-
హిందూ వివాహ చట్టప్రకారం ఎస్టీలు విడాకులు ఇవ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: హిందూ వివాహ చట్టప్రకారం వివాహం చేసుకున్న ఎస్టీలకు అదే చట్టప్రకారం విడాకులు ఇవ్వవచ్చని.. అయితే పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన ఓ గిరిజన (లంబాడ) దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కామారెడ్డి సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఎస్టీకి చెందిన వారికి హిందూ వివాహ చట్టం సెక్షన్ 2(2) వర్తించదని కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. దీనిపై దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సృజన్కుమార్రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు పూర్తిగా హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహం చేసుకున్నారని.. పెళ్లి కార్డు సహా ఇతర ఆధారాలన్నీ పరిశీలించాల్సిన ట్రయల్ కోర్టు ఆ పని చేయలేదన్నారు. హిందూ లంబాడా వర్గానికి చెందిన వారని.. హిందూ వివాహ చట్టం వారికి వర్తించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు లంబాడా వర్గానికి చెందిన వారైనా వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినందున ట్రయల్ కోర్టు పూర్తి ఆధారాలను పరిశీలించి ఆ మేరకు విడాకులు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.అయితే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 2(2).. ఇతర సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న ఎస్సీలకు వర్తించదని, ఈ కేసుకు మాత్రమే పరిమితమని చెప్పారు. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి దాకా.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదిక అయ్యింది. గురువారం అర్ధరాత్రి 1గం.(శుక్రవారం) దాకా కేసుల విచారణ జరిగింది. అందులో వెకేషన్ బెంచ్ ఆ ప్రొసీడింగ్స్ చేపట్టడం మరీ విశేషం. మే 6 నుంచి మే 31వ తేదీదాకా తెలంగాణ హైకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్లు పని చేస్తాయి. అయితే గురువారం ఒక్కరోజే లిస్ట్లో ఉన్న 250 కేసులు విచారణ చేపట్టింది జస్టిస్ విజయ్సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్. ఉదయం 10.30ని. మొదలైన బెంచ్ విచారణ.. తెల్లవారుఝామున 1గం. దాకా సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక.. బీజేపీ వేసిన ప్రైవేట్ పిటీషన్ ను అర్థరాత్రి 1 గంటకు విచారించింది ఈ వెకేషన్ బెంచ్. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే.. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేసింది. దీంతో.. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆరోపణలున్నాయి. సంబంధిత వార్త: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్ -
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
-
వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్రెడ్డికి తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలోకి ప్రవేశించొద్దని ఆదేశిస్తూ కోర్టుకు పాస్పోర్టు, రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, ఇద్దరు ష్యూరిటీలు ఇవ్వాలని సూచించింది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హైదరాబాద్ సీసీఎస్లో హాజరు కావాలని ఆదేశించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్షులను బెదిరించొద్దని ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్కుమార్రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని తమకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదని.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డితో పాటు సునీల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పారు. అరెస్టు సమర్థనీయం కాదు నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం (హియర్ సే ఎవిడెన్స్) చట్టప్రకారం సాక్ష్యంగా చెల్లదని వైఎస్ భాస్కర్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గూగుల్ టేకవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధృవీకరణ ఇవ్వదన్నారు. ఇలాంటి సాక్ష్యాలతో వైఎస్ భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి అరెస్టు సమర్థనీయం కాదన్నారు. ‘మూడో చార్జిషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది.వైఎస్ అవినాశ్రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించినవారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం సహకరిస్తున్నారు. హత్య వెనుక వైఎస్ భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినా గంగిరెడ్డి తాను అలా చెప్పలేదని పేర్కొన్నారు. దస్తగిరి చెప్పిన విషయానికి అంత ప్రా«దాన్యమిస్తున్న సీబీఐ ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడంలేదు’ అని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. తండ్రి తన కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా?‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈయనపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయనను తప్పించి.. మరొకరిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగిన రోజు వైఎస్ అవినాశ్రెడ్డికి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి తన కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో సీబీఐ విచారణను సాగదీస్తోంది’ అని నిరంజన్రెడ్డి న్యాయమూర్తికి నివేదించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలి.. ‘‘పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే సాక్ష్యాలు లేవు. వైఎస్ భాస్కర్రెడ్డి వయసు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల వద్దకు చేర్చాల్సి ఉంటుంది. జైలులో ఉంటే అదెలా సాధ్యం? ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్రెడ్డితోపాటు ఉదయ్కుమార్రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. వీరికి కూడా అదే వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితులను జైలులో ఉంచడం వారి హక్కులను హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది’ అని నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి గత నెలలో తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం తీర్పు చెప్పారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు ఊహించని షాక్ తగిలింది. విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెల్లడించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నికపై కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విఠల్కు రూ.50వేలు జరిమానా కూడా విధించింది.అయితే, 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నామినేషన్ విత్ డ్రా చేయలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల అనంతరం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఇదే సమయంలో ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరోవైపు.. విఠల్ లాయర్ అభ్యర్థనతో తీర్పును కోర్టు.. నాలుగు వారాలు సస్పెండ్ చేసింది. -
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
-
ఆ ఈవీఎంల వినియోగానికి హైకోర్టు ఓకే
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకునేందుకు ఎన్నికల కమిషన్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మల్లారెడ్డి, కాంగ్రెస్ తరఫున వజ్రేష్యాదవ్ పోటీ చేశారు. 33 వేల మెజారిటీతో మల్లారెడ్డి విజయం సాధించారు. అయితే అఫిడవిట్లో మల్లారెడ్డి తప్పుడు సమాచా రం ఇచ్చారని.. నిర్ణీత ఫార్మాట్లో వివరాలన్నీ ఇవ్వలేదని ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వజ్రేష్ యాదవ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. సమీప అభ్యర్థి అయిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించేలా ఎన్నికల కమిష న్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వజ్రేష్ తరఫున న్యాయవాది సిర్థ పోగుల దాఖలు చేసిన పిటిష న్పై జస్టిస్ జె.శ్రీనివాస్రావు బుధవారం విచారణ చేపట్టారు. ఎన్నికల కమిషన్, మేడ్చేల్ ఆర్డీవో, అసెంబ్లీ కార్యదర్శి, మల్లారెడ్డితో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే కేసు కారణంగా గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్లను వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా, అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.పల్లా రాజేశ్వర్రెడ్డికి నోటీసులుజనగామ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్రెడ్డి (బీఆర్ఎస్) ఎన్నికను సవాల్ చేస్తూ కొమ్మూరి ప్రతాపరెడ్డి(కాంగ్రెస్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమీప ప్రత్యర్థినైన తనను శాసనసభ్యుడిగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై కూడా న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్రావు బుధవారం విచారణ చేపట్టారు. వాదన తర్వాత.. రాజేశ్వర్రెడ్డి సహా ఇతర ప్రతివా దులకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేస్తూ, విచారణను జూన్ 14కు వాయిదా వేశారు. -
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాస్రావు,జస్టిస్ రాజేశ్వర్రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియ జేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్రావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరినీ శాశ్వత న్యాయమూర్తు్తలుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969, ఆగస్టు 31న జగ్గన్నగారి శ్రీనివాస్రావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, మాణిక్యరావు. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999 ఏప్రిల్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో సమర్థంగా వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే వరకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఈ రెండేళ్లలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. ఆయనకు భార్య శ్రీలత ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రక్షిప్త ఉన్నారు. 2001లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మహబూబాబాద్ జిల్లా సూదన్పల్లిలో 1969 జూన్ 30న నామవరపు రాజేశ్వర్రావు జన్మించారు. తల్లిదండ్రులు గిరిజాకుమారి, సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్లో.. హైసూ్కల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్లో పూర్తి చేశారు. ఓయూ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. 2001 ఫిబ్రవరి 22న న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత సీవీ రాములు కార్యాలయంలో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు విధులు నిర్వర్తించారు. యూజీసీ న్యాయవాదిగానూ పనిచేశారు. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్గా విధులు నిర్వహించారు. 2019 నవంబర్ నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా పనిచేస్తూ 2022 ఆగస్టు 16న అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. -
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ కూడా తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా కొనసాగుతారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ నియామకాలు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. (ఇక ఎవరి హైకోర్టు వారిదే) కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్ 29న రాధాకృష్ణన్ జన్మించారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. కర్ణాటకలోని కొలార్ గోల్డ్ ఫీల్డ్ లా కాలేజీ నుంచి లాయర్ పట్టా సాధించారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. సివిల్ లాయర్గా పేరుగాంచిన రాధాకృష్ణన్ రెండుసార్లు కేరళ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. గతేడాది మార్చి 18న ఛత్తీస్గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో హైదరాబాద్లోని హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా కొనసాగనుంది. దీనికి చీఫ్ జస్టిస్గా రాధాకృష్ణన్ను కొనసాగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. -
మూడు నెలల్లో పంచాయతీ
-
అసెంబ్లీ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
