తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. భూసేకరణపై స్టే | Telangana HC Sensational Judgement On Land Acquisition Notification | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. భూసేకరణపై స్టే

Published Thu, Mar 6 2025 1:29 PM | Last Updated on Thu, Mar 6 2025 3:37 PM

Telangana HC Sensational Judgement On Land Acquisition Notification

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో  భారీ షాక్‌ తగిలింది. హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్‌పై  స్టే విధిస్తూ.. తక్షణమే భూసేకరణ ఆపేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.

వికారాబాద్‌ జిల్లా దుండిగల్‌ మండలం హకీంపేట పరిధిలో 8 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా.. బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారంటూ బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. హకీంపేటకు చెందిన శివకుమార్‌ బాధితుల తరఫున పిటిషన్‌ వేయగా.. అడ్వొకేట్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం.. భూసేకరణపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్‌​ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని  ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.

	Land Acquisition: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement