దక్కించుకున్నామని.. నిరీ్ణత కోటా అయిపోయిన తర్వాత తాము చెల్లించే మొత్తంలో సుమారు 15 శాతం నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో రూ.50 లక్షల స్లాబ్తో టెండర్ దక్కించుకున్న వ్యాపారికి పది పర్యాయాల వరకు ఐఎంఎల్ డిపోలో కొనుగోలు చేసిన మద్యానికి ఎలాంటి అదనపు పన్ను ఉండదు. అంతకు మించి కొనుగోలు చేస్తే రూ.లక్షకు దాదాపు 15 శాతం అంటే రూ.15 వేలు అదనంగా పన్ను రూపంలో చెల్లించాలి. దీంతో పాటు అమ్మకాలు లేని సమయంలో కొనుగోలు చేయాల్సి రావడం భారంగా మారిందని.. మిత్తీలకే సరిపోని పరిస్థితి ఉందని మద్యం దుకాణాల యజమానులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా... ఉమ్మడి కరీంనగర్ పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. తాజాగా ఎక్సైజ్ అధికారులు నాలుగు జిల్లాల్లోని వైన్షాపులకు ఒక్కసారిగా సేల్స్ పెంచాలని టార్గెట్ విధించారు. ⇒ కరీంనగర్తో సహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ప్రతీ వైన్షాపునకు రూ.30 లక్షల టార్గెట్ విధించారు. ‘‘మీరు అమ్ముకోండి.. లేదా స్టాక్ మీతోపాటే ఉంచుకోండి.. అవేమీ మాకు చెప్పొద్దు. కానీ, తప్పకుండా ప్రతీషాప్ రూ.30 లక్షల స్టాక్ కొనుగోలు చేయాల్సిందేనని’షరతు పెట్టారు. దీంతో గత్యంతరం లేక కేసులు పెడతారేమోననే భయంతో రూ.30లక్షల స్టాక్ కొనేందుకు సిద్ధమవుతున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో రూ.30 లక్షల సరుకు తాము కొనలేమని మెజారిటీ వైన్షాపుల నిర్వాహకులు చేతులు ఎత్తేయడంతో కనీసం గత ఏడాది విక్రయాలను చేరుకోవాలని మినహాయింపు ఇచ్చారు. ⇒ జగిత్యాల జిల్లాలోనూ వ్యాపారులు తాము రూ.30 లక్షలు చేయలేమని అనడంతో గతేడాది విక్రయాలతో 5–10 శాతం అదనంగా విక్రయించాలని టార్గెట్ పెట్టడంతో అంతా ఓకే అన్నారని సమాచారం. ⇒ పెద్దపల్లి జిల్లాలో రూ.30 లక్షలు స్టాకు కొనలేమని వ్యాపారులు చెప్పడంతో చివరికి గతేడాది విక్రయాల మీద 30 శాతం అదనంగా విక్రయించాల్సిందేని షరతు పెట్టడంతో వ్యాపారులు సమ్మతించారని తెలిసింది. ⇒ దీంతో ప్రతీ వైన్షాపు నిర్వాహకుడు రూ.లక్షలాదిగా దొరికిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ టార్గెట్ రీచ్ అయ్యేందుకు నానాతంటాలు పడుతున్నారు. -
‘మత్తు’ మాటలవి!
ఉక్కుపాదం మోపడం ద్వారా మద్యపానాన్ని నియంత్రిస్తూ, మద్యం అమ్మకాల పరిమాణాన్ని తగ్గించాం. ఇదే సమయంలో ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచితే అదెలా కుంభకోణం అవుతుంది? కనీస పరిజ్ఞానం లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బాగా మందు తాగిన వ్యక్తి కూడా చంద్రబాబులా అబద్ధాలు చెప్పరని అర్థమవుతోంది. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడే 14 డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మేం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ డిస్టిలరీల నుంచే మద్యం సరఫరా అవుతోంది. అయితే మా హయాంలో విషం అయిన మద్యం.. చంద్రబాబు హయాంలో అమృతం అవుతుందా?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్వేతపత్రం పేరుతో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. 2014–19 మధ్య లిక్కర్ అమ్మకాల్లో ఏటా 15 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఈ లెక్కన 2018–19 నాటికి 3.84 కోట్ల కేసుల మద్యం విక్రయించారని చెప్పారు. దీన్ని బట్టి పరిశీలిస్తే 2023–24 నాటికి లిక్కర్ విక్రయాలు గణనీయంగా పెరగాల్సి ఉండగా 3.2 కోట్ల కేసుల లిక్కర్ అమ్మకాలు తగ్గాయన్నారు. 2018–19లో 2.77 కోట్ల కేసుల బీర్లు అమ్ముడు పోతే, తమ ప్రభుత్వంలో 2023–24లో 1.12 కోట్ల కేసులు మాత్రమే విక్రయించామని చెప్పారు. దీన్ని బట్టి కమీషన్లు, లంచాల కోసం అధిక పరిమాణంలో మద్యం విక్రయాలను ఎవరు పెంచారో ప్రజలు గమనించాలని విజ్ఙప్తి చేశారు. మద్య నియంత్రణ చర్యల్లో భాగంగా షాక్ కొట్టేలా ధరలను పెంచడంతో విక్రయాలు తగ్గినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. నాణ్యత లేని మద్యం సరఫరా చేసి, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీశామని తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో చలామణిలో ఉన్న బ్రాండ్లన్నింటికీ 2014–19 మధ్య బాబు పాలనలోనే అనుమతులిచ్చారని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ వంటి దాదాపు 15 బ్రాండ్ల విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 అక్టోబర్ 26న చంద్రబాబు ప్రభుత్వంలో అనుమతి ఇచ్చారు. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్ విస్కీకి 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ల బీర్లు సైతం చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే. వాటన్నింటికీ 2017 జూన్ 7న అనుమతి జారీ చేశారు. రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా 2018 నవంబరు 9న, బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు కూడా అపద్ధర్మ సీఎంగా చంద్రబాబు 2019 మే 14న అనుమతి ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి ఆ మర్నాడే 2019 మే 15న టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.. బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా క్లియరెన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకే టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన డిస్టిలరీలు తయారు చేసిన మద్యమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయ్యింది. ఈ లెక్కన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముంది? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలరా? 2014–19 మధ్య టీడీపీ హయాంలో బడి, గుడి అన్న తేడా లేకుండా మద్యం సిండికేట్లు.. పర్మిట్ రూమ్లు, బెల్ట్ దుకాణాలతో మద్యం 24 గంటలూ ఏరులై పారించారు. 4,380 మద్యం దుకాణాలకు అనుమతించి, 43 వేలకు పైగా బెల్ట్షాపుల్లో అమ్మకాలు చేపట్టారు. వాటిలో మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే 25 శాతం అధిక ధరకు విక్రయించారు. మాకు, వాళ్లకు మధ్య ఇదీ తేడా..» దశలవారీ మద్య నియంత్రణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది. » టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా, వాటిని 2,934కు తగ్గించాం.» 2019కి ముందు ప్రతి వైన్ షాప్కు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్ రూమ్లు రద్దు చేశాం. ఊరూరా విచ్చలవిడిగా కొనసాగిన 43 వేల బెల్ట్షాప్లకు స్వస్తి పలికాం. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. » ప్రైవేటు మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి.. 2019 అక్టోబరు 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించాం.» మద్యం విక్రయ వేళలు కుదించాం. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయాలు అనుమతించాం.» ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పర్చేందుకు షాక్ కొట్టేలా ధరలు పెంచాం.» అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటు చేశాం.» తద్వారా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వంలో మద్యం విక్రయాలు దాదాపు సగానికి తగ్గాయి. » మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది మా ప్రభుత్వమే. అయినా మాపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు.నాణ్యతలేని ఆరోపణలు నాణ్యత లేని మద్యం సరఫరాతో, వినియోగదార్ల ఆరోగ్యం దెబ్బతిందంటూ నాణ్యత లేని ఆరోపణలు, దుష్ప్రచారం చేశారు. నాటి మద్యంలో విషపు అవశేషాలు ఉన్నట్లు చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ పేరిట ఓ తప్పుడు నివేదికను టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అలాంటి రిపోర్ట్ మేం ఇవ్వలేదని ఆ సంస్థనే చెప్పింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. అయినప్పటికీ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం నమూనాలను హైదరాబాద్లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ల్యాబ్లో పరీక్షించాం. ఆ శాంపిల్స్ అన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ఐఐసీటీ కూడా నివేదిక ఇచ్చింది. -
11న సాయంత్రం 5 నుంచి మద్యం బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్కు 48 గంటల ముందు.. అంటే ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) వికాస్రాజ్ తెలిపారు. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించిన నేపథ్యంలో ఆ మేరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని సైతం పొడిగించాలని అబ్కారీ శాఖను ఆదేశించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో.. ఆ రోజు సైతం మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు డ్రైడే అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఢిల్లీ లిక్కర్ విధానం కేసు ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖుల అరెస్టులతో ఢిల్లీ లిక్కర్ విధానం కేసు కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు ఏమిటన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా అరెస్టు చేసింది. -
కొత్త ఏడాదికి లిక్కర్తో కిక్కిచ్చిన మందుబాబులు..!
కొత్త ఏడాదికి లిక్కర్తో కిక్కిచ్చిన మందుబాబులు..! -
మద్యం విక్రయాలపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ)/ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): మద్యం విక్రయాల్లో చెల్లింపులు సక్రమంగా లేవంటూ ఒక చోట ప్రచారం.. మద్యం అమ్మకాల వల్లే ప్రజల ఆరోగ్యం చెడిపోతోందంటూ మరోచోట విమర్శలు.. ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరు. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే లక్ష్యంగా ఆమె విమర్శల తీరు ఉందని ఆపార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నరసాపురంలో ఓ ప్రభుత్వం మద్యం దుకాణానికి వెళ్లి పురందేశ్వరి హడావుడి చేశారు. అక్కడ ఆమె చేసిన దు్రష్పచారాన్ని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ గట్టిగా తిప్పికొట్టింది. నరసాపురం మద్యం దుకాణంలో రూ. లక్ష మద్యం అమ్మకాలు జరిగినా కౌంటర్లో కేవలం రూ. 700 బిల్లు మాత్రమే చూపిస్తున్నారని ఆమె అసత్య ఆరోపణలు చేశారు. అయితే ఆ మద్యం దుకాణంలో గురువారం రూ. 2,60,330 విలువైన మద్యాన్ని విక్రయించి ఆమేరకు ఖజానాకు జమ చేసినట్టు బెవరేజెస్ కార్పొరేషన్ ఆధారాలతో సహా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పురందేశ్వరి నరసాపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని ఆ రోజు ఎంత విలువైన మద్యాన్ని విక్రయించారని ప్రశ్నించారు.అందుకు ఆ సిబ్బంది రూ. లక్షకు పైగా మద్యాన్ని విక్రయించినట్టు తెలిపారు. ఆ దుకాణంలో అప్పటికి డిజిటల్ చెల్లింపులు రూ. 700 మేరకు జరిగాయి. అదే విషయాన్ని సిబ్బంది చెప్పారు. ఆ విషయాన్ని పురందేశ్వరి వక్రీకరిస్తూ రూ. లక్షకుపైగా మద్యం అమ్మినప్పటికీ కేవలం రూ. 700 మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారని నిరాధార ఆరోపణలు చేశారు. ఆ మద్యం దుకాణంలో నగదు, డిజిటల్ చెల్లింపులు కలిపి గురువారం మొత్తం రూ. 2,60,330 విలువైన మద్యం విక్రయానికి సంబంధించి శనివారం చలానా తీయడం ద్వారా రాష్ట్ర బెవరేజస్న్ కార్పొరేషన్ ఆ మొత్తాన్ని ఖజానాలో జమ చేసింది. ఆ చలానా కాపీని కూడా మీడియాకు విడుదల చేసింది. దాంతో పురందేశ్వరి ఆరోపణలు కేవలం దు్రష్పచారమన్నది స్పష్టమైంది. కేజీహెచ్లో అబద్ధాలు ఇలా.. శనివారం విశాఖలో పర్యటించిన పురందేశ్వరి.. కేజీహెచ్లో గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డును సందర్శించి లివర్ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగడం వల్ల లివర్ పాడైపోయిందా అంటూ వారిని ఆమె ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్న రోగులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి.. మద్యం తాగడం వల్ల 39 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. 52 మంది వార్డులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా, పురందేశ్వరి వ్యాఖ్యల్లో వాస్తవ పరిస్థితుల్ని వైద్యుల సమక్షంలో ‘సాక్షి’ పరిశీలన చేయగా.. ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు ఆమె మీడియాతో అబద్ధాలు మాట్లాడినట్లు స్పష్టమైంది. వార్డులో మొత్తం 52 పడకలున్నాయి. 36 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. కానీ.. పురందేశ్వరి మాత్రం 52 మంది ఉన్నారని 39 మంది పరిస్థితి విషమంగా ఉందని అబద్ధం చెప్పారు. వార్డులో కేవలం 30 మంది మాత్రమే లివర్ సమస్యతో బాధపడుతున్నారని.. ఏ ఒక్కరి పరిస్థితి విషమంగా లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇందులో కొంతమంది ఆరోగ్యం కుదుట పడగా.. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. దీన్ని కూడా పురందేశ్వరి దవక్రీకరించి మీడియా ముందు తప్పుడు ప్రచారం చేశారు. ఉన్న రోగుల్లో చాలా మంది ఆహార నియమాలు పాటించకపోవడం, మసాలా, జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల అడ్మిట్ అయ్యారనీ.. ఐదుగురు మాత్రమే మద్యం బాధితులు ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. బీజేపీని నిందించడం సరికాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్రంలోని బీజేపీని నిందించడం సరికాదని, ఆయన అరెస్టుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసు రాష్ట్ర పరిధిలోని సీఐడీ విచారిస్తోందన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు వ్యవహారంపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మద్యం విక్రయాల్లో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఈ దోపిడీపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. -
గుడుంబా పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చింది: ఈటల
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో గుడుంబా సీసాలు పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏటా రూ.10,700 కోట్లున్న మద్యం ఆదాయం.. ఇప్పుడు రూ.45 వేల కోట్లకు చేరిందని ఆరోపించారు. మాజీ మంత్రి చిత్తరంజన్తో భేటీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చిత్తరంజన్దాస్తో కల్వకుర్తిలోని ఆయన నివాసంలో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ను ఈటల బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక ర్తలు, అనుచరులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని చిత్తరంజన్దాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఇదీ చదవండి: నెలాఖరుకు బీజేపీ తొలి జాబితా? -
వైన్ నిల్వలు వదిలించుకొనేందుకు రూ. 1,700 కోట్లు
పారిస్: ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడడానికి ఎవరైనా మద్యం అమ్మకాలు పెంచుతారు. కానీ ఫ్రాన్స్ మద్యానికి డిమాండ్ లేకపోవడంతో ఆ నిల్వలను వదిలించుకోవడానికి దాదాపు రూ.1,700 కోట్లు (20 కోట్ల యూరోలు) ఖర్చు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ సంక్షోభం, ఆ వెంటనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు వైన్ వంటి వాటికి ఖర్చు చెయ్యడం బాగా తగ్గించేశారు. తక్కువ ధరకు లభించే బీర్కు అలవాటు పడిపోయారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల్లో ఇటీవల కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కబోత భరించలేని ప్రజలు వైన్ బదులుగా బీర్ ఎక్కువగా తాగుతున్నారు. చాలా మంది ఆల్కహాల్ ఉత్పత్తులకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్(1996 నుంచి 2010 మధ్య పుట్టినవారు) మద్యం తాగడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగా వైన్కి డిమాండ్ పడిపోయింది. మరోవైపు వైన్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన బోర్డాక్స్ ప్రాంతంలో వైన్ నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వమే ఆ వైన్ను కొనుగోలు చేసేందుకు 20 కోట్ల యూరోలు కేటాయించింది. అదనంగా ఉన్న వైన్ను కొనుగోలు చేసి దానిలోని ఆల్కాహాల్ను శానిటైజర్లు, శుభ్రతా ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటి తయారీలో వినియోగించనుంది. ఇలా చేయడం ద్వారా మళ్లీ వైన్కు డిమాండ్ పెరుగుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. వైన్ వినియోగం యూరప్ దేశాలైన ఇటలీలో ఏడు శాతం, స్పెయిన్లో 10 శాతం, ఫ్రాన్స్లో 15 శాతం, జర్మనీలో 22 శాతం, పోర్చుగల్లో 34 శాతం మేర తగ్గిపోయింది. -
దుబాయ్లో మద్యంపై పన్ను రద్దు
దుబాయ్: పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేసింది. ఇది ఆదివారం నుంచే అమల్లో వచ్చింది. అంతేకాకుండా వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్లకు ఇకపై ఎలాంటి చార్జీ వసూలు చేయబోరు. దుబాయ్లో ఎవరైనా ఇళ్లలో మద్యం సేవించాలంటే వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్ ఉండాల్సిందే. దుబాయ్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మద్యం విషయంలో కొన్ని చట్టాలను సడలిస్తోంది. అయితే, పన్ను రద్దు అనేది తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
HYD: నయా సాల్ ధమాకా.. చుక్క-ముక్క దుమ్మురేపాయి
ఢిల్లీ/హైదరాబాద్: నయా సాల్కి రోడ్లపై హడావిడి తక్కువగా కనిపించింది. వేడుకలపై పోలీస్ ఆంక్షలు అందుకు ఒక కారణం. అయితే.. ముక్క, మందుతో గప్చుప్ మజాలో రాష్ట్ర ప్రజలు ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో గతేడాది కంటే అదనంగా ఆల్కాహాల్ బిజినెస్ జరగడం గమనార్హం. కోవిడ్ ఆంక్షలు ఏమాత్రం లేకపోవడం, అమ్మకాలకు అదనపు సమయం ఇవ్వడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్లలో ఎక్కువమందిలో.. బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ 500 ఎంజీ మించి ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. 4,07,820 బీర్లు, 4,56,228 ఫుల్ బాటిళ్లు.. ఈ లెక్క నగరంలోని మద్యం బాబులు జనవరి 1 పార్టీ పేరుతో తాగేసింది. రాష్ట్ర ఎక్సైజ్శాఖ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 31వ తేదీన మద్యం డిపోల నుంచి రూ.215.74 కోట్ల విలువైన మద్యం సరఫరా అయ్యింది. చివరి వారం మొత్తంగా రూ.1,111.29 కోట్లు విలువైన అమ్మకాలు జరిగాయి.మద్యం దుకాణాలకు.. రెండు లక్షలకు పైగా కేసుల లిక్కర్, లక్షా 30 వేల దాకా బీర్ల కేసులు వెళ్లాయి. గతేడాది అదే తేదీన రూ.171.93 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. అంటే.. రూ.43 కోట్లు అదనంగా ఆల్కాహాల్ సేల్ జరిగిందన్నమాట. అలాగే.. గతేడాది చివరి వారంలో రూ.925 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే.. రూ.185 కోట్లు అదనంగా అన్నమాట. ఇక.. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో మద్యం విక్రయాలు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో నమోదయ్యింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 76,038 కేసుల లిక్కర్, 33,985 బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యధికంగా 40,655 లిక్కర్ కేసులు, 21,122 కేసుల బీర్లతో.. రంగారెడ్డి జిల్లా పరిధిలో జోరుగా విక్రయాలు జరిగాయి. మూడు జిల్లాల్లో కలిపి రూ.82.07 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో.. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.43.21 కోట్ల ఆదాయం వచ్చింది. దుకాణాలు, బార్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బిర్యానీ హవా కొత్త సంవత్సరం వేడుకల కోసం దేశంలో అత్యధికంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీ హవా స్పష్టంగా కనిపించింది. శనివారం రాత్రి పదిన్నర గంటల దాకా.. ఏకంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు ప్రముఖ ఫుడ్ యాప్ స్విగ్గీ ప్రకటించుకుంది. అదే సమయంలో.. 75.4 శాతం హైదరాబాదీ బిర్యానీకే ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ప్రకటించుకుంది. లక్నో బిర్యానీ, కోల్కతా బిర్యానీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్లోని ఓ పాపులర్ రెస్టారెంట్ ఏకంగా.. 15వేల కేజీల బిర్యానీని సర్వ్ చేయడం గమనార్హం. -
TS: 6 రోజులు.. రూ. 1,111 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలు ‘కొత్త’పుంతలు తొక్కాయి. లిక్కర్ షాప్లకు కొత్త జోష్ వచ్చింది. లెక్కకు మించిన కిక్కు వచ్చింది. చలి తీవ్రతతోపాటు కొత్త సంవత్సరం వస్తోందన్న ఉత్సాహంతో మందుబాబులు తెగ తాగేశారు. సంవత్సరం చివర్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2022 డిసెంబర్ చివరివారం రూ. 1,111.29 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోవడం గమనార్హం. చివరి ఆరురోజుల మద్యం అమ్మకాలు వెయ్యి కోట్ల మార్కును దాటాయి. ఒక్క డిసెంబర్ 30న రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి రూ.250 కోట్లకుపైగా విలువైన మందు వైన్షాపులకు తరలివెళ్లిందంటే కొత్త ఏడాది ఆరంభాన్ని మందుబాబులు ఎలా పండుగ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరి నాలుగు రోజుల అమ్మకాల విషయానికి వస్తే 2021 డిసెంబర్లో చివరి నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, ఈసారి అది రూ.775 కోట్లు దాటింది. డిసెంబర్ను పరిగణనలోకి తీసుకుంటే 2021లో రూ.2,901 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, 2022 డిసెంబర్లో ఆ విలువ రూ.3,376 కోట్లు దాటింది. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.500 కోట్లు పెరిగిందన్నమాట. 2021 సంవత్సరం మొత్తం మీద 2.73 కోట్ల లిక్కర్ కేసులు, 2.45 కోట్ల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.18,868 కోట్లపైచిలుకు కాగా, 2022లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రూ.34,352.75 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 3.5 కోట్ల లిక్కర్, 4.5 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 2020తో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2020లో రూ.16,254 కోట్లు అమ్ముడుపోయింది. -
Telangana: న్యూ ఇయర్ వేడుకలు.. మందుబాబులకు గుడ్ న్యూస్
హైదరాబాద్: కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు ఈసారి పూర్తిస్థాయిలో జరగనున్నాయి. న్యూ ఇయర్ను వెల్కం చెప్పేందుకు యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలుకుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. తాజాగా న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు రాత్రి ఒంటిగంట వరకు.. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. మరోవైపు న్యూయిర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి పాస్లు, టికెట్లు జారీ చేయొద్దని పేర్కొన్నారు.. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని తెలిపారు. చదవండి: తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్.. గతేడాదితో పోలిస్తే.. -
మందుబాబుల దసరా ‘ధమాకా’
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని మద్యం ఏడురోజులు ఏరులైంది. రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గత ఏడు రోజుల్లో మద్యం విక్రయాలు రూ.1,100 కోట్లు దాటాయి. అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 5(దసరా)న రెండురోజులు రాష్ట్రంలోని మద్యం డిపోలకు సెలవులుండగా, గత ఏడు పనిదినాల్లో కలిపి ఈ మేరకు మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సెప్టెంబర్ 30న రికార్డుస్థాయిలో రూ.313 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు సాగాయి. అయితే, సెప్టెంబర్ నెలాఖరులో వైన్షాపుల యజమానులు లిక్కర్కు ఎక్కువ ఇండెంట్ పెట్టి బీర్లు తగ్గించారు. గత ఏడు పనిదినాల్లో అమ్ముడైన మద్యం గణాంకాలను జిల్లాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్ల మేర మద్యం అమ్ముడైంది. వరంగల్ అర్బన్ (149.02 కోట్లు), నల్లగొండ (124.44 కోట్లు), కరీంనగర్ (111.44 కోట్లు), హైదరాబాద్ (108.24కోట్లు) జిల్లాల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయించారు. -
ఏరులై పారనున్న మద్యం.. కల్తీ చేసేందుకు వేల జీతాలతో ప్రత్యేక సిబ్బంది
సాక్షి, వరంగల్: ఏడాదికోసారి వచ్చే పండుగ దసరా. ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు మాంసంతోపాటు మద్యంపై ఎనలేని మక్కువ చూపుతారు. ఏ పండుగకూ లేని విధంగా దసరాకు మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా గోదాంలలో ఎక్కువగా నిల్వ చేయడంతోపాటు మద్యం దుకాణాలకు కోటాకు మించి సరఫరా చేస్తుంది. కొందరు మద్యం ప్రియులు కూడా పండుగ అవసరాల కోసం ముందస్తుగానే భారీగా కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే పండుగ సందర్భంగా మద్యానికి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ వరంగల్తోపాటు జిల్లాలోని కొన్ని వైన్స్లు, బార్ అండ్ రెస్టారెంట్లు కల్తీకి పాల్ప డుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేలకొద్దీ బాటిళ్ల మూతలు తీసి.. తక్కువ ధర ఉన్న మద్యం, నీళ్లు కలిపే తంతును కొనసాగిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా రూ.లక్షల్లో లాభాలు ఆర్జించే దిశగా కొందరు వైన్స్ సిబ్బంది ప్రయత్నిస్తున్నా.. ఆబ్కారీ శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. మందును కల్తీ చేసేందుకు అనుభవజ్ఞులైన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని.. ఏరోజుకారోజు పని పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వడంతోపాటు కొందరికి వచ్చే లాభాల్లో సగం వాటా ఇస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకొని పని కానిచ్చేస్తున్నారన్న టాక్ వస్తోంది. ఇటీవలి కాలంలో వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ వైన్స్లో కల్తీ జరుగుతుందంటూ ఎక్సైజ్ అధికారులు ఆ షాపును సీజ్ చేశారు. ఏడాదిలో తూతూమంత్రంగా ఏదో చేయాలన్నట్లుగా ఓ వైన్స్ను సీజ్ చేసిన అధికారులు నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్లోని అనేకచోట్ల కల్తీ జరుగుతున్నా పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారు. వారంతా ‘మామూలు’గా చూసుకుంటుండడంతోనే అలా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్స్లు కూడా సమయపాలన లేకుండా నడుపుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే మాటలు ప్రజల నుంచి వస్తున్నాయి. అంతేకాక మద్యం కల్తీ కావడం వల్ల ఎంత తీసుకున్నా కిక్కు ఎక్కడం లేదని కొందరు మద్యంబాబులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. మూతలు తీసేటోళ్లకు పండుగే.. దసరా పండుగ వేళ మద్యం కిక్కు ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో కొన్ని వైన్స్లు సీల్కు ఇబ్బంది లేకుండా మూత తీసి కల్తీ చేసే గ్యాంగ్లను నియమించుకున్నాయి. ఈ దందా అంతా రాత్రివేళల్లో జరిగే అవకాశం ఉండటంతో ఒక్కో రోజుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నారనే టాక్ వస్తోంది. గ్రేటర్ వరంగల్తోపాటు జిల్లాలో చాలాచోట్ల ఇలాంటి గ్యాంగ్లు ఉన్నాయి. బ్లండర్ స్పైడ్లో ఓసీ, రాయల్ స్టాగ్లో ఐబీలతోపాటు ఐబీ, ఓసీల్లో నీటిని కలిపి మద్యం ప్రియులకు విక్రయిస్తున్నాయి. రాయల్ స్టాగ్ విస్కీ బాటిళ్ల సీల్ పగలకుండా చాకచక్యంగా మూత తెరిచి దాదాపు సగం మద్యాన్ని ప్లాస్టిక్ మినరల్ వాటర్ బాటిల్లో పోస్తున్నారు. మరో బాటిల్లోని నీళ్లతో నింపి.. ఆపై విస్కీలో కలిపి బ్రాండెడ్ బాక్స్లో పెడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. గతంలోనూ ఈ తరహా వారిని హైదరాబాద్లో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసినా.. ఇక్కడ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్లోని కొత్తవాడ, హంటర్ రోడ్డు ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. ‘పెద్ద బ్రాండ్లోకి చిన్న బ్రాండ్ల మందును కలపొచ్చు. చిన్న బ్రాండ్ల్లోనూ నీళ్లు కలిపే అవకాశముంది. ఇలా లూజ్ సేల్ చేసే వైన్స్లపై నిఘా ఉంచాం. ఖానాపురంలో వైన్స్కు రూ.5,20,000 జరిమానా విధించాం. దసరా వేళ కల్తీకి అవకాశం ఉండడంతో మా సిబ్బంది క్షేత్రస్థాయిలో కన్నేసి ఉంచారు’ అని జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారి లక్ష్మణ్నాయక్ తెలిపారు. -
Telangana: మద్యం అమ్మకాల రికార్డు.. ఏడాది రాబడి 9 నెలల్లోనే!
సాక్షి, హైదరాబాద్: మద్యం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు మించి సమకూరుతోంది. మందుబాబులు తెగ తాగేసి ఖజానాకు కాసుల కళ తెస్తున్నారు. ఏడాది మొత్తం అమ్మకాల ద్వారా వస్తుందని భావించిన రాబడి కేవలం తొమ్మిది నెలల్లోనే ఖజానాకు చేరే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం రూ.17,500 కోట్లు రావచ్చని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించింది. సంవత్సరం మొత్తం రూ. 22,500 కోట్ల మేర అమ్మకాలు సాగితే అందులో 70శాతం.. అంటే రూ.17,500 కోట్ల ఆదాయం రావచ్చనేది రాష్ట్ర ప్రభుత్వం లెక్క. కానీ, తొలి ఆరునెలల్లోనే రూ.17,324 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్బీసీఎల్) లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందులో 70 శాతం అంటే... దాదాపు రూ.12 వేల కోట్లకుపైగా ఆదాయం ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చేరిందన్నమాట. ఈ లెక్కనæ మరో రెండు నెలల్లోనే రూ.17,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటుందని అర్థమవుతోంది. 2021 నేషనల్ హెల్త్ సర్వే–5 ప్రకారం మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్ప్రదేశ్, సిక్కింల తర్వాత మూడోస్థానాన్ని తెలంగాణ దక్కించుకుంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో 29 శాతానికిపైగా మందుబాబులున్నారు. ఈ మందుబాబులు తెగ తాగేస్తుండటంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలు కూడా పెంచినందున అంచనాలకు మించి ఆదాయం వస్తుండటం గమనార్హం. నాలుగోవంతు రంగారెడ్డిలోనే.. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని బేవరేజెస్ కార్పొరేషన్ లెక్కలు చెబుతున్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ జిల్లాలో రూ. 3,970.82 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. రూ.వెయ్యి కోట్ల మార్కు దాటిన జిల్లాల్లో హైదరాబాద్ (రూ.1,828.10 కోట్లు), కరీంనగర్(1,469.93), ఖమ్మం(1,100.38), మహబూబ్నగర్ (1,233.53),మెదక్ (1,424.09), నల్లగొండ(1,774.46), వరంగల్ అర్బన్ (రూ.1,745.73 కోట్లు) ఉన్నాయి. రాష్ట్రంలోని ఈ ఎనిమిది జిల్లాల్లోనే రూ.14 వేల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరగ్గా, మిగిలిన అన్ని జిల్లాలు కలిపి రూ.3 వేల కోట్ల మేర అమ్మకాలు జరగడం విశేషం. కేసులవారీగా పరిశీలిస్తే గత ఆరునెలల్లో రాష్ట్రంలోని మందుబాబులు 1.7 కోట్ల లిక్కర్ కేసులు, 2.5 కోట్ల బీర్ కేసులు లాగించేశారని గణాంకాలు చెబుతున్నాయి. -
ఏపీ మద్యం విధానం సరైనదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తి సహేతుకమైదని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏకస్వామ్య విధానాలను నిరోధించేందుకు ఉద్దేశించిన ‘కాంపిటిషన్ యాక్ట్ – 2002’కు అనుగుణంగానే ఉందని కూడా తేల్చి చెబుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారీ మద్య నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని దేశంలో ప్రముఖ విదేశీ మద్యం తయారీ కంపెనీలు వ్యతిరేకించాయి. 8 పెద్ద కార్పొరేట్ మద్యం కంపెనీలు సభ్యులుగా ఉన్న ‘ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించడాన్ని ఆ సంఘం వ్యతిరేకించింది. మద్యం కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా బెవరేజస్ కార్పొరేషన్ నిర్వహించడం కాంపిటిషన్ యాక్ట్కు విరుద్ధమని వాదించింది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయన్న బెవరేజస్ కార్పొరేషన్ వాదన సరికాదని కూడా చెప్పుకొచ్చాయి. ఆ సంఘం ఆరోపణలను రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ సమర్థంగా తిప్పికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన కొత్త మద్యం విధానం పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేయడంతో పాటు మద్యం దుకాణాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న విధానాన్ని కూడా వివరించింది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలతో సహా వివరించింది. అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లను కొంటున్నామని, వాటికి చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నామని రికార్డులతో సహా వెల్లడించింది. బెవరేజస్ కార్పొరేషన్ బకాయిలు పెడుతోందన్న కొన్ని మద్యం కంపెనీల వాదనలో నిజం లేదని వివరించింది. ఇరు పక్షాల వాదనలను విన్న కాంపిటిషన్ కమిషన్ తన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ అనుసరిస్తున్న మద్యం విధానం చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉందని తీర్పులో స్పష్టం చేసింది. బెవరేజస్ కార్పొరేషన్ చేసుకున్న మద్యం సరఫరా ఒప్పందాలు అన్నీ చట్టానికి లోబడే ఉన్నాయని చెప్పింది. బెవరేజస్ కార్పొరేషన్ మద్యం డిమాండ్ను కృత్రిమంగా సృష్టిస్తోందన్న అభియోగాలు నిరాధారమని వెల్లడించింది. ‘ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ లేవనెత్తిన అభ్యంతరాలు హేతుబద్ధంగా లేవని చెప్పింది. అందువల్ల ఈ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది. -
ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!!
గోదావరిలో ఇసుక మేటలు వేస్తే!!... తొలగించకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన. పోనీ ఇసుకను తొలగిస్తుంటే!!... బంగారంలాంటి ఇసుకను కావాల్సిన వారికి కట్టబెట్టేసి తరలించేస్తున్నారంటూ ఆవేశం. మద్యం విక్రయాలు పెరిగితే!!... ఊరూరా మద్యం ఏరులై పారుతోందని, పేదల ఆరోగ్యాన్ని బలిపెడుతున్నారని ఆక్రందన. పోనీ... మద్యం విక్రయాలు తగ్గితే!!... ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని, రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని గగ్గోలు. అంతేకాదు!! రోడ్లు బాగులేకుంటే పట్టించుకోవటం లేదంటూ అరుపులు. బాగు చేస్తుంటే అప్పులు తెచ్చేస్తున్నారంటూ పెడబొబ్బలు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నా... ఉద్యోగాల కల్పన పెరుగుతున్నా కూడా అవేమీ పట్టనట్లుగా అభివృద్ధి లేదని, వెనకబడిపోయామని దుష్ప్రచారం. ఇవన్నీ పది తలల రామోజీరావులోని రంగులు. ఆయన పుత్రిక ‘ఈనాడు’లో రోజూ పేజీల కొద్దీ పరిచే వార్తలు. పోనీ రామోజీలో ఇన్ని భావావేషాలు అన్నివేళలా ఉంటాయా అంటే.. ఆ ఛాన్సే లేదు. చంద్రబాబు నాయుడు కాకుండా వేరొకరు అధికారంలో ఉంటేనే ఈ వేషాలన్నీ బయటకు వస్తాయి. బాబు అధికారంలో ఉంటే ఐదేళ్లూ రోడ్లేయకపోయినా... రోడ్లేయటానికి ఉన్న ఇబ్బందులే రామోజీకి కనిపిస్తాయి. ఇసుక ఉచితమంటూ ఎమ్మెల్యేలు మాఫియా డాన్లలా మారి అమ్మేసినా అదంతా ఆయన దృష్టిలో జనహితమే. బెల్టు షాపులు పెట్టి మద్యం ఊరూరా పారించినా... ఆ తప్పు తాగేవాళ్లదే తప్ప బాబుది కాదు. టీకొట్టు నడిపేవాళ్లని దావోస్ తీసుకెళ్లి.. వాళ్లకి కోట్లు తొడిగి ఎంఓయూలు చేసుకుంటే... వాళ్లంతా రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే పారిశ్రామికవేత్తలే. ఇంతెందుకు!! బాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నా... అది చారిత్రక అవసరమే. బాబు ఏం చేసినా... అది దేశ ప్రయోజనాల కోసమే. ఇప్పుడు కూడా చంద్రబాబు గెలవాల్సిన చారిత్రక అవసరాన్ని పదేపదే గుర్తు చేస్తూ ఇలాంటి దగుల్బాజీ రాతలు రాసేవాళ్లు ఆశిస్తున్నది ఒక్కటే. ఈ ప్రభుత్వానికి జనాదరణ తగ్గటం లేదు. కాబట్టి దీన్ని ఏ పనీ చేయకుండా కట్టడి చేయాలి. రాష్ట్రంలో కరెంటు, రోడ్లు, నీళ్లు ఏవీ లేవని విపరీతంగా దుష్ప్రచారం చెయ్యాలి. నిరుపేదల సంక్షేమాన్ని నిలిపేసేలా చెయ్యాలి. ఆదాయం తగ్గినా... అప్పులు మాత్రం తేనివ్వకూడదు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఉన్న జనాదరణ తగ్గిపోవాలి. తామెన్ని చేసినా ఆయనే గెలుస్తాడు కనక ప్రతిపక్షాలన్నీ కలిసిపోవాలి. లేకపోతే తామే కలిపేయాలి. ఏ మార్గంలో అయినా... ఎవరి సాయంతో అయినా అర్జెంటుగా చంద్రబాబును కుర్చీ ఎక్కించేయాలి. ‘ఈనాడు’ చూసేవారికి ఎవరికైనా అర్థమయ్యేది ఇదే!!. ఏ రాష్ట్రానికైనా ప్రధాన ఆదాయ వనరులు తక్కువే. పన్నుల్లో అధికభాగం వచ్చేది మద్యం.. పెట్రోలు నుంచే. పెట్రోల్లో కేంద్రానిదే సింహభాగం. వీటితో పాటు రుణాలు, గ్రాంట్లు ఇతరత్రా ఆదాయంపైనే ఏ రాష్ట్ర బడ్జెట్టయినా నడుస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదీ ఈ నిధులతోనే. అలాంటిది రాష్ట్రం ఒక వంక మద్య నియంత్రణకు కట్టుబడి షాపులు తగ్గించి.. బెల్టు షాపులు తీసేసి... అమ్మకాలను తగ్గిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు కెళుతుంటే ఈ రాతలేంటి రామోజీ? రాష్ట్రానికి ఆదాయం వస్తే తప్పా? చంద్రబాబు హయాంలో ఏటేటా మద్యం విక్రయాలు విపరీతంగా పెరుగుతూ పోయినా మీ పెన్నులోంచి ఒక్క అక్షరమూ రాలి పడలేదెందుకు? 7.81 కాంపౌండెడ్ వృద్ధితో 2015–16లో 306 లక్షల కేసులుగా ఉన్న మద్యం విక్రయాలు 2018–19లో బాబు దిగిపోయే నాటికి ఏకంగా 384 లక్షల కేసులకు చేరాయి. మద్య నిషేధ ఉద్యమాన్ని నడిపి... తన ఫిలింసిటీలో క్యాబరేలకూ ఓకే చేసిన ఉద్యమనేత రామోజీ బీరు విక్రయాలైతే 168 లక్షల కేసుల నుంచి ఏకంగా 227 లక్షలకు చేరాయి. నిజానికి అదే వృద్ధి నేటికీ కొనసాగితే 2021–22లో 481 లక్షల మద్యం కేసులు విక్రయించి ఉండాలి. కానీ వాస్తవంగా 266 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. దీన్నిబట్టే ప్రభుత్వం మద్య నియంత్రణకు ఏ స్థాయి కృషి చేస్తోందన్నది అర్థమవుతుంది. అంకెలు చెబుతున్న ఈ వాస్తవాలను కూడా రామోజీరావు పరిగణనలోకి తీసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఎంత దారుణమైన వార్తలు రాసయినా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచటమే ఆయన ధ్యేయం. తనవాడైన చంద్రబాబును మళ్లీ పీఠంపై చూడాలన్నది ఆయన కల. జనం గుండెల్లో నిలిచి...ఎందరినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న వైఎస్ జగన్ తన వాడు కాదు మరి!!. అదే అసలు తేడా. పకడ్బందీ దుష్ప్రచారపు వ్యూహం ‘ఈనాడు’ సహా ఎల్లో పత్రికల్లో మొదట పతాక శీర్షికల్లో వేస్తారు. తరవాత ఆ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు రకరకాలుగా మీడియాతో మాట్లాడతారు. అవన్నీ మళ్లీ ఆ మీడియా ప్రాధాన్యం ఇచ్చి ప్రచురిస్తుంది. వీటిని మళ్లీ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేస్తారు. ఈ పోస్ట్లనూ మీడియాలో సందర్భాన్ని బట్టి వేస్తారు. ఇదీ... నచ్చని ప్రభుత్వాలపై దుష్ప్రచారానికి ఎల్లో మీడియా చేసే పకడ్బందీ దుష్ప్రచార ప్రణాళిక. ఇప్పుడీ ప్రణాళికలో సీబీఎన్ దత్తపుత్రుడు కూడా చేరిపోయాడు. ‘ఈనాడు’ వార్తకు తన వెటకారపు పైత్యాన్ని జోడించి చెలరేగిపోయాడు. పథకం ప్రకారం దాన్ని మళ్లీ ‘ఈనాడు’ తన వెబ్సైట్లో పెట్టేసింది. ఇంకెన్నాళ్లు రామోజీ ఈ ఎల్లో జర్నలిజం? పత్రిక పేరిట రాజకీయాలెందుకు? నేరుగా రాజకీయాల్లో చేరిపోవచ్చుగా? ‘మత్తు’ ఎవరిది రామోజీరావు గారూ? ఇక స్వయంగా రామోజీ విషయానికొస్తే... ఆయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధ ఉద్యమానికి సారథి. పోటీగా వచ్చిన ‘ఉదయం’ పత్రిక ఆర్థిక మూలాలు మద్యం డబ్బులోనే ఉన్నాయని భావించి... అందరినీ ఎగదోసి ఉద్యమాన్ని నడిపిన ‘నాయకుడు’. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపి... చంద్రబాబును ఎక్కించాక... నిషేధానికి తూట్లు పొడిచిన మహా పత్రికావ్రతుడు. ఇక ఇప్పుడు నేరుగా తన పేరిట పెట్టుకున్న ఫిలింసిటీలో మద్య ప్రవాహాన్ని పారిస్తూ... క్యాబరేలు, అర్థనగ్న నృత్యాలక్కూడా తెరలు తీసిన ఫక్తు వ్యాపారి. మరి ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే ఎలా? తెలుగు రాష్ట్రాల్లో ఈ చరిత్ర తెలియనిదెవరికి? ఇదే చంద్రబాబు అయ్యుంటేనా...!! ఆదివారం ‘ఈనాడు’ అచ్చేసిన రామోజీ ‘మత్తు’ వార్తలో ప్రధానంగా పేర్కొన్న విషయం ఒక్కటే. ఇప్పుడున్న వడ్డీ రేట్లతో పోలిస్తే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చాలా ఎక్కువ వడ్డీకి రుణం తెచ్చేసిందని, అది మున్ముందు భారమైపోతుందని!!. నిజానికి ఏ ప్రభుత్వమైనా నేరుగా తను జారీ చేసే రాష్ట్రాభివృద్ధి బాండ్లపై తక్కువ వడ్డీయే చెల్లిస్తుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసే బాండ్లపై మాత్రం కాస్త ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఇపుడు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు 8.03 శాతం వడ్డీ చెల్లిస్తుండగా బెవరేజెస్ కార్పొరేషన్ మాత్రం 9.32 శాతం వడ్డీతో బాండ్లు జారీ చేసింది. నిజానికిపుడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి అనిశ్చితి రాజ్యమేలుతోంది. గతనెల దేశంలో ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరగా... గ్రామాల్లో ఈ రేటు 8.38 శాతంగా ఉంది. గత ఎనిమిదేళ్లలో ఇదే రికార్డు. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరటంతో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచింది. మన ఆర్బీఐ ఇదే బాటలో నడవగా... యూరోపియన్ సెంట్రల్ బ్యాంకూ ఈ ది«శగానే వెళుతోంది. ఇలాంటి సమయంలో 9.32 శాతం వడ్డీ అంటే చాలా తక్కువకిందే లెక్క. ఇదే గనక చంద్రబాబు చేసి ఉంటే రామోజీ మంగళహారతులు పట్టి మరీ పతాక శీర్షికల్లో బాబు గొప్పతనాన్ని, చాణక్యాన్ని కుమ్మేసేవారు. కానీ ముఖ్యమంత్రి జగన్ కనక ఈ అప్పు తేవటమే నేరమన్న తీరులో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ హయాంలో... అబ్బో!! టీడీపీ హయాంలో ఏపీసీఆర్డీఏ బాండ్లు జారీ చేసి రూ.2,000 కోట్లు సమీకరించింది. అప్పట్లో రాష్ట్రాభివృద్ధి రుణాలకు ప్రభుత్వం 8.42 శాతం చెల్లిస్తుండగా... సీఆర్డీఏ 10.32 శాతం వడ్డీకి బాండ్లు జారీ చేసింది. రూ.1,300 కోట్ల మేర జారీ చేయగా రూ.2,000 కోట్లకు (1.5 రెట్లు) బిడ్లు వచ్చాయి. దీంతో చంద్రబాబును, ఆయనపై ఇన్వెస్టర్లకున్న నమ్మకాన్ని వర్ణిస్తూ ‘ఈనాడు’ ఆకాశానికి ఎత్తేసింది. బాబు ముంబయి వెళ్లి తన సక్సెస్పై ఇంటర్వ్యూలిచ్చారు. కానీ ఇపుడు తక్కువ వడ్డీకి బెవరేజెస్ కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లకు ఏకంగా 4.5 రెట్ల స్పందన వచ్చింది. అయినా దీన్ని వ్యతిరేక కోణంలో చూస్తూ దుష్ప్రచారానికి పూనుకున్నారు రామోజీ జర్నలిజాన్ని ఏమనుకోవాలన్నది జనం విజ్ఞతకే వదిలిపెట్టాల్సిన అంశం. ప్రభుత్వ సంస్థలు అప్పులు తెస్తే తప్పా? ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు తేవటం నేరమన్నట్లు, అదేదో ఘోరమన్నట్లు రామోజీరావు గుండెలు బాదేసుకున్నారు. నిజానికి ప్రభుత్వ గ్యారెంటీతో ప్రభుత్వ పీఎస్యూలు అప్పులు తేవటమన్నది చంద్రబాబు హయాంలో బీభత్సంగా జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర పీఎస్యూలకు రూ.14,028 కోట్ల అప్పులు రాగా... వాటిని చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో ఏకంగా రూ.59,250 కోట్లకు తీసుకెళ్లిపోయారు. అంటే దాదాపు నాలుగు రెట్లు పెంచేశారు. అయినా రామోజీకి ఎన్నడూ ఇది కనిపించకపోవటమే చిత్రాతిచిత్రం. మద్యం తగ్గటం కనిపించటం లేదా? మద్యాన్ని దశలవారీగా తగ్గించి, నియంత్రిస్తామని ఎన్నికలకు ముందే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా దానికే కట్టుబడి... దానికి తగ్గట్టే చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాల సంఖ్యను ఏకంగా 40 శాతం తగ్గించేశారు. బాబు హయాంలో ఏకంగా 4,300 మద్యం దుకాణాలుండగా... వాటి సంఖ్యను 2,934కు పరిమితం చేశారు. మద్యం షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్లను పూర్తిస్థాయిలో రద్దు చేశారు. దీనికితోడూ చంద్రబాబు ఊరూరా ప్రోత్సహించిన దాదాపు 43,000 బెల్టు షాపుల ఉనికే లేకుండా చేశారు. ఫలితంగా మద్యం వినియోగం రాష్ట్రంలో అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. జనం దూరంగా ఉంటారన్న ఉద్దేశంతో ముందు చెప్పినట్లే కొన్నింటిపై రేట్లు పెంచారు. ఇవన్నీ నచ్చని రామోజీరావు తన దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. వైఎస్సార్ నోరు పారేసుకున్నారు.. చంద్రబాబు క్లాస్ పీకారు... చంద్రబాబు, ఇతర నాయకుల విషయంలో రామోజీ రాసే వార్తల్లో ఎంత ‘విష’యం ఉంటుందన్నది ఈ చిన్న వార్తను చూస్తే తెలుస్తుంది. 2008 జూన్ 19న ఒకే రోజు అటు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాలు నిర్వహించారు. అందులో కొందరు విలేకరుల తీరుపై ఇద్దరూ అసహనం వ్యక్తం చేశారు. కానీ దానిపై ‘ఈనాడు’ ప్రచురించిన వార్తలకు శీర్షికలేంటో తెలుసా? ఒకదానికేమో ‘మీడియాపై నోరు పారేసుకున్న వైఎస్’. మరోదానికేమో ‘మీడియాకు క్లాస్ పీకిన చంద్రబాబు’. అదీ కథ. ‘ఈనాడు’ జర్నలిజం గురించి, రామోజీ నీతినియమాల గురించి చెప్పటానికి ఇదొక్కటి చాలేమో. అదే విషయాన్ని ఆ మర్నాడు నాటి సీఎల్పీ ఎండగట్టింది. -
తెగ తాగేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ధరలు ఎంత పెరిగినా మందుబాబులు తగ్గేదేలే అంటున్నారు. మండే ఎండల్లోనూ మద్యాన్ని మస్తుగా లాగించేస్తున్నారు. మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల విలువ ఏకంగా రూ. 3 వేల కోట్లు దాటింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ. 677 కోట్ల విలువైన మద్యాన్ని లాగించగా ఆ తర్వాతి స్థానాల్లో వరంగల్ అర్బన్, నల్లగొండ జిల్లాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు 55.72 లక్షల బీర్ కేసులు, 29.61 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి. అంటే సగటున రోజుకు 2 లక్షల బీర్ కేసులు, లక్ష కేసుల లిక్కర్ను రాష్ట్రంలోని మద్యం ప్రియలు లాగించేస్తున్నారన్న మాట. ఇక జిల్లాలవారీ గణాంకాలను పరిశీలిస్తే మొత్తం మద్యం విక్రయాల్లో వరంగల్ అర్బన్, నల్లగొండ జిల్లాలు కలిపి 20 శాతానికిపైగా అమ్మకాలు జరుగుతున్నాయి. వరంగల్ అర్బన్లో మే మొత్తంమీద రూ. 318 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్ముడయింది. ఇందులో 6 లక్షల బీర్ కేసులు, 2.96 లక్షల లిక్కర్ కేసులు ఉన్నాయి. ఇక నల్లగొండలో కూడా మద్యం విక్రయాలు రూ. 300 కోట్లు దాటాయి. ఒక్క నెలలోనే ఇక్కడ 3 లక్షల లిక్కర్ కేసులు, 5.9 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. -
‘కిక్కు’ తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: భారీగా పెరిగిన మద్యం ధరలు గ్రేటర్లో మద్యం ప్రియులకు శరాఘాతంగా మారాయి. అనూహ్యంగా పెరిగిన ధరల దృష్ట్యా లిక్కర్ వినియోగం కొంత వరకు తగ్గింది. కానీ ఆబ్కారీశాఖ ఆదాయం మాత్రం పెరిగింది. అన్ని రకాల బీర్లు, మద్యం బ్రాండ్లపైన ప్రభుత్వం కనిష్టంగా రూ. 20 నుంచి గరిష్టంగా సుమారు రూ.160 వరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో బ్రాండ్ ధర ఒక్కో విధంగా పెరిగింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన మద్యం ప్రియులపైన ధరల భారం పడింది. అనూహ్యంగా పెరిగిన ధరలు నిరాశకు గురిచేశాయి. ధరల పెంపునకు ముందు రోజు అమ్మకాలను నిలిపివేశారు. ఆ తరువాత కొత్త ధరలతో అమ్మకాలు మొదలయ్యాయి. తగ్గుదల ఇలా... ధరల పెంపునకు ముందు రంగారెడ్డి జిల్లాలో సుమారు 4 లక్షల కేసుల బీర్లు విక్రయించగా ధరల పెంపు తరువాత ఈ నెల 19 నుంచి 28 వరకు 3.6 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సుమారు 40 వేల కేసుల వరకు బీర్ల అమ్మకాలు పడిపోయాయి. గ్రేటర్లో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగే రంగారెడ్డి జిల్లాలో ధరల పెంపునకు ముందు 1.86 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం విక్రయిస్తే ధరలు పెరిగిన తరువాత 1.84 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. సుమా రు 20 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి. అలాగే హైదరాబాద్, మేడ్చెల్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలోనూ ధరల పెంపునకు ముందు, తరువాత లిక్క ర్ అమ్మకాల్లో వ్యత్యాసం స్పష్టంగా నమోదైంది. పెరిగిన ధరల దృష్ట్యా మద్యం వినియోగం కొంత మేరకు తగ్గిందని పలు వైన్షాపులకు చెందిన నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. వేసవి ఇంకా నిప్పులు చెరుగుతున్నప్పటికీ బీర్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం. బీరుపైన పెరిగిన ధరలు స్వల్పమే అయినా గత వారం కంటే వినియోగం తగ్గింది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఈ నెల మొదటి పది రోజుల్లో 85 వేల కేసుల బీర్లు విక్రయిస్తే ఈ నెల 19 నుంచి 28 వరకు 80 వేల కేసుల బీర్లు అమ్మారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆదాయం పెరిగింది... లిక్కర్ ధరలు పెంచడంతో అమ్మకాలు తగ్గినా ఆదాయం మాత్రం కొద్దిగా పెరిగింది. ఈ నెల 8వ తేదీ నుంచి 17 వరకు గ్రేటర్లోని మూడు జిల్లాల పరిధిలో రూ.315 కోట్ల ఆదాయం నమోదు కాగా, 19వ తేదీ నుంచి 28 వరకు రూ.351 కోట్లకు ఆదాయం పెరిగింది. మూడు జిల్లాల్లోనూ రంగారెడ్డి టాప్లో ఉంది. ధరల పెంపునకు ముందు రూ.192 కోట్ల ఆదాయం లభించగా, ప్రస్తుతం రూ.212 కోట్లకు పెరిగింది. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
పోలీసు వెబ్సైట్ ద్వారానే లైసెన్సుల రెన్యువల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తూ వ్యాపార సంస్థల లైసెన్సుల రెన్యువల్కు పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారానే అవకాశం కల్పించనున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో బార్లు, రెస్టారెంట్లు, పబ్బులతో పాటు డ్రైవ్–ఇన్ రెస్టారెంట్ల యాజమాన్యాలతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలోనే త్వరలో ఆన్లైన్ రెన్యువల్ విధానం అమలులోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో కొకైన్ దొరకడం, కొన్ని పబ్బు ద్వారా తీవ్ర ధ్వనికాలుష్యం వెలువడుతోందని, వీటి పార్కింగ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, మందుబాబుల ఆగడాలు పెరిగాయని వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కొత్వాల్ ఈ సమావేశం నిర్వహించారు. తమ లాభాల కోసం కొన్నింటి యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ సిటీకి అపఖ్యాతి తీసుకువస్తున్నారని ఆనంద్ అన్నారు. ఈ సమావేశానికి హాజరైన దాదాపు 100 మందికి సిటీ పోలీస్ యాక్ట్, అందులోని నిబంధనలు ఇతర అంశాలను వివరించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే తక్కువ వయస్సు ఉన్న వారిని పబ్బుల్లోకి, బార్లలోకి అనుమతించవద్దని, ధ్వని స్థాయిలను పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం 30 రోజుల బ్యాకప్తో ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రాంగణంలో సౌండ్ ప్రూఫింగ్, వ్యాలెట్ డ్రైవర్లు, సిబ్బంది, కస్టమర్లను గమనిస్తూ ఉండటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మద్యం సరఫరాకు సంబంధించి రాత్రి 11 గంటల తరువాత వచ్చిన ఆర్డర్లను అంగీకరించరాదని కచ్చితంగా 12 గంటల లోపు మూసివేయాలని ఆదేశించారు. (క్లిక్: దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్) శుక్ర, శనివారాల్లో లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని అర గంట అదనపు సమయంతో సహా గంట మినహాయింపు ఇస్తున్నామన్నారు. పాశ్చాత్య దేశాలలో పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందు నిర్వాహకులు తమ లైట్లను డిమ్ చేస్తూ కస్టమర్లు అది మూసే సమయమైందని తెలిసేలా చేస్తారని, ఇక్కడా ఈ విధానం అమలు చేయాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికులు లేదా ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని స్టార్ రేటింగ్ ఉన్న హోటళ్లలో 24 గంటలూ మద్యం విక్రయించేందుకు అనుమతి ఉంటుందని, ఇది సాధారణ ప్రజల కోసం కాదని ఆనంద్ స్పష్టం చేశారు. ఇలాంటి బార్లు, రెస్టారెంట్లు, పబ్బులకు ఇకపై అనుమతులు ఉండవని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీలు ఎం.రమేష్, పి.విశ్వప్రసాద్లతో పాటు జోనల్ డీసీపీలు పాల్గొన్నారు. (క్లిక్: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు) -
కరోనా అదుపు.. మందుబాబుల జోరు.. గరిష్ట స్థాయిలో అమ్మకాలు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రెండో, మూడో దశ కరోనా వైరస్ నియంత్రణలోకి రాగానే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. 2021–22 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలోని మద్యం ప్రియులు ఏకంగా 23.58 కోట్ల లీటర్ల విదేశీ మద్యం, 34.83 కోట్ల లీటర్ల దేశీ మద్యాన్ని, అలాగే 23.13 లక్షల లీటర్ల బీరు, 0.86 లక్షల లీటర్ల వైను సేవించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వద్ద నమోదైన వివరాలను బట్టి తెలిసింది. 2020 మార్చిలో విధించిన లాక్డౌన్ కారణంగా వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసి ఉన్నాయి. ఆ తరువాత దశలవారీగా లాక్డౌన్ నియమాలు సడలించడంతో సమయపాలన పాటి స్తూ అప్పుడప్పుడు వైన్ షాపులు తెరిచి ఉండేవి. కాని ఈ ఏడాది జనవరి నుంచి లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో మద్యం విక్రయాలు మరింత జోరందుకున్నాయి. విదేశీ మద్యంతో పోలిస్తే బీర్ల విక్రయం కొంతమేర తగ్గింది. కాని గత పదేళ్లతో పోలిస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో మద్యం విక్రయాలు పెరిగాయని రికార్డులను బట్టి స్పష్టమైతోంది. 2012–13 ఆర్ధిక సంవత్సరంలో 80.55 లక్షల లీటర్ల మద్యం అమ్ముడుపోగా రూ.9,297 కోట్ల ఆదాయం వచ్చింది. అదే 2021–22 ఆర్ధిక సంవత్సరంలో 82.4 కోట్ల లీటర్ల మద్యం విక్రయం కాగా రూ.17,177 కోట్ల ఆదాయం వచ్చినట్లు రాష్ట్ర ఆదాయ పన్ను వద్ద నమోదైన రికార్డులను బట్టి తెలిసింది. చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. మద్యం విక్రయాలతో పాటు బార్లు, వైన్ షాపుల లైసెన్స్ రిన్యూవల్, కొత్త లైసెన్స్లు జారీ, మద్యం స్మగ్లింగ్ లపై చేసిన దాడులు, పన్నులు తదితరాల వల్ల వచ్చిన ఆదాయం కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. 2021–22 ఆర్ధిక సంవత్సరంలో మద్యం స్మగ్లింగ్, అక్రమంగా మద్యం తయారుచేయడం, అనుమతి లేకుండా విక్రయించడం తది తరా కారణాలవల్ల పట్టుబడ్డ 34,849 మందికి పోలీసులు బేడీలు వేశారు. పదేళ్లతో పోలీస్తే ఇంతపెద్ద సంఖ్యలో నింధితులు పట్టుబడడం ఇదే ప్రథమం. -
ఒక్క రోజు.. రూ. 307 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్చి నెలాఖరు రోజు మద్యం భారీగా అమ్ముడైంది. ఆర్థిక సంవత్సరం చివరి రోజున వెల్లువలా డిపోల నుంచి వైన్, బార్ షాపులకు మందు తరలివెళ్లింది. ఈ ఒక్కరోజే రూ.307 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం ఇదే తొలిసారని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలలో రూ. 2,814 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి బయటకు వచ్చింది. గతేడాది డిసెంబర్లో రూ. 3,459 కోట్ల అమ్మకాల తర్వాత ఇదే ఎక్కువ కావడం గమనార్హం. మరోవైపు 2021–22 ఆర్థిక సంవత్సరం మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయని ఎక్సైజ్ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏకంగా రూ. 31,046 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత భారీగా మద్యం అమ్ముడవడం, రూ.30 వేల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. 2020–21తో పోలిస్తే దాదాపు రూ. 5 వేల కోట్లు ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయి. 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తం 3,49,95,281 బీరు కేసులు.. 3,73,93,385 లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. -
TDP Alapati Raja: నవ్విపోదురు ‘రాజా’
సాక్షి, గుంటూరు(తెనాలి): దశలవారీ మద్య నిషేధంపై అవాకులు చెవాకులు పేలుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడే యథేచ్ఛగా అక్రమ మద్యం అమ్మకాలకు తెగబడ్డాడు. గోవా నుంచి కంటైనర్లో మద్యం తెప్పించి ఓ రహస్య ప్రదేశంలో అమ్ముతూ ఎస్ఈబీ పోలీసులకు ఈనెల 19న రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఈ వ్యక్తి గతంలో ఓ హత్యకేసులోనూ నిందితుడు. ఇతను తెనాలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అనుచరుడే కావడం గమనార్హం. మహిళలను వెంటేసుకుని ఆలపాటి రాజేంద్రప్రసాద్ మద్యం అమ్మకాలపై ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన వెలుగు చూడడంతో ప్రజల్లో ప్రతిపక్షం నవ్వులపాలవుతోంది. చదవండి: (పరిటాల సునీత, శ్రీరామ్పై కేసు నమోదు) అసలేం జరిగిందంటే..! బుర్రిపాలెంకు చెందిన శాఖమూరి బాబు సురేంద్ర తెలుగు యువత తెనాలి రూరల్ మండల అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అనుచరుడు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులో నివాసం ఉంటాడు. ఇతను వేంపాటి వేణుబాబు, జాస్తి సతీష్, గడ్డిపాటి బాపనయ్య చౌదరి అనే వ్యక్తులతో కలిసి గోవా నుంచి కంటైనర్లో మద్యం తీసుకొచ్చాడు. వీరందరూ కలిసి రెడ్డిపాలెం దగ్గర్లో రహస్యంగా అమ్మకాలు చేస్తూ ఈనెల 19న గుంటూరులో ఎస్ఈబీ పోలీసులకే మద్యం అమ్మబోయి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. 174 బాక్సుల్లోని 2,800 మద్యం సీసాలను ఎస్ఈబీ గుంటూరు–2 టౌన్ సీఐ కర్ణ, అడిషనల్ ఎస్పీ బిందు మాధవ్, ఈఎస్ అన్నపూర్ణమ్మ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. గతంలోనూ నేరచరిత్ర ►సురేంద్ర గతేడాది నల్లపాడు పోలీస్ స్టేషను పరిధిలో జరిగిన హత్య కేసులో రెండో నిందితుడు. ►2020 లాక్డౌన్ సమయంలోనూ బుర్రిపాలెంరోడ్డులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నేరంపై శాఖమూరి బాబు సురేంద్రపై కేసు నమోదైంది. ►ఆలపాటి రాజా దన్నుతోనే ఇతడు ఇన్ని నేరాలకు పాల్పడుతున్నాడని, అక్రమ మద్యాన్ని గుంటూ రులోని ఆలపాటి రాజాకు చెందిన హోటల్కూ సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. -
సిటీ జనుల మందు ‘పార్టీ’.. ఏకంగా రూ.100 కోట్లు తాగేశారు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా గ్రేటర్లో మద్యం అమ్మకాలు పెరిగాయి. మూడు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే అమ్మకాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.55 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరగగా హైదరాబాద్లో రూ.25 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడైంది. మేడ్చల్ జిల్లాలో రూ.20 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. సాధారణంగా దసరా, డిసెంబర్ 31 సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులు రావడంతో మద్యం ప్రియులు పండగ చేసుకున్నారు. -
కొత్త ఏడాది ఊపుతో తెగ తాగేశారు.. మొత్తం రూ.2,901 కోట్ల మద్యం..
సాక్షి, హైదరాబాద్: పెరిగిన చలి, కొత్త ఏడాది ఊపుతో గతేడాది చివర్లో మందుబాబులు కేసులకు కేసులు మందు, బీర్లు లాగించేశారు. డిసెంబర్ చివరి 4 రోజుల్లో రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి సుమారు రూ.600 కోట్ల విలువైన మద్యం మార్కెట్లోకి వెళ్లింది. 2021, డిసెంబర్ 31న దాదాపు రూ.171 కోట్ల మద్యం అమ్ముడుపో వడం గమనార్హం. ఇక, డిసెంబర్ నెల మొత్తం మీద రూ.2,901 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలలో 40.11 లక్షల కేసుల లిక్కర్, 33.93 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. గత ఏడాది డిసెంబర్లో 33.23 లక్షల కేసుల లిక్కర్, 26.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,276 కోట్లు. ఇక, 2021 సంవత్సరం మొత్తం మీద 2.73 కోట్ల లిక్కర్ కేసులు, 2.45 కోట్ల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ. 18,868 కోట్ల పైమాటే. అదే 2020లో రూ.16,254 కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. 2020తో పోలిస్తే 2021లో 16 శాతం ఎక్కువ మద్యం విక్రయాలు జరిగినట్లు ఎౖMð్సజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: అరుదైన రాయి.. కాపాడుకోవాలోయి -
న్యూఇయర్ వేడుకలు: లిక్కర్ టార్గెట్పై ఒమిక్రాన్ ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలను పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ఒకవైపు సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. దీంతో ఈసారి కూడా లిక్కర్ అమ్మకాలపై కోవిడ్ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మద్యం వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తాజాగా కోవిడ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎక్కువ సంఖ్యలో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధించింది. మాస్కులను తప్పనిసరి చేసింది. దీంతో ఈసారి బార్లు, రెస్టారెంట్లు, పబ్బుల్లో మద్యం వినియోగంపై ఆంక్షలు ఉండనున్నాయి. తాజాగా కొత్త సంవత్సరం జోష్ మొదలైంది. గతేడాది కోవిడ్ దృష్ట్యా వేడుకలకు దూరంగా ఉన్న యువత ఈసారి ఎలాగైనా ‘ఘనంగా మజా’ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఒమిక్రాన్ వెంటాడుతోంది. గత ఏడాదీ అంతే... గతంలో కోవిడ్ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే వినియోగించేవారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కొద్ది రోజులుగా వినియోగం పెరిగింది. రానున్న రోజుల్లో ఆంక్షల దృష్ట్యా అమ్మకాలు తగ్గవచ్చనే అంచనాతో వైన్స్ నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో మద్యం నిల్వ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు పరిణామాలను గమనించి కొత్త సంవత్సరం కోసం సరుకును తెప్పించే ఆలోచన ఉన్నట్లు ఓ వైన్ షాపు యజమాని తెలిపారు. మరోవైపు ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ ఏడాది టార్గెట్ను మరింత పెంచాలని భావిస్తున్నారు. గత సంవత్సరం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సుమారు రూ.300 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఈసారి రూ.450 కోట్లకు పైగా మద్యం విక్రయాలపై టార్గెట్ను నిర్దేశించినట్లు సమాచారం. -
Liquor Sales: ‘కిక్కెక్కిస్తున్న’ చలి!.. అమ్మకాలు అదుర్స్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. గత వారం, పది రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో చలి తీవ్రమైంది. దీంతో మద్యం ప్రియులు లిక్కర్ వినియోగాన్ని పెంచారు. కొత్త మద్యం పాలసీ ఆరంభంలోనే అమ్మకాలు పెరగడంతో మద్యం దుకాణాలు సైతం కళకళలాడుతున్నాయి. రెస్టారెంట్లు, బార్లలోనూ మద్యం వినియోగం పెరిగినట్లు ఆబ్కారీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే ఊపు న్యూ ఈయర్ జోష్ వరకు ఉంటుందని భావిస్తున్నారు. గతేడాది కోవిడ్ కారణంగా చాలా మంది కొత్త సంవత్సర వేడుకలకు దూరంగానే ఉన్నారు. పబ్బులు, బార్లు వెలవెలబోయాయి. కొద్ది రోజులుగా ఒమిక్రాన్ ఆందోళనలు నెలకొన్నప్పటికీ కోవిడ్ తీవ్రత అంతగా లేకపోవడంతో కొత్త సంవత్స వేడుకల సందర్భంగా మద్యం వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో ఇందుకు అనుగుణంగా టార్గెట్లపైన దృష్టి సారించే అవకాశం ఉంది. చలితో పాటే... గతంలో కోవిడ్ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే మద్యం వినియోగించారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. దానికి తోడు వారం, పది రోజులుగా పెరిగిన చలి వాతావరణం మందుబాబులను మరింత ఉత్సాహపరుస్తోంది. కొత్త మద్యం పాలసీ మేరకు గ్రేటర్లో 615 మద్యం దుకాణాలకు అను మతులనిచ్చిన సంగతి తెలిసిందే. నగరంలోని అన్ని చో ట్ల కొత్త దుకాణాల్లో పూర్తిస్థాయిలో అమ్మకాలు మొదలయ్యాయి. ఆరంభంలోనే లి క్కర్ సేల్స్ భారీగా పెరగడం పట్ల వైన్స్ నిర్వాహకులు సైతంసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..) 109 శాతం పెరిగిన విక్రయాలు గతేడాది డిసెంబర్తో పోల్చితే ఈ డిసెంబర్లో మద్యం అమ్మకాలు 109.29 శాతం పెరిగినట్లు ఎక్సైజ్శాఖ అంచనా. లిక్కర్కు పోటీగా బీర్ల అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. ఉదాహరణకు గత సంవత్సరం హైదరాబాద్–1 డిపో పరిధిలో 8.96 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరుగగా ఈ సారి 10.55 లక్షల కేసులకు పెరి గింది. అలాగే బీర్ల అమ్మకాలు గతేడాది 5.91 లక్షల కేసులు అయితే ఈ డిసెంబర్ నాటికి 8.58 లక్షల కేసులకు పెరిగాయి. గతేడాది కోవిడ్ కాలంలో బీర్ల వినియోగం తగ్గడం గమనార్హం. ఈ ఏడాది సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరిగి అమ్మకాలు పెరిగాయి. -
మద్యం టెండర్.. ఆదాయం వండర్
సాక్షి, హైదరాబాద్: ఈసారి మద్యం టెండర్లో గతంలో ఎప్పుడూలేనంతగా ఖజానాకు కాసులు రాలాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకుగాను నిర్వహించిన టెండర్లలో మొత్తం 67,849 దరఖాస్తులు వచ్చాయని ఎౖక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇందులో దాదాపు 10 శాతం ఒక్క ఖమ్మం జిల్లా నుంచే రావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ద్వారా రూ.1,357 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలుగా ఉంది. ఈసారి షాపుల సంఖ్య పెరగడంతో దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. గత టెండర్ల సమయంలో దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.975 కోట్ల ఆదాయం రాగా, ఈసారి దాదాపు రూ.400 కోట్లు ఎక్కువగా వచ్చింది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో కలెక్టర్లు శనివారం ఈ దరఖాస్తులకు డ్రా తీసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. గత రెండేళ్లతో పోలిస్తే రాష్ట్రంలోని కొన్ని షాపులకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయని ఎక్సైజ్ శాఖ తేల్చింది. ఇక్కడి వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ దరఖాస్తులు వేశారనే అంచనాతో ఆయా షాపుల పరిధిలో ఏం జరిగిందన్న దానిపై స్థానిక ఎక్సైజ్ అధికారులతో విచారణ జరిపించాలని కమిషనర్ నిర్ణయించారు. విచారణ తర్వాతే ఆయా షాపులకు డ్రా తీసే కార్యక్రమం ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. -
మద్యం వినియోగం తగ్గింది
కర్నూలు: ప్రభుత్వం చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో మద్యం వినియోగం భారీగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణరెడ్డి తెలిపారు. కర్నూలులోని హరిత హోటల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను జాగృతం చేయడం ద్వారానే మద్యం నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. మద్యం అక్రమాలపై 14500 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రగ్స్, మత్తు పానీయాలపై విద్యార్థులు, యువకులను జాగృతం చేసేందుకు కర్నూలు నగరం నుంచి నవంబర్ నెల 1వ తేదీన కళాజాత ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. -
Hyderabad: పెరుగుతున్న ‘కిక్కు’.. ముందుంది అసలైన పండుగ.. తగ్గేదే లే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా వైన్షాపులు, బార్లు, రెస్టారెంట్లు కళకళలాడుతున్నాయి. కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో కోవిడ్ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే వినియోగించేవారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. కానీ క్రమంగా వైరస్ ఉధృతి తగ్గిపోవడం, ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. అలాగే పర్మిట్ రూమ్లు సైతం మందుబాబులతో నిండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ 6 నెలల్లో 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగినట్లు అంచనా. సర్కార్ ఆదాయం సైతం అదేస్థాయిలో పెరిగింది. మరోవైపు మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి, నల్గొండ మొదటి రెండు స్థానంలో నిలవగా హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. నగరంలో 18,25,276 కేసుల మద్యం అమ్ముడైంది. చదవండి: చారిత్రక వేదిక.. సరదాల వేడుక: అసదుద్దీన్కు కేటీఆర్ సూచన 56 శాతం పెరిగిన బీర్ల వినియోగం కోవిడ్ కాలంలో బీర్ల వినియోగం చాలా వరకు పడిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని సైతం తగ్గించాయి. శీతల పానీయాలు, బీర్లు సేవించడం వల్ల కోవిడ్ సోకే అవకాశం ఉండవచ్చునన్న వార్తలతో బీర్బలులు బాటిల్ పక్కన పెట్టేశారు. కానీ సెప్టెంబర్ నుంచి బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే 56 శాతం వరకు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. 7,016,500 కేసుల విక్రయాలు జరిగాయి. బీర్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఒక్కో బాటిల్ పైన రూ.10 వరకు తగ్గించారు. ధరల తగ్గింపు కంటే కోవిడ్ భయం తొలగిపోవడం వల్లనే వినియోగం పెరిగినట్లు ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆదాయంలోనూ మూడో స్థానం... ►ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.14,320 కోట్ల అమ్మం అమ్మకాలు జరిగాయి. ►రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క జిల్లా నుంచే రూ.3.247 కోట్ల ఆదాయం లభించింది. ►రెండో స్థానంలో ఉన్న నల్గొండ జిల్లాలో మద్యం అమ్మకాలపైన రూ.1,599 కోట్ల ఆదాయం లభించింది. ►ఆ తరువాత మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ మద్యం ఆదాయం రూ.1510 కోట్లు ►దసరా అమ్మకాలతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ‘చదువు ఇష్టం లేదు.. ఆటలే ఇష్టం..ప్లీజ్ మాకోసం వెతకొద్దు’ -
మద్యానికి దూరంగా.. అభివృద్ధికి దగ్గరగా..
నందిగామ: కొణతమాత్మకూరు.. కృష్ణా జిల్లాలో 17వందల పైచిలుకు జనాభా ఉన్న ఓ చిన్న గ్రామం. మద్యం అలవాటు ఇక్కడ ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా చిదిమేసింది. విచ్చలవిడిగా తాగుతూ భార్యలను హింసించిన ఘటనలు ఇక్కడ కోకొల్లలు. ఇలాంటి ఊరు ఒక్కసారిగా మారిపోయింది. మద్యానికి వ్యతిరేకంగా మహిళలు సమర శంఖం పూరించడమే కారణం. ఇప్పుడు ఆ గ్రామం మద్యం ముట్టని ఊరుగా ఖ్యాతిగడిస్తూ అభివృద్ధికి పరుగులు పెడుతోంది. కృష్ణాజిల్లా నందిగామ మండలంలో ఉన్న ఈ గ్రామంలో ఒకప్పుడు ఎవరిష్టం వచ్చినట్లు వారు తాగడం.. రోజంతా కష్టపడి సంపాదించిన మొత్తం తాగుడుకే వెచ్చించడం జరిగేది. భర్తలు ఫుల్లుగా తాగడం, భార్యలను హింసించడం, మహిళలు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన మొత్తాన్ని కూడా సారా కొట్టుకే తగలేయడం, డబ్బుల్లేని రోజు పుస్తెలను సైతం తాకట్టు పెట్టి తాగడం పరిపాటిగా ఉండేది. దీంతో విసిగిపోయిన మహిళలు పోరాటానికి శ్రీకారం చుట్టారు. మద్యం వ్యతిరేక ఉద్యమానికి బీజం వేశారు. దీంతో 2005 అక్టోబర్లో పంచాయతీ తీర్మానం చేశారు. మద్యం సీసాలను ధ్వంసంచేసి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా పోరాటం చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం కదలి రావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వారు వచ్చి గ్రామంలోని మందుబాబులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలా మూడు నెలలపాటు కొనసాగిన ఉద్యమం సత్ఫలితాన్నిచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామంలో మద్యానికి చోటులేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఈ గ్రామంలో బెల్ట్ షాపు ఏర్పాటుచేసేందుకు చేసిన ప్రయత్నాలను సైతం గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడ అందరిదీ ఒకే మాట.. అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఈ గ్రామంలో కూడా పలు పార్టీలను అభిమానించే వారున్నారు. అయితే, మద్యం మహమ్మారి విషయంలో మాత్రం వారందరిదీ ఒక్కటే మాట. పలు విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. మద్యం మహమ్మారి విషయంలో, అభివృద్ధి విషయంలో మాత్రం వీరు ఒక్క తాటిపైనే ఉంటారు. పొరుగునే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఉన్నప్పటికీ, గ్రామంలోకి మద్యం తీసుకువచ్చే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ఈ గ్రామస్తుల కట్టుబాటు అలాంటిది. ఉద్యమ స్ఫూర్తితో గ్రామాభివృద్ధి ఇక్కడ మహిళలు చేపట్టిన ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తి.. గ్రామాభివృద్ధిలోనూ కొనసాగింది. దీంతో ఈ గ్రామంలో రెండు ఎత్తిపోతల పథకాలు, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్, ధాన్యం కొనుగోలు కేంద్రం వంటివి ఏర్పాటయ్యాయి. దీనికితోడు గ్రామంలోని అన్ని రహదారులు పూర్తిగా సిమెంటు రోడ్లుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు వారి అభివృద్ధికి మరింత దోహదపడుతున్నాయి. ఇలా అన్ని గ్రామాల్లోనూ ప్రజలు కలిసికట్టుగా ఉంటే గ్రామ సీమలు అభివృద్ధిలో మహా నగరాలను మించిపోవడం ఖాయం. ఈమె పేరు కనమాల పుల్లమ్మ. ఈమె భర్త కృష్ణ. మద్యానికి బానిసై 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటికి ఆమె ఉంటున్న గ్రామంలో మద్యపాన నిషేధం అమలుకాలేదు. ఇద్దరు కుమారులను పెంచేందుకు నానా కష్టాలు పడింది. రోజువారీ కూలీకి వెళ్లొచ్చిన డబ్బుతో పెద్ద కుమారుడు నాగరాజును డిగ్రీ వరకు చదివించింది. రెండో కుమారుడు వినయ్ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటూనే కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. కేవలం మద్యం మహమ్మారి వల్లే తన భర్త మరణించాడని ఆమె చెబుతోంది. ఇలా పుల్లమ్మ లాంటి అనేకమంది మహిళలు ఆ గ్రామంలో తమ భర్తల తాగుడు వ్యసనంతో పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. అభివృద్ధిలో అందరిదీ ఒకే మాట గ్రామస్తులు అభివృద్ధిని, రాజకీయాన్ని వేర్వేరుగా చూస్తారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మా గ్రామంలో రాజకీయం ఉంటుంది. అధికారంలో ఎవరున్నా, గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిందే. ఈ విషయంలో తేడా వస్తే గ్రామస్తులు సహించరు. అందరూ ఒకే తాటిపై ఉండబట్టే అభివృద్ధి సాధ్యపడుతోంది. ప్రతి విషయంలో పారదర్శకత ఉంటుంది. – మేడా కోటేశ్వరరావు, సర్పంచ్ కేసులు లేని గ్రామం కొణతమాత్మకూరు గ్రామం ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉంటాయి. ఏడాదికి ఈ గ్రామం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాదు. ప్రమాదాలు, ఇతరత్రా కేసులు అడపాదడపా వస్తాయి. అన్ని గ్రామాలు ఇలా కట్టుబాటుతో ఉంటే, గ్రామసీమలు పట్టణ వాసులకు ఆదర్శంగా నిలుస్తాయి. – కనకారావు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ -
మద్యంపై ఎవరెంత ఖర్చుపెడితే మీకెందుకు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్ని మద్యం షాపుల్లో త్వరలో డిజిటల్ రూపంలో చెల్లింపుల విధానాన్ని అమలు చేయనున్నామని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) గురువారం హైకోర్టుకు నివేదించింది. దసరా నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఏపీబీసీఎల్ తరఫు న్యాయవాది పి.నరసింహమూర్తి కోర్టుకు వివరించారు. బ్యాంకులు కూడా చెల్లింపులకు అంగీకరించాయన్నారు. ఈ నేపథ్యంలో మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ వివరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఆన్లైన్/డిజిటల్ రూపంలో చెల్లింపులను ఆమోదించడం లేదని, అన్నిచోట్లా డిజిటల్, ఆన్లైన్ చెల్లింపులను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దాసరి ఇమ్మాన్యుయెల్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దసరా నాటికి డిజిటల్ చెల్లింపులు.. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. ఏపీబీసీఎల్ న్యాయవాది దసరా కల్లా మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగ ప్రవీణ్ స్పందిస్తూ.. మద్యం విక్రయాలను ఆధార్తో అనుసంధానం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మద్యం విక్రయాలను ఆధార్తో అనుసంధానించడం ఏమిటంటూ ప్రశ్నించింది. మద్యం కొనుగోలుదారుల్లో చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారని.. వారు రోజూ రూ.200–రూ.300 వరకు మద్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రవీణ్ చెప్పారు. మద్యంపై ఎవరెంత ఖర్చు పెడుతున్నారు.. ఎవరెంత తాగుతున్నారో పిటిషనర్కెందుకని ధర్మాసనం ప్రశ్నించింది. మద్యం సేవించే గోప్యత కూడా ఇవ్వరా అంటూ నిలదీసింది. ఇతరుల జీవితాల్లోకి ఎందుకు తొంగిచూస్తున్నారని ప్రశ్నించింది. అందరి సమాచారం అడుగుతున్నారు.. మరి పిటిషనర్ ఏం చేస్తుంటారని ప్రశ్నించింది. దీనికి ప్రవీణ్ సమాధానం చెప్పలేకపోయారు. మీ గురించి చెప్పడానికి ఇష్టపడరు.. మిగి లిన వారి గురించి మాత్రం మీకు అన్నీ కావాలా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘ఆ ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేశాం’ ఇద్దరు వ్యక్తులను నిర్బంధించి కొట్టిన వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్ఐని సస్పెండ్ చేశామని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ గురువారం హైకోర్టుకు నివేదించారు. శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని తెలిపారు. ఇద్దరు వ్యక్తుల ఒంటిపై గాయాలున్నాయన్న వైద్యుల నివేదికను పరిశీలించాక తగిన విధంగా స్పందిస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైద్యుల నివేదికను ఏజీకి అందచేయాలంటూ రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్కు సమాధానం ఇస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.రాజారెడ్డి చెప్పడంతో హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన భర్త కంచర్ల నవీన్బాబు, అతని స్నేహితుడు అశోక్ బాబులను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ గుంటూరు జిల్లా, తోకలవానిపాలెంకు చెందిన షేక్ అక్తర్ రోషన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ఈ వ్యాజ్యంపై గురువారం మరోసారి విచారణ జరిపింది. గత విచారణ సమయంలో నవీన్బాబు, అశోక్ బాబులకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు వైద్య పరీక్షల నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఆ నివేదకను పరిశీలించిన ధర్మాసనం ఇద్దరి ఒంటిపై గాయాలున్నట్లు తెలిపింది. పాదాలపై కొట్టడం ఇక్కడమేన్నా ఆచారంగా వస్తోందా? అంటూ వ్యాఖ్యానించింది. అలాంటిది ఏమీ లేదని ఏజీ చెప్పారు. ‘ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో సరికాదు’ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ముద్రించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన జడా రవీంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ముఖ్యమంత్రి ఫొటో ముద్రణపై ఉన్న అభ్యంతరాలను వినతిపత్రం రూపంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని పిటిషనర్ను ఆదేశించింది. ఆ అభ్యంతరాలపై అధికారులు ఆరు వారాల్లో నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ముందుకు అధికారులు కోర్టు ధిక్కార కేసులో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు గురువారం వ్యక్తిగతంగా హైకోర్టు ముందు హాజరయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో వాదనలు వినిపించేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి సమయం కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని, వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ గుంటూరుకు చెందిన ప్రైవేటు రికగ్నైజ్డ్ ఎయిడెడ్ పాఠశాలల యజమాన్యాల సంఘంతోపాటు మరికొందరు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో బి.రాజశేఖర్, వాడ్రేవు చినవీరభద్రుడు, మరికొందరు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు వారిద్దరూ గురువారం కోర్టు ముందు హాజరయ్యారు. ఆత్మహత్యలొద్దు.. న్యాయం చేస్తాం: కాంట్రాక్టర్లకు హైకోర్టు విజ్ఞప్తి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు రావడం లేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకోవద్దని కాంట్రాక్టర్లకు హైకోర్టు గురువారం విజ్ఞప్తి చేసింది. అసహనం, ఆగ్రహం, ఆవేదనతో ప్రాణాలు తీసుకుంటే కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటో ఆలోచించాలని హితవు పలికింది. కొంత ఆలస్యమైనా న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని తెలిపింది. అధికారుల చర్యల వల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికే న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ఉపాధి హామీ పనుల బిల్లులను చెల్లించకపోవడంపై దాఖలైన వ్యాజ్యాలపై ఆయన కొద్ది వారాలుగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాలపై ఆయన మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. బిల్లులు అందక అనంతపురం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. -
ఏపీ: మద్యం.. తగ్గుముఖం
అక్రమ మద్యంపై ఉక్కుపాదం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను మూసేయించడం, దుకాణాల సంఖ్యను తగ్గించడంతో పాటు.. విక్రయాల సమయాన్ని కుదించాం. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఈ సమయంలో రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలి రాకుండా చూడాలి. ఎక్కడైనా తయారు చేస్తుంటే చర్యలు తీసుకోవాలి. కాలేజీలు, యూనివర్సిటీలకు సమీపంలో గంజాయి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో నిఘా పెట్టాలి. గంజాయి సాగును గుర్తించి, ఎప్పటికప్పుడు ధ్వంసం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అక్రమ మద్యం తయారీ, రవాణాతో పాటు గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దానిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాల ప్రగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, 4,379 మద్యం షాపులను 2,975కు కుదించి.. మూడింట ఒక వంతు దుకాణాలను మూసి వేశామని తెలిపారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం 43 వేల బెల్టు షాపులను తీసేయడంతో పాటు 4,379 పర్మిట్ రూమ్లను మూసి వేయించడం వల్ల రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఇది వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించే వారని, ఈ సమయాన్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేశామని చెప్పారు. ఈ చర్యలన్నింటితో లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయని వివరించారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం ► గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలి. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేయాలి. పోలీసు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ► డ్రగ్స్కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపై పర్యవేక్షణ ఉండాలి. ► దీనిపై కార్యాచరణ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలి. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపై దృష్టి పెట్టాలి. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు ► నిర్ధేశించిన రేట్ల కన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలి. ఎస్ఈబీ కాల్ సెంటర్ నంబర్పై విస్తృత ప్రచారం కల్పించాలి. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్కు కాల్ చేసేలా జిల్లాల వారీగా ప్రచారం చేయాలి. ► వచ్చే కాల్స్పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలి. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలి. ► ఈ సమీక్షా సమావేశంలో ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ (స్పెషల్ యూనిట్స్) ఏ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న పోలీసులు (ఫైల్) కేసుల వివరాలు ఇలా.. ► మద్యం అక్రమ రవాణా, తయారీపై నమోదైన కేసులు : 1,20,822 ► అరెస్ట్ అయిన నిందితులు : 1,25,202 ► 2020లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 63,310 ► 2021లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 57,512 ► ఎస్ఈబీ నమోదు చేసిన కేసులు : 74,311 ► పోలీసులు నమోదు చేసిన కేసులు : 46,511 ► సీజ్ చేసిన అక్రమ మద్యం (లీటర్లు) : 8,30,910 ► స్వాధీనం చేసుకున్న నాటుసారా (లీటర్లు) : 8,07,644 ► ధ్వంసం చేసిన బెల్లం ఊట (లీటర్లు) : 2,30,48,401 ► సీజ్ చేసిన వాహనాలు : 29,491 ► ఇసుక అక్రమ రవాణాపై నమోదైన కేసులు : 12,211 ► అరెస్ట్ అయిన నిందితులు : 22,769 ► స్వాధీనం చేసుకున్న ఇసుక (టన్నులు) : 5,72,372 ► స్వాధీనం చేసుకున్న వాహనాలు : 16,365 ► గంజాయి సాగు, రవాణాపై నమోదైన కేసులు : 220 ► అరెస్ట్ అయిన నిందితులు : 384 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 18,686 ► 2021 మార్చి 20 నుంచి 2021 మార్చి 31 వరకు ఆపరేషన్ నయా సవేరా కింద నమోదైన కేసులు : 69 ► అరెస్ట్ అయిన వారు : 174 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 2,176 ► అవేర్నెస్ క్యాంపులు : 330 -
మద్యం విక్రయాన్ని పెంచటానికేనని అడ్డగోలు కథనాలు
-
మద్యం ఇంగ్లీష్.. నాటుసారా లోకల్.. కోడ్లో అమ్మకాలు..
మందస : మండలంలోని భైరిసారంగపురంలో మద్యం అక్రమ అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో అధికారులు సరిగ్గా దృష్టి సారించకపోవడంతో నాటుసారా విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. కొంతమంది వ్యాపారులు ఏకంగా మద్యం అమ్మకాలనే వృత్తిగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం అమ్మకాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి బంద్ అవుతుండటంతో కొంతమంది వ్యాపారులు ఆంధ్రా, ఒడిశాల నుంచి రహస్యంగా మద్యం బాటిళ్లను తీసుకువస్తున్నారు. అవసరాన్ని బట్టి రూ.60 నుంచి రూ.100 ఎక్కువగా అమ్ముతున్నారు. ఈ గ్రామానికి నాటుసారా తయారీ చేస్తున్న గిరిజన గ్రామాలు దగ్గరలో ఉండడంతో వ్యాపారులు రాత్రివేళ, వేకువజాములో ద్విచక్ర వాహనాలపై నాటుసారా తీసుకువచ్చి అమ్ముతున్నారు. మద్యానికి ఇంగ్లీష్ అని, నాటుసారాకు లోకల్ అంటూ కోడ్ల ద్వారా వ్యాపారులు ఇంటి పెరటి వైపు నుంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆర్మీ, నేవీ, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులు కూడా ఈ వ్యాపారంలో ముఖ్యపాత్ర వహిస్తున్నట్లు సమాచారం. మద్యం, నాటుసారా అమ్మకాలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, అధికారులు, ఎస్ఈబీ స్పందించి అక్రమ మద్యం, నాటుసారా అమ్మకాలను నిరోధించాలని స్థానికులు కోరుతున్నారు. -
Liquor Sales Dip: తగ్గిన మద్యం అమ్మకాలు
సాక్షి, అమరావతి: మద్యం మీద వచ్చే ఆదాయం కంటే ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇందుకు కర్ఫ్యూ కూడా తోడవ్వడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. బెల్టు షాపులను తొలగించడం, అక్రమ మద్యం విక్రయాలను, రవాణాను అడ్డుకోవడం, అమ్మకాల సమయం కుదించడం.. తదితర చర్యల ద్వారా దశలవారీ మద్యపాన నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పుడు కర్ఫ్యూ కోసం మద్యం దుకాణాల సమయాలను మరింతగా కుదించారు. దీంతో ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు రాష్ట్రంలో బీరు, లిక్కర్ కలిపి మొత్తం 21,31,558 కేసులు విక్రయించగా.. మే నెలలో 1 నుంచి 23 వరకు 16,74,343 కేసులే అమ్ముడయ్యాయి. తద్వారా మద్యం అమ్మకాలు 21.45 శాతం మేర తగ్గినట్లు తేలింది. దిగిన బీరు, లిక్కర్.. సాధారణంగా వేసవిలో బీరు విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం బీరు అమ్మకాల్లో భారీ తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 28,184 బీరు కేసులు విక్రయించగా.. మే నెలలో కర్ఫ్యూ అమలైన 5వ తేదీ నుంచి 23 వరకు రోజుకు సగటున 13,423 బీరు కేసులే అమ్ముడయ్యాయి. తద్వారా బీరు అమ్మకాల్లో 52.37 శాతం తగ్గుదల నమోదైందని అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ అమ్మకాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 63,455 లిక్కర్ కేసులు విక్రయించగా.. మే నెలలో 5 నుంచి 23 తేదీ వరకు రోజుకు సగటున 56,665 కేసుల అమ్మకాలే జరిగాయి. తద్వారా లిక్కర్ అమ్మకాలు 10.70 శాతం తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. ఏప్రిల్లో 1 నుంచి 23 వరకు మద్యం అమ్మకాలతో రూ.1,531.97 కోట్లు వచ్చింది. మే నెలలో 1 నుంచి 23వ తేదీ వరకు రూ.1,318.17 కోట్ల ఆదాయమే వచ్చింది. అంటే దాదాపు 14 శాతం మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. -
ఏపీ: మద్యానికి కళ్లెం.. భారీగా తగ్గిన కిక్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం జోరుకు కళ్లెం పడింది. దశలవారీ మద్య నియంత్రణ విధానం సత్ఫలితాలనిస్తోంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రజారోగ్యమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన బహుముఖ కార్యాచరణ విజయవంతమవుతోంది. 2019 – 20 కంటే 2020 – 21లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. లిక్కర్ అమ్మకాలు 39 శాతం తగ్గగా బీరు విక్రయాలు ఏకంగా 73 శాతం తగ్గడం విశేషం. ఇక చంద్రబాబు సర్కారు హయాంతో పోల్చి చూస్తే 2018 – 19 కంటే ప్రస్తుతం లిక్కర్ అమ్మకాలు 51 శాతం, బీరు అమ్మకాలు ఏకంగా 80 శాతం తగ్గాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మద్యం అమ్మకాలను ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండేళ్లలో 51 శాతం తగ్గిన లిక్కర్ అమ్మకాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018–19లో రాష్ట్రంలో 3.80 కోట్ల లిక్కర్ కేస్ల అమ్మకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019–20లో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు 2.59 కోట్ల కేస్లకు తగ్గింది. అంటే 32 శాతం తగ్గాయి. ఇక 2020–21లో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు కేవలం 1.87 కోట్ల కేస్లకే పరిమితమయ్యాయి. 2019–20తో పోలిస్తే 39 శాతం తగ్గాయి. టీడీపీ అధికారంలో ఉన్న 2018–19తో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు ఏకంగా 51 శాతం క్షీణించాయి. 80 శాతం తగ్గిన బీరు అమ్మకాలు బీరు అమ్మకాల జోరును కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా నియంత్రించింది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్రంలో 2.90 కోట్ల బీరు కేస్లు అమ్మకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019–20లో బీర్ అమ్మకాలు 1.43 కోట్ల కేస్లకు తగ్గించారు. అంటే 50 శాతం అమ్మకాలు తగ్గాయి. ఇక 2020–21లో రాష్ట్రంలో బీరు విక్రయాలు కేవలం 57 లక్షల కేస్లకే పరిమితమవడం విశేషం. అంటే 40 శాతం బీర్ అమ్మకాలు తగ్గిపోయాయి. టీడీపీ అధికారంలో ఉన్న 2018–19తో పోలిస్తే రాష్ట్రంలో బీరు అమ్మకాలు ఏకంగా 80 శాతం తగ్గడం విశేషం. బహుముఖ వ్యూహంతో కట్టడి రాష్ట్రంలో దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని అమలు చేస్తామన్న ఎన్నికల హామీకి అనుగుణంగా సీఎం జగన్ అనుసరిస్తున్న బహుముఖ వ్యూహం సత్ఫలితాలు ఇస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచేందుకు చంద్రబాబు సర్కారు మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్లను అనుమతించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే 4,380 పర్మిట్ రూమ్ల అనుమతులను రద్దు చేసి వాటిని తొలగించింది. మద్యం దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే కాకుండా వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం కేవలం 2,394 మాత్రమే ఉన్నాయి. మరోవైపు మద్యం దుకాణాల వేళలను కూడా కుదించారు. టీడీపీ సర్కారు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలను అనుమతించగా ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకే అనుమతించారు. ఆదాయం కాదు.. ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యం చంద్రబాబు హయాంలో బెల్టు దుకాణాలు, పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట వేస్తోంది. మద్యం అమ్మకాలను తగ్గించేందుకు సమర్థంగా చర్యలు చేపట్టింది. మా కమిటీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. కరోనా పరిస్థితులు తొలగిపోయాక పొదుపు సంఘాల మహిళలు, వార్డు/ గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా మద్యవిమోచన ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. – వి.లక్ష్మణ్రెడ్డి, రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడు షాక్ కొట్టే ధరలతో... మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం షాక్ కొట్టేలా ధరలను పెంచింది. సారా తయారీ, అమ్మకాలను నిరోధించడం, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో’ను ఏర్పాటు చేసి విస్త్రృత తనిఖీలకు ఆదేశించింది. రాష్ట్రంలో మద్య విమోచన ప్రచార కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మద్యపానంతో కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. -
న్యూ ఇయర్ ఎఫెక్ట్: మద్యానికే మత్తెక్కించేశారు..
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరాదిలో తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. గత నాలుగురోజుల్లో రూ.758.76 కోట్ల విలువైన లిక్కర్ వ్యాపారం జరిగింది. డిసెంబర్ 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ పేర్కొంది. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకలకు అనుమతి లేకున్నా.. గతేడాది పోలిస్తే ఈ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు అధికంగా ఆదాయం రావడం విశేషం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయి. మొత్తంగా 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. -
మద్యం అమ్మకాలు.. రికార్డులు బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : నవంబర్ నెలలో మందుబాబులు ‘పండుగ’చేసుకున్నారు. ‘ఫుల్లు’గా ఏసేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక... ఎన్నడూ లేనంతగా నవంబర్లో మద్యం అమ్మకాలు జరిగాయి. రికార్డు స్థాయిలో రూ. 2,567 కోట్ల మద్యం అమ్ముడైంది. సాధారణంగా సగటున నెలకు రూ. 1,700 కోట్ల దాకా సేల్ ఉంటుంది. ఒక్కనెలలో ఇంత భారీమొత్తంలో మందు అమ్ముడుపోవడం ఇదే ప్రథమమని, ఇందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలే కారణమని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. 31 లక్షల కేసులు... ఉఫ్! ఎన్నికల పుణ్యమా అని తాగినోళ్లకు తాగినంత దొరికింది. దాంతో మందుబాబులు గత నెలలో రెచ్చిపోయారని ఎౖMð్సజ్ గణాంకాలు చెపుతున్నాయి. నవంబర్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు 31,60,135 లిక్కర్ కేసులు లాగించేశారు మద్యం ప్రియులు. ఇక బీర్ల విషయానికి వస్తే నవంబర్ నెలలో 23,85,597 బీర్ కేసులు మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు చేరాయి. ఈ రెండింటి విలువ రూ. 2,567.14 కోట్లు కావడం గమనార్హం. మూడు రోజుల్లో కుమ్మేశారు నవంబర్ అమ్మకాలను పరిశీలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల జోష్లో ఎక్కువగా జరిగినట్టు అర్థమవుతోంది. నెల మొత్తంలో అమ్ముడయ్యే సరుకులో మూడోవంతు 26, 27, 28 తేదీల్లోనే డిపోల నుంచి మార్కెట్లోకి వచ్చింది. నవంబర్ నెలలో రూ.2,567 కోట్ల విలువైన మద్యం అమ్ముడయితే ఈ మూడు రోజుల్లో 860 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక, నెల ఆసాంతం 31 లక్షల లిక్కర్ కేసులను లాగించేసిన మందుబాబులు... ఇందులో 10.42 లక్షల కేసులను ఆ మూడు రోజుల్లోనే హుష్ పటాక్ అనిపించడం కొసమెరుపు. తేదీ లిక్కర్ కేసులు బీర్ కేసులు విలువ రూ.కోట్లలో 26 2,74,779 1,74,501 229.26 27 4,21,466 2,24,699 346.69 28 3,46,247 1,65,475 284.48 -
ఏపీలో తెలంగాణ మద్యానికి 'చెక్'..!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించింది. అంతకు ముందు మూడు బాటిళ్ల రవాణాపైనా నిషేధం విధించి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లకు అనుమతి లేకుండా చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా స్మగ్లింగ్ జరిగింది. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదయ్యాయి. మరోవైపు పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాలూ పెద్దఎత్తున పెరగడం గమనార్హం. ఇందుకు కారణం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం స్మగ్లింగ్ జరగడమే. మద్యం ధరలు ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఉండటంతో అక్కడ్నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో పోలిస్తే రూ.426 కోట్లు పెరిగిన అమ్మకాలు ► గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు తెలంగాణలో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో రూ.426 కోట్లు పెరిగాయి. ► అదే మద్యం వినియోగాన్ని ఏపీతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనపడుతోంది. తెలంగాణలో ఈ ఐదు నెలల వ్యవధిలో మద్యం వినియోగం 142.72 లక్షల కేసులు కాగా, ఏపీలో 49 లక్షల కేసులు మాత్రమే. ► తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో (ఏప్రిల్–ఆగస్ట్)తో ఈ ఏడాది పోల్చి చూస్తే ఆదాయంలో 2.93%, అమ్మకాల విలువలో 4.66% వృద్ధి నమోదైంది. ఏపీలో భారీగా 65% వినియోగం తగ్గింది. ► మద్యం కేసుల వినియోగం కర్ణాటకలో 198.88 లక్షలు కాగా, తమిళనాడులో 172.64 లక్షల కేసులు. ► ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజుల వ్యవధిలో అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచే 630 కేసులు కాగా, కర్ణాటక– 546, ఒడిశా– 24, తమిళనాడు– 11 కేసులు నమోదయ్యాయి. ఐదు నెలల్లో రూ.2,170 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ 1 గతేడాది ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.7,638.24 కోట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో రూ.5,468.17 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గతేడాది కంటే రూ.2,170.07 కోట్ల ఆదాయం కోల్పోయింది. అంటే 28.411% ఆదాయం తగ్గింది. 2 మద్యం, బీరు అమ్మకాల విలువను పరిశీలిస్తే ఈ ఐదు నెలల వ్యవధిలో గతేడాది రూ.8,884.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.5,998.87 కోట్లు. అమ్మకాల విలువ గతం కంటే రూ.2,885.82 కోట్లు తక్కువగా నమోదైంది. -
4 రోజులు.. రూ.812 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈసారి దసరా పండుగకు మందు బాబులు దుమ్ము లేపారు. కరోనా ప్రభావం అసలుందా.. అనే స్థాయిలో ఫుల్లుగా తాగేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి బయటకు వెళ్లిన లిక్కర్, బీర్ కేసుల విలువ రూ.812 కోట్ల పైమాటే. అంటే రోజుకు సగటున రూ.203 కోట్ల విలువైన మద్యం అమ్ముడయిందన్న మాట. అదే నెల సగటు చూస్తే రోజువారీ అమ్మకాలు రూ.82 కోట్లు మాత్రమే జరగడం గమనార్హం. ఈ నెల మద్యం విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే లిక్కర్, బీర్లు కలిపి దాదాపు 50 లక్షల కేసుల వరకు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,112 కోట్లుగా ఉంది. ఈ నెల 27 నాటికి 27,08,292 కేసుల లిక్కర్, 22,65,397 కేసుల బీర్లు డిపోల నుంచి రాష్ట్రంలోని వైన్ షాపులకు చేరాయి. ఇందులో మూడో వంతు దసరా నాలుగు రోజుల్లోనే అమ్ముడయ్యాయి. ఈ నాలుగు రోజుల్లో 9,41,900 కేసుల లిక్కర్, 9,29,694 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
కరోనా: చిల్డ్ బీర్ల జోలికెళ్లని మద్యం ప్రియులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మందుబాబులు బీర్ల జోలికి వెళ్లడం లేదు. ప్రత్యామ్నాయంగా లిక్కర్నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రెండు నెలలుగా బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. చిల్డ్ బీరు తాగితే జలుబు చేసి కరోనాకు దారితీసే అవకాశాలున్నాయని భావిస్తున్న మద్యం ప్రియులు దాని జోలికెళ్లడం తగ్గించేశారు. బీర్ల ధరలు విపరీతంగా పెరగడం కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు నిత్యం వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా ఉంది. దీంతో మద్యం ప్రియులు బీరు బదులు లిక్కర్ వైపు మొగ్గుచూపుతున్నారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాలతో పోల్చితే బీర్ల అమ్మకాలు సుమారు 20 శాతం తగ్గినట్లు ఎక్సైజ్శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతేడాది (2019) సెప్టెంబర్లో 1.83 లక్షల బీరు కేసులు విక్రయాలు జరిగితే, ఈ ఏడాది గతనెల (సెప్టెంబర్)లో 1.40 లక్షల కేసులకు పడిపోయింది. అంటే సుమారు 43 వేల కేసులు తక్కువ వినియోగమైంది. ఆగస్టు మాసంలో కూడా బీర్ల అమ్మకాలు తగ్గాయి. 2019 ఆగస్టులో 1.76 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగితే.. ఈ ఏడాది ఆగస్టులో 1.46 లక్షల కేసులకు తగ్గాయి. అంటే సుమారు 30 వేల కేసుల బీర్ల అమ్మకాలు తగ్గాయి. ఈ లెక్కన ఆగస్టులో కూడా సుమారు 20 శాతం అమ్మకాలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన లిక్కర్ వినియోగంబీరు ప్రియులు కూడా లిక్కర్ వైపు మొగ్గు చూపడంతో లిక్కర్ అమ్మకాలు ఊపందుకున్నాయి. 2019 సెప్టెంబర్ మాసంలో లిక్కర్ 1.12 లక్షల కేసుల విక్రయాలు జరగగా, గత నెల(2020 సెప్టెంబర్)లో 1.27 లక్షల కేసులకు పెరిగాయి. సుమారు 11 శాతం లిక్కర్ అమ్మకాలు పెరిగినట్లు తేలింది. బీర్ల ధరలు పెరగడమూ కారణమే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు చల్లని పానియాలు సేవించడం తగ్గించారు. దీనికి తోడు బీర్ల ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది సుమారు రూ. 120 ఉన్న స్ట్రాంగ్ బీరు ఇప్పుడు రూ. 160కి పెరిగింది. రెండు బీర్లకు వెచ్చించిన ధరలో బ్రాండెడ్ లిక్కర్ క్వాటర్ వస్తుండడంతో మందుబాబులు లిక్కర్ను తాగేందుకే ఎక్కువ మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తగ్గని ఆదాయం బీర్ల విక్రయాలు తగ్గినప్పటికీ.. పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది 2019లో సెప్టెంబర్లో బీర్ల అమ్మకాలపై సుమారు రూ. 19.09 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్లో బీరు విక్రయాలపై సుమారు రూ. 23.43 కోట్ల ఆధాయం వచ్చింది. సుమారు 20 శాతం అమ్మకాలు తగ్గినప్పటికీ ఆదాయం పెరగడానికి కారణం బీర్ల ధరలు పెరగడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దాచి.. దోచుకుంటున్నారు...!
పిఠాపురం: అధికారంలో ఉన్నంత కాలం దోచుకున్నది చాలేదన్నట్టు ఇప్పుడు ఏకంగా అక్రమంగా మద్యం అమ్ముకుని మరీ దోచుకుంటున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకున్న టీడీపీ పక్క రాష్ట్రం నుంచి భారీగా మద్యాన్ని తరలించినట్టు ఎక్సైజ్ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. 2019 ఎన్నికల్లో పంపిణీ చేయడం కోసం తెచ్చిన మద్యాన్ని కొత్తపల్లి మండల తెలుగుదేశం ముఖ్య నేత దాచిపెట్టి ఇప్పుడు మద్యం రేట్లు పెరగడంతో అధిక రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు. కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన టీడీపీ ముఖ్యనేత తన అనుచరుల ద్వారా పాలకేంద్రాన్ని అడ్డాగా చేసుకుని మద్యం బాటిళ్లను ఎక్కువ రేట్లకు విక్ర యిస్తూ గత కొన్ని నెలలు గా దోచుకుంటున్నట్టు విచారణలో తేలింది. ఎక్సైజ్ సీఐ కె.కాత్యాయని కథనం ప్రకారం.... కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు వచ్చిన సమాచారం ప్రకారం పిఠాపురం స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో ఆధ్యర్యంలో ఎక్సైజ్ శాఖాధికారులు ఆదివారం అర్ధరా త్రి మాటు వేసి దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నేత అనుచరులు పెనుమల్లు సుబ్బిరెడ్డి, కడిమిశెట్టి సూర్యచక్రం పట్టుబడ్డారు. వీరి నుంచి 103 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు ఆమె తెలిపారు. ఈదాడుల్లో పిఠాపురం ఎక్సైజ్ శాఖాధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ నేతలకు తెలియకుండా.. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి తెచ్చి నియోజకవర్గ ముఖ్యనేతకు తెలియకుండా మద్యంను దాచిపెట్టి, ఇప్పుడు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ పథకాలలో భారీగా అక్రమాలకు పాల్పడిన సదరు మండల టీడీపీ నేత ఇప్పుడు అక్రమ మద్యం అమ్ముతు కూడా దోచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుండగా అధికారులు విచారణ చేస్తున్నారు. -
లిక్కర్ కిక్కు.. పైపైకి..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో లిక్కర్ వినియోగం నెలనెలా పెరుగుతోంది. గత మూడు నెలల మద్యం అమ్మకాలను పరిశీలి స్తే ప్రతినెలా 2 లక్షల కేసులు.. అంటే రోజుకు దా దాపు 7వేల కేసుల లిక్కర్ ఎక్కువగా అమ్ముడవుతోంది. మేలో 26 లక్షల కేసులు పైగా అమ్ముడు పోగా.. జూన్లో 28 లక్షల కేసులు, జూలైలో ఏకం గా 31 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగాయి. కానీ బీర్ విక్రయాల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మేలో 23.22 లక్షల బీర్లు తాగగా, జూన్లో అది 28.77 లక్షల కేసులకు పెరిగింది. జూలైలో మాత్రం ఏకంగా 6 లక్షల కేసులు తగ్గి కేవలం 22.99 లక్షలకు మాత్రమే పరిమితమైంది. వాతావరణం చల్లబడడం, వర్షాలు ప్రారంభం కావడంతోనే జూన్తో పోలిస్తే జూలైలో బీర్ల విక్రయాలు తగ్గాయని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. ఖజానాకు కాసుల కిక్కు.. ఇక మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం నెలనెలా పెరుగుతోందని ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మేలో రూ.2,270 కోట్లు, జూన్లో రూ.2,391 కోట్లు, జూలైలో రూ.2,506 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే గత మూడు నెలల్లో నెలకు రూ.100 కోట్లు కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆ మేరకు ఆదాయం పెరుగుతుంది. -
56 రోజులు.. రూ.3,800 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లిక్కర్ అమ్మకాలు కాసుల పంట పండిస్తున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. లాక్డౌన్ ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం విక్రయాలు ప్రారంభం కాగా, ఆ నెలలో రూ.1,864 కోట్లు, జూన్ మాసం మొత్తంలో రూ.1,955 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్ కేసులను వైన్స్ యజమానులు మద్యం డిపోల నుంచి కొనుగోలు చేశారు. అయితే, మే నెలతో పోలిస్తే జూన్ నెలలో కొంత కిక్కు తగ్గినట్టు కనిపిస్తున్నా పెద్దగా ప్రభావం చూపలేదు. జూన్ రెండో సగ భాగంలో షాపుల లైసెన్సు ఫీజులు కట్టాల్సి రావడంతో డబ్బులు సర్దుబాటు కాక వైన్స్ యజమానులు స్టాక్ పెట్టుకునేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. కానీ, మళ్లీ రాష్ట్రంలో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారంతో జూన్ మాసంలో చివరి మూడ్రోజులు డిపోల నుంచి మద్యం విక్రయాలు పెరిగాయి. మొత్తం మీద ఈ రెండు నెలల మద్యం అమ్మకాల ద్వారా రూ.3,000 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరినట్టైంది. పెరిగిన బీర్ల అమ్మకాలు.. వాస్తవానికి ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. మరీ ముఖ్యంగా మే నెలలో ఈ అమ్మకాలు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ, ఈసారి అందుకు భిన్నంగా మే కంటే జూన్ నెలలో బీర్ల అమ్మకాలు బాగా జరిగాయని డిపోల నుంచి వెళ్లిన బీర్ కేసుల లెక్కలు చెబుతున్నాయి. మే నెలలో 26 రోజుల అమ్మకాలకు గాను 23 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడుపోగా, జూన్లో 30 రోజులకు గాను 28.67 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అయితే, అదే స్థాయిలో లిక్కర్ అమ్మకాల్లో మార్పు రాలేదు. మే నెల కంటే కేవలం 1.70 లక్షల కేసులు ఎక్కువ మద్యం అమ్ముడైంది. మే నెలలో రూ.26 లక్షలకు పైగా మద్యం కేసులు అమ్ముడవగా, జూన్లో దాదాపు 28 లక్షల కేసులే అమ్ముడుపోయాయి. మే నెల కంటే నాలుగు రోజులు ఎక్కువ సమయం జూన్లో దొరకడం, మద్యం విక్రయించే వేళలు కూడా జూన్ నెలలో పెరిగినా లిక్కర్ అమ్మకాల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ఈ లెక్కన రాష్ట్రంలో మేతో పోలిస్తే జూన్ నెలలో లిక్కర్ అమ్మకాలు కొంత తగ్గినట్టేనని ఎక్సైజ్ శాఖ అధికారులు చెపుతున్నారు. మొదటి సగం ‘ఫుల్లు’! జూన్ నెలలో అమ్మకాలు మొదట్లో బాగానే కనిపించాయి. ఈ రెండు నెలల్లో కలిపి రోజుకు సగటున రూ.68 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగ్గా, జూన్ నెల ప్రథమార్ధంలో మాత్రం అది సగటున రూ.77 కోట్ల వరకు వచ్చింది. జూన్ 1 నుంచి 15 మధ్య ఏకంగా రూ.1,153 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరింది. అందులో 15 లక్షలకు పైగా కేసుల బీర్లు, 13.45 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడైంది. ఆ తర్వాత 15 రోజుల్లో కలిపి కేవలం రూ.800 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్ అమ్మకాలే జరిగాయి. అంటే జూన్ చివరి 15 రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున రూ.53 కోట్ల మద్యం విక్రయాలే జరిగాయన్న మాట. ఇందుకు వైన్షాపు యజమానులు స్టాక్ పెట్టేందుకు వెనుకాడటమే కారణమని ఎక్సైజ్ శాఖ వర్గాలంటున్నాయి. ఈ నెలలోనే 3 నెలల లైసెన్సు ఫీజు చెల్లించే వాయిదా ఉండటంతో పెద్ద మొత్తంలో డబ్బులు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని, అందుకే ఈ నెలాఖరులో పెద్దగా స్టాక్ పెట్టుకోలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, మళ్లీ రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తారేమోననే అంచనాతో చివరి మూడ్రోజులు పెద్ద ఎత్తున స్టాక్ను తరలించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
జీతమంతా ఇంటికే తెస్తన్నాడు
విజయనగరం జిల్లా రామభద్రాపురానికి చెందిన ఈ దంపతులు యశోద, బంగారినాయుడు. నిత్యం మద్యం తాగే బంగారినాయుడు ఇప్పుడు గ్రామంలో మునిపటిలా మద్యం దొరకపోవడంతో తాగుడుకు దూరమయ్యాడు. ‘ఇప్పుడు మా సంసారం బాగుందయ్యా. దశల వారీ మద్య నిషేధం మా కుటుంబంలో ఆనందాన్ని నింపింది’ అని యశోద ఆనందంగా చెబుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత రేషన్ శనగల్ని వంటకు సిద్ధం చేస్తున్న యశోద, బంగారి నాయుడు దంపతులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: దశలవారీ మద్య నిషేధం పుణ్యమా అని వేలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి మనశ్శాంతిగా బతుకుతున్నాయి. విజయనగరం జిల్లాలో గతంలో 6 వేల వరకు బెల్టు షాపులు ఉండేవి. ప్రభుత్వం ఉక్కుపాదం మోపటంతో అవన్నీ మూతపడ్డాయి. గతంలో జిల్లాలో 210 మద్యం దుకాణాలు ఉంటే.. గత అక్టోబర్ 1న తొలి విడతగా 20 శాతం తగ్గించి మొత్తం దుకాణాలను 168కి పరిమితం చేశారు. తొలుత 10 శాతం ధరలు పెంచారు. దీంతో అమ్మకాలు తగ్గాయి. లాక్డౌన్ అనంతరం మద్యం షాపులు పునఃప్రారంభం కాగా.. ఆ వెంటనే మరో 13 శాతం షాపులను తగ్గించింది. ధరలను సైతం ఒకేసారి 75 శాతం పెంచడంతో మద్యం అమ్మకాలు పడిపోయాయి. గతేడాది జూన్ 15 వరకు 13,53,167 కేసుల మద్యం, 4,76,665 కేసుల బీర్ల అమ్మకాలు జరగ్గా.. ప్రభుత్వం చర్యలతో ఈ ఏడాది జూన్ 15 వరకు 8,31,428 కేసుల మద్యం, 3,97,974 కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సంతోషంగా బతుకుతున్నాం –బలగ పార్వతి, చినభీమవరం, బాడంగి మండలం మాది పేద వ్యవసాయ కుటుంబం. గతంలో ఊరంతా బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మందు అమ్మేవారు. నా భర్త తిరుపతి అక్కడికెళ్లి తాగేవాడు. ఏ రోజూ ఇంటిపట్టున ఉండేవాడు కాదు. ఆరోగ్యాన్ని అసలు లెక్క చేసేవాడు కాదు. తరచూ ఇంట్లో గొడవలు, పస్తులు సర్వసాధారణంగా ఉండేవి. ఇప్పుడు మద్యం దుకాణాలు తగ్గిపోవడం, ధరలు పెరగడంతో చిరాకొచ్చి మందు మానేశాడు. పిల్లలతోను, నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడు. సంతోషంగా బతుకుతున్నాం. తాగుడు మానేశాడయ్యా! – వేచలం లక్ష్మి, ఉత్తరాపల్లి, కొత్తవలస మండలం నా పెనిమిటి ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తాడయ్యా. ఆయన మద్యానికి బానిస కావటంతో కుటుంబమంతా దుర్భర జీవితం గడిపేవాళ్లం. వచ్చిన కొద్దిపాటి సంపాదన తాగుడికే తగలేయడంతో కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బెల్టు షాపులు తీసేయడంతో ఊళ్లో మద్యం దొరకట్లేదు. రేట్లు కూడా పెరగడంతో అంత పెట్టి కొనలేక నా పెనిమిటి తాగుడు మానేశాడయ్యా. ఇప్పుడు జీతమంతా ఇంటికే తెచ్చిస్తన్నాడు. రోజూ పిల్లలతో కలిసి అంతా ఒకేసారి భోంచేస్తంటే శానా ఆనందంగా ఉందయ్యా. -
26 రోజులు.. రూ. 1,865 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలించిన తొలి నెలలో మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే జరిగాయి. గత నెల ఆరో తేదీన రాష్ట్రంలో వైన్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వగా... 31 నాటికి (26 రోజుల్లో) రూ.1,864.95 కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో రూ.800 కోట్ల విలువైన బీర్లు, రూ. 1,000 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడు పోయాయి. కాగా, ఎండలు మండిపోయిన మే నెలలో బీర్ల అమ్మకాలు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. లిక్కర్ మాత్రం ఎప్పటిలాగే అమ్ముడుపోవడం గమనార్హం. తొలిరోజు సగటు కొనసాగింపు మే నెల మద్యం అమ్మకాలను పరిశీలిస్తే వైన్ షాపులు తెరిచిన మొదటి రోజు మే 6న రూ.72 కోట్ల విలువైన మద్యం లిక్కర్ డిపోల నుంచి బయటకు వెళ్ళింది. తొలిరోజు కొనుగోళ్లు ఈ నెలంతా కొనసాగగా, నెల ముగిసే సమయానికి సగటున రోజుకు రూ.71 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి పది రోజుల తర్వాతి కొనుగోళ్లలో పెరుగుదల కనిపించింది. మే 16న రూ.100 కోట్లు, 26న ఈ నెలలోనే అత్యదికంగా రూ.140 కోట్లకు పైగా విలువైన సరుకు డిపోల నుంచి షాపులకు వెళ్ళింది. మే నెలలో అత్యధికంగా ఈ రోజే ఎక్కువ కొనుగోళ్లు జరగడం గమనార్హం. ఇక మే నెల చివరి రోజున రూ. 62 కోట్ల మద్యం అమ్ముడయింది. బీర్.... బేర్ మే నెలలో బీర్ ప్రియుల్లో ఉత్సాహం తగ్గిందని అమ్మకాలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు లక్ష కేసుల బీర్లు, 1.30 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడవుతుంది. అదే ఎండాకాలంలో అయితే బీర్ల అమ్మకాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మే నెలలో మరీ ఎక్కువగా రోజుకు 1.5లక్షలకు పైగా సగటున 50 లక్షల కేసుల బీర్ అమ్ముడుపోతుంది. కానీ ఈ మే నెలలో రోజుకు సగటున అమ్ముడైన బీర్ కేసుల సంఖ్య 90 వేలు మాత్రమే. మే నెలలో ఇంత తక్కువ స్థాయిలో బీర్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎక్సైజ్ వర్గాలే అంటున్నాయి. గత నెలలో లిక్కర్ డిపోల నుంచి అమ్ముడుపోయిన మద్యం వివరాలు -
దూసుకుపోతున్న మద్యం యాప్ బేవ్క్యూ
కొచ్చి: కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో కేరళలో దాదాపు రెండు నెలల తరువాత మద్యం అమ్మకాలకు అనుమతి లభించడంతో మందుబాబులు తమ దూకుడును ప్రదర్శిస్తున్నారు. కేరళ బేవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చిన బేవ్క్యూ (వర్చువల్ క్యూ లైన్) యాప్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్లో విడుదలైన కొద్ది గంటలకే మూడు లక్షలకు పైగా డౌన్లోడ్లను సాధించింది. 2.82 లక్షల టోకెన్లు జారీ అయ్యాయి. కోవిడ్-19 సమయంలో మద్యం దుకాణాల్లో రద్దీ, భౌతికదూరం, దుకాణాల ముందు క్యూలైన్లను కట్టడి చేసే దిశగా ఆన్లైన్లో టోకెన్ ఆధారిత అమ్మకాలకు కేరళ ఈ యాప్ తీసుకొచ్చింది. కొచ్చికి చెందిన ఫెయిర్కోడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ దీన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో వుంది. ఐవోఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నదీ లేనిదీ స్పష్టత లేదు. (మద్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్) మరోవైపు ఈ యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడం విమర్శలకు తావిచ్చింది. క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ లో సమస్యల కారణంగా మద్యం దుకాణదారులు లాగ్ బుక్ లో టోకెన్ నంబర్లను చేసుకొని మరీ మద్యం సరఫరా చేశారట. చాలామంది వినియోగదారులు ఈ యాప్ సరిగా పనిచేయడం లేదంటూ ట్వీట్ చేస్తున్నారు. పదేపదే ప్రయత్నించినప్పటికీ ఓటీపీ రావడం లేదని ఒకరు, టైమ్ స్లాట్ను ఎంచుకొనే ఆప్షన్ కనిపించడం లేదని మరొకరు ఫిర్యాదు చేశారు. అయితే విషయం తెలిసిన అప్లికేషన్ ప్రొవైడర్లు ప్రస్తుతానికి టోకెన్ ఇవ్వడం నిలిపివేసి, శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరిగి జారీ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా కేరళలో మద్యం విక్రయాలకు గురువారం నుంచి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా కేటాయించిన టోకెన్ నెంబర్ ద్వారానే మద్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్రతీ నాలుగు రోజులుకు ఒకసారి మాత్రమే ఒక వ్యక్తి మద్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. బేవ్క్యూ యాప్ లో రిజిస్టర్ కాని వారు రాష్ట్రంలో మద్యాన్ని కొనలేరు. -
మందుబాబులకు గుడ్ న్యూస్..ఇకపై మాల్స్లో మద్యం
లక్నో : మందుబాబులకు ఉత్తరప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ర్టంలో మాల్స్లో విదేశీ మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు రిటైల్ షాపులలో మాత్రమే అమ్ముడవుతున్న లిక్కర్ ఇకపై మాల్స్లోనూ అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కేవలం సీల్డ్ సీసాల్లో మద్యం అమ్మకాలు జరపాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాల్స్లో లిక్కర్ అమ్మకాలకు సంబంధించి ఎఫ్.ఎల్ -4-సి రూపంలో లైసెన్సులు మంజూరు చేస్తామని రాష్ర్ట ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ భూస్ రెడ్డి వెల్లడించారు. (‘యోగి ఓ వర్గానికి ముప్పు’ ) అంతేకాకుండా మద్యం అమ్మకాలు జరపాలంటే ఆ ప్రాంగణంలో కనీసం 500 చదరపు అడుగుల విస్తీర్ణంతో వినియోగదారుడిగా సౌకర్యవంతంగా నడవడానికి వీలుండేలా ఉండాలని తెలిపారు. ఎక్సైజ్ అనుమతులు పొందిన మద్యాన్ని మాత్రమే విక్రయించాలని పేర్కొన్నారు. విదేశీ మద్యంతో పాటు జిన్, వైన్, వోడ్కా,రమ్ లాంటి ఇండియన్ బ్రాండ్లను కూడా విక్రయాలు అమ్ముకోవచ్చని తాజా ప్రకటనలో తెలిపారు. అయితే కశ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించాలని లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని అన్నారు. లాక్డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన రాష్ర్ట ఖజానాకు తాజా ఉత్తర్వులతో గణనీయమైన ఆదాయం పొందుతామని ఆశిస్తున్నట్లు సంజయ్ తెలిపారు. ఈ మధ్యకాలంలో ఎక్కువమంది షాపింగ్ మాల్స్లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నందున దానిని దృష్టిలో ఉంచుకొని మాల్స్లో విదేశీ మద్యం విక్రయాలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. (మాజీ సీఎంకు కరోనా పాజిటివ్.. ) -
మద్యం అమ్మకాలు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ : మద్యం అమ్మకాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలనే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో తమిళనాడులో మద్యం అమ్మకాలకు మార్గం సుగమమైంది. కాగా, కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పున: ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం షాపుల ద్వారా అమ్మకాలు చేపట్టింది. అయితే అమ్మకాలు జరిగే షాపుల మందు పెద్ద ఎత్తున జనసముహాలు ఉండటం, వినియోగదారులు భౌతిక దూరం నిబంధన పాటించకపోవడంతో ఆ షాపులను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.(చదవండి : వారిని ఎందుకు విమర్శించరు?) అయితే హైకోర్టు ఆదేశాలపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్, హోం డెలివరీ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టడం సాధ్యపడదని సుప్రీం కోర్టుకు తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ మద్యం అమ్మకాలు లేవని తెలిపింది. చట్ట ప్రకారం తగిన మార్గదర్శకాలు ఉంటేనే ఈ విధానాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మద్యం అమ్మకాలు నిలిపివేయాలనే హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. (చదవండి : లాక్డౌన్: మరో రెండు వారాలు పొడిగించండి) -
లిక్కర్పై సుప్రీంకోర్టుకెక్కిన తమిళనాడు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరపవద్దంటూ తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీని వల్ల ఆదాయంలో భారీ నష్టాలు వస్తాయని తమ పిటిషన్లో పేర్కొంది. భౌతిక దూరం పాటించడం లేదని, కరోనా మరింత విస్తరించే ప్రమాదం ఉన్నందున మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ కొంతమంది లాయర్లు వేసిన పిటిషన్పై శుక్రవారం విచారించిన మద్రాస్ హైకోర్టు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ, కావాలంటే ఆన్లైన్లో అమ్మాల్సిందిగా తీర్పునిచ్చింది. అయితే అన్నిచోట్లా ఆన్లైన్లో అమ్మడం సాధ్యం కాదని, అందుకే మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వ నియమని బంధనల మేరకే తాము మద్యం అమ్మకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తమ పిటిషన్ లో పేర్కొంది. -
మద్యం అమ్మకాలకు నో.. సుప్రీంకు సర్కార్
సాక్షి, చెన్నై : మద్యం దుకాణాలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మద్యాన్ని కేవలం ఆన్లైన్లోనే విక్రయించాలని ప్రభుత్వానికి సూచించింది. (ఆన్లైన్లో మద్యం విక్రయాలకు అనుమతి) ఈ ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేసిన తమిళ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ను న్యాయస్థానం త్వరలోనే విచారించనుంది. కాగా ఆన్లైన్లో మద్యం అమ్మకాలకు సుప్రీంకోర్టు ఇదివరకే సుముఖత వ్యక్తం చేసిన చేసింది. ఇక తమిళనాడులో తొలిరోజు మద్యం విక్రయాలు రికార్డు స్దాయిలో రూ 170 కోట్ల మద్యం అమ్మకాలు జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 600 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. (172 కోట్ల మద్యం అమ్మకాలు) -
బార్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలు
బెంగుళూరు : ఇకపై మద్యంబాబులు దుకాణాల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టక్కర్లేదు. మీకు నచ్చిన వైన్షాప్, బార్, పబ్.. ఇలా ఏదో ఓ షాప్లో వెళ్లి మద్యం కొనుగోలు చేయోచ్చు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ కారణంగా పేరుకుపోయిన తమ స్టాక్ను క్లియర్ చేసుకోవడానికి మద్యం విక్రయాలు జరుపుకోవడానికి వైన్ షాపుల తరహాలోనే క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు అనుమతినిచ్చింది. (మద్యం ఎక్కువ తాగాడని హత్య ) తాజా ఉత్తర్వుల ప్రకారం నేటి నుంచి మే 17 వరకు ఆయా దుకాణాలు రిటైల్ ధరలకు (ఎమ్ఆర్పి) మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు తప్పక పాటించాలి. ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. ఆరు నెలల షెల్ఫ్ లైఫ్ ఉన్న బీర్ లాంటివి సరైన సమయంలో విక్రయించకపోతే ఆ స్టాక్ పనికిరాకుండా పోతుందని బార్ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు మద్యం విక్రయించడానికి అనుమతినిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మద్యం అమ్మకాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం అమ్మకాల్లో ఆన్లైన్ డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం నిబంధన పాటించడానికి, జనాలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా ఉండేందుకు హోం డెలివరీ ఉపకరిస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. లాక్డౌన్ వేళ మద్యం అమ్మకాలు సామాన్యుల జీవితంపై ప్రభావం చూసే అవకాశం ఉందని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. (చదవండి : మద్యం హోం డెలివరీకి జొమాటో..!) అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. కానీ రాష్ట్రాలు భౌతిక దూరం నిబంధన అతిక్రమించకుండా ఉండేందుకు మద్యం అమ్మకాల్లో హోం డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ దీపక్ సాయి.. ‘మద్యం షాపుల ముందు భౌతిక దూరం నిబంధన పాటించడం కుదరదు. ఎందుకంటే కొన్ని షాపులు మాత్రమే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. దీంతో వాటి ముందు పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరారు. మద్యం అమ్మకాల వల్ల సామాన్యుని జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేదే మా కోరిక. అందుకే మద్యం అమ్మకాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు తప్పకుండా స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు. (చదవండి : లిక్కర్ ప్రచారంలో దొర్లిన తప్పు.. అధికారుల క్షమాపణ) కాగా, మూడో దశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం ప్రకటించిన సడలింపులతో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్న మందుబాబులు.. ఒక్కసారిగా వైన్ షాపుల ముందు బారులు తీరారు. ముంబైలో ఈ రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కేవలం రెండు రోజుల్లోనే మద్యం షాపులను మళ్లీ మూసివేశారు. మరోవైపు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా మద్యం హోం డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ఇప్పటికే పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు మద్యం అందజేస్తున్న సంగతి తెలిసిందే. -
మద్యం అమ్మకాలు; మండిపడ్డ మహిళలు
చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మద్యం దుకాణాలను తెరవడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ కొనసాగుతుండగానే మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మహిళాలోకం మండిపడుతోంది. తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా మహిళలు నిరసన చేపట్టారు. లిక్కర్ షాపులు తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మద్యం దుకాణాల ముందు బైఠాయించారు. (తమిళనాడులో కరోనా విలయతాండవం) అమ్మకాలు అదుర్స్.. కాగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తమిళనాడులో గురువారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా మొదటి రోజే రాష్ట్ర ఖాజానాకు రూ. 172 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత వైన్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు క్యూ కట్టారు. మొదటి రోజే 20 లక్షల లీటర్ల మద్యం అమ్ముడుపోయిదంటే మందు బాబులు ‘ఎంత దాహం’ మీద ఉన్నారో అర్థమవుతోంది. ప్రతి రాష్ట్రంలో అమ్ముడుయే పాలకంటే ఇది 4 లక్షల లీటర్లు మాత్రమే తక్కువ. ఇక మహిళలు ఆందోళనకు తిరుచ్చిలోనే ఓ మద్యం దుకాణం ‘ఆల్కహాలికుల’ కోసం షామినా, కుర్చీలు ఏర్పాటు చేయడం విశేషం. (టోకెన్ ఉంటేనే మద్యం అమ్మబడును) -
కేంద్ర నిర్ణయం మేరకే మద్యం అమ్మకాలు
సాక్షి, తాడేపల్లి : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నింబంధనలను, ఆంక్షలను ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు. మొదటి ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని, దశల వారీగా మద్య నిషేధం జరుగుతుందని తెలిపారు. రోజురోజుకు కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్నాయని, వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్లో కరోనా తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ కరోనా ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. (ఏపీలో పెరిగిన మద్యం ధరలు ఇవే..) మంగళవారం స్థానికంగా జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. ‘మద్యం అమ్మకాలపై కూడా కేంద్రప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. మద్యం అమ్మకాలపై చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?. మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని స్పష్టంగా చెప్పాం. గతంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే.. చంద్రబాబు తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం గురించి మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదు. మద్యం బ్రాండ్ల గురించి చంద్రబాబుకు ఎందుకంత బాధ?. హెరిటేజ్ ఫ్యాక్టరీలో కరోనా వస్తే.. ఎందుకు దాచిపెట్టారు?’ అని నిలదీశారు. (మద్యం ధరలు పెంచడానికి కారణం అదే) -
లాక్డౌన్లో మద్యం అమ్మకాలా?
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ కొనసాగుతుండగా మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. మద్యం అమ్మకాల పునరుద్ధరణను ప్రజావ్యతిరేక చర్యగా పేర్కొంది. లాక్డౌన్ ఎత్తివేసే వరకు దేశంలో మద్యం అమ్మకాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ‘కరోనావైరస్ ఇప్పటికీ ఉనికిలో ఉంది. లాక్డౌన్ ఇప్పటికీ అమలులో ఉండగా మద్యం దుకాణాలను మద్యం విక్రయించడానికి ఎలా అనుమతిస్తారు? మద్యం అమ్మకాలను అనుమతించడం ప్రజా వ్యతిరేక విధానం. లాక్డౌన్ ఎత్తివేసే వరకు దేశంలో మద్యం అమ్మకాలను నిషేధించాలి. లేకపోతే ఇది ప్రజలపై చెడు ప్రభావాన్ని చూపుతుంద’ని నారాయణ అన్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభం కావడంతో వైన్ షాపుల ముందు మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దీంతో పలు పలు రాష్ట్రాలు మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో వలస, అసంఘటిత కార్మికులు, పేదలు, కూలీలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు దేశవ్యాప్తంగా సోమవారం ఒకరోజు దీక్షను చేపట్టారు. లాక్డౌన్ బాధితులను ఆదుకునేందుకు రూ. 10 లక్షల కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. (లాక్డౌన్ బాధిత వర్గాలను ఆదుకోండి) -
ఇక ‘స్మార్ట్ లాక్డౌన్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలాన్ని పొడిగించడం ఖాయమేనని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) దేశాన్ని ఉద్దేశించి చేయనున్న ప్రసంగంలో ఏయే అంశాలను ప్రస్తావించనున్నారు? లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండబోతోందా? గత మూడువారాలుగా కొనసాగిన విధంగా కఠినంగానే ఉండబోతోందా? ఆంక్షల సడలింపుపై ఏవైనా నిర్ణయాలుంటాయా? ఉంటే.. ఎలాంటి మినహాయింపులుంటాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. మూడు వారాల లాక్డౌన్తో ఇప్పటికే కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ.. మరో రెండు వారాల పాటు నిర్బంధం ఇలాగే కొనసాగితే ఏ స్థాయికి పడిపోతుందోనని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ లాక్డౌన్ కాకుండా.. ఆర్థికాభివృద్ధికి వీలు కల్పించే ‘స్మార్ట్ లాక్డౌన్’ను ప్రధాని ప్రతిపాదించే అవకాశముందని తెలుస్తోంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లోనూ.. ప్రాణాలు కాపాడటంతో పాటు దేశæ ఆర్థికాభివృద్ధి పైనా(జాన్ భీ.. జహాః భీ) దృష్టి పెట్టాల్సి ఉందని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. మద్యం అమ్మకాలకు ఒత్తిడి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చాలామంది ముఖ్యమంత్రులు మద్యం అమ్మకాల విషయం ప్రస్తావించారు. ఖజానాకు అత్యంత కీలకమైన ఆదాయ వనరు అయిన మద్యం అమ్మకాలపై ఆంక్షల సడలింపును వారు కోరారు. బార్లు, రెస్టారెంట్లకు అనుమతివ్వకుండా.. పాక్షికంగా, రోజులో కొన్ని గంటల పాటు అయినా మద్యం అమ్మకాలకు వీలు కల్పించాలన్నారు(దీనిపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి). దాంతో, రాష్ట్రాలు కోరితే.. ఆంక్షల సడలింపులో భాగంగా.. మద్యం అమ్మకాలను పాక్షికంగా అనుమతించే అవకాశం ఉంది. ► స్వల్ప స్థాయిలో దేశీయ విమాన, రైల్వే, మెట్రోరైల్ సర్వీసులను అనుమతించే అవకాశం ఉంది. అయితే, 30 శాతం టికెట్లను మాత్రమే విక్రయించేలా ఆంక్షలు పెట్టే అవకాశముంది. ► కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. అంతర్రాష్ట్ర ప్రయాణాలను పలువురు సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు. -
కరోనా: బ్లాక్లో మద్యం హవా
సాక్షి, మంచిర్యాల: మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు గుట్టుగా బ్లాక్లో మద్యం దందా సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లాక్డౌన్లో ఏకంగా వైన్సుల నుంచే అమ్మకాలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో స్టాక్ను బయటకు తీసి అదును చూసి విక్రయిస్తున్నారు. ఈనెల 22న జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి అన్ని వ్యాపారాలు మూత పడ్డాయి. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలకు సైతం ఎక్సైజ్ అధికారులు తాళాలు వేసి సీల్ వేశారు. అయితే చాలా మంది కర్ఫ్యూ ప్రకటించగానే ఆ రోజు వరకే స్టాక్ బయటికి తీశారు. అదే రోజు రాష్ట్రంలో మార్చి 31వరకు లాక్డౌన్ ప్రకటించడం, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను ఏప్రిల్ 14వరకు పొడిగించడం ప్రకటించడంతో చాలా చోట్ల వైన్సుల్లోనే సరుకు ఉండిపోయింది. (ప్రధాని మోదీ మీటింగ్.. వీడియో లీక్! ) ఇక కొందరు లాక్డౌన్ ప్రకటించడం టీవీల్లో చూసి వెంటనే అప్రమత్తమై ఉన్న స్టాక్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక కొందరు వైన్సుల నుంచే స్టాక్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జైపూర్లో రెండు రోజుల క్రితం ఓ వైన్సు షాపు తాళానికి వేసి ఉన్న సీల్ తొలగించినట్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చింది. అంతేకాక గ్రామాల్లో బెల్టు షాపుల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తే సరుకు పట్టుబడుతోంది. ఇదంతా వైన్సుల నుంచే సరఫరా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బుధవారం కాసిపేట మండలం దేవాపూర్లోని బెల్టుషాపుల్లో దాడి చేయగా మద్యం పట్టుబడింది. కొన్ని చోట్ల బ్లాక్లో కూడా మద్యం దొరక్కపోవడంతో వైన్సుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. బుధవారం దండేపల్లి మండలం చెల్కగూడెంలోని ఓ వైన్సులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి రూ.5వేల విలువైన మద్యం ఎత్తుకెళ్లారు. (క్యాస్టింగ్ కౌచ్: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా! ) అడ్డగోలు రేట్లకు అమ్మకం మందుబాబుల బలహీనతను ఆసరా చేసుకుని అడ్డగోలు రేట్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి బ్రాండ్ సరుకును రెట్టింపు ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం. ఉదాహరణకు ఎంసీ ఫుల్ బాటిల్ ఎమ్మార్పీ రూ.560 కాగా, ప్రస్తుతం బ్లాక్లో రూ.1100లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీరు ధర ఎమ్మార్పీ రూ.120 ఉంటే ప్రస్తుతం రూ.300 వరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇలా ప్రతి బ్రాండ్కు ఎమ్మార్పీతో పోల్చితే రెట్టింపుకు మించి ధరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇక కొందరు లాక్డౌన్ను ముందే ఊహించి పెద్ద ఎత్తున సరుకును రహస్య ప్రదేశాలకు తరలించారు. జనతా కర్ఫ్యూ పాటించిన రోజే లాక్డౌన్ ప్రకటించడంతో జిల్లా కేంద్రంతో పాటు అనేక షాపుల్లో ఉన్న స్టాక్ను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఉన్న స్టాక్ కూడా ఖాళీ అవుతుండడంతో ధరలు రెట్టింపు చేస్తూ వచ్చారు. లాక్డౌన్ తర్వాత రెండు, మూడు రోజులు ఎమ్మార్పీకి మించి రూ.50 నుంచి రూ.100 వరకు అధికంగా విక్రయించగా ప్రస్తుతం కొన్నిచోట్ల రెట్టింపు, మరి కొన్నిచోట్ల మూడింతల ధరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. బయట ఎక్కడా మద్యం దొరకపోవడంతో ఎంత ధర అయినా కొనేందుకు మద్యం ప్రియులు ఆసక్తి చూపుతుండడంతో ఈ దందా సాగుతోంది. ప్రస్తుతం వైన్సు షాపుల్లోనూ ఉన్న స్టాక్ దాదాపు అయిపోయినట్లే తెలుస్తోంది. ఎందుకంటే గోదాంల నుంచి మద్యం స్టాక్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉన్న స్టాక్నే డిమాండ్ను బట్టి రహస్యంగా ఎక్కువ ధరలకు అమ్ముకునే పనిలో ఉన్నారు. (ఇదేం పని జోన్స్.. ట్రోల్ చేసిన ఆకాష్ ) గ్రామాల్లో గుడుంబా జోరు.. గుడుంబా రహిత జిల్లాగా సాగిన తర్వాత మళ్లీ లాక్డౌన్తో గ్రామాల్లో గుడుంబా తయారీ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రాణహిత తీరం వెంబడి పలు ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్నారు. జిల్లాలో నెన్నెల, దండేపల్లి, కోటపల్లి, భీమారం, మందమర్రి తదితర మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో పెద్దఎత్తున బెల్లంపానకం, నాటు సారా పట్టుబడుతోంది. అటు మద్యం సరఫరా లేకపోవడంతో కొందరు గ్రామీణ ప్రాంతాల్లో మత్తు కోసం గుడుంబా వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం లీటరు గుడుంబా ఏడు వందల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎంతైన ఖర్చు చేసి మత్తు కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. మద్యం షాపుల తాళాలకు వేసిన సీల్ తీసినా.. తాళాలు తమ వద్దనే ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో నిత్యం మఫ్టీలో గుడుంబా తయారీ అరికట్టేందుకు గస్తీ చేస్తున్నామని ఎక్కడైనా మద్యం విక్రయిస్తే తమ దృష్టికి తేవాలని అబ్కారీ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నిత్యం మద్యం సేవించే అలవాటు ఉన్నవారికి కొద్ది రోజులుగా మద్యం దొరకపోవడంతో నిర్ణీత సమయాల్లోనైనా ఆంక్షలతో మద్యం షాపులు తెరవాలనే డిమాండ్లు వస్తున్నాయని అంటున్నారు. (ఎల్లకాలం నీకు తోడుగా ఉంటా: బిగ్బాస్ రన్నరప్ ) -
‘మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు’
సాక్షి, అమరావతి : లాక్డౌన్ వేళ మద్యం అక్రమ అమ్మకాలపై డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల్లో చెక్పోస్ట్లలో మరింత నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మద్యం అమ్మకాలకు సహకరిస్తున్న ఎవరినీ కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్ను తనిఖీ చేసి, మళ్ళీ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్ స్టాక్కు ఇప్పటి క్లోజింగ్ స్టాక్ సరిగా ఉందో లేదో వెరిఫై చేయాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వానికి ప్రతి రోజూ కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తున్నా ప్రజారోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ మద్యం అమ్మకాలను నిషేధించారని తెలిపారు. అయితే నిబంధనలు అతిక్రమించి కొంతమంది టీడీపీ అనుకూల బార్ ఓనర్లు మద్యాన్ని బయటికి తీసుకొచ్చి విపరీతమైన ధరలకు విక్రయిస్తున్న ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని తెలిపారు. దీంతో వెంటనే ఆ బార్ల లైసెన్స్ సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఇప్పటికే చిత్తూరులో టీడీపీకి చెందిన భాస్కర్ నాయుడు రెడ్హ్యాండెడ్గా దొరకడంతో అతని బార్ లైసెన్స్ సస్పెండ్ చేశామని వెల్లడించారు. మద్యం విక్రయిస్తే టోల్ఫ్రీ నెంబర్లకు సమాచారమివ్వండి ఎవరైనా మద్యం విక్రయిస్తే టోల్ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఈ సందర్బంగా మంత్రి నారాయణస్వామి ప్రజలకు సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్లు 18004254868, 94910 30853, 0866 2843131 ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. మత్తుకు బానిసలైన కొంతమంది సహనం కోల్పోయి హానికర ద్రవాలు సేవించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఆయన అన్నారు. వారి విషయంలో కుటుంబసభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని, ఈ నెంబర్లు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. -
జాతరలో మద్యం జోరు
సాక్షి, వరంగల్ రూరల్ : మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జాతర సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు 22 షాపుల ఏర్పాటుకు ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు అనుమతి ఇచ్చారు. ఒక్కో మద్యం షాపు రోజుకు రూ.9 వేల అద్దె చొప్పున ఏడు రోజులకు రూ.12.5 లక్షల ఆదాయం ఎక్సైజ్ శాఖకు లభించింది. ఇప్పటి వరకు రూ.4.57 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. కాగా, గత జాతరలో రూ.3.53 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. -
నగరం బ్రాందీ హైదరాబాద్గా మారింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష ప్రారంభించారు. రెండురోజులపాటు దీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నియంత్రించి.. దశల వారీగా మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. మద్యం వల్ల బాధితురాలైన వారి కుటుంబసభ్యులు సహా, ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో హత్యాచారానికి గురైన సమత భర్త, అత్త, పిల్లలు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘ రాజకీయ కారణాలతో దీక్ష చేపట్టలేదు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. తండ్రి కొడుకుల వల్లే బ్రాండ్ హైదరాబాద్ కాస్తా బ్రాందీ హైదరాబాద్గా మారింది. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేశారు. మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వం రూ. 980 కోట్ల ఆదాయం స్వీకరించింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నా.. మద్యం అమ్మకాలు పెంచుకుంటూపోతున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నారు. అర్ధరాత్రి మద్యం అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నారు. మద్యం నిషేధించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. పల్లెల్లో బెల్ట్ షాపులను ద్వంసం చేయాలని మహిళా మోర్చా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం’ అని అన్నారు. -
ఏపీలో గణనీయంగా తగ్గిన మద్యం అమ్మకాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన నూతన మద్యం విధానం సత్ఫలితాలిస్తోంది. మద్య నియంత్రణ, నిషేధం దిశగా ఏపీ వేగంగా ముందుకు సాగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఏపీలో మద్యం వినియోగం, విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018 నవంబర్లో 29లక్షల 62వేల కేసుల లిక్కర్ను విక్రయించగా.. ఈ ఏడాది నవంబర్లో 22లక్షల 31వేల కేసుల మద్యం మాత్రమే అమ్ముడయింది. దీంతో 24.67 శాతం మేర మద్యం అమ్మకాలు తగ్గినట్టయింది. బీర్ల అమ్మకాల విషయానికి వస్తే 2018 నవంబర్లో 17లక్షల 80వేల కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది నవంబర్లో 8లక్షల 13వేల కేసులను మాత్రమే విక్రయించారు. దీంతో బీర్ల అమ్మకాల్లో తగ్గుదల 54.30 శాతంగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ వల్ల గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 3500లకు తగ్గించారు. అంతేకాకుండా మద్యం అమ్మకం సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. మద్యం ధరల పెంపుదల, అమ్మకాల్లో నియంత్రణ విధిస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఈ మార్పు సాధ్యమైంది. కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, సమయాన్ని సక్రమంగా పాటించడంతో మద్యం క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తోందని అధికారులు చెబుతున్నారు. పర్మిట్ రూమ్లను రద్దు చేయడంతో మద్యం షాపులు కేవలం అమ్మకానికి పరమితమవుతున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎక్సైజ్, పోలీసు అధికారులు సమన్వయంతో బెల్ట్ షాపులను తొలగించడంతో గ్రామాల్లో మద్యం వినియోగం పూర్తిగా తగ్గిందని అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా నిఘా ఉంచడం ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆదాయం తగ్గలేదు.. అయితే నూతన మద్యం విధానం వల్ల ఆదాయం మాత్రం తగ్గలేదని అధికారులు తెలిపారు. భారీగా రెట్లు పెంచడంతో.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అలాగే ఉందన్నారు. మద్యం వినియోగం మాత్రం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. -
ఆ దందా సాగదిక...
మద్యం వ్యాపారంలో ప్రైవేటు వ్యాపారుల దందాకు ఇక చరమ గీతం పాడనున్నారు. నిరుపేదలను నిలువునా మోసగించే చర్యలు ఇక సాగనివ్వరు. లూజు విక్రయాల పేరుతో దగా చేసే విధానానికి ఇక చెల్లు చెప్పనున్నారు. కల్తీ మద్యంతో అనారోగ్యం కొనితెచ్చుకోనక్కర లేదు. ప్రభుత్వమే ఇక మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున విక్రయాలన్నీ ఇక పారదర్శకమే. సాక్షి, విజయనగరం రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దశలవారీగా మద్యనిషేధం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మరో కీలకమైన అడుగు పడబో తోంది. తొలుత బెల్టుషాపులు నిరోధించి...కొంతవరకు పల్లెల్లో ప్రశాంతవాతావరణం నెలకొల్పారు. ఇప్పుడు మద్యం దుకాణాలు పూర్తిగా ప్రభుత్వపరంగానే నిర్వహించడంతో లూజు విక్రయాలు... కల్తీ మ ద్యానికి చెల్లు చెప్పనున్నారు. ప్రస్తుతం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 210 మద్యం దుకా ణాలు ప్రైవేటు వ్యాపారుల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. వ్యాపారులు మద్యం దుకాణాలకు టెండర్లు వేసిలాటరీ పద్ధతిలో దుకాణాలను దక్కించుకుని నిర్వహించారు. ప్రభుత్వం ఏడాది కాలానికి నిర్దేశించిన ఫీజును చెల్లించి వ్యాపారం కొనసాగించారు. దీనివల్ల మద్యం దుకాణాల్లో లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగేది. నిబంధనలు ఖాతరు చేయకుండా మద్యం దుకాణాల్లోనే లూజ్ విక్రయాలు చేసేవారు. దీంతో మద్యం విక్రయాల్లో కల్తీ జరిగి మందుబాబుల జేబులకు చిల్లు పడటమే కాకుండా మద్యం ప్రియుల ఆరోగ్యంపైనా ప్రభావం పడేది. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతులు ఉండటంతో ఆ సమయం వరకు అధికారికంగా మద్యం విక్రయాలు సాగించిన వ్యాపారులు రాత్రి 10 గంటల అనంతరం మద్యం దుకాణాల వెనుకనుంచి వారి సిబ్బందితో అనధికార విక్రయాలు సాగించేవారు. ఇక విడి విక్రయాలు బంద్.. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు. దీనివల్ల ఇక విడి విక్రయాలకు ఆస్కారం ఉం డదు. దీనివల్ల కల్తీ జరిగే అవకాశమే ఉండదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అలాగే మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అనధికార విక్రయాలకు ఆస్కారం ఉండదు. దీంతో మద్యం విక్రయాలు తగ్గే అవకాశం ఉండటం, దశలవారీ మద్య నిషేధానికి బాటలు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కల్తీకి ఆస్కారం ఉండదు.. నూతన మద్యం విధానంలో విడి విక్రయాలకు ఆస్కారం లేనందు న మద్యంకల్తీ జరిగే అవకాశం ఉండదు. అలాగే జిల్లాలో ఉన్న 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించి 168కే పరిమితం చేశాం. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సిబ్బందిని నియమించడంతో వారు నిర్ణీత వేళల్లోనే పని చేస్తారు కాబట్టి అనధికార విక్రయాలు జరపడానికి వీలుపడదు. – వై.బి.భాస్కరరావు, అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్, విజయనగరం -
మద్యం విచ్చలవిడి అమ్మకాలకు చెక్
పేదల బతుకుల్లో వెలుగు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యానికి బానిసలుగా మారుతున్నవారి జీవన ప్రమాణాలు మరింత దిగజారకుండా ముందడుగు వేస్తోంది. కేవలం మూడు నెలల పాలనలో బెల్ట్ దుకాణాలను, కల్తీ మద్యం, నాటు సారా వ్యాపారాలను సమర్థవంతంగా నియంత్రించిన ప్రభుత్వం తాజాగా మద్యం విచ్చలవిడి అమ్మకాలను అడ్డుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది. విశాఖ సిటీ: మద్యం విక్రయాలను ఇక ప్రభుత్వమే చేపట్టనుంది. అక్రమ వ్యాపారంతో పాటు కల్తీని పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేయనుంది. విడి మద్యం అమ్మకాలకు చెక్ పెట్టనుంది. మద్యం దుకాణాల వద్ద తాగే అవకాశం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కూడా సాధ్యపడుతుంది. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్న పథకాల్లో పొందుపరిచిన మద్యపాన నిషేధం వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నూతన మద్యం పాలసీకి రంగం సిద్ధం చేసింది. ఈ పాలసీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా తొలిదశలో 20 శాతం దుకాణాలు తగ్గించనున్నారు. తద్వారా జిల్లా, నగరంలో ప్రస్తుతం ఉన్న 401 మద్యం దుకాణాల సంఖ్య 320కి తగ్గుతుంది. ఇందులో 42 మద్యం దుకాణాలను (గతేడాది రెన్యూవల్ చేయించుకోలేదు) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నారు. మిగిలిన 278 దుకా ణాలు అక్టోబర్ నుంచి మొదలవుతాయి. ఆయా దుకాణా లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ద్వారా ఏర్పాటవుతాయి. వీటిని నడిపేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీ పనిచేస్తుంది. మొ త్తం 320 దుకాణాల్లో 1520 మంది సిబ్బం దిని నాలుగు విభాగాల్లో ఏడాది కాల పరిమి తికి అవుట్ సోర్సింగ్ ద్వారా నియమిస్తా రు. నగర పరిధిలోని ఒక్కో దుకా ణానికి ఒక సూపర్వైజర్, ముగ్గురు సేల్స్మెన్లు, ఒక సెక్యూరిటీగార్డు, జిల్లాలో దుకాణానికి ఒక సూపర్వైజర్, ఇద్దరు సేల్స్మెన్లు, ఒక గార్డుకు ఉపాధి కల్పి స్తారు. రిక్రూట్మెంట్ కోసం ఎక్సైజ్ కమి షనర్ ఆదేశాల మేరకు జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ శని వారం నోటిఫికేషన్ జారీ చేశారు. ‘బెల్ట్’పై ఉక్కుపాదం.. అయితే రాష్ట్రంలో నూ తన ప్రభుత్వం ఏర్పడిన తరువాత మ ద్యం అమ్మకాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యంగా మూడు నెలల పాలనలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేలు పైచీలుకు మద్యం బెల్ట్ దుకాణాలను పూ ర్తిగా నిర్మూలించారు. కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపారు. నాటుసారా బట్టీల పనిపట్టారు. సిండికేట్ ఆటకట్టించారు. మద్యాన్ని జనవాసాలకు దూరం చేయడంలో దాదాపు ప్రభుత్వం చాలావరకు సఫలీకృతమైంది. మరో నెల రోజుల తరువాత మద్యం అమ్మకాలు పూర్తిగా గాడిలో పడతాయి. సమయం ఉండదు మిత్రమా.. మరోవైపు మద్యం అమ్మకాల సమ యం విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన మా ర్గదర్శకాలు జారీ చేసిం ది. ఏపీఎస్బీసీఎల్ అవుట్లెట్ ద్వారా అమ్మకాలు ఉద యం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మా త్రమే నిర్ణయించారు. ఇదివరకు ఈ సమ యం ఉదయం 10 నుంచి రాత్రి 10 గం టల వరకు ఉండేది. జిల్లా వ్యాప్తంగా ఈ నెలా ఖరున ప్రారంభం కానున్న 42 దుకాణాలకు ఈ సమయం వర్తించగా..అక్టోబర్ నుంచి అన్ని దుకాణాలకు వర్తింపజేస్తారు. మెరిట్ ద్వారా ఉద్యోగం.. సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సూపర్వైజర్ పోస్టుకు డిగ్రీ అర్హత కాగా సేల్స్మెన్కు ఇంటర్మీడియట్ అర్హత. గార్డుకు నామమాత్రపు విద్యార్హతను నిర్ణయించారు. సూపర్వైజర్కు రూ.17,500, సేల్స్మెన్కు రూ.15 వేలు వేతనం ఇవ్వనున్నారు. ఏడాది కాల పరి మితికి గాను వీరిని అవు ట్ సోర్సింగ్ ద్వా రా పరీక్షలో మె రిట్ సాధించిన వారికి ఉపాధి కల్పిస్తూ పారదర్శకంగా నియామకం జరుపుతా రు. మొత్తం 400 మంది సూపర్వైజర్లు, 800 మంది సేల్స్మెన్లు, గార్డులను తీసుకుంటారు. వీరి పనితీరు బాగుంటే మరో ఏడాదికి ఒక నెల వేతనం బోనస్గా అందిస్తూ కొనసాగిస్తారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వీరి నియాకాలు చేపడతారు. ఏపీఎస్బీసీఎల్ మేనేజర్ సారధ్యం వీరు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 25. టెండర్లకు నేడే ఆఖరు.. ఏపీఎస్బీసీఎల్ అవుట్ లెట్ల నిర్వాహణకు దుకాణాలను అద్దెకు తీసుకునేందుకు ప్రస్తుతం జరుగుతున్న టెండర్ల ప్రక్రియ గడువు ఆదివారంతో ముగియనుంది. ఆసక్తి గల ప్రస్తుత మద్యం దుకాణాల యజమానుల నుంచి టెండర్లు స్వీకరించేందుకు జిల్లా/నగరంలోని ప్రతి పోలీస్స్టేషన్లోనూ టెండర్ బాక్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం వరకు ఆయా బాక్సుల్లో టెండర్ పత్రాలు వేసి పూర్తి వివరాలను ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు తెలియజేయవచ్చు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన టెండర్లను ఈ నెల 20 జాయింట్ కలెక్టర్ సమక్షంలో తెరిచి తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా భవనాలతో పాటు ఫర్నిచర్ ఇతర అవసరమైన సామగ్రిని అద్దెకు తీసుకుంటారు. టీడీపీ హయాంలో బతుకులు బుగ్గి.. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ అస్తవ్యస్తంగా సాగింది. బడి–గుడి రోడ్డు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలకు అనుమతులు జారీ చేశారు. దాంతోపాటు బెల్ట్ దుకాణాలకు పూర్తిగా సహకరించి లైసెన్స్ దుకాణాల నుంచే మద్యం సరఫరా చేసేవారు. దీంతో మద్యం జనవాసాల్లో ఏరులై పారేది. దీంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు మద్యానికి బానిసలుగా మారి ఒళ్లు–ఇళ్లు గుల్ల చేసుకునే దుస్థితి వచ్చింది. ముఖ్యంగా కుటుంబ పెద్దలతో పాటు యువకులు కూడా మద్యానికి బానిసలు కావడంతో జిల్లావ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీంతోపాటు మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు కోకొల్లలు. ప్రభుత్వాదాయం కోసం మద్యం అమ్మకాల్లో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడంతో పేదమధ్య ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. మరోవైపు మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఇష్టానుసారం ధరలు పెంచేసి ఎమ్మార్పీ నిబంధనలకు తూట్లు పొడిచి మందుబాబుల జేబులకు చిల్లు పెట్టారు. ‘పర్మిట్’ లేదు.. ప్రస్తుతం లైసన్స్ మద్యం దుకాణం వద్ద ప్రత్యేక రుసుం ద్వారా పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చేవారు. దీంతో దుకాణం కాస్త బార్గా మారి అక్కడే మందుబాబులు మద్యం సేవించేవారు. సమయం మించిపోయినా అక్కడే తిష్ట వేసి పార్టీలు చేసుకోవడం పరిపాటిగా మారింది. లూజ్ అమ్మకాలు యథేచ్ఛగా సాగేవి. అయితే తాజాగా మద్యం పాలసీ ద్వారా ఆయా పర్మిట్ రూమ్లకు ఇకపై అనుమతి ఇవ్వబోరు. దుకాణంలో కేవలం అమ్మకాలు మాత్రమే జరుపుతారు. షాపు చుట్టుపక్కల ఎక్కడా మద్యపానం చేయడానికి వీలు లేదు. నిరుద్యోగులకు బాసటగా.. -నాలుగు విభాగాల్లో ఏడాది కాల పరిమితికి అవుట్ సోర్సింగ్ విధానం -ఒక్కో షాపునకు ఓ సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్మెన్లు, ఓ సెక్యూరిటీ గార్డు -సూపర్వైజర్కు : 17,500 వేతనం -సేల్స్మన్కు : 15,000 -మొత్తం సూపర్వైజర్లు : 400 మంది -సేల్స్మన్లు : 800 మంది -సెక్యూరిటీ గార్డులు : 320 మంది -దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 25 వైన్ షాపుల వివరాలు.. -జిల్లాలో ఉన్న మద్యం షాపులు : 401 -కొత్త పాలసీ ప్రకారం తగ్గనున్నవి : 81 -గతేడాది రెన్యువల్ చేయించుకోలేని మద్యం షాపులు : 42 -అక్టోబర్ నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే షాపులు : 42 -వీటి మోనటరింగ్కు కమిటీ సభ్యులు : ఐదుగురు పారదర్శకంగా ప్రక్రియ.. నూతన మద్యం పాలసీ విధానంపై పూర్తి కసరత్తు చేస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం సూచించిన కమిటీలో కలెక్టర్ సారధ్యంలో ఐదుగురు సభ్యుల బృందంతో పాటు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. టెండర్ ప్రక్రియతో పాటు సిబ్బంది నియామకం కూడా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. ఈ నెలాఖరుకు 42 అవుట్లెట్లు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. మిగిలిన దుకాణాలు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి. దుకాణాల సమయం గంట తగ్గించడంతో పాటు పరిమిట్ రూమ్ల అనుమతిని రద్దు చేస్తాం. నూతన మద్యం పాలసీ వలన ప్రజల బతుకులు మారుతాయని ఆశిస్తున్నాం. – టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ డెప్యూటీ కమిషనర్, విశాఖపట్నం -
‘మందు’స్తు సిద్ధం!
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో మద్యాన్ని ఏరులై పారించి యువతను, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇప్పటి నుంచే అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మద్యం ఇండెంట్లుకు తగ్గించే అవకాశాలు ఉండడంతో ముందుగానే మద్యం కొనుగోళ్లు చేసుకొనేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. ఇప్పటికే జిల్లా అధికార పార్టీలో కీలక నేత మద్యం సిండికేట్తో చర్చలు జరిపి ఎమ్మార్పీ ఉల్లంఘనకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. అందుకు ఆయన భారీగానే తాయిలాలు పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అభ్యర్థులకు మద్యం పంపిణీలో ఇబ్బంది లేకుండా ముందుగానే సిద్ధంగా ఉంచాలనే ఆదేశాలు ఇచ్చారు. దీంతో భారీగా ఇండెంట్లు పెట్టి కేసులు తెప్పించినట్లు సమాచారం. గత మూడు నెలల్లో భారీగా మద్యం కొనుగోళ్లు గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ వస్తే.. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మద్యం విక్రయాల్లో నిబంధనలు అమలవుతాయి. గతేడాది ఇదే నెలల్లో ఎంత విక్రయాలు జరిగాయో.. అంతే ఇండెంట్లో వ్యాపారులకు మద్యం సరఫరా అవుతుంది. సాధారణంగా అయితే ఈ లిమిట్ ఉండదు. దీని కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే మద్యం వ్యాపారులతో కలిసి అధికార పార్టీ నేతలు భారీగా కొనుగోళ్లు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ముందుగానే తమ షాడో నేతలను రంగంలోకి దింపారు. వైన్ షాపుల నుంచి మద్యం కేసులు కొనుగోళ్లు చేయించి రహస్య ప్రాంతాల్లో దాచి ఉంచాలని నేతలు ఆదేశించడంతో వారు మద్యం కేసులు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు వేల కేసుల మద్యం రహస్య ప్రాంతాలకు తరలించేసుకుంటున్నారు. రెండింతలు పెరిగిన కొనుగోళ్లు జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన వ్యాపారంతో పోల్చుకుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండింతలు కొనుగోళ్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో 350 మద్యం దుకాణాలు ఉండగా ఎక్కువ దుకాణాలు అధికార పార్టీకి చెందిన నేతలవే ఉన్నాయి. మద్యం సిండికేట్తో సమావేశమైన టీడీపీ కీలకనేత తమ పార్టీ అభ్యర్థులకు ఎన్నికలకు సరిపడా మద్యం సరఫరా చేయాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మద్యం డిపో నుంచి కొనుగోళ్లు చేసి టీడీపీ నేతలకు విక్రయాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన మద్యం విక్రయాలే చెప్పవచ్చు. గత నెలలో రూ.138 కోట్లు విలువ చేసే 2,46,597 లిక్కర్, 1,45,807 బీరు కేసులు విక్రయాలు జరిగాయి. అదే గతేడాది ఫిబ్రవరి నెలలో రూ.88 కోట్లు విలువ చేసే 1,79,849 లిక్కర్, 92,057 బీరు కేసులు విక్రయాలు జరిగాయి. అంటే ఈ ఏడాది దాదాపు రూ.50 కోట్లు ఎక్కువగా మద్యం క్రయవిక్రయాలు పెరిగినట్లుగా గణాంకాలు చూపిస్తున్నాయి. జిల్లాలో మద్యం కొనుగోళ్లు సంవత్సరం లిక్కర్ కేసులు బీరు కేసులు వ్యాపారం (రూ.కోట్లు) 2018 ఫిబ్రవరి 1,79,849 92,057 రూ.88 2019 ఫిబ్రవరి 2,46,597 1,45,807 రూ.138 ఎమ్మార్పీ ఉల్లంఘనకు గ్రీన్సిగ్నల్ జిల్లాలోని ఎన్నికల ముందుగానే మద్యం «ధరలు పెంచుకునేందుకు జిల్లా అధికార పార్టీలోని కీలక నేత గ్రీన్సిగ్నల్ ఇప్పించారు. మద్యం సిండికేట్తో సమావేశ మైన కీలక నేత ప్రతి మద్యం బాటిల్పై అదనంగా రూ.5 వంతున అదనంగా పెంచి విక్రయాలు చేసుకొనేలా ఆదేశాలిప్పించారు. ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే మద్యం ధరలు పెంచేశారు. గత ఇరవై రోజులుగా ప్రతి క్వాటర్ బాటిల్ , బీరు బాటిల్పై ఎమ్మార్పీ కంటే అదనంగా పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఇలా చేసుకొనేందుకు కీలక నేతకు దాదాపు రూ.30 లక్షల వరకు తాయిలాలు సిండికేట్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ ఉన్నతాధికారుల నుంచి స్థానిక స్టేషన్ల వరకు అందరికీ గతంలో మాదిగానే నెలవారీ మామూళ్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. పోలీసులకు కూడా నెలవారీ మామూళ్లు అందేలా ఒప్పందం చేసుకొని ఎమ్మార్పీ ఉల్లంఘన చేశారు. -
ప్రాణాలు తీస్తున్న సరదా
సాక్షి, చందంపేట (దేవరకొండ) : 18 ఏళ్లు నిండిన ఓ యువకుడు ప్రేమించుకుని వివాహం చేసుకున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రి నుంచి విడిపోయాడు. తల్లి పని చేసి సాకింది. ఆ యువకుడు ప్రయోజకుడయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, కాళ్లపై నిలబడ్డ కొడుకు మృత్యువాతపడ్డాడు. స్నేహితులతో కలిసి వచ్చి మృత్యుఒడిలోకి వెళ్లాడు. రెండున్నరేళ్లలోపు ఇద్దరు కుమారులకు దూరమయ్యాడు. తల్లి, భార్య రోదనలు, ఆ చిన్నారులను చూస్తే పలువురిని కన్నీటి పర్యంతం చేసింది.. ఈ ఘటన ఆదివారం రాత్రి నేరెడుగొమ్ము మండలం కృష్ణా నది తీరమైన వైజాక్ కాలనీలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రాంతంలోని మెహిందీపట్నంకు చెందిన గడ్డం వెంకట్(23) హైదరాబాద్లోని సోని ట్రాన్స్పోర్ట్లో ఇన్చార్జ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అదే కాలనీకి చెందిన నిర్మలతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర సంవత్సరాల లోపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తన కంపెనికి చెందిన ఏడుగురు మిత్రులతో కలిసి వెంకట్ ఆదివారం సుమారు 3 గంటల సమయంలో వైజాక్ కాలనీలోని ఓ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి అక్కడే తినేందుకు కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాన్ని సందర్శించేందుకు మిత్రులతో మర బోటులో వెళ్లాడు. అక్కడే కాసేపు ఆగినీటిలో ఈత కొట్టారు. ఇదే క్రమంలో మద్యం సేవించి వెంకట్ ప్రమాదవశాత్తు నీటి గుంతలోకి వెళ్లిపోయాడు. తోటి మిత్రులు అరుపులు వేయడంతో మత్స్యకారులు అక్కడికి వెళ్లి గాలించారు. పోలీసులకు కూడా సమాచారం అందడంతో కృష్ణా నదిలో పోలీసు సిబ్బంది జల్లడ పట్టడంతో సుమారు గంట సేపటికి వెంకట్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పచ్చిపాల పరమేశ్ తెలిపారు. అడ్డూఅదుపు లేకుండా మద్యం విక్రయాలు తెలంగాణ రాష్ట్రంలో అరకు పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందిన వైజాక్ కాలనీలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గతంలో పుష్కరాల సమయంలో వచ్చిన ఓ చిన్నారి కూడా మృత్యువాతపడగా మట్టి, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడడంతో మరో చిన్నారి మృతిచెందాడు. అనుమతి లేకుండా మర బోట్లలోవేలాది రూపాయలు వసూలు చేసి సాగర తీరంలో కొంత మంది వ్యాపారం చేస్తున్నారు. ప్రమాదం ఉన్నప్పటికి మరబోట్లేనే మద్యం, వంటకాల పేరుతో పర్యాటకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ సరదాగ వచ్చిన వారి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోయేలా ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. నిద్రావస్థలో మత్స్యకార సంస్థ అర్హత, రక్షణ జాకెట్లు, హెచ్చరికలు, సూచనలు ఇవ్వాల్సిన మత్స్య శాఖ నిద్రావస్థలో ఉంది. ఆదివారం రాత్రి జరిగిన ఘటనలో వెంకట్ మృతి చెందినప్పటికీ ఆ శాఖ సోమవారం నాటికి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి పలు హెచ్చరికలు చేయాల్సి ఉంది. అనుమతి లేకుండా మరబోట్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ విషయమై నేరెడుగొమ్ము ఎస్ఐ పచ్చిపాల పరమేశ్ను వివరణ కోరగా నలుగురు కానిస్టేబుళ్లు, ఎస్ఐ, ఇద్దరు హోంగార్డులు ఉన్నారని, ఎన్నికల నిర్వాహణ, ఆయా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలపై దృష్టి సారించామని, మత్స్య శాఖ, మండల పరిషత్, తహసీల్దార్ ఈ విషయాలపై దృష్టి సారించాలని, కాని వారు పట్టించుకోవడం లేదన్నారు. కన్నీరు..మున్నీరు వెంకట్, నిర్మలలు మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు.. అందరిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండున్నర సంవత్సరాల లోపు అభి, అఖి కుమారులు ఉన్నారు. చిన్నప్పటికి నుంచి తండ్రి తమ నుంచి దూరమైనా తల్లి ఆలనా..పాలన చూసి ప్రయోజకున్ని చేసింది. గత రెండు రోజుల క్రితం తాను సంపాదించిన డబ్బులలో ఓ ద్విచక్ర వాహనం కొనుక్కుంటానని తల్లిని కోరడంతో కొన్ని పైసలు ఇచ్చానని, రెండు రోజుల్లో బండి తెచ్చుకుంటానని చెప్పి వెళ్లిన కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లి రోదన అంతా ఇంత కాదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఈ ప్రాంతంలో చనిపోవడం ఏంటని ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. నా వెంకట్...నాకు కావాలి ప్రేమించి వివాహం చేసుకున్న భార్య నిర్మల చిన్నారుల ఏడుపులతో కేకలు పెట్టడడం కలచివేసింది. -
నల్గొండలో ఒక్కరోజే రూ.3 కోట్లు తాగేశారు
నల్లగొండ క్రైం : కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం పొంగింది. మందు ప్రియుల జేబుకు చిల్లు పడగా.. ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలికేందుకు జరిగిన కార్యక్రమాలతో ఒక్క రోజులోనే (డిసెంబరు 31వ ) రూ.3 కోట్ల మద్యం సేల్ అయ్యింది.ఇక, డిసెంబరు నెల విషయానికి వస్తే.. 2017 డిసెంబర్ ఒక్క నెలలో రూ.83 కోట్ల 2లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. కాగా, 2018 డిసెంబర్లో రూ.95 కోట్ల 28 లక్షల విలువ గల మద్యం అమ్మకాలు జరిగాయి. 2017తో పోలిస్తే 2018 డిసెంబర్లో రూ.12.26 కోట్ల అదనపు అమ్మకాలు జరిగాయి కేవలం డిసెంబర్ 31 నాడు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రూ.5కోట్ల 15 లక్షల విలువైన మద్యం వైన్షాపులకు చేరగా... అందులో రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 138 వైన్షాపులు, 18 బార్లు, నాగార్జునసాగర్, నల్లగొండల్లో క్లబ్బులు ఉన్నాయి. డిసెంబర్ 31న మద్యం డిపో నుంచి వైన్షాపులకు 8,185 లిక్కర్ పెట్టెలు, 10,298 బీర్ పెట్టెలు తరలాయి. మొత్తం రూ. 5,15 లక్షల విలువైన మద్యం వైన్షాపులకు చేరగా రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రోజుకు సగటున రూ.2 కోట్ల 50 లక్షల మద్యం అమ్మకం ఉంటుందని జిల్లా ఎక్సైజ్ అధికారి శంకరయ్య తెలిపారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత బీర్లను పొంగించారని మద్యం అమ్మకాలు రుజువు చేస్తున్నాయి. -
భార్య పెళ్లిచీర తాకట్టుపెట్టి...
బౌద్ధ సంస్కృతి విరాజిల్లిన చోటు, సాంస్కృతిక వికాసానికి పెట్టనికోట అయిన తెలుగు నేలలో గ్రామ సంస్కృతి రానురాను మందు సంస్కృతిగా మారిపోతూ వుంది. పుట్టుక, పెళ్ళి, మరణం, పండుగ ఒక్కటేమిటి ప్రతి సందర్భంలోను గ్రామం, పట్టణం మందు వాసన వేస్తున్నాయి. మన పాలకులు ప్రజల్లో, యువకుల్లోని బలహీనతలను రెచ్చగొట్టి డబ్బు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక నీతి, రాజకీయ ప్రవర్తన, తాగుడు వలన విధ్వంసం అవుతున్నాయి. ‘వీధి వీధికి కుళాయిల్లా మందు షాపులు, బెల్టు షాపులు పెట్టారు. మంచినీళ్ళకు జుట్టు జుట్టు పట్టుకొని కొంటున్నాం, కానీ మందు మాత్రం బాబు ఇంటికే సరఫరా చేస్తున్నాడు. నా బిడ్డ కళ్ళముందే చనిపోయాడు బాబూ’ అని ఎందరో తల్లులు ఏడుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ కేకలు వినపడటం లేదా? విశ్వవిద్యాలయాలు, కాలేజీ హాస్టళ్ళ నిండా మందు సీసాలు, అర్ధరాత్రి కేకలు, ఆడపిల్లల హాస్టళ్ళకు వెళ్ళి ఫొటోలు తీయ డాలు, అక్షరాలు బుర్రకెక్కక అక్షరం ముక్క రాక విద్యా సంస్కృతి ధ్వంసం అవడంలేదా? ఒక బేల్దార్ మేస్త్రీ ఉదయాన్నే తాగి రాయి మీద రాయి పెడుతూ క్రిందపడి చనిపోయాడు. ఆ యూనియన్ లీడర్ ‘ఇది వరకు మేస్త్రీలు ఇడ్లీ, అట్టు తిని ఎంత ఎత్తయిన ఎక్కి పనిచేసేవారు. ఇప్పుడు 100కి 90 మంది మేస్త్రీలు తాగి పరంజాలు ఎక్కుతున్నారు. అక్కడ నుండి తూలిపడిపోతున్నారు’ అన్నారు. పొన్నూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే మందుషాపు నడుస్తోంది. ఇలా అన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల అండతోనే షాపులు నడుస్తున్నాయి. రాష్ట్రాన్ని విజ్ఞాన హబ్బుగా చేస్తానంటున్నావు. విద్యార్ధిలోకమే రోజుకు ఎంతమందు సేవిస్తోందో తెలుసా? ముఖ్యంగా మత కేంద్రాలు తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, కనక దుర్గా మందిర పరిసరాల్లో మందు తాగి, ప్రయాణాల్లో బైకులు, కార్లు నడపడంవల్ల ఎంత నెత్తురు ఈ తెలుగు నేల పీల్చుకుందో తెలుసుకుంటున్నారా? చర్చిల ఎదురు ఎక్కువ మందు తాగుతున్నారు. మసీదుల ముందూ మందు షాపులు ఉన్నాయి. మతక్షేత్రాల చుట్టూ మద్యం షాపులే. చివరకు రక్షక భటులే తాగి ఇళ్ళకు వెళ్ళడం కాక, డ్యూటీలకు వస్తున్న వైనం మీకు తెలుస్తోందా? అనంతపురం, కర్నూలు, కడపల్లో మద్యం విపరీతంగా అమ్ముడవుతోంది. ఒక్క అనంతపురంలో రూ. 244 కోట్ల ఆదాయం వచ్చిదంటే ఇక చూడండి. ఒక పక్క కరువు మరొక పక్క నిరుద్యోగం. రాయలసీమ జిల్లాల్లో మందుసీసా ఒక్కటే రాజ్యం ఏలుతోంది. శ్రీకాకుళం జిల్లా తెలుగు నేలకు వన్నె తెచ్చిన జిల్లా. అటువంటి జిల్లా ఇప్పుడు మందు వాసనేస్తోంది. తుఫానులో ప్రచార ఆర్భాటం తప్ప చేసింది ఏమీ లేదు. తుఫాన్ రిలీఫ్కు ఇచ్చిన డబ్బులన్నీ ప్రజలు తాగుతున్నారని తెలుసు. సంక్షేమ పథకాలు తాగుడుకే బలి అవుతున్నాయి. చివరకు రూపాయి బియ్యం కూడా అమ్ముకుని తాగుతున్నారు. అన్న క్యాంటీన్కి కూడా తాగే వస్తున్నారు. డ్వాక్రా లోన్లు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళ చేతుల నుంచి పీక్కుంటున్నారు. ఇళ్ళు కుదువ పెడుతున్నారు. గిన్నెలు, చెంబులు, ఫ్యాన్లు, టి.వి.లు ఇంట్లో సామానంతా కుదువ పెట్టి తాగుతున్నారు. ఆడవాళ్ళ చెవికమ్మలు, పుస్తెలు, కాళ్ళకుండే పట్టాలతో సహా లాక్కెళ్ళి తాగుతున్నారు. ఇటీవల ఒకడు భార్యకు పెట్టిన పెండ్లి పట్టుచీర కూడా కుదువపెట్టి తాగాడు. ఇక అమరావతి ప్రాంతంలో అయితే మందు కొట్లకు తెల్లవారి నుంచే క్యూలు. రైతులు భూమి మీద వచ్చిన డబ్బుతో తాగి, పేకాడి ఇప్పటికే కొంత మంది రోడ్డున పడ్డారు. రైతుల గుండెల్లో తాగుడు అనే గునపం బాబు గుచ్చాడని రైతుల భార్యలు వాపోతున్నారు. తన మనవడి కోసం ఇప్పటికే వేల కోట్లు సంపాదించిన చంద్రబాబు తన రాష్ట్ర ప్రజల కుటుంబాలు విచ్ఛిన్న మవ్వడం తెలియదా? మామూలు రవాణాల్లోనే కాకుండా జల రవాణాల్లో కూడా మరణాలు పెరిగాయి. ఈ ఏడాది మే 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు గ్రామానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లికి మధ్య లాంచీ తలకిందులై 19 మంది చనిపోయారు. ఈ సంవత్సరం జూలై 14న తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండల పరిధిలోని గోదావరి నదిలో పశువుల్లంక మొండి రేవు వద్ద పడవ బోల్తాపడి ఏడుగురు గల్లంతయ్యారు. ఈ మరణాల వెనుక తాగుడు ప్రధాన పాత్రలో వుంది. ఈనాడు ఫూలే, అంబేడ్కర్ ఆలోచనా విధానంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పడి బాబును ఓడించాల్సిన బాధ్యత ముందుకు వచ్చింది. ఈ దుర్భర పరిస్ధితి నుండి రాష్ట్రాన్ని బయట పడవేయాల్సి వుంది. - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు 98497 41695 -
లిక్కర్ అమ్మకాలకు డబుల్ కిక్కు
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ అమ్మకాలకు ఎన్నికల వాతావరణం కిక్కు ఎక్కిస్తోంది. మరోవైపు దసరా సంబురాలు సమీపిస్తుండటంతో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. గ్రేటర్ పరిధిలో నిత్యం రూ.10 కోట్ల మేర వివిధ రకాల బ్రాండ్ల మద్యం, బీర్లు అమ్ముడవుతుండగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరవాత అమ్మకాల్లో 15 శాతం పెరుగుదల నమోదైనట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహానగరం పరిధిలో సుమారు 400 మద్యం దుకాణాలు, మరో 500 బార్లు వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల సమావేశాలు, చీర్స్ పార్టీలతో హోరెత్తుతున్నాయి. గతేడాది దసరా కంటే ఈసారి అమ్మకాల్లో 25 శాతం వృద్ధి నమోదవుతుందని ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రేటర్లో రోజుకు సుమారు పది లక్షల లీటర్ల బీరు, ఐదు లక్షల లీటర్ల మేర దేశీ, విదేశీ బ్రాండ్ల మద్యాన్ని నిషాచరులు సేవిస్తున్నట్లు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ప్రతి శుక్ర, శని వారాల్లో మద్యం వాడకం అధికంగా ఉందని ఆబ్కారీశాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా 16–35 ఏళ్ల మధ్యనున్నవారు బీరు, 35–55 మధ్య వయస్కులు విస్కీ సేవిస్తుండటం గమనార్హం. వీకెండ్లో జోష్... ఐటీ, బీపీవో, కేపీవో, రియల్టీ, సేవారంగాల్లో పనిచేస్తున్నవారిలో అత్యధికులు శుక్ర, శనివారాల్లో లిక్కర్ కిక్కుతో పసందు చేసేందుకు మక్కువ చూపిస్తున్నట్లు తాజా మద్యం అమ్మకాల తీరుతో తెలుస్తోంది. గ్రేటర్లో సాధారణ రోజుల్లో నిత్యం సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతుండగా, అవి వీకెండ్లో రూ.20 కోట్లకు పైమాటే ఉంటున్నాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. బడా లిక్కర్ మాల్ క్యాకమాల్... జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఓ బడాలిక్కర్ మాల్ మందుబాబులు, గ్రేటర్ సిటీజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ లిక్కర్మాల్ ఆసియాలోనే అత్యంత పెద్దదిగా ప్రాచుర్యం పొందింది. దీనిలో సుమారు 1,100 రకాల దేశీ, విదేశీ బీరు, విస్కీ, బ్రాందీ, వైన్ రకాలు లభిస్తున్నాయి. రూ.300 ధర పలికే బీరు మొదలు రూ.5.23 లక్షల విలువ చేసే ఖరీదైన విస్కీ వరకు ఇక్కడ లభిస్తున్నాయి. ఇక్కడ నెలకు రూ.5 కోట్ల మేర అమ్మకాలవుతున్నాయి. ఇందులో సింహభాగం విదేశీ సరుకుదే. ఏ విదేశీ మద్యాన్ని ఎలా ఆస్వాదించాలి.. ఏ మద్యం సేవిస్తే, ఎలాంటి స్టఫ్ తీసుకోవాలన్న అంశంపై కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అవగాహన కల్పించేందుకు సైతం ఈ మాల్లో ఏర్పాట్లు చేయడం విశేషం. క్షణాల్లో బీ(రు) రెడీ... బీర్బలుల దాహార్తిని తీర్చేందుకు క్షణాల్లో బీరును సిద్ధం చేసి చిల్డ్గా సర్వ్ చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఏడు మినీ బ్రూవరీలు సైతం అందుబాటులోకి రావడం విశేషం. వీటికి ఇటీవలి కాలంలో ఆదరణ బాగా పెరిగినట్లు నిర్వాహకులు ’సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఓ బ్రూవరీని నిత్యం వెయ్యిమందికిపైగానే సందర్శిస్తుండగా అది వీకెండ్లో 2500–3000 వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.