అసెంబ్లీ రద్దుపై పిటిషన్: హైకోర్టులో వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను సమావేశపరచకుండా, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే అసెంబ్లీని రద్దు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది నీరుప్రెడ్డి వాదించారు. శాసనసభను సమావేశపరచకుండా అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ముందస్తు రద్దును సవాల్ చేస్తూ భారీగా పిటిషన్స్ దాఖలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ దాదాపు 200 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. కాగా తెలంగాణ ఓటర్ల జాబితా సవరణపై దాఖలైన పిటిషన్పై నేడు విచారణ కొనసాగింది. ఈ పిటిషన్పై ఈసీ కౌంటర్ దాఖలు చేయగా, దీనిపై వాదనలు వినిపించేందుకు తమకు గడువు ఇవ్వాలని పిటిషనర్ కోరగా విచారణను కోర్టు వాయిదా వేసింది. 10న విచారణ అసెంబ్లీ రద్దు పై కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కొమ్మి రెడ్డి రాములు సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీం ఆదేశాలతో హైకోర్టు లంచ్ మోషన్ పిటీషన్ గా స్వీకరించి బుధవారం విచారణను చేపట్టనుంది.70 లక్షల ఓట్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయని పిటిషనర్లు ఆరోపించారు. కాగా అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లు అన్నింటిపై బుధవారం హైకోర్టు విచారిస్తుంది. -
అనుమతి లేనిదే ప్రణయ్ విగ్రహం వద్దు
సాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలో పెరుమాళ్ల ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని, అప్పటి వరకు ఎలాంటి పనులను చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రణయ్ భార్య అమృత వర్షిణి కోరిక మేరకు అతడి విగ్రహాన్ని మిర్యాలగూడలోని సాగర్ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్ విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్పై హైకోర్టు జస్టిస్ ఏవీ. శేషసాయి పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రణయ్ విగ్రహ ఏర్పాటులో కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్ సీఐ, మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. కాగా టూటౌన్ సీఐ ప్రణయ్ తండ్రికి నోటీస్లు ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన అధికారులు వచ్చే నెల 23వ తేదీన కోర్టుకు హాజరుకావాలని కోరింది. మారుతీరావు ఇల్లు, కార్యాలయంలో సోదాలు ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఇల్లు, కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. మిర్యాలగూడ లోని మారుతీరావు కార్యాలయం, నాగార్జుననగర్లో ఉన్న సొంతింటిలో సోదాలు నిర్వహించారు. పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అధికారుల అండతో కోట్లాది రూపాయలు సంపాదించినట్లు వస్తున్న ఆరోపణలను నివృత్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. సుపారీ గ్యాంగ్ కు ఇచ్చిన కోటి రూపాయలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా డీఎస్పీ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో మారుతీరావుకు సంబంధించిన రెండు చోట్ల సోదాలు చేశారు. మారుతీరావు రాయించుకున్న ఒక వీలునామాతో పాటు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచా రం. సోదాల్లో లభించిన పత్రాలను సమగ్రంగా పరిశీలించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ సోదాల్లో సీఐ లు ధనుంజయ్, శ్రీనివాస్రెడ్డి, సదానాగరాజు, వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కస్టడీలో ప్రణయ్ హత్యకేసు నిందితులు ప్రణయ్ హత్య కేసులోని ఏడుగురు నిందితులను శుక్రవారం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసులోని నిందితులు మారుతీరావు, అస్గర్అలీ, బిహార్శర్మ, అబ్దుల్ బారి, శ్రవణ్, కరీం, శివలను విచారిస్తున్నారు. ప్రణయ్ని కిడ్నాప్ చేసేందుకు వచ్చిన సభ్యులు ఎవరు? రెక్కీ ఎన్నిసార్లు నిర్వహించారు? హత్యకు డీల్ ఎవరికి ఎంత? తదితర విషయాలను రా బట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులు పాటు పోలీస్ కార్యాలయంలో విచారించనున్నట్లు సమాచారం. -
ఓవైసీ ఆస్పత్రికి భూమి కేటాయింపుపై హైకోర్టు స్టే
-
2040 వరకు హైకోర్టు జడ్జి కాలేం
సాక్షి, న్యూఢిల్లీ: సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే తాము 2040 వరకూ తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతిపై వెళ్లలేమని సుప్రీంకోర్టుకు తెలంగాణ న్యాయాధికారుల సంఘం నివేదించింది. జిల్లా న్యాయమూర్తులు, ఇతర సబార్డినేట్ సర్వీసుల్లో ఉన్న న్యాయాధికారుల విభజనకు సంబంధించిన వివాదంపై బుధవారం తన వాదనలు కొనసాగించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం వరుసగా రెండో రోజూ కేసును విచారించింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు సల్మాన్ ఖుర్షీద్, హుజేఫా అహ్మదీ తమ వాదనలు వినిపించారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, 3, 4 ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారానే విభజన జరగాలి. న్యాయాధికారుల విభజన కూడా అలాగే జరగాలి. కానీ ఆర్టికల్ 235 ప్రకారం సబార్డినేట్ కోర్టులు హైకోర్టు నియంత్రణలో ఉన్నాయి కాబట్టి.. విభజన కూడా ఆర్టికల్ 235 ప్రకారమే జరగాలంటే ఎలా? రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆర్టికల్ 235 ఎలా వర్తిస్తుంది? కేంద్రం హైకోర్టుతో సంప్రదింపులు జరపవచ్చు. కానీ అంతిమంగా పునర్వ్యవస్థీకరణ చట్టం పరిధిలోనే కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలి. అసలు పునర్ వ్యవస్థీకరణ చట్టానికి స్థానికతే గుండెకాయ. స్థానికత లేకుండా కేవలం సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే మేం 2040 వరకూ కూడా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందలేం’’అని హుజేఫా అహ్మదీ వాదించారు. ఫుల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది: హైకోర్టు రిజిస్ట్రీ హైకోర్టు రిజిస్ట్రీ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి తన వాదన వినిపించారు. ‘‘పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 78 గానీ, మరొకటి గానీ న్యాయాధికారుల విభజనను ప్రస్తావించలేదు. వీరు సవాలు చేసిన తీర్పు ఫుల్ కోర్టు ఇచ్చినది. మీరు సీనియారిటీని ఎలా విస్మరిస్తారు? సర్వీసు కండిషన్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆప్షన్లు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల వారు తరాలుగా వచ్చి స్థిరపడి ఉన్నారు. వారిని కాదంటే ఎలా? సీనియారిటీ ద్వారానే కేటాయింపులకు న్యాయం జరుగుతుంది’’అని వాదించారు. అప్పుడు లేనిది.. ఇప్పుడెందుకు?: ఏపీ న్యాయాధికారుల సంఘం ఏపీ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, వై.రాజగోపాలరావు తమ వాదనలు వినిపించారు. ‘‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 76 నుంచి 80 వరకు ఏవీ కూడా న్యాయాధికారుల విభజనను ప్రస్తావించలేదు’’అని ఆదినారాయణ రావు వాదించారు. దీనికి జస్టిస్ ఏకే సిక్రీ జోక్యం చేసుకుంటూ ‘‘ఈ చట్టం ద్వారా విభజన చేపట్టవచ్చని హైకోర్టు అంగీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది.. మరి మీరెందుకు అంగీకరించడం లేదు’’అని ప్రశ్నించారు. ఆదినారాయణరావు బదులిస్తూ ‘‘ఈ చట్టం ఆధారంగా విభజనకు హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వలేదు. కేవలం ఆర్టికల్ 235 ద్వారా సంక్రమించిన అధికారాలతోనే మార్గదర్శకాలను రూపొందించింది’’అని పేర్కొన్నారు.‘‘సుప్రీంకోర్టు 1993లో ఆలిండియా జడ్జెస్ కేసులో ఇచ్చిన తీర్పు గానీ, ఇతర తీర్పులు గానీ పరిశీలిస్తే న్యాయవ్యవస్థలోకి ఏనాడూ కార్యనిర్వాహక వ్యవస్థ చొరబడేందుకు అనుమతివ్వలేదు. పిటిషనర్లు చెబుతున్నట్టు 371డీ న్యాయవ్యవస్థకు అమలు కాదు. అలా అమలైతే ప్రాంతాల వారీగా రిజర్వేషన్ వర్తించేది. కానీ ఈ సర్వీసులో అఖిల భారత స్థాయిలో ఎవరైనా పోటీపడొచ్చు. వారన్నట్టుగా స్థానికతే ప్రాతిపదిక అయితే ప్రస్తుతం ఈ సర్వీసులో తెలంగాణలో, ఏపీలో పనిచేస్తున్న తమిళనాడు వారినో లేదా కర్ణాటక వారినో ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లో నివాసం ఎక్కడ అనేది ఒక ప్రాతిపదికే కాదు. నియామకం సమయంలో ప్రాతిపదికగా లేని స్థానికతను ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకోవాలి’’అని వాదించారు. వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పటివరకు జరిగిన వాదనలపై కేసులోని అన్ని పార్టీలు తమ ప్రతిస్పందనలను ఆగస్టు 31 లోపు లిఖితపూర్వకంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉదయకుమార్ సాగర్ వాదనలు వినిపించారు. ఏపీ న్యాయాధికారుల సంఘం ప్రతినిధి గంటా శ్రీనివాసులు, తెలంగాణ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు వరప్రసాద్, చంద్రశేఖర్ విచారణకు హాజరయ్యారు. -
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కనకయ్య
కార్యదర్శులుగా పాశం సుజాత, గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జెల్లి కనకయ్య ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి రేసు మహేందర్రెడ్డిపై 157 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా ఎస్.సురేందర్రెడ్డి, కార్యదర్శులుగా పాశం సుజాత, గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోశాధికారిగా నగేశ్ దారా, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా అరవింద్ కుమార్ కాటా విజయం సాధించారు. వీరితో పాటు మరో 13 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నికయ్యారు. వీరంతా ఏడాది పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. -
జూలై 1న హైకోర్టు విధుల బహిష్కరణ
తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానం సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరిం చుకోవడంతో పాటు ఉమ్మడి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో జూలై 1న హైకోర్టు విధుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి, రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టులకు చెందిన న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు మోహనరావు తెలిపారు. హైకోర్టులో ప్రవేశానికి రిజిస్ట్రార్ జనరల్ పేరు మీద జారీ అయిన మార్గదర్శకాల్లో ఐదో క్లాజ్ను తొలగించాలని కూడా తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే కేటాయింపుల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఏసీజేను కలిసిన బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు విభజన, ప్రాథమిక కేటాయింపుల జాబితా ఉపసంహరణ అభ్యర్థనలతో బార్ కౌన్సిల్ సభ్యులు బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రం సమర్పించినట్లు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో తమ అభ్యర్థనలపై దృష్టి సారించాలని కోరినట్లు తెలిపారు. తమ అభ్యర్థనల పట్ల తాత్కాలిక సీజే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. -
‘విభజన’ మార్గదర్శకాలు అమలు చేయండి
ఏసీజేకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కింది కోర్టుల విభజన నిమిత్తం ఫిబ్రవరిలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితం గా అమలయ్యేలా చూడాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల జేఏసీ బుధవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బొసాలేకు విజ్ఞప్తి చేశా యి. సంఘం అధ్యక్షుడు జి.మోహనరావు, జేఏసీ కన్వీనర్ రాజేందర్రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు ఏసీజేకు వినతిపత్రం సమర్పించారు. కింది స్థాయి న్యాయ వ్యవస్థ విభజన నిమిత్తం న్యాయాధికారుల నుంచి హైకోర్టు ఆప్షన్లు కోరిందని, ఇందుకు మార్గదర్శకాలూ జారీ చేసిందని వారు తెలిపారు. అయితే ఏపీకి చెందిన న్యాయాధికారులు తెలంగాణకు ఆప్షన్ ఇచ్చినట్లు తెలిసిందని, దీనివల్ల తెలంగాణ న్యాయాధికారులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. -
న్యాయవాదుల ఆమరణ దీక్ష విరమణ
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయూలని కోరుతూ గత మూడు రోజులుగా జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు కొనసాగిస్తు న్న ఆమరణ నిరాహార దీక్షను శనివారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. అంతకు ముందు కేటీఆర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఎస్ఆర్ఎస్పీ సమీపంలో వాటర్గ్రిడ్ ఇన్టేక్ వెల్ను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ హై కోర్టు కోసం న్యాయవాదుల ఆందోళన ⇒ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు ⇒ ఉదయం పూట నడవని ఆర్టీసీ బస్సులు ⇒ మూడో రోజు సాగిన నిరాహార దీక్షలు ⇒ క్షీణించిన ఆరోగ్యాలు ⇒ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ ⇒ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్ క్రైం: తెలంగాణ ప్రత్యేక హై కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నగర బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలను స్వచ్ఛందగా మూసివేశారు. తెరిచి ఉంచిన దుకాణాలను న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మూసివేయించారు. బస్సులు ఉదయం నడువలేదు. పెట్రోల్ బంక్లను సాయంత్ర వరకు మూసిఉంచారు. సినిమా హాళ్లలో ఉదయం ఆటను రద్దు చేశారు. న్యాయవాదులు ఉదయం ఆరుగంటల నుంచి డీసీఎం వ్యాన్లో జిల్లా కేంద్రంలో తిరుగుతూ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బంద్ కారణంగా రద్దీగా ఉంటే గాంధీచౌక్, నెహ్రుపార్కు ప్రాంతాలు బోసి పోయాయి. న్యాయవాదులు ఉదయం బస్టాండ్కు చేరుకుని బస్టాండ్ ఎదుట బైఠాయించారు. దాంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయూరుు. బస్టాండ్ ఎదుట ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం 10 గంటల తర్వాత బస్సులు నడిచారుు. ప్రయివేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక రోజు ముందుగానే సెలవు ప్రకటించారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్ఎల్ శాస్త్రి, ఐకాస కన్వీనర్ ఎం రాజేందర్రెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు డీసీఎం వ్యాన్లో నగరమంతా తిరుగుతూ బంద్ పాటించాలని ప్రజలను, వ్యాపారులను కోరారు. న్యాయవాదుల ఆందోళనకు మద్దతుగా న్యూడెమెక్రసీ, పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవేణు ఆధ్వర్యంలో న్యాయవాదులకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్భవన్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై దీక్ష శిబిరానికి చేరుకుంది. అక్కడి నుంచి నగరంలో తిరుగుతూ తెరిచి ఉం చిన దుకాణాలను మూసివేయించారు. ఈ బైక్ ర్యాలీలో మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ పాల్గొన్నారు. బీపీ తగ్గిన న్యాయవాదులు న్యాయవాదులు చేపట్టిన నిరహార దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. దీక్ష శిబిరంలో ఉదయం, సాయంత్రం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు న్యాయవాదులకు బీపీ తగ్గిపోతుండటంతో వైద్యులు తగు సూచనలు చేసి వెళ్తున్నారు. తెలంగాణ హై కోర్టు ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకు దీక్షకు వీడబోమని న్యాయవాదులు పేర్కొంటున్నారు. పలు జిల్లాల బార్ కౌన్సిల్ అధ్యక్షుల సంఘీభావం నిజామాబాద్ న్యాయవాదులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి బార్ కౌన్సిల్ అధ్యక్షులు బిపిన్కుమార్, ప్రతాప్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, ఖమ్మం బార్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఉపేందర్రెడ్డి, జిల్లాలోని ఆర్మూర్, బిచ్కుంద బార్ కౌన్సిల్ సభ్యులు సందర్షించి సంఘీభావాన్ని తెలిపారు. తెలంగాణ హై కోర్టు కోసం వివిధ జిల్లాలో జరుగుతున్న ఉద్యమాలు, నిరసనలు సక్రమంగా జరుగటంలేదని, ఆంధ్ర జడ్జీలను బాయికాట్ చేయాలని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. హై కోర్టు కోసం మేం జిల్లాలో ఉద్యమిస్తుంటే, ఉమ్మడి హై కోర్టులో మీరేందుకు ఉద్యమించటంలేదని న్యాయవాదులు హై కోర్టు సాధన కమిటీ సభ్యులను ప్రశ్నించారు. దీనిపై వారు స్పందిస్తూ హై కోర్టు విధుల బహిష్కరణకు బార్ కౌన్సిల్ సభ్యులే ముందుండి నడిపించాలని అప్పుడే సక్సెస్ అవుతామని వారు సమాధానం ఇచ్చారు. దీక్షల విరమణ నిజామాబాద్ క్రైం: పంచాయతీ రాజ్ శాఖ, ఐటీ మంత్రి కె తారక రామారావు శనివారం రాత్రి న్యాయవాదుల దీక్షలను విరమింపజేరుుంచారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ న్యాయవాదుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హై కోర్టు సాధించేవరకు కృషి చేస్తోందన్నారు. 41(ఏ) సెక్షన్తో పోలీస్స్టేషన్లలో జరుగుతున్న అవినీతి గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. హై కోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫైల్ చేసిందన్నారు. దీనిపై వచ్చే మంగళవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం కేటీఆర్ న్యాయవాదులకు నిమ్మరసం ఇచ్చి దీక్షల ను విరమింపచేశారు. కేటీఆర్ వెంట మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, జీవన్రెడ్డి, రవీందర్రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు తదితరులు ఉన్నారు. విధులు బహిష్కరిస్తేనే హైకోర్టు వస్తుంది నిజామాబాద్ క్రైం : ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరిస్తేనే తెలంగాణ హైకోర్టు ఏర్పడుతుందని సాధన కమిటీ కన్వీనర్ సహోదర్రెడ్డి అన్నారు. తక్షణమే విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్లో న్యాయవాదుల ఆమరణ నిరహార దీక్ష శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల దీక్షలు తెలంగాణ జిల్లాలలో ప్రతి ఒక్క న్యాయవాదికీ ఆదర్శమన్నారు. తెలంగాణ హైకోర్టు కోసం గవర్నర్కు వినతిపత్ర ం సమర్పించామన్నారు. దానికి ఆయన స్పందించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రకు ప్రత్యేక హైకోర్టు కావాలని లెటర్ ఇస్తే తెలంగాణ హైకోర్టు ఏర్పా టుకు మార్గం సుగమమవుతుందని చెప్పారన్నారు. సోమవారం చంద్రబాబును, కేసీఆర్ను కలువనున్నామన్నారు. హైకోర్టు ఏర్పడితే మన ఉద్యోగాలు మనకు వచ్చే అ వకాశాలు ఉంటాయన్నారు. హైకోర్టులో ఒక్క రోజు ఉద్యమం చేస్తే చాలని న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం. రాజేందర్రెడ్డి అన్నారు. వారం రోజులపాటు విధులు బ హిష్కరిస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. హైకోర్టు ఏర్పాటు కోసం కేంద్ర న్యాయశాఖ విభాగానికి లేఖ ఇచ్చామని, దానిని వారు సుప్రీంకోర్టుకు పంపారని చెప్పారు. ఈ నెల 24న ఏదో ఒకటి తేలిపోనుందన్నారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోరుతూ న్యాయవాదులు ఇచ్చిన నిజామాబాద్ నగర బంద్ శనివారం ప్రశాంతం గా ముగిసింది. -
‘హైకోర్టు’ కోసం రెండో రోజు దీక్ష
నిజామాబాద్ లీగల్ :తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు జిల్లా కోర్టు ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. రెండో రోజు దీక్షలో మంజీత్ సింగ్, సీహెచ్ సాయిలు, సతీశ్ కుమార్, గోవర్ధన్, సత్యనారాయణ గౌడ్ కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సందర్శించి, దీక్షలకు సంఘీభావం తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ఎల్ శాస్త్రి, నారాయణరెడ్డి, ప్రతినిధులు శ్రీనివాస్, మాణిక్ రాజు, జగన్మోహన్ గౌడ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. నేడు తెయూ బంద్ తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేపట్టిన దీక్షకు మద్దతుగా బుధవారం తెలంగాణ యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చినట్లు లా విద్యార్థులు తెలిపారు. మంగళవారం వర్సిటీ లా కళాశాల విద్యార్థులు సంతోష్ గౌడ్, నవీన్ కుమార్, రాజేశ్వర్, శేఖర్, నాగార్జున, జైపాల్ విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజన చేయకుండా కావాలనే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న హైకోర్టులో సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. వెంటనే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. బంద్కు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్గౌడ్, టీఎస్ జేఏసీ జిల్లా చైర్మన్ యెండల ప్రదీప్, ఏబీవీపీ తెయూ ఇన్చార్జి రమణ, ఎన్ఎస్యూఐ తెయూ ఇన్చార్జి రాజ్కుమార్, టీజీవీపీ ఇన్చార్జి మనోజ్ మద్దతు ప్రకటించారు. -
స్పోర్ట్స్ టవర్లోకి తెలంగాణ హైకోర్టు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ హైకోర్టును గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం పాతబస్తీలో కొనసాగుతున్న ఉన్నత న్యాయస్థానంలో ఉమ్మడి కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ న్యాయస్థానాన్ని వేరొక చోటకు మార్చాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కింగ్కోఠిలోని పరదా ప్యాలెస్, ఎర్రమంజిల్లోని ఆర్అండ్బీ భవన సముదాయాన్ని స్వయంగా పరిశీలించారు. హైకోర్టు అవసరాలకు తగ్గట్టుగా ఇవి లేవని భావించిన ప్రభుత్వం.. తాజాగా జీఎంసీ బాలయోగి స్టేడియం సమీపంలోని ‘స్పోర్ట్స్ టవర్’ను పరిశీలించింది. ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ టవర్ను సందర్శించింది. 14 అంతస్తుల ఈ భవన సముదాయం కోర్టు నిర్వహణకు అనుకూలంగా ఉందని, ట్రాఫిక్ సమస్య కూడా ఉండదనే అభిప్రాయపడింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి స్పోర్ట్స్ టవర్లోకి ‘టీ’ హైకోర్టును షిప్ట్ చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆఫ్రో -ఏషియన్ గేమ్స్ సమయంలో ఈ టవర్ను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. క్రీడాకారులు, ఇతరులు విడిదికి అనుకూలంగా డిజైన్ చేసిన ఈ భవనం శాప్ ఆధీనంలో కొనసాగుతోంది.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement