![Telangana: 10th Class Exam Paper Reduced From 11 To 6 - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/11/Telangana-tenth-exam.jpg.webp?itok=c0m4HugK)
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షల పేపర్లను కుదించింది. దీంతో ఈ ఏడాది టెన్త్లో 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతో పరీక్షలు ఉండనున్నట్లు, ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్గానే పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2020-21లో 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా.. 2021-22లో కూడా ఈ విధంగానే అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడం గమనార్హం.
చదవండి: భారత్: మన ఇంటర్నెట్ వేగం అంతంతే!
Comments
Please login to add a commentAdd a comment