కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు | Special trains for Kumbh Mela | Sakshi
Sakshi News home page

కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

Published Thu, Feb 20 2025 5:11 AM | Last Updated on Thu, Feb 20 2025 5:11 AM

Special trains for Kumbh Mela

నేటి నుంచి 28 వరకు... చర్లపల్లి–దానాపూర్‌ మధ్య సర్వీసులు  

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 26వ తేదీన మహాకుంభమేళా ముగియనున్న దృష్ట్యా.. చర్లపల్లి–దానాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–దానాపూర్‌ (07791) ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 9.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి రెండోరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు దానాపూర్‌ చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో దానాపూర్‌–చర్లపల్లి (07792) ప్రత్యేక రైలు ఈ నెల 20 నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 4.45 గంటలకు దానాపూర్‌ నుంచి బయలుదేరి.. మర్నాడు రాత్రి 9.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 

ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బర్హంపూర్‌ తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement