
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం రాష్ట్రంలో 41,310 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, అందులో 453 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.85 లక్షలకు చేరుకుంది. తాజాగా 1,380 మంది కోలుకోగా, మొత్తం 7.74 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు వైరస్తో 4,108 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం 6,746 క్రియాశీలక కరోనా కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment