corona
-
సూర్యుడి ‘కరోనా’ను తాకింది...
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ స్పేస్క్రాఫ్ట్ చరిత్ర సృష్టించింది. నాసా ప్రయోగించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుంది. ఈ విషయాన్ని నాసా శుక్రవారం ధ్రువీకరించింది. 2018లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక కొద్దిరోజుల క్రితమే భగభగ మండే సూర్యుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6.1 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి విజయవంతంగా చేరుకుంది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా గుండా ప్రయాణించింది. ఎలాంటి ముప్పు లేకుండా సురక్షింగా ఉంది. చరిత్రలో ఇప్పటిదాకా లోకబాంధవుడికి ఇంత సమీపానికి వెళ్లి, సురక్షితంగా ఉన్న అంతరిక్ష నౌక మరొకటి లేదు. అంతా సవ్యంగా ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి గురువారం రాత్రి నాసాకు సందేశం అందింది. పార్కర్ రాబోయే కొన్ని రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలో చక్కర్లు కొట్టనుంది. దాంతో అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోతాయి. సురక్షిత ప్రాంతానికి తిరిగివచ్చిన తర్వాత మళ్లీ సంకేతాలు అందుతాయి. మానవులు ఇప్పటిదాకా నిర్మించిన అంతరిక్ష నౌకల్లో ఇదే అత్యంత వేగవంతమైంది కావడం గమనార్హం. గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 2,500 డిగ్రీల సెల్సియస్ ఫారెన్హీట్(1,370 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతను సైతం తట్టుకొనేలా పటిష్టమైన హీట్ షీల్డ్ను పార్కర్పై అమర్చారు. సూర్యుడి నుంచి అత్యధిక ఉష్ణోగ్రత జనించడానికి కారణం ఏమిటన్నది మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఇదిలా ఉండగా, పార్కర్ సోలార్ ప్రోబ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ సూర్యుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించనుంది. -
భాగ్యనగరాన్ని.. కమ్మేస్తున్న క్లౌడ్స్..
దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో.. విభిన్న ఆహార రుచులకు కేంద్రమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ప్రముఖమైనది. ప్రస్తుత కాంటినెంటల్ వంటకాలే కాదు నిజాం కాలం నాటి స్థానిక సాంస్కృతిక వంటకాలతోనూ మన భాగ్యనగరం ‘బౌల్ ఆఫ్ డెలీíÙయస్ డిష్’గా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా నగరంలో స్థానిక వంటకాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రుచులు కూడా ఆదరణ పొందుతున్నాయి. ఈ రుచుల కోసమే ప్రత్యేకంగా రెస్టారెంట్లు కూడా వెలిశాయి. అయితే కరోనా అనంతరం ఈ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా క్లౌడ్ కిచెన్. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో మొదలైన ఈ కల్చర్.. వెళ్లే అవకాశమున్నా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టేంతగా మార్పు చెందింది. నగరంలో విభిన్న రుచులు విభిన్న సంసంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ బిర్యానీ మొదలు ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్ని రుచులూ ఆన్లైన్, డిజిటల్ వేదికగా ఒక్కొక్క ఆర్డర్తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్థానిక వంటకాలే కాదు చైనీస్, కొరియన్, మొగలాయి, కరాచి వంటి రుచులను అందించే రెస్టారెంట్లు తమ డోర్ స్టెప్ సేవలను అందిస్తున్నాయి. వీరికి వారధులుగా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ వేదికలు ఉన్నాయన్న విషయం విధితమే. అయితే.. ఈ కోవలోకి స్టార్ రెస్టారెంట్లు కాస్త విముఖతను ప్రదర్శించాయి. నాణ్యత, బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ సేవలు అందించలేదనేది నిపుణుల మాట. కానీ ప్రస్తుతం నగరంలోని టాప్ 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు సైతం క్లౌడ్కిచెన్కు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి పాకశాస్త్ర నైపుణ్యాలతో నాణ్యత, ప్యాకింగ్, బ్రాండ్ వాల్యూ వంటి అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సేవలు ప్రారంభిస్తున్నాయి. విలాసవంతమైన జీవితాల్లో ఈ లోటును పూడ్చడానికి స్టార్ హోటళ్ల యాజమాన్యం ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా గమనించాలి. జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల డిజిటల్ ఫుడ్ సేవలు ఊపందుకున్నాయి. అందరూ అదే దారిలో.. డైనింగ్తో పాటు ఈ క్లౌడ్ కిచెన్లో కూడా మంచి లాభాలు వస్తుండటంతో పలు రెస్టారెంట్లు ఈ డిజిటల్ ఇన్నోవేషన్కు సై అంటున్నాయి. కానీ స్టార్ హోటళ్లు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే గత కొంత కాలంగా 5 స్టార్ హోటళ్లు సైతం క్లౌడ్ కిచెన్ను ప్రారంభించాయి. వాటి బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూనే, పాకశాస్త్ర నైపుణ్యాలను డిజిటల్ వేదికతో అనుసంధానం చేస్తూ సేవలందిస్తున్నాయి. ఇక క్లౌడ్ కిచెన్ సేవలను నగరవాసులు ఆస్వాదిస్తున్న తీరు అద్భుతం. ఈ నేపథ్యంలో వారికి మా సేవలను సైతం అందంచాలనే లక్ష్యంతో ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫుడ్టెక్ సేవలు ప్రారంభించాం. స్విగ్గీ, జొమాటో వంటి వేదికలతో అనుసంధానమై మా పసందైన రుచుల పండుగను ఆహార ప్రియుల వద్దకే చేర్చుతున్నాం. ముఖ్యంగా మా ప్రయత్నంలో అధిక–నాణ్యత భోజనాన్ని అందించడంతో పాటుగా పర్యావరణహితమైన ప్యాకింగ్ను కొనసాగిస్తున్నాం. డిజిటలీకరణతో అద్భుత ఫలితాలు ఫుడ్, హోటల్స్ రంగంలో అధునాతన డిజిటలీకరణ అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్లో పాకశాస్త్ర నిపుణులైన స్టార్ హోటల్ చెఫ్లు, కిచెన్ మేనేజర్లు విశేషమైన శిక్షణ ఉండటంతో ఈ విధమైన క్లౌడ్ కిచెన్కు మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా వివిధ దశల్లో ఆహార పదార్థాల తనిఖీ, తయారీ విధానంలోనూ అధునాతన సాంకేతికత వినియోగించడంతో పాటు శాటిలైట్ కిచెన్లలో ఉపయోగించే యాప్లు ఈ వంటలకు మరింత నాణ్యతను, ఖచి్చతత్వాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ ఫుడ్ టెక్ సేవలలో సుస్థిరతే ప్రధాన లక్ష్యంగా స్టార్ హోటల్స్ ప్యాకింగ్ను వినూత్నంగా చేపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, మారే ఉష్ణోగ్రతలు ఆహారాన్ని పాడు చేయకుండా స్పిల్లేజ్ ప్రూఫ్ కంటైనర్లను ఉపయోగిస్తుండటం విశేషం. ఫుడ్ లవర్స్ అభిరుచికి అనుగుణంగా.. నగరంలోని ఫుడ్ లవర్స్ ఇష్టపడే రుచులకు అనుగుణంగా, మా నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటూ 3 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందులో భాగంగా ప్రముఖ మాస్టర్ చెఫ్లచే రూపొందించబడిన దాల్ మఖీ్న, కబాబ్లు, ర్యానీలతో సహా గౌర్మెట్ నార్త్ ఇండియన్ వంటకాలను అందించడానికి ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ క్రియేషన్స్’, ఆరోగ్యానికి హితమైన మిల్లెట్ కిచిడీ, ఇంటి వంటలను తలపించే చపాతీలు, అన్నం వంటి వాటికోసం ‘ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్’, క్రోసెంట్స్, బేగెల్స్, గౌర్మెట్ బ్రెడ్లు వంటి బేకరీ ఐటమ్స్ కోసం ‘ఐటీసీ సన్ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్’ సేవలు ఉన్నాయి. ఈ మూడు రకాల సేవలను హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నైలోని 19 క్లౌడ్ కిచెన్లలో ప్రారంభించాం. – రోహిత్ భల్లా, ఫుడ్ టెక్ బిజినెస్ హెడ్, ఐటీసీ లిమిటెడ్. -
ముంచుకొస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!
కోవిడ్-19 ప్రపంచ దేశాలను ఎంతలా గడగడలాడించిందో అదరికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకునేలోపు ఆ మహమ్మారి ఏదో రూపంలో నేను ఉన్నానంటూ కన్నెర్రజేస్తోంది. ఇప్పటివరకు ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వంటి రకరకాల సబ్వేరియంట్లుగా రూపాంతరం చెంది కలవరపెడుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ ఎక్స్ఈసీ అనే కొత్త వేరియంట్ రూపంలో దూసుకొస్తోంది. తొలిసారిగా ఈ కొత్త వేరియంట్కి సంబంధించిన కేసుని జర్మన్లో గుర్తించారు. అలా ఇది యూకే, యూఎస్, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఇది యూరప్లో వేగంగా విజృంభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్లో కూడా ఈ వైరస్ వృద్ధి తీవ్రంగా ఉందని వెల్లడించారు. ఈ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ని ఓమిక్రాన్ సబ్వేరియంట్ హైబ్రిడ్ కేఎస్ 1.1, కేపీ, 3.3గా చెబుతున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా, లండన్లోని జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ మాట్లాడుతూ.. ఇతర కోవిడ్ వేరియంట్లతో పోలిస్తే ఈ ఎక్స్ఈసీ తొందరగా వ్యాప్తి చెందదని, అయినప్పటికీ టీకాల వంటి రక్షణ అందిచడం మంచిదని సూచించారు. శీతకాలంలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ..ఈ వేరియంట్ ఉధృతి ఇప్పుడే ప్రారంభమయ్యింది. ఇది తీవ్ర రూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్లొచ్చు. ఈ ఎక్స్ఈసీ కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వంశానికి చెందిన ఉపవేరియంటే కాబట్టి దీన్ని వ్యాక్సిన్ల, బూస్టర్ డోస్లతో అదుపు చేయగలం అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందర్నీ పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.ఎక్స్ఈసీ లక్షణాలు..జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులతో సహా మునుపటి కోవిడ్ వేరియంట్ల మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత ఛార్జ్ చేస్తాడంటే..?) -
మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్కు కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్కు కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించిన దరిమిలా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చింది.ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. తన కోవిడ్ టెస్ట్ పాజిటివ్గా వచ్చిందని, వైద్యులు ఐదురోజుల పాటు తనను రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపారు. కోవిడ్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనను కలుసుకునేందుకు కొద్ది రోజులపాటు ఎవరూ రావద్దని దిగ్విజయ్ కోరారు. मेरा COVID test पॉजिटिव आया है। मुझे ५ दिनों के लिए आराम करने के लिये कहा गया है। इसलिए मैं कुछ समय के लिए नहीं मिल पाऊँगा। क्षमा करें। आप सभी भी COVID से बचने के लिए अपना ख़्याल रखें।— Digvijaya Singh (@digvijaya_28) August 20, 2024 -
కోవిడ్ మందుకు ఆయుష్ అనుమతి!
కొవిడ్ వైరస్ బారిన పడినవారిలో ఇప్పటికీ కొన్ని స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వారికోసం రెమిడియమ్ థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫార్మాసూటికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సంయక్తంగా ‘కోరోక్విల్-జెన్’ అనే ఔషధాన్ని తయారు చేశాయి. ఈమేరకు తాజాగా ఈ డ్రగ్ భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు కూడా పొందింది.ఈ సందర్భంగా రెమిడియమ్ థెరపెటిక్స్ సీఈఓ కృష్ణన్ మాట్లాడుతూ..‘కొవిడ్ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటికీ స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు రెమిడియం థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్-చెన్నై, ఢిల్లీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ యూనివర్శిటీ సహకారంతో ‘కోరోక్విల్-జెన్’ను అభివృద్ధి చేశాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్న జింక్తో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్ మిశ్రమం ఇందులో ఉంటుంది. దానివల్ల కొవిడ్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని వాడే రోగులు ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. ఈ డ్రగ్కు తాజాగా భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు లభించాయి. కొవిడ్తో కలిగే అనారోగ్య సమస్యలతోపాటు క్షయ, ఆస్తమా, సీజనల్ అలర్జీలు, పల్మనరీ, ఇతర శ్వాసకోశ రుగ్మతల చికిత్సలో కోరోక్విల్-జెన్ ఉపయోగించేందుకు లైసెన్స్ లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..! -
మరో కరోనా వేవ్.. జపాన్లో పెరుగుతున్న కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోల్లాన్ని ఎవరూ మరచిపోలేరు. తాజాగా జపాన్లో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19కు చెందిన 11వ వేవ్ ఇప్పుడు జపాన్ను వణికిస్తోంది.జపాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కజుహిరో టటేడా తెలిపిన వివరాల ప్రకారం కేపీ.3 వేరియంట్ జపాన్లో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం.ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో కోవిడ్ -19 బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైనవి కావని టాటెడా చెప్పారు. కేపీ వేరియంట్ త్రీ సాధారణ లక్షణాలు అధిక జ్వరం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ అంతటా జూలై 1 నుండి 7 వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది. -
బైడెన్కు కరోనా
మిల్వాకీ: ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. ప్రత్యర్థి అసలే డొనాల్డ్ ట్రంప్. ఆదినుంచీ దూకుడుగా దూసుకెళ్తున్నారు. అది చాలదన్నట్టు హత్యా యత్నంతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. దాన్ని వీరోచితంగా ఎదుర్కొన్న తీరుతో మరింత ఫేవరెట్గా మారారు. అలాంటి ట్రంప్ను దీటుగా ఎదుర్కోవాల్సిన డెమొక్రాట్లు మాత్రం ఇంకా కాలూ చెయ్యీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. వయోభారం, మతిమరుపుతో రోజుకో రకంగా తడబడుతున్న అధ్యక్షుడు జో బైడెన్ ఎలా చూసినా ట్రంప్కు పోటీ ఇవ్వలేరని దాదాపుగా తేలిపోయింది. అయినా పోటీ నుంచి తప్పుకునేందుకు, మరొకరికి చాన్సిచ్చేందుకు 81 ఏళ్ల బైడెన్ ససేమిరా అంటున్నారు. ఇవి చాలవన్నట్టు బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు! దాంతో కీలక దశలో ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ వరుస పరిణామాలతో డెమొక్రాట్లు తల పట్టుకుంటున్నారు. పోటీకి ముందే ఓటమి ఖాయమయ్యేలా ఉందని వాపోతున్నారు. బైడెన్ను ఎలాగోలా బుజ్జగించి తప్పించేందుకు చివరి నిమిషం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లాస్వెగాస్లో ప్రచార ఈవెంట్లో మాట్లాడాల్సి ఉండగా బైడెన్కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో డెలావెర్ నివాసంలో ఐసోలేషన్లో ఉన్నారు.ట్రంప్ను మీరు ఓడించలేరు: పెలోసీ బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పార్టీ కీలక నేత, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల బైడెన్తో ఫోన్లో మాట్లాడినట్టు సీఎన్ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్ను ఓడించడం ఆయన వల్ల కాదని ఆమె స్పష్టం చేసినట్టు చెప్పుకొచి్చంది. ‘‘పోల్స్ కూడా మీరు గెలవలేరనే చెబుతున్నాయి. కనుక తప్పుకుంటే మంచిది. కాదని మొండికేస్తే మీరు ఓడటమే గాక ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల విజయావకాశాలను కూడా చేజేతులా నాశనం చేసిన వారవుతారు’’ అంటూ పెలోసీ కుండబద్దలు కొట్టారట. -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో తెలియజేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ కూడా బైడెన్ ఆరోగ్య వివరాలను తెలియజేశారు. జో బైడెన్ తన సోషల్ మీడియా ఖాతాలోలో ఇలా రాశారు. ‘ఈ రోజు మధ్యాహ్నం నేను కోవిడ్ -19 టెస్టులు చేయించుకున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు. నేను అనారోగ్యం నుంచి కోలుకునేవరకూ అందరికీ దూరంగా ఉంటాను. ఈ సమయంలోనూ అమెరికా ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను’అని పేర్కొన్నారు. I tested positive for COVID-19 this afternoon, but I am feeling good and thank everyone for the well wishes. I will be isolating as I recover, and during this time I will continue to work to get the job done for the American people.— President Biden (@POTUS) July 17, 2024 బైడెన్కు చికిత్స అందిస్తున్న వైద్యుడు కెవిన్ ఓ కానర్ మాట్లాడుతూ బైడెన్ ప్రస్తుతం ముక్కు కారటం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారన్నారు. అలసిపోయినట్లు కనిపిస్తున్నారని కూడా తెలిపారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన దరిమిలా బైడెన్కు యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్లోవిడ్ మొదటి డోస్ అందించాం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తూనే ఉంటామని తెలిపారు. లాస్ వెగాస్లో జరిగిన ఒక సదస్సులో ప్రసంగానికి ముందు బైడెన్కు కరోనా టెస్ట్ చేశారు. ఈ రిపోర్టుల ఆధారంగా ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్ ప్రస్తుతం కరోనాలోని తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయన డెలావేర్కు చేరుకుని కరోనా తగ్గేవరకూ ఒంటరిగా ఉంటారన్నారు.Earlier today following his first event in Las Vegas, President Biden tested positive for COVID-19. He is vaccinated and boosted and he is experiencing mild symptoms. He will be returning to Delaware where he will self-isolate and will continue to carry out all of his duties… pic.twitter.com/ka5hiBavTC— ANI (@ANI) July 17, 2024 -
Hathras Stampede: కరోనా కాలంలోనూ..
యూపీలోని హత్రాస్లో జరిగిన భారీ తొక్కిసలాట దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 121 మంది మృతి చెందారు. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ సత్సంగానికి స్థానికులతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ల నుంచి కూడా భోలే బాబా అనుచరులు తరలివచ్చారు. భారీ స్థాయిలో జనం వచ్చినప్పటికీ సత్సంగ్ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో భోలే బాబా నిర్వాకానికి సంబంధించిన అంశం మరోమారు చర్చల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న 2021లో భోలే బాబా ఒక సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో 50 వేల మందికి పైగా జనం పాల్గొన్నారు. నాడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సత్సంగంలో 50 మంది మాత్రమే పాల్గొనడానికి అనుమతివుంది. అయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ 50 వేల మందికి పైగా జనం సత్సంగానికి హాజరయ్యారు.ఇందుకు భోలే బాబా సహకరించారనే ఆరోపణలున్నాయి. నాడు ఫరూఖాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఆప్పట్లో జిల్లా యంత్రాంగం సత్సంగ్ నిర్వాహకులకు నోటీసు కూడా ఇచ్చింది. 2021లో బాబా నిర్వహించిన సత్సంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ये वीडियो 2021 का है जब फ़र्रुख़ाबाद में बाबा नारायण हरि साकार ने सत्संग किया था. साल 2021 में कोविड की वजह से प्रशासन ने सिर्फ़ 50 लोगों की अनुमति दी थी लेकिन बाबा ने 50 हज़ार से ज़्यादा की भीड़ इकट्ठी कर दी थी.#HathrasAccident #HathrasTragedy #bholebaba pic.twitter.com/0GLHXUdxV0— NDTV India (@ndtvindia) July 3, 2024 -
'నేను ఆత్మహత్య చేసుకోను'.. ఫార్మా కంపెనీపై ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను హరించింది. ప్రపంచం మొత్తం భయం గుప్పెట్లో ఇరుక్కున్న సమయంలో అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్స్ తయారుచేసి అందించడం మొదలుపెట్టాయి. ఇలా వ్యాక్సిన్స్ తయారు చేసిన కంపెనీల జాబితాలో ఒకటి ఫార్మా దిగ్గజం 'ఫైజర్'.కరోనా రక్కసి నుంచి రతప్పించుకోవడానికి ఉపయోగించిన వ్యాక్సిన్స్.. ఆ తరువాత అనేక దుష్ప్రభావాలను చూపించింది. దీంతో చాలామంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల ఫైజర్ ఫార్మా కంపెనీలో పనిచేసే మహిళ 'మెలిస్సా మెక్టీ'.. ఆ కంపెనీ గురించి సంచనల విషయాలు బయటపెట్టింది.అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రపంచంలోని దాదాపు 150 కంటే ఎక్కువ దేశాలకు తన వ్యాక్సిన్ సరఫరా చేసింది. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి పక్కన పెడితే.. అందులో మానవ పిండం కణజాలం-ఉత్పన్నమైన సెల్ లైన్లను ఉపయోగించినట్లు ఆరోపిస్తూ కంపెనీ ఈమెయిల్లను మెలిస్సా మెక్టీ లీక్ చేశారు.మెలిస్సా మెక్టీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో తాను ఫైజర్ విజిల్బ్లోయర్ని అని పేర్కొంది. కంపెనీలో సుమారు పదేళ్లు పని చేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో లీక్ చేస్తూ.. తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని, తనకు భర్త, కొడుకు ఉన్నట్లు పేర్కొంది. తన కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేస్తూ.. తన ప్రాణానికి హాని కలిగితే అది, కంపెనీ పనే అంటూ వెల్లడించింది.గతంలో 737 మ్యాక్స్ బోయింగ్ విమానంలో లోపాలను గురించి వెల్లడించిన వ్యక్తి, కొన్ని రోజుల తరువాత ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి నా ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగితే అది కంపెనీ పన్నిన కుట్ర అని మెలిస్సా మెక్టీ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.I AM A PFIZER WHISTLEBLOWERTHE ONLY ONE ACTUALLY EMPLOYED AS A LONG TERM PFIZER EMPLOYEEI AM TIRED.I am tired of feeling like an imposter.I am tired of feeling like I have no hope. I am tired of fighting, debating, posting, researching.. But I am NOT suicidal. I have a… pic.twitter.com/NcSy9R2Hho— Melissa McAtee (@MelissaMcAtee92) May 8, 2024 -
'కరోనా' సమయంలో.. కానరాని పచ్చ నేతలు! ఫోన్లు సైతం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా నాయకులు జనం కోసం పనిచేయాలి. నమ్ముకున్న వారి క్షేమం కోసం పాటు పడాలి. కానీ టీడీపీ నేతలు ఆపత్కాలంలో ఆప్తులను వదిలేశారు. కోవిడ్ మహమ్మారి ఊళ్లకు ఊళ్లను వణికిస్తుంటే.. తమ దారి తాము చూసుకున్నారు. విశాఖలో ఒకరు, ఢిల్లీలో ఇంకొకరు, జనాలకు దూరంగా చాలామంది దాక్కున్నారు. ఓ వైపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముమ్మరంగా సాయం చేస్తూ జనాలకు ధైర్యమిస్తూ ఉంటే.. టీడీపీ నాయకులు మాత్రం కనీసం తమ కార్యకర్తల కోసమైనా పనిచేయలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు నిరంతరం జనాల్లోనే ఉంటూ వారి బాగోగులు చూసుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం ఇసుక, నీరుచెట్టు, ప్రాజెక్టులు, మద్యం, అభివృద్ధి పనుల ముసుగులో కోట్లు వెనకేసుకున్న టీడీపీ నాయకులు జనాలకు ఓ కష్టం వచ్చిన వేళ అండగా నిలవలేకపోయారు. కనీసం సొంత పార్టీ క్యాడర్ను కూడా కరోనా కాలంలో వారు పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా కష్టకాలంలో టీడీపీ నేతలు జాడే కానరాలేదు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.జిల్లాను కరోనా సెకెండ్ వేవ్ ఎంతగా కబళించిందో జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. యువత సైతం మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇంత కష్టకాలంలో టీడీపీ నాయకులు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీని పరిస్థితి ఉండేది. ఒక్కో నేత ఒక్కో చోట దాక్కుని ఉన్నారు. ఆపద వచ్చినప్పుడు తమ నాయకుడు ఆదుకుంటారని సాధారణంగా నియోజక వర్గ ప్రజలు, కేడర్ అనుకుంటారు. తమ నాయకుడు ఏదో ఒక ఆస్పత్రికి చెప్పి, బాగా చూడాలని, మెరుగైన వైద్యం అందించాలంటూ చెబుతారని ఆశిస్తారు. కానీ జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నం. టీడీపీ నేతలు ఎక్కడా ఆ రకంగా స్పందించిన దాఖలాల్లేవు. ఏ ఒక్క నేత కూడా కనీసం పట్టించుకోలేదు. దాక్కున్న టీడీపీ నేతలు..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు స్థానికంగా లేరు. కరోనా సమయంలో విశాఖలో తలదాచుకున్నారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ఎక్కడున్నారో నాయకులకు కూడా తెలియని పరిస్థితి. నాయకులు ఎవరు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం హడావుడి చేశారు. తానొక కంట్రోల్ రూమ్ ప్రారంభించినట్టు బిల్డప్ ఇచ్చారు.ఆయనేదో వ్యక్తిగతంగా సాయమందిస్తారేమో అనుకుని చాలా మంది ఫోన్లు చేశారు. కానీ ఆయన చేసిందేమీ లేదు. ఇద్దరు వ్యక్తులతో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు వచ్చిన విన్నపాలను అధికారులకు మళ్లించారు. అప్పటికే అధికారులు కంట్రోల్ రూమ్ నడుపుతున్నారు. వారికి నేరుగా వచ్చే ఫోన్లకు స్పందిస్తున్నారు. ఈయన వల్ల మరింత జాప్యం జరిగే పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ రోగులకు బెడ్లు ఎక్కడున్నాయని అడిగితే అధికారులను అడిగి చెబుతామంటూ దాట వేస్తూ చేతులు దులుపుకున్నారు.మాజీ మంత్రి కళా వెంకటరావు ఎక్కడున్నారో తెలియనట్టుగా ఇంటికి తాళాలు వేసుకుని లోపలే ఉన్నారు. కనీసం కేడర్ ఫోన్ ఎత్త లేదని ఆ పార్టీ కార్యకర్తలే వాపోయారు. జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పరిస్థితి దాదాపు ఇంతే. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, కావలి ప్రతిభా భారతి తదితరులు కరోనా కాలంలో జనాలకు కనిపించనే లేదు.అందుబాటులో వైఎస్సార్సీపీ నేతలు..కష్టకాలంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. కొందరు నేరుగా ప్రజల వద్దకు వెళ్లగా, మరికొందరు తన పీఏ నంబర్లను ప్రజల వద్ద ఉంచి, ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు సేవలు పొందారు. తమకు అవకాశం ఉన్న మేరకు స్పందించారు. ఆస్పత్రిలో బెడ్ కావాలన్నా, రోగులకు మెరుగైన వైద్యం కోసం, మందులు, ఇతరత్రా అవసరాల కోసం ఎప్పటికప్పుడు స్పందించారు.తమ్మినేని సీతారాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నారు.డిప్యూటీ సీఎం హోదాలో ధర్మాన కృష్ణదాస్ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడమే కాకుండా కోవిడ్ ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం ఉన్నా స్పందించారు.మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అదే రకంగా స్పందించారు. కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు, సేవలందించడంలో తనదైన పాత్ర పోషించారు.ఎమ్మెల్యే రెడ్డి శాంతి అయితే నిరంతరం నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉన్నారు. మహిళా ఎమ్మెల్యే అయినప్పటికీ ధైర్యంగా ప్రజలకు అందుబాటులోనే ఉండి సాయపడ్డారు.శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించి సాయం చేయడంలో తమదైన పాత్ర పోషించారు.ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ కరోనా బారిన పడినప్పటికీ తన అనుచరుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నారు.ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అయితే కరోనా కష్టకాలంలో రిస్క్ తీసుకుని పనిచేశారు. జిల్లా యంత్రాంగానికి రెండు ఆక్సిజన్ అంబులెన్స్లు అందించారు. రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం..కరోనా సమయంలో నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లలేని పరిస్థితిలో వైఎస్సార్సీపీ నాయకులు వ్యక్తిగతంగా తమ సొంత సొమ్ముతో కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేశారు. ఎక్కడికక్కడ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా వలంటీర్లను పెట్టుకుని తోచినంత సాయం చేశారు.ఇక ప్రభుత్వం ప్రతీ ఇంటికి సాయం చేసింది. ఒకవైపు కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోగులకు పౌష్టికాహారం అందజేసింది. హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు ఇంటింటికీ ఉచితంగా మందులు పంపిణీ చేసింది. ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఇంటికి మెడికల్ కిట్ అందజేసింది. అంతటితో ఆగకుండా ప్రతి ఇంటికి ఆర్థిక సాయం చేసింది.జిల్లాలో 6,70,438 మందికి రూ.707.61కోట్లు మేర సచివాలయంలోనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. అంతేకాకుండా విదేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లోనూ చిక్కుకున్న వారిని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు, విమానాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చింది. ముఖ్యంగా జిల్లాలోని వలస కూలీలు, వలస మత్స్యకారులను ప్రత్యేక జాగ్రత్తలతో తీసుకొచ్చి, ప్రత్యేక క్వారంటైన్ ఏర్పాటు చేసి, ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంది.ఇవి చదవండి: ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు -
ఈ మల్టీకలర్ ఫేస్మాస్క్ ధర వింటే షాకే..!
కరోనా బారీనుంచి ఆ సమయంలో ఎన్నోరకాల ఫేస్మాస్క్లను వాడారు. వాటి వలన ఫలితాలు, నష్టాలు కూడా అనుభవించారు. అదొక విధమైతే.., ఈ చర్మ సమస్యలు మరో విధము. వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు బారుతుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. ఈ సమస్యలను డీల్ చేయాలంటే ఈ లైట్ థెరపీ మాస్క్ను వాడాల్సిందే.. దీన్ని 15 నుంచి 25 నిమిషాల వరకు ముఖానికి పెట్టుకుని ఉంచితే.. మంచి ఫలితం లభిస్తుంది. ఆప్షన్స్లో మల్టీ కలర్స్ని మార్చుకోవడంతో వివిధ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి, శ్రమ, ఇబ్బంది లేకుండా ముఖంలో మెరుపుని సొంతం చేసుకోవచ్చు. ఈ మాస్క్ సాయంతో రెడ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, వైట్, గ్రీన్, సియాన్ ఇలా మొత్తంగా 7 రంగుల్లో ట్రీట్మెంట్ని అందుకోవచ్చు. రిమోట్ సాయంతో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పోర్టబుల్గానూ, కంఫర్టబుల్గానూ పని చేస్తుంది. స్త్రీల సౌలభ్యం, సౌకర్యం కోసం రూపొందిన ఈ ఎల్ఈడీ బ్యూటీ మాస్క్.. ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్తో తయారైంది. ఇంట్లోనే కాదు ప్రయాణాల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు, ఈ మాస్క్ బిజీ లైఫ్స్టయిల్కి సరైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏపని చేసుకుంటూ అయినా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ స్కిన్కేర్ టూల్.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. బ్లూ లైట్ చికాకు, అలసటలను దూరం చేస్తుంది. వైట్ లైట్ చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది. సియాన్ లైట్ స్కిన్ టోన్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక్కో కలర్ ఒక్కో సమస్యను దూరం చేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే హోమ్ స్పాను ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,083 రూపాయలు. ఇవి చదవండి: ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా! -
మలేరియా వ్యాక్సిన్ తయారీపై ‘సీరమ్’ దృష్టి!
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(పూణె) మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తర్వాత తమ సంస్థ మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించిందని తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ తయారు చేసేందుకు కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకుందని అదార్ పూనావాలా తెలిపారు. సంస్థకు పది కోట్ల డోసుల మలేరియా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. డిమాండ్కు అనుగుణంగా దీనిని మరింత పెంచవచ్చన్నారు. మలేరియా వ్యాక్సిన్ తయారీలో టెక్నాలజీ బదిలీ ఒప్పందంతో పాటు వ్యాక్సిన్ల ఎగుమతిపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాక్సిన్ తయారీపై కూడా దృష్టిపెట్టామన్నారు. ఏటా లక్షల మంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ గతంలో కరోనా నివారణకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసింది. ఇప్పుడు దీనికి డిమాండ్ తగ్గడంతో తక్కువ స్థాయిలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. -
యూపీలో మళ్లీ కరోనా కలకలం
ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్నగర్లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్గా తేలారు. 2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్ల టీకాలు అందించారు. -
దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్ఠానికి కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కోవిడ్ -19 నుండి 548 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. అటు.. జేఎన్.1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 47కి చేరుకున్నాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 41 కేసులు బయటపడ్డాయి. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! -
గుండెపోటు ముప్పు పెంచిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 18–45 మధ్య వయస్కుల గుండెపోటు మరణాలు సాధారణంగా ఏడాదికి లక్షకు నాలుగు ఉంటాయి. కానీ కరోనా కాలంలో ఈ సంఖ్య పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా కాలంలో యువతీ యువకులు అత్యధికంగా ఆకస్మిక గుండెపోటుకు గురై చనిపోయారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రీయ అధ్యయనం చేసింది. దీని ప్రకారం కరోనా రాని యువకులతో పోలిస్తే వైరస్ సోకిన వారు మొదటి వారంలో గుండెపోటుకు గురయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ ఉంది. అదే రెండో వారంలో రెండున్నర రెట్లు, 30 రోజుల తర్వాత రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తేలింది. ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్, మితిమీరిన వ్యాయామం లాంటి కారణాలతో పాటు కరోనా సోకడం యువతకు ముప్పు పెంచిందని నిర్ధారించింది. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని అధ్యయనం తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 31.6% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు మరణించిన 729 యువకుల్లో 31.6 శాతం మంది అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు. కోవిడ్తో ఆసుపత్రుల్లో చేరినవారు 2.3 శాతం మంది ఉన్నారు. అందులో పొగతాగేవారు 26 శాతం ఉన్నారు. ఆల్కహాల్ తీసుకునేవారు 27 శాతం ఉన్నారు. చనిపోవడానికి 48 గంటలకు ముందు మితిమీరి ఆల్కహాలు తీసుకున్నవారు 7 శాతం ఉన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ తీసుకున్నవారు 1.7 శాతం ఉన్నారు. ఏ రకమైన వ్యాయామం చేయనివారు 81 శాతం, 48 గంటలకు ముందు మితిమీరిన శారీరక శ్రమ లేదా అధిక వ్యాయామం చేసినవారు 3.5 శాతం ఉన్నారు. సాధారణ వ్యాయామం చేసినవారు 16 శాతం ఉన్నారు. ఆకస్మికంగా మరణించిన ఆ యువకులకు చెందిన 10 శాతం మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అంటే గుండెపోటుకు సంబంధించి కుటుంబ చరిత్ర ఉన్నవారు అన్నమాట. కుటుంబ సభ్యులంటే తల్లి, తండ్రి, తోబుట్టువులని ఐసీఎంఆర్ పేర్కొంది. కోవిడ్తో ఆసుపత్రిలో చేరిన యువకుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఆకస్మిక మరణాలు నాలుగు రెట్లు అధికంగా సంభవించాయి. 48 గంటలకు ముందు మితిమీరిన మద్యం తీసుకుంటే మరణాలు ఆరు రెట్లు ఎక్కువ. విపరీతమైన శారీరక శ్రమ చేయడం వల్ల మూడు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. డ్రగ్స్తో నాలుగు రెట్లు, పొగతాగడం వల్ల రెండు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. వ్యాయామం చేస్తున్నప్పుడు సాధారణంగా రెండు నిమిషాల్లోనే శ్వాస అదుపులోకి వస్తుంది. కానీ 10 నిమిషాల పాటు కొనసాగితే దాన్ని మితిమీరిన వ్యాయామం అంటారు. అటువంటి వారిలో మరణాలు సంభవించాయి. వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు తగ్గాయి... కోవిడ్ వ్యాక్సిన్ వల్ల యువకులు ఆకస్మిక మరణాలకు గురైనట్లు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐసీఎంఆర్ వీటిపైనా అధ్యయనం చేసింది. వార్తల్లో కథనాలను ఆధారంగా చేసుకొని పరిశోధన కొనసాగించింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఆకస్మిక మరణాలపై అధ్యయనం దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 47 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల పరిధిలో ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. 2021 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు కరోనా కాలంలో యువకుల ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసింది. ఆయా కాలేజీల పరిధిలో 18–45 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించిన 29,171 మంది యువకుల్లో 729 మందిపై ప్రత్యేకంగా పరిశో ధన చేసింది. వారి మరణాలకు కారణాలపై డేటా సేకరించి విశ్లేషించింది. నాలుగింట మూడొంతుల మంది మరణాల వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచే తీసుకుంది. కరోనా సామాజికంగా కూడా దెబ్బతీసింది అలవాటు లేని శారీరక శ్రమ, వ్యాయామం అతిగా చేయడం వల్ల యువకుల్లో ఆకస్మిక మరణాలు సంభవించాయి. తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలిక జబ్బులు కూడా దోహదపడ్డాయి. కోవిడ్ అనేది సాధారణ జబ్బే కాదు. అది సామాజికంగా కూడా దెబ్బతీసింది. ఉద్యోగం కోల్పోవడం లాంటివి పరోక్షంగా ప్రభావం చూపించాయి. మరోవైపు మానసిక రుగ్మతలు 25 శాతం పెరిగాయి. వదంతులు, ప్రచారాలు కూడా ప్రజలపై మానసికంగా ప్రభావం చూపాయి. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
విజయ్కాంత్ గొప్పమనసు.. వారికోసం స్థలం ఇస్తానన్న కెప్టెన్.!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు.. ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. అయితే గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి ఖననానికి తన సొంత స్థలం ఇస్తానని ప్రకటించారు. ఈ విషయంపై ఆయన గతంలో ట్వీట్ చేశారు. ఎందుకలా చేశారంటే... గతంలో చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. దీంతో వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై స్పందిస్తూ విజయ్కాంత్ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో మృతిచెందిన వారిని ఖననం చేయడానికి తన సొంత స్థలం ఇస్తానన్నారు. తన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగాన్ని ఖననానికి ఇస్తున్నట్లు వెల్లడించారు. కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేయటంతో వైరస్ వ్యాపించెందదని.. ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని అప్పటి విజయ్కాంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఇవాళ విజయ్కాంత్ మృతి చెందడం అభిమానులకు షాక్కు గురిచేసింది. கொரோனாவால் உயிரிழந்தவர்களின் உடல்களை அடக்கம் செய்ய பொதுமக்கள் எதிர்ப்பு தெரிவித்தால், ஆண்டாள் அழகர் பொறியியல் கல்லூரியின் ஒரு பகுதியை உடல் அடக்கம் செய்ய எடுத்துகொள்ளலாம்.#SpreadHumanity | #COVID19 pic.twitter.com/CG2VLBzj4F — Vijayakant (@iVijayakant) April 20, 2020 -
తెలంగాణలో ఈ ఏడాది తొలి కోవిడ్ మరణం!
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు.. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. మృతులను 60 ఏళ్ల వ్యక్తితోపాటు 40 ఏళ్ల వ్యక్తిగా తెలిపారు. తెలంగాణలోనూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే అత్యధికంగా 45 మంది వైరస్ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో 54 పాజిటివ్ చేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్ట్లు పెంచారు, -
Covid-19 JN.1 Variant: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..!
న్యూఢిల్లీ: కరోనా కేసుల ఉధృతి నెమ్మదిగా ఊపందుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. కేరళలో మరో వ్యక్తి కోవిడ్తో కన్నుమూయడంతో దేశంలో ఇప్పటిదాకా కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 5,33,333కి ఎగబాకింది. భారత్లో తొలికేసు వెలుగుచూసిననాటి నుంచి ఇప్పటిదాకా 4,50,08,620 మందికి కరోనా సోకగా వారిలో 4,44,71,545 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 220.67 కోట్ల డోస్ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. ఆగ్నేయాసియా దేశాలు జాగ్రత్త శ్వాససంబంధ కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. కోవిడ్ వ్యాధి విస్తృతిపై ఓ కన్నేసి, నిఘా పెంచి, వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. ‘‘ పండుగల సీజన్ కావడంతో జనం ఒక్కచోట గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆమె చెప్పారు. జేఎన్1 ఉపవేరియంట్కు వేగంగా సంక్రమించే గుణం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్వో స్పష్టంచేయడం తెల్సిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు జేఎన్1సహా అన్నివేరియంట్ల కరోనా వైరస్ల నుంచీ సమర్థవంతంగా రక్షణ కలి్పస్తాయి’’ అని ఆమె చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సైతం అవసరమైన చోట్ల కోవిడ్ నిబంధనలను తప్పక అవలంభించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. -
దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ
ఢిల్లీ: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు, రాజస్థాన్, కర్నాటకలో ఒకరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కు చేరుకుంది. అటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ జేఎన్-1 వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 38కి చేరాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. జేఎన్.1 వ్యాప్తి ముందు వేరియెంట్లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఇదీ చదవండి: Year Ender 2023: జనం సెర్చ్చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
TS: ఒక్కరోజులో 12 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 1,322 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ వెల్లడించారు. ఈ మేరకు కరోనా బులెటిన్ విడుదల చేశారు. నమోదైన కేసుల్లో తొమ్మిది హైదరాబాదులోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 38 మంది ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.44 లక్షలకు చేరింది. అందులో 8.40 లక్షల మంది రికవరీ అయ్యారు. చలికాలం కావడం, ఫ్లూ జ్వరాలు కూడా ఉండటం తదితర కారణాలతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. పర్యాటకులకు తప్పనిసరి ఐసోలేషన్ తాజాగా రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకుల కోసం తప్పనిసరి ఐసోలేషన్ను ప్రారంభించాలని రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ వైద్యుల ప్యానెల్ వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ, గోవా, మహారాష్ట్రలలో కోవిడ్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరింది. జేఎన్.1 వేరియంట్ పై స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉందని పేర్కొంది. కేరళ లేదా ఇతర ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు ఎవరైనా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పైగా చాలా మందిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదనిడాక్టర్ల బృందం అభిప్రాయపడింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 40 నమూనాలు..: రాష్ట్రంలో కరోనా కేసులు ఏ వేరియంట్ అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. గత వారం మొత్తం 40 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 4–5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. సమావేశంలో మంత్రి ఆదేశాలిలా.. పని చేయని పీఎస్ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరిగ్గా వినియోగించాలి. అన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య పరికరాలు, డ్రగ్స్, డయాగ్నస్టిక్స్ మొదలైన వాటి అవసరాలను ఆసుపత్రులు తెలియజేయాలి. మొత్తం 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు రోజుకు 16,500 నమూనాలను పరీక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లతో పాటు, రాష్ట్రంలో 84 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ కిట్లు మొదలైన వాటిని టిఎస్ఎంఎస్ఐడిసి సేకరించి సరఫరా చేస్తుంది. గత 2 వారాల్లో మొత్తం 6,344 నమూనాలు సేకరించారు. నెలాఖరు నాటికి పరీక్షలను వేగవంతం చేయాలి. రోజుకు 4,000 పరీక్షలు నిర్వహించాలి. గాంధీ హాస్పిటల్లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపాలి కోవిడ్ రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలి. కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ సంస్థల నుంచి గత నాలుగేళ్లుగా అందిన సీఎస్ఆర్ విరాళాల జాబితాపై నివేదిక అందజేయాలి. -
‘జేఎన్ 1’పై జాగ్రత్త
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘జేఎన్ – 1’ వ్యాప్తి నేపథ్యంలో కట్టడి చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అత్యంత బలమైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ను అప్రమత్తం చేయాలని సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులకు రాకుండానే రికవరీ జేఎన్–1 వేరియంట్పై ప్రస్తుతానికి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. దీని బారిన పడ్డవారు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఆస్పత్రుల వరకూ రాకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. దీనికి డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తెలిపారు. అయితే జేఎన్–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందన్నారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామన్నారు. కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తుల శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్కు తరలించి వేరియంట్లను విశ్లేషిస్తున్నామన్నారు. సచివాలయాల్లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్, ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చికిత్సకు అవసరమైన మందులన్నీ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ సదుపాయాలను సిద్ధం చేస్తున్నామన్నారు. పీఎస్ఏ ప్లాంట్లు సత్వర వినియోగానికి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డి–టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు ఇందులో పాల్గొన్నారు. సన్నద్ధత ఇలా.. ♦ రాష్ట్రవ్యాప్తంగా జీజీహెచ్లలోని 13 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లను యాక్టివేట్ చేసిన వైద్య శాఖ. రోజుకు కనీసం వెయ్యి పరీక్షల నిర్వహణ. ♦ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణ. ♦ వైరస్ అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించేలా గ్రామ/వార్డు సచివాలయాల్లో ఐదు చొప్పున ర్యాపిడ్ కిట్లు అందుబాటులో. ♦ శబరిమల, కేరళ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకు స్క్రీనింగ్. వీరిపై ప్రత్యేకంగా ఫోకస్. ♦ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 12,292 జనరల్, 34,763 ఆక్సీజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్ ఐసీయూ పడకల చొప్పున మొత్తం 56,741 పడకలు అందుబాటులో. -
జేఎన్–1 అంత ప్రమాదకరం కాదు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా కొత్త వేరియంట్ జేఎన్–1 అంత ప్రమాదకరమేమీ కాదని.. దాని గురించి అతిగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి తెలిపారు. వారం, పది రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిని బట్టి దీని తీవ్రత, చూపబోయే ప్రభావంపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియెంటే కాబట్టి ఎక్కువ మందికి సోకవచ్చన్నారు. అంతేతప్ప తీవ్ర లక్షణాలు ఉండటంగానీ, ప్రమాదకరంగా మారే అవకాశంగానీ తక్కువని స్పష్టం చేశారు. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా అంచనా ప్రకారం.. ఇప్పటికే నమోదైన కేసుల పరిస్థితిని చూస్తే ఈ వైరస్ అంతగా ప్రమాద కారి కాదు. సాధారణ జలుబు, దగ్గు, సైనసైటిస్, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలు ఉంటాయి. అందరూ అన్నిచోట్లా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కేన్సర్, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరిస్తే చాలు. డబ్ల్యూహెచ్వో పరిశీలిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) జేఎన్–1ను వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించింది. అంటే వచ్చే 10– 15 రోజులు ఇది ఎంతగా విస్తరిస్తుంది, ఎంత వేగంగా వ్యాపిస్తుంది (ఇన్ఫెక్టి విటీ), సీరియస్ ఇన్ఫెక్షన్గా మారుతుందా (విరులెన్స్) అన్న అంశాలను పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న డేటా మేరకు ఈ వైరస్కు విరులెన్స్ అంత ఎక్కువగా లేదు. వ్యాపించే సామర్థ్యం ఒమిక్రాన్ అంతలేదు.. కానీ డెల్టా కంటే ఎక్కువగా ఉంది. ఈ వేరియంట్కు సంబంధించి కేరళలో ఎక్కువగా, ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్లో ఈ కేసులు అధికంగా వచ్చాయి. యూఎస్, యూరప్లోనూ నమో దవుతున్నాయి. రోగ నిరోధక శక్తి ముఖ్యం ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీముఖ్యం. ప్రస్తుతం మనలో ఎంత ఇమ్యూనిటీ ఉందనే దానిపై ఏఐజీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నాం. వారం, పదిరోజుల్లో ఇది పూర్తవుతుంది. బూస్టర్ డోస్ వేసుకోవాలా వద్దా అన్న దానిపై స్పష్టత వస్తుంది. ఇమ్యూనిటీ ఉన్నవారు బూస్టర్ డోస్ను వేసుకోవాల్సిన అవసరం లేదు. మన దేశ ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది ‘‘మళ్లీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా అని చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అమెరికాలో అయితే 65ఏళ్లు దాటినవారు బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచిస్తున్నారు . అదే భారత్లో చాలా వరకు వ్యాక్సిన్ వేసుకోవడం, కరోనా సోకి ఉండటంతో ఏర్పడిన ‘హైబ్రిడ్ ఇమ్యూనిటీ’ ఉంది. ఒకవేళ వైరస్ సోకినా అది తీవ్ర వ్యాధిగా మారకుండా ఈ ఇమ్యూనిటీ ఉపయోగపడుతుంది. ఒమిక్రాన్ స్పైక్ ప్రొటీన్లలో మార్పులతో జేఎన్–1 వేరియంట్ ఏర్పడినందున గతంలో తీసుకున్న వ్యాక్సినేషన్, కోవిడ్ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీని ఇది తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనితో జ్వరం, గొంతునొప్పి, గొంతులో గరగర, దగ్గు, తలనొప్పి వంటి స్వల్ప అస్వస్థతే కలుగుతోంది. వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటనలు, దూరప్రాంతాలకు వెళ్లి వచ్చినవారికి లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోవాలి. ’’ – డాక్టర్ గోపీచంద్ ఖిల్నానీ, డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ మెంబర్ -
కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?
న్యూయార్క్: కరోనా కారణంగా జలుబు, జ్వరం రావడం, వాసన, రుచిని కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని తెలుసు. కానీ కరోనా సోకినవారికి స్వరాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుందా? అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయింది. కోవిడ్కు కారణమైన సార్కోవ్ 2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. తాజా ఘటన అందుకు నిదర్శనమని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్ -19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షలో ఆమె స్వరపేటికలోని రెండు స్వర తంతువులు నిస్తేజంగా మారిపోయాయని వైద్యులు గుర్తించారు. ఆమెకు స్వరపేటికకు పక్షవాతం సోకిందని తేలింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె గొంతులో ఆపరేషన్ చేశారు. ట్యూబ్ ద్వారా బ్రీతింగ్ ఆడిట్ చేశారు. గొంతులోని ట్యూబ్ ద్వారానే 13 నెలల పాటు శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. కరోనా గురించి అందరు మర్చిపోతున్న తరుణంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశంలో కొత్తగా వ్యాపిస్తున్న జేఎన్1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు చేరింది. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వేరియంట్తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే దీనితో జనాలకు పెద్దగా ముప్పు లేదని పేర్కొంది. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలివే.. అదే జరిగితే తట్టుకోగలమా?.. అశ్రద్ధ వద్దు -
కోవిడ్పై అప్రమత్తంగా ఉందాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరంలేదనీ, అయితే అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ త్రివేణి, డాక్టర్ శివరామప్రసాద్, ఉస్మానియా, గాందీ, ఛాతీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రాజారావు, డాక్టర్ మహబూబ్ ఖాన్, టీస్ఎంఎస్ఐడీసీ సంచాలకులు కౌటిల్య, చీఫ్ ఇంజనీరు రాజేంద్ర కుమార్, స్పెషల్ ఆఫీసర్ రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు, చికిత్సకు అవసరమైన పరికరాలు, ఔషధాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడైనా కొరత ఉంటే టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇండెంట్ పెట్టి, వెంటనే ఆయా వనరులను సమకూర్చుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో మాక్డ్రిల్ను వెంటనే పూర్తిచేయాలని, ఆస్పత్రుల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు అందజేయాలని సూచించారు. ఈ 9 కేసుల్లో తీవ్రమైన లక్షణాలేమీ లేవు: తగినన్ని కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఆస్పత్రులు, జిల్లా స్థాయిలో విభాగాధిపతులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం విధిగా నమూనాలను ఉప్పల్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్డీ)కి పంపాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శనివారం మరోమారు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నెల 6వ తేదీ నుంచి బుధవారం వరకు తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ తొమ్మిది కేసుల్లో తీవ్రమైన లక్షణాలేమీ లేవని, బాధితులంతా హోం ఐసోలేషన్లో కోలుకుంటున్నారని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 319 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివిటీ రేటు 0.31 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ కేసుల టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై నిఘా పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 6 కరోనా కేసులు రాష్ట్రంలో బుధవారం మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 538 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు రవీంద్ర నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. హైదరాబాద్ నగరంలోనే ఈ ఆరు కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది ఆస్పత్రుల్లో లేదా ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.44 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. అందులో ఇప్పటివరకు 4,111 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన వారంతా రికవరీ అయ్యారు. -
భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు
-
ఒక్కరోజులో నాలుగు కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా నలుగురికి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కోవిడ్ బులెటిన్ విడుదల చేశారు. కాగా గత వారం రోజుల్లో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితులు అందరూ ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు... కరోనా ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన జేఎన్1 సబ్ వేరియంట్వని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఈ వేరియంట్వి ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కరోనాపై మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలి కొత్త సబ్ వేరియంట్ జేఎన్1 పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గత అనుభవంతో పరిస్థితులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలనీ మాక్డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లోని జేఎన్ 1 వైరస్ పరిస్థితిపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సమగ్ర సమాచారం అందజేశారు. భయపడాల్సిన అవసరం లేదన్న అధికారులు ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మంత్రికి అధికారులు వివరించారు. అయితే ఇతర దేశాల్లో కేసులు పెరిగినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు విరివిగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బుధవారం నుంచి పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇళ్లల్లో వారిని ఐసోలేషన్లో ఉంచడం వల్ల ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. మాస్క్లు అవసరం లేదు కానీ... మాస్క్లు ధరించాల్సిన ప్రత్యేక అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కరోనా కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ సబ్ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయని, కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. -
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మే రకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని, మాస్కులను ధరిం చాలని సూచించారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవా రు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనడానికి రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని, వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజలు ఆందోళన చెంద వద్దని, చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది కరోనా గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న కరోనా వేరియంట్ జేఎన్1 ఒమిక్రాన్కు చెందినదే. ఇది ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో రెండు నెలలుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ప్రమాదకారి కాదని ఇప్పటికే నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శ్వాస కోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ కిరణ్మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
హైబ్రిడ్ వర్కే సో బెటరూ!
మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచం కరోనా కోరల్లో చిక్కి అన్నిరంగాలు ప్రభావితమయ్యాక వర్క్ ఫ్రం హోం విధానం అమల్లోకి వచ్చింది.దీంతో ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి పలు రంగాల ఉద్యోగులు అలవాటుపడ్డారు. కొంతకాలంగా పరిస్థితులు సద్దుమణగడంతో ఐటీతో సహా పలు కంపెనీలు, సంస్థలు ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడం తప్పనిసరి చేస్తున్నాయి. దీనిపై ఉద్యోగుల మనోగతం ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘సీఐఈఎల్ హెచ్ఆర్’ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైబ్రిడ్ పనివిధానమే (ఆన్లైన్+ఆఫ్లైన్) మేలని అధికశాతం టెకీలు, ఇతర రంగాల ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తప్పనిసరిగా ఆఫీసుల నుంచే పనిచేయాలని పట్టుబట్టకుండా వర్క్ ఫ్రం హోం లేదా వారానికి ఒకరోజు ఆఫీసుకు రావడం లాంటి పద్ధతులను అనుమతించాలనే డిమాండ్ పెరుగుతోంది. వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ విధానానికి అనుమతించకపోతే వేరే కంపెనీల్లోకి మారేందుకూ సిద్ధమని 73 శాతం టెకీలు, ఇతర ఉద్యోగులు చెప్పినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, 35 శాతం మంది మాత్రం ఆఫీసుల నుంచి పనిచేసే రోజుల సంఖ్యను పెంచడాన్ని స్వాగతించారు. 26 శాతం మంది ఆఫీసు నుంచి పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐటీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న 3,800 ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే నివేదిక రూపొందించారు. వర్క్ ఫ్రం ఆఫీసుకు కంపెనీల మొగ్గు ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలు కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. రెండువందలకు పైగా కంపెనీల్లో డెలాయిట్ ఇండియా బెనిఫిట్స్ ట్రెండ్స్ 2023 నిర్వహించిన సర్వేలో... 88 శాతం ఉద్యోగులు ఏదో ఒక రూపంలో తమకు అనుకూలమైన పని పద్ధతులను మార్చుకున్నట్లు వెల్లడైంది. ఐటీసీ సంస్థ వర్క్ ఫ్రం ఆఫీస్ను పునఃప్రారంభించడంతోపాటు కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులను వారానికి రెండురోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా నిర్వహించిన సర్వేలో హైబ్రిడ్ విధానానికి అత్యధికులు మొగ్గుచూపుతున్నట్టు తేలింది. దీనికి అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన హైబ్రిడ్ వర్క్మోడల్/ ఫ్లెక్సిబుల్ వర్క్ వసతులను రూపొందించినట్టు డీబీఎస్ బ్యాంక్ ఇండియా హెచ్ఆర్ కంట్రీ హెడ్ కిషోర్ పోడూరి తెలిపారు. హైబ్రిడ్ విధానంతో వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు ట్రాఫిక్రద్దీ, వాహన కాలుష్యం నుంచి ఉపశమనం దొరుకుతుందని ఉద్యోగులు భావిస్తున్నట్లు చెప్పారు. అనుకూలమైన పని గంటలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండే సంప్రదాయ ఆఫీసు పనివేళల విధానం కాకుండా నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులు తమకు అనుకూలమైన పని సమయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత కూడా పెరుగుతోంది. దీంతో వారు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను కూడా సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. –నీలేశ్ గుప్తా, డైరెక్టర్, డెలాయిట్ ఇండియా వర్క్ఫోర్స్ ఉండేలా... ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పని ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన మార్పులపై కంపెనీలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఉత్పాదకతను పెంచే వర్క్ఫోర్స్, నైపుణ్య ఉద్యోగులు ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.–ఆదిత్య నారాయణ్ మిశ్రా, సీఈవో, సీఐఈఎల్ హెచ్ఆర్ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ అంటే... ఆఫీసు, ఇంటి నుంచి పనిచేయడాన్ని సమ్మిళితం చేస్తే హైబ్రిడ్ పనివిధానం అవుతుంది. ఇందులో వారంలో కొద్ది రోజులు ఆఫీసు నుంచి, కొద్దిరోజులు ఇంటి నుంచి పనిచేస్తారు. యాజమాన్యం, ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పని విధానాన్ని, ఆఫీసు వేళలను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల ఇళ్లకు దగ్గర్లోని లేదా ఉద్యోగులకు అనుకూలంగా ఉండే కో వర్కింగ్ ప్లేస్ల నుంచి పనిచేసే వీలు కూడా కల్పిస్తారు. దీంతో యాజమాన్యాలు, ఉద్యోగులకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. -
మళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్..
ముంబయి: కరోనా పేరు విని చాలాా రోజులు అయి ఉంటుంది! ఎక్కడా పెద్దగా కేసులు నమోదుకాకపోవడంతో ఇక అయిపోయిందని అనుకున్నాం. కానీ కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ వచ్చి.. కొత్తగా కేసులు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా కరోనా మొదటి, రెండవ దశలో ఎక్కువగా నష్టపోయిన మహారాష్ట్రలోనే మళ్లీ కొత్త రకం కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త రకం కరోనా వైరస్ ఈజీ.5.1 కలవరపెడుతోంది. మహారాష్ట్రలో ఈ వేరియంట్ రకానికి చెందిన కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా ముంబై లో 43 కేసులు నమోదయ్యాయి. పూణేలో 34 కేసులు వెలుగులోకి రాగా.. థానేలో 25 చొప్పున యాక్టీవ్ కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య రంగాన్ని అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. కరోనా కొత్త రకం వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున మాస్కులు తరహా రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇదీ చదవండి: వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. కాంగ్రెస్పై బీజేపీ ఫైర్ -
మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి..డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్!
మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి పూర్తిగా బయటపడ్డాం అని అనుకుంటున్న సమయంలో మరో వేరియంటే చాపకింద నీరులా వచ్చేస్తుంది. ఇంకా నేను ఉన్నానంటూ..మరో కొత్త వేరియంట్ రూపంలో భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ మహమ్మారి మొదలైన సమయంలో ఎదుర్కొన్న కష్టాలు అంత ఈజీగా మర్చిపోలేం. అందర్నీ ఇంట్లో బందీలుగా చేసింది. ఇప్పుడూ మళ్లీ మరో రూపంలో ఆ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ సైతం అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏంటీ కొత్త వేరియంటే..ఎక్కడ వ్యాపించింది? ఇంతవరకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి, దాని తాలుకా కేసులు చూశాం. ఇప్పుడు అది ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి..ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ఈ వారంలో ఆ కొత్త వేరియంట్కి సంబంధించి..సుమారు నాలుగువేల కేసు వచ్చాయిని చెప్పారు. ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త వేరియంట్కి జులై 31న "ఎరిస్" అనే పేరుతో వేరియంట్గా వర్గీకరించారు. తొలిసారిగా జూలై 3, 2023న దీని తాలుకా కేసులను గుర్తించారు. అది కాస్త నెమ్మదిగగా పెరగడంతో ఆరోగ్య అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు ఆస్పత్రిలో చేరే రేటు పెరగుతున్నట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు తక్కువుగానే ఉన్నాయని, అలాగే ఐసీయూలో అడ్మిట్ అవుతున్న కేసులు పెద్దగా పెరగలేదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్ఎస్ఏ) పేర్కొంది. ఏది ఏమైనా ఈ మహామ్మారీ కేసులు పెరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు ఇయూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ డాక్టర్ మేరి రామ్సే. ప్రజలంతా ఈ వైరస్ల బారిన పడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, అలానే శ్వాసకోస సంబంధ సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఈ కొత్త వేరింట్ కేసులను ట్రాక్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్లు, సంరక్షణ పద్దతులను అవలంబించాలని సూచించారు. అలాగే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండటమేగాక తమ రక్షణను వదులుకోవద్దని చెప్పారు. కాగా యూకేలో నెమ్మదిగా పెరుగుతున్న ఈ కొత్త వేరియంట్ కేసులపై నిపుణలు, అధికారలు పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రజలు ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరించారు అధికారులు. (చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!) -
గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లోని వారికి ఇప్పటివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన 1,149 మంది దరఖాస్తుదారులకూ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటిల్లో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిల్లో ఆ 1,149 దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాల్సిందిగా సీఎస్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోస్టులివే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. పోస్టుల భర్తీకి టైమ్లైన్.. ఇక ఈ కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్లైన్ను కూడా నిర్దేశించింది. దరఖాస్తుల పరిశీలన ఆగస్టులోగా పూర్తిచేయాలి.. అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలి. సమ్మతి నివేదికను సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. మృతిచెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీచేయాలి. -
ఏమీ చేయలేక సీఎం కుర్చీలో ఉన్నా!
సాక్షి, చెన్నై : తాను ఏమీ చేయలేని పరిస్థితులలో ఈ కుర్చీలో ఉన్నానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో నియమితులైన నర్సులు తమ ఉద్యోగాలను పరి్మనెంట్ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంగళవారం సీఎం రంగస్వామిని కలిసేందుకు వచ్చిన నర్సులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్ద వీరు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అటు వైపుగా వచ్చిన డీఎంకే ఎమ్మెల్యేలు వారికి మద్దతు ఇచ్చారు. సీఎం రంగస్వామిని కలిసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా నర్సులతో రంగస్వామి మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లగక్కడం గమనార్హం. గతంలో ఉన్న పాలన వేరు, ప్రస్తుతం ఉన్న పాలన వేరని వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో నియమించిన నర్సులను తొలగించాలని అధికారులు తనకు సూచించారని గుర్తుచేశారు. అయితే, తానే మూడు నెలలకు ఒక పర్యాయం కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తూ వచ్చానని వివరించారు. ఇక్కడున్న వారి ముందు చెప్పడంలో సంకటంగా ఉందంటూ, సీఎం కురీ్చలో ఎందుకు ఉన్నానో అని అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెబితే గతంలో అధికారులు చేసే వారని, ఇప్పుడు అలా చేయడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాక్రమాలకు వెళ్లినా, శిలాఫలకంలో తన పేరు ఉందా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు అయితే, వీఆర్ఎస్ ఇవ్వాలని కోరుతున్నారని వివరించారు. విద్యుత్ శాఖలో సెలవులపై అనేక మంది అధికారులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. తన చేతిలో అధికారం ఉంటే, కరోనా కాలంలో సేవలు అందించిన నర్సుల కాంట్రాక్టు ఐదేళ్లకు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నానని, తన చేతిలో ఏమీ లేదని, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
గండం గట్టెక్కిన అమెరికా
ఎట్టకేలకు ఒక పెను సంక్షోభం సమసిపోయింది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని మింగేసే మూడో ముప్పుగా ఆర్థిక నిపుణులు అభివర్ణించిన అమెరికా గరిష్ఠ రుణపరిమితి (డెబిట్ సీలింగ్) సంక్షోభంపై పాలక డెమాక్రాటిక్ పార్టీ, విపక్ష రిపబ్లికన్ పార్టీల మధ్య చివరి నిమిషంలో కుదిరిన అవగాహన పర్యవసానంగా కథ సుఖాంతమైంది. నిజానికి కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఊహించని రీతిలో వచ్చిపడ్డాయి. కానీ అమెరికా సంక్షోభం అలా కాదు. అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబు మాదిరి కొన్ని నెలలుగా ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ముడిపడి ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా, అగ్రరాజ్యంగా ఉన్న అమె రికా తన ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా క్రమశిక్షణతో నడపలేకపోవటమే ఈ సమస్యకు మూలం. తొలిసారి 1917లో గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు అమెరికన్ కాంగ్రెస్ అనుమతించగా, ఆ తర్వాత 1939లో, 1941లో రుణ సేకరణకు ప్రత్యేక చట్టాలు చేయాల్సివచ్చింది. ఇక అది రివాజుగా మారింది. ఆ తర్వాత 2011 వరకూ 78సార్లు గరిష్ఠ రుణ పరిమితికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయాల్సివచ్చింది. అమెరికా ప్రస్తుత గరిష్ఠ రుణ పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లు కాగా, దాన్ని మరింత పెంచేందుకు ప్రతినిధుల సభ, సెనేట్ తాజాగా అంగీకరించాయి. రుణ పరిమితిని పెంచే బదులు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవాలంటూ మొన్న ఏప్రిల్లో రిపబ్లికన్ పార్టీ పట్టు బట్టడంతో జో బైడెన్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. రిపబ్లికన్ల ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో బైడెన్ సర్కార్ ప్రతిపాదించిన బడ్జెట్కు 4.8 లక్షల కోట్ల మేర కోత పెట్టే తీర్మానం ఏప్రిల్ నెలాఖరున ఆమోదం పొందింది. ఆ కోత తీర్మానం ద్వారా హరిత ఇంధన రంగ పెట్టుబడులకు ప్రభుత్వం ఇవ్వదల్చుకున్న పన్ను మినహాయింపులకూ, విద్యార్థుల రుణాల మాఫీకీ రిపబ్లికన్లు మోకాలడ్డారు. ఈ చర్య అమెరికా పౌరులపైనా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా తుపాకి గురిపెట్టడంతో సమానమని అమెరికా ఖజానా మంత్రి జానెట్ యెలెన్ మండిపడ్డారు. ఆ మాటెలావున్నా ప్రతి నిధుల సభ, సెనేట్ల ఆమోదం లభించకపోతే ఆపద్ధర్మంగా బైడెన్ 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తనకు లభించే విశేషాధికారాలతో ప్రత్యేక చర్య తీసుకునే వీలుంటుంది. కానీ అది సంక్షోభాన్ని తాత్కాలికంగా ఒకటి రెండు నెలలు వాయిదా వేయగలదే తప్ప నివారించలేదు. ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితిని పోగొట్టలేదు. అందుకే సమస్యకు పరిష్కారం సాధ్యమా కాదా అన్న సంశ యంలో ప్రపంచం పడిపోయింది. ఇరు పార్టీల మధ్యా ఒప్పందం కుదరకపోతే అమెరికా తన రుణాలను చెల్లించలేని స్థితిలో పడేది. టీచర్లు, పబ్లిక్ రంగ సంస్థల కార్మికులతో సహా లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు నిలిపేయాల్సివచ్చేది. పింఛన్లు, అనేకానేక సాంఘిక సంక్షేమ పథకాలు కూడా ఆపాల్సివచ్చేది. కేవలం తాను చెల్లించక తప్పని రుణాలకూ, వడ్డీ చెల్లింపులకూ ప్రాధాన్యం ఇవ్వాల్సివచ్చేది. దాని సెక్యూరిటీలు పల్టీలు కొట్టేవి. సారాంశంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేది. ఒక అంచనా ప్రకారం స్వల్పకాల దివాలా అయినా కనీసం 5 లక్షల మంది ఉద్యోగులకు అది ముప్పుగా పరిణమించేది. మరింత కాలం కొనసాగితే అనేకానేక వ్యాపారాలూ మూతబడి 83 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యేవి. అంతేకాదు, అది కార్చిచ్చులా వ్యాపించి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేది. ఇరుపక్షాలూ పరిణతి ప్రదర్శించటం వల్ల ప్రస్తుతానికైతే అంతా సర్దుకుంది. కానీ మున్ముందు ఇదంతా పునరావృతం కాకమానదని గత చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. అసలే ప్రపంచం ఆర్థిక మాంద్యం అంచుల్లో ఉంది. కరోనా మహమ్మారి లక్షలాదిమంది ప్రాణా లను బలితీసుకోవటంతోపాటు మహా మహా ఆర్థిక వ్యవస్థలనే తలకిందులు చేసింది. దాన్నుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు సాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ పొరుగునున్న చిన్న దేశం ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగారు. కొన్ని నెలల్లో సమసిపోతుందనుకున్న ఆ దురాక్రమణ యుద్ధం ఏణ్ణర్థం నుంచి ఎడతెగకుండా సాగుతోంది. ఇదే అదునుగా రష్యాకు కళ్లెం వేసేందుకు అమెరికా యూరోప్ దేశాలన్నిటినీ ఏకం చేసి ఉక్రెయిన్కు సైనికంగా, ఆర్థికంగా అండదండలందిస్తోంది. అదే సమయంలో రష్యాపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. తమ సమస్త అవసరాలకూ రష్యాపై ఆధారపడక తప్పని యూరోప్ దేశాలు ఈ ఆంక్షల పర్యవసానంగా ఒడిదుడుకుల్లో పడ్డాయి. జర్మనీ ఆర్థిక మాంద్యంలో పడింది. ఈలోగా గోరుచుట్టుపై రోకటి పోటులా ఈ రుణ గరిష్ఠ పరిమితి సంక్షోభం వచ్చిపడింది. తన శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేస్తున్నవారికి రిపబ్లికన్లతో ఒప్పందం ద్వారా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి షాక్ ఇచ్చారు. రిపబ్లికన్లకు చెందిన ప్రతినిధుల సభ స్పీకర్ మెకార్తీ తన పార్టీలోని అత్యుత్సాహులను కట్టడి చేయగలిగారు. అయితే అమెరికా డాలర్తో, అక్కడి ఫైనాన్షియల్ మార్కెట్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ముడిపడివున్న సంగతిని ఆ దేశం మరువ కూడదు. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు విశ్వసనీయత లేకపోవటంవల్ల తప్ప ఇందులో తన ప్రయోజకత్వం ఏమీ లేదని అది గుర్తించాలి. తాజా ఒప్పందం పర్యవసానంగా 2025 జనవరి వరకూ గండం గట్టెక్కినట్టే. ఆ తర్వాతైనా సమస్యలు తప్పవు. ఇప్పటికైనా అమెరికా సొంతింటిని చక్కదిద్దుకునే చర్యలు మొదలెట్టాలి. హద్దూ ఆపూలేని వ్యయానికీ, పన్నులకూ కళ్లెం వేసి హేతుబద్ధ విధానాలను రూపొందించుకోవాలి. -
కరోనా పీడ విరగడైంది: డబ్యూహెచ్వో
జెనీవా: కరోనా మహమ్మారి పీడ దాదాపుగా విరగడైనట్టే. గత మూడున్నరేళ్లుగా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ దశను దాటేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కోవిడ్–19 అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఇకపై చూడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధ్నామ్ వెల్లడించారు. కనీవినీ ఎరుగని రీతిలో లాక్డౌన్లతో నాలుగ్గోడల మధ్య ప్రజలు బందీగా ఉండడం, ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవడం వంటి వాటితో కరోనా కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ బలహీనపడిపోయినప్పటికీ ఇంకా ముగింపు దశకు చేరుకోలేదని టెడ్రోస్ చెప్పారు. ఇప్పటికీ ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయని, ప్రతీ వారం కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. 2020 జనవరి 30 డబ్ల్యూహెచ్ఓ కోవిడ్–19ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. -
పోసాని కృష్ణమురళికి కరోనా.. ఆసుపత్రికి తరలింపు
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సినిమా షూటింగ్లో భాగంగా పూణె వెళ్లిన ఆయన నిన్న(గురువారం)హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే పోసానికి కోవిడ్ సోకడం ఇది మూడోసారి. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన పోసాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. -
Covid-19: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,830 మందికి పాజిటివ్గా తేలింది. గత ఏడు నెలల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. క్రితం రోజుతో(5,676 కేసులు) పోల్చితే దాదాపు 50 శాతం అధికం. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40వేల మార్క్ దాటి 40,215కు చేరింది. కరోనావ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ బారినపడివారిలో 4,42,04,771 మంది కోలుకున్నారు. కోవిడ్ సోకి ఇప్పటివరకు మొత్తం 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త తెలిపారు. వైరస్ వివిధ రకాలుగా మ్యుటేషన్లు చెంది బలహీనపడుతోందని చెప్పారు. అందుకే పాజిటివ్గా తేలిన వారిలో స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావడం లేదని పేర్కొన్నారు. అయితే ప్రజలు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని సూచించారు. చదవండి: కోవిడ్ అంతమయ్యే అవకాశముంది.. అయినా సరే నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే -
ముగింపు దశకు కరోనా! అయినా నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఈసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ ముగింపు దశకు చేరుకుందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే వైరస్ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది(మ్యుటేషన్లు) బలహీన పడుతోందని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఇప్పుడు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇంకా కొన్ని మ్యూటేషన్ల అనంతరం కరోనా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎక్స్బీబీ.1.16 వేరియంట్పై ఈ ఏడాది జనవరిలో తొలిసారి వెలుగుచూసిన ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కూడా అంత ప్రమాదకరం కాదని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 'XBB.1.16 అనేది రీకాంబినెంట్ వైరస్. ఇది మానవ శరీరంలో అనుకోకుండా తయారవుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, పునరుత్పత్తి సమయంలో జన్యు పదార్ధం మిక్స్అప్ అయినప్పుడు అవి తయారవుతాయి.' అని ఆయన వివరించారు. బూస్టర్ డోసులు, మాస్కులు దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఇంకా బూస్టర్ డోసు టీకా తీసుకోని వారు, ఆలస్యం చేసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే వాళ్లను స్కూళ్లకు అసలు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఒకవేళ వారికి సోకింది కరోనా అయితే అది ఇతర విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బంది సోకి మరింత మందికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. చదవండి: మాక్డ్రిల్తో అప్రమత్తమైన భారత్.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు -
బండెక్కితే భయమే! రాష్ట్రంలో రోజూ 20 మంది మృతి.. టాప్ 10లో తెలంగాణ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రోడ్డెక్కగానే బండిని రయ్మంటూ పరుగెత్తిస్తారు.. జన సంచారం ఉండని హైవేలపై అయితే వాయు వేగంతో పోటీ పడతారు.. ఇలా దూసుకుపోతే ఆ కిక్కే వేరనుకుంటారు.. దీనికోసం ట్రాఫిక్ నిబంధనలనూ బేఖాతరు చేస్తారు.. ఇందులో కిక్కు ఎంత వస్తుందో వారికే తెలుసుగానీ.. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడం మాత్రం పెరిగిపోతోంది. రహదారులపై బ్లాక్ స్పాట్లు, వాహన వేగ నియంత్రణలో వైఫల్యం, హెల్మెట్, సీటుబెల్టు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వంటివి వేలకొద్దీ మరణాలకు కారణమవుతున్నాయి. కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగింది. దీనితో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువై ప్రమాదాలు– మరణాల శాతం పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెప్తున్నారు. ప్రమాద మృతుల్లో 35ఏళ్ల లోపు వారే 46.3శాతం ఉంటుండటంపై ఆందోళన కరమని పేర్కొంటున్నారు. 2021 సంవత్సరానికిసంబంధించి కేంద్ర రవాణాశాఖ ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించిన గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతున్నాయి. అతి వేగమే.. చంపేస్తోంది ♦ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 18–35 ఏళ్లలోపు వారే అత్యధికంగా (46.3శాతం) ఉన్నారు. ఇందులోనూ 45.1శాతం టూవీలర్స్పై, 12.9 శాతం కార్లలో ప్రయాణిస్తున్నవారుకాగా.. 18.9శాతం మంది పాదచారులు. ♦ 71.7శాతం ప్రమాదాలు అతివేగంతో డ్రైవర్ వైఫల్యం వల్లే చోటు చేసుకున్నాయి. ఇందులో 31శాతం కొత్త వాహనాలు (5 ఏళ్లలోపువే) నడిపేవారే చేశారు. 9.5 శాతం మంది మద్యం–సెల్ఫోన్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాల బారినపడ్డారు. ♦ ప్రమాదాలు చేసిన వారిలో ఏడు శాతం మందికి లైసెన్స్లు కూడా లేకపోవడం గమనార్హం. ♦ నేషనల్ హైవేలపైనే అత్యధిక ప్రమాదాలు–మరణాలు చోటు చేసుకున్నాయి. 2021లో 1,28,825 (31.6శాతం) ప్రమాదాలు, 56,007 మరణాలు హైవేలపైనే నమోదయ్యాయి. ఆ ఏడాది తెలంగాణలోని హైవేల 2,735 మంది చనిపోయారు. ♦ 10 లక్షలు జనాభా దాటిన నగరాల్లో రోడ్డు ప్రమాదాల విషయంలో చెన్నై, ఢిల్లీ, జబల్పూర్లో తొలి మూడు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్ 8వ ప్లేస్లో ఉంది. మహానగరాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 25 శాతం మంది పాదచారులే. హైవేలపై లోపాలు సరిదిద్దక.. తెలంగాణ మీదుగా వెళుతున్న ప్రధాన హైవేలపై లోపాలను సరిదిద్దే అంశం వేగంగా ముందుకు కదలటం లేదు. అత్యధిక ప్రమాదాలు జరిగే హైవే–65 (మచిలీపట్నం– హైదరాబాద్– పుణే), హైవే–44 (కన్యాకుమారి–కశ్మీర్), హైవే–563 (భూపాలపట్నం–హైదరాబాద్)లపై పలుచోట్ల ఇంజనీరింగ్ లోపాలను గతంలోనే గుర్తించారు. వాటితో ప్రమాదాలు జరుగుతున్నట్టూ తేల్చారు. కానీ వాటిని సరిదిద్దే విషయంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా హైవే–65పై కోదాడ, మునగాల, కట్టంగూర్, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో అండర్వేలు నిర్మించాల్సి ఉంది. మూడేళ్లుగా టెండర్ల ప్రక్రియే పూర్తికాలేదు. హైవే–44లోనూ నిర్మల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ఇంజనీరింగ్ లోపాలు అలానే ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి? తెలంగాణలో ప్రమాదాల నియంత్రణ దిశగా నూతన మోటార్ వెహికల్ యాక్ట్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్లో లోపాలను సరిచేయడం, సైన్బోర్డులు, ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ను పెంచటం, ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందే చర్యలు తీసుకోవడం అవసరమని స్పష్టం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా తగిన అవగాహన కల్పించాలని పేర్కొంటున్నారు. ప్రమాదాల్లో యూఎస్.. మరణాల్లో భారత్.. వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్–2020 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 19,27,654 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో సంభవించిన మరణాల సంఖ్య (36,650)లో మూడో స్థానంలో నిలిచింది. భారత్ 4,12,432 ప్రమాదాలతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా.. 1,53,972 మృతులతో మరణాల సంఖ్యలో మాత్రం టాప్లో నిలిచింది. అమ్మానాన్నను రోడ్డు మింగింది గత ఏడాది డిసెంబర్ 11న సూర్యాపేట జిల్లా అనంతగిరి నుంచి ఖమ్మం జిల్లా జల్లేపల్లికి వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో రమేష్–రేణుక దంపతులు మృతిచెందడంతో.. వారి పిల్లలు కార్తీక్, హాసిని అనాథలుగా మారిపోయారు. -
గాడిలో పడ్డ చదువులు.. సత్ఫలితాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా విపత్తు అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. దాని ప్రభావం విద్యా రంగం పైనా తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా విద్యా రంగం రెండుళ్లు దాదాపు స్తంభించిపోయింది. స్కూళ్లు, ఆట పాటలు లేక విద్యార్థులు మానసికండా కుంగిపోయారు. కరోనా సమయంలో పాఠశాలల విద్యార్థులకు బోధన పూర్తిస్థాయిలో అందక తరగతికి తగ్గ సామర్థ్యాలు దెబ్బతిన్నాయి. మన రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. చదువులకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. చదువుల్లో విద్యార్థులు ఎక్కడా వెనకబడకుండా త్వరితగతిన చర్యలు చేపట్టేలా విద్యా శాఖను సమాయత్తం చేశారు. కరోనా విజృంభణ సమయంలో ఆన్లైన్ తరగతులు, ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లోని విద్యార్థులకు వీడియోలతో పాఠాలు చెప్పించారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో పలు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని రాష్ట్రాలకంటే ముందుగానే స్కూళ్లు తెరిపించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూనే, తరగతుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. ఇది సత్ఫలితాలనిచ్చింది. విద్యార్థులు ఉల్లాసంగా పాఠశాలలకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ, బోధనాభ్యసన కార్యక్రమాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. కరోనాతో తగ్గిన పాఠశాలల పనిదినాలు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రతి ఏటా జూన్ 12న ప్రారంభమై మరుసటి ఏడాది ఏప్రిల్ చివరి వరకు ఉంటుంది. పర్వదినాలు, జాతీయ దినోత్సవాలు, ఇతర సెలవులు అన్నీ పోను 220 రోజులు తరగతులు తప్పనిసరిగా జరగాలి. 2019 సంవత్సరంలో కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని రంగాలతో పాటు విద్యా రంగమూ అతలాకుతలమైంది. 2019 – 20 విద్యా సంవత్సరం చివర్లో (2020 మార్చి 24న) కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో అన్ని రంగాలతో పాటు పాఠశాలలూ మూతపడ్డాయి. 203 రోజులే పాఠశాలలు నడిచాయి. 2020 – 21 విద్యా సంవత్సరంలో రెండోసారి కరోనా వైరస్ విజృంభణతో మళ్లీ పాఠశాలల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలిగింది. ఆన్లైన్లోనే బోధన సాగింది. పాఠశాలలు లేక విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. పిల్లల చదువులకే అత్యధిక ప్రాధాన్యమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక ముందు జాగ్రత్తలతో పాఠశాలలను తెరిపించేలా ఆదేశాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లోకన్నా ముందుగా స్కూళ్లు తెరిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. స్కూళ్లను పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయించడం, అందరికీ మాస్కులు తప్పనిసరి చేయడంతో సహా అనేక ముందు జాగ్రత్తలతో స్కూళ్లను తెరిచింది. పబ్లిక్ పరీక్షలుండే 10వ తరగతితో పాటు 8, 9 తరగతులు ముందుగా ప్రారంభించింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత మిగతా తరగతులనూ ప్రారంభించింది. ఈ ఏడాది ఇతర రాష్ట్రాలకన్నా ముందుగా అన్ని జాగ్రత్తలతో నవంబర్ 2 నుంచి స్కూళ్లను పునఃప్రారంభించారు. విద్యార్ధులందరూ ఒకేసారి కాకుండా భౌతిక దూరం పాటించేలా కొన్ని తరగతులను ఉదయం, మరికొన్ని తరగతులను మధ్యాహ్నం నిర్వహించింది. పై తరగతుల వారికి ఎక్కువ రోజులు బోధన జరిగేలా చర్యలు చేపట్టింది. కనిష్టంగా ప్రైమరీ తరగతులకు 50 పని దినాలు, గరిష్టంగా పై తరగతులకు 130 వరకు పనిదినాలు ఉండేలా చూశారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లు యథాతథంగా సాగేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆ సంవత్సరంలో 180 రోజుల పాటు పాఠశాలలు నడిచాయి. ప్రస్తుత (2022–23) విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో తరగతులు జరుగుతున్నాయి. పాఠశాలల పనిదినాలకు ఇబ్బంది రాకుండా పర్వదినాల్లోని సెలవులను కూడా సర్దుబాటుచేసి తరగతులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది 220 రోజులు స్కూళ్లు కొనసాగనున్నాయి. కోవిడ్లో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సహాయ కార్యక్రమాలు కోవిడ్ కారణంగా 2019–20, 2020–21లో పాఠశాలల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో పిల్లల చదువులు దెబ్బతినకుండా ఏ రాష్ట్రంలోనూ లేని అనేక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వాటిలో ప్రధానమైనవి.. ► దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా టెన్త్ విద్యార్థులకు ఆన్లైన్లో వీడియో పాఠాలను ప్రసారం చేయించింది. ► విద్యామృతం అనే నూతన కార్యక్రమాన్ని నిర్వహించింది. ► టీవీ ప్రసారాలు అందుకోలేని టెన్త్ విద్యార్థుల కోసం విద్యా కలశం పేరుతో రేడియో ద్వారా పాఠాలను ప్రసారం చేసింది ► ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు లేని మారుమూల కొండ ప్రాంతాలకు ప్రత్యేకంగా స్క్రీన్ ప్రొజెక్టర్తో కూడిన వాహనాలను పంపించి, అక్కడి విద్యార్థులకు వీడియో ద్వారా పాఠాలు బోధించింది ► ఎస్సీఈఆర్టీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాఠాలు, ఇతర విద్యా కార్యక్రమాలను ప్రసారం చేయించింది ► టీచర్లలో బోధనా విధానాలపై నూతన ఒరవడులను పెంచేందుకు వెబినార్ల ద్వారా శిక్షణ ఇచ్చింది. వీటి ద్వారా 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించారు. ► పాఠశాలలు తెరిచాక తదుపరి విద్యా సంవత్సరాల్లో పై తరగతులకు వెళ్లే విద్యార్థుల్లో లోపాల సవరణకు బ్రిడ్జి కోర్సులను నిర్వహించింది. ► 2020 – 21 విద్యా సంవత్సరంలో విద్యా వారధి పేరుతో దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా ఆన్లైన్ తరగతులు ప్రసారం చేయించింది ► విద్యార్థులకు సందేహా నివృత్తికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కేటాయించింది. ఈ నంబర్కు ఫోన్ చేసిన వారికి విద్యావేత్తల ద్వారా సందేహాలు నివృత్తి చేయించింది. ► టీఎల్ఎం పోటీలు, కవర్ పేజీ డిజైన్లు, పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలతో విద్యార్థులను ప్రోత్సహించింది. ► కోవిడ్ సమయంలో ఇళ్లకే పరిమితమైన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందిపడకుండా సుమారు 36,88,610 మందికి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా రోజువారీ బియ్యం, గుడ్లు చిక్కీలతో కూడిన డ్రై రేషన్ పంపిణీ చేయించింది. -
మురుగునీటి పరీక్షలతో.. కోవిడ్ కొత్త రకాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మురుగునీటిని తరచూ పరీక్షిస్తుండటం ద్వారా కోవిడ్ రాక, కొత్త రూపాంతరితాలను గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతే కాకుండా సామాజిక స్థాయిలో వ్యాధి వ్యాప్తిని, వైరస్ మోతాదును అంచనా వేసేందుకు ఇది చౌక పద్ధతిగా దోహదపడుతుందన్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, బీమ్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్ బెంగళూరులో 28 చోట్ల నుంచి మురుగునీటిని సేకరించి జన్యు పరీక్షలు నిర్వహించాయి. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ నమూనాలను ఆర్టీ–పీసీఆర్ పరీక్షలకు జరిపాయి. ఈ ఫలితాల ఆధారంగా వైరస్ వ్యాప్తి, వాటిల్లో జరుగుతున్న మార్పులను తెలుసుకోవడం వీలైందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఫరా ఇష్టియాక్ తెలిపారు. సాధారణ పద్ధతులతో పోలిస్తే మురుగునీటిలో జన్యువుల కోసం పరీక్షలు జరపడం ద్వారా ఎక్కువ రూపాంతరితాలు గుర్తించామని వివరించారు. ఈ పద్ధతిని భవిష్యత్తులో ఇతర వైరస్ల గుర్తింపునకు కూడా ఉపయోగించవచ్చని టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ అధ్యయనం వివరాలు లాన్సెట్ రీజినల్ హెల్త్–సౌత్ ఈస్ట్ ఆసియా తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
భారత్లో కోవిడ్ భయాలు: స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూసిన కారణంగా త్వరలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్డౌన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వీటిపై స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఇదంతా నిరాధారమైన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. స్కూళ్లు, కాలేజీలకు 15 రోజులు సెలవులు ప్రకటిస్తారనే బోగస్ వార్తలను ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ చేసి ట్విట్టర్లో పోస్టు చేసింది. మరోవైపు చలి తీవ్రత బాగా పెరగడంతో కాన్పూర్, నోయిడా లక్నో, బిహార్, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీలోని పలు పాఠశాలలను మూసివేశారు. పొగమంచు కారణంగా కొన్ని చోట్ల స్కూళ్ల సమయాన్ని మార్చారు. అంతేగానీ కరోనా కారణంగా సెలవులు ప్రకటించలేదు. చదవండి: భారత్లో డ్రంక్ అండ్ డ్రైవ్ను అరికట్టడం ఎలా? सोशल मीडिया पर कई खबरों को शेयर करते हुए दावा किया जा रहा है कि #Covid19 के कारण देश में लॉकडाउन लगेगा और स्कूल/कॉलेज बंद रहेंगे। #PIBFactCheck ✅ ये सभी दावे फ़र्ज़ी हैं। ✅ कोविड से जुड़ी ऐसी किसी भी जानकारी को शेयर करने से पहले #FactCheck अवश्य करें। pic.twitter.com/jLcIeI9pBn — PIB Fact Check (@PIBFactCheck) January 4, 2023 -
హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న హై రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను వారం రోజులు క్వారంటైన్లో ఉంచనున్నట్లు తెలిపింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే ఐసోలేషన్కు తరలించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి డా.కే శివకుమార్ శనివారం తెలిపారు. నాలుగు రకాల కరోనా వేరియంట్ల విజృంభణతో చైనా విలవిల్లాడుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. చదవండి: న్యూ ఇయర్ రోజు విషాదం.. టూర్కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా.. -
ఆ దేశాల కరోనా ఆంక్షలపై చైనా సీరియస్.. ఇదేం తీరు..?
బీజింగ్: చైనాలో కరోనా కేసులు ఆందోళనకరస్థాయిలో పెరిగిన కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. చైనా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి నిబంధన తీసుకొచ్చాయి. అయితే ఈ విషయంపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ దేశం నుంచి వచ్చినవారికే పరీక్షలు నిర్వహించడం వివక్షపూరితమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లుగా కరోనా నియంత్రణకు తాము చేపట్టిన చర్యలను నిర్వీర్యం చేసినట్లేనని వ్యాఖ్యానించింది. అమెరికా, దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్, తైవాన్ సహా భారత్ కూడా చైనా ప్రయాణికులపై ఇటీవలే ఆంక్షలు విధించింది. చైనా నుంచి వచ్చేవారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వ మీడియా స్పందించింది. అయితే చైనా వ్యాఖ్యలు చూస్తుంటే వింతగా అన్పిస్తోంది. మొన్నటివరకు ప్రపంచంలో ఏ దేశమూ చేయని విధంగా మూడేళ్లపాటు కఠిన కరోనా ఆంక్షలు అమలు చేసింది. విదేశాల నుంచి వెళ్లేవారు కచ్చితంగా క్వారంటైన్లో ఉండి, కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే అనుమతించింది. ఈనెల మొదట్లోనే ఆంక్షలు సడలించింది. జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధన ఎత్తివేస్తున్నట్లు చెప్పింది. కానీ.. కరోనా పరీక్షమాత్రం తప్పనిసరి చేసింది. అలాంటి చైనా ఇప్పుడు వేరే దేశాలు ఆంక్షలు అమలు చేస్తే మాత్రం వివక్షపూరితం అనడం హాస్యాస్పదంగా ఉంది. డిసెంబర్ 7 నుంచి చైనాలో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేశారు. ఆ తర్వాత నుంచి కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. చైనా మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తోంది. చదవండి: సమాచారం దాచి.. సంక్షోభం పెంచి -
కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్లోకి ఎంట్రీ..!
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత్ తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లోనే రాండమ్గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. చైనా సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలనే నిబంధనలు తీసుకురానుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 40 రోజులు చాలా కీలకమని, జనవరిలో కరోనా కేసులు పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించారు అధికారులు. దేశంలో నాలుగో వేవ్ వచ్చినా మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. గతంలో తూర్పు ఆసియాలో కోవిడ్ విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్లో కొత్త వేవ్ వచ్చిందని గుర్తు చేశాయి. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్, ‘ఎయిర్ సువిధ’ ఫారమ్లో వివరాల నమోదు వంటి నిబంధనలు మళ్లీ తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సుమారు 6000 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. అందులో గత రెండు రోజుల్లోనే 39 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా బుధవారం సందర్శించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కరోనా అలర్ట్: జనవరి గండం ముందే ఉంది.. కేంద్రం వార్నింగ్ ఇదే.. -
కోవిడ్ ఫ్రీ బూస్టర్ డోస్లు నిల్.. కొనుక్కోవాల్సిందే!
చైనాలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అందులో భాగంగా కోవిడ్ బూస్టర్ డోస్లను త్వరిగతిన తీసుకోమని ప్రజలను హెచ్చరిస్తోంది. ఐతే 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా అందిచ్చే కోవిడ్ బూస్టర్ డోస్లు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లేవని, కనీసం దేశ రాజధాని ఢిల్లీలో సైతం తగినంత మొత్తంలో అందుబాటులో లేవని సమాచారం అలాగే సుమారు రూ. 400లు వసూలు చేసి బూస్టర్ డోస్లు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద ఉన్నాయి గానీ అవికూడా రానున్న కొద్ది రోజుల్లో అయిపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐతే అధికారిక లెక్కల ప్రకారం కోవిన్ వెబ్ పోర్టల్లో కూడా ఎన్నో బూస్టర్ డోస్లు అందుబాటులో లేవని స్పష్టంగా చెబుతోంది. ఐతే కొన్ని ప్రైవేట్ సెంటర్లో మాత్రం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు ప్రభుత్వం మాత్రం చైనా మాదిరిగా కేసులు పెరగకుండా ప్రజలను సత్వరమే బూస్టర్ డోస్లు తీసుకోమని చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, దేశంలో సాధారణ టూ డోస్ వ్యాక్సిన్ను ఇప్పటి వరకు 90 శాతం మంది తీసుకోగా, బూస్టర్ డోస్ను ఢిల్లీలో కేవలం 20 శాతం మంది తీసుకోగా, భారత్ అంతటా 30 శాతం మంది తీసుకున్నారు. ప్రజలంతా కూడా వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధైర్యంతో ధీమాగా ఉన్నారని కేంద్రం నొక్కి చెబుతోంది. అయినప్పటికీ అవగాహన డ్రైవ్లను నిర్వహించమని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం భారత్లో కేసుల తక్కువుగానే ఉన్నాయని, సగటున 200 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. (చదవండి: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!) -
3 కోవిడ్ టీకాలు తీసుకున్నవారికి బంపరాఫర్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చర్యలకు నడుం బిగించింది. మూడు డోసులు టీకా తీసుకున్న వారికి సాధారణ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల పునరుద్ధరణపై డిస్కౌంట్ ఇవ్వాలని అన్ని బీమా సంస్థలను కోరింది. కరోనా క్లెయిమ్లను వీలైనంత త్వరితంగా పరిష్కరించాలని, డాక్యుమెంట్ల అవసరాన్ని తగ్గించాలని కోరింది. బీమా సంస్థలు తమ వెల్నెట్ నెట్వర్క్ ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్ట్లు నిర్వహించుకునే విధంగా పాలసీదారులను ప్రోత్సహించాలని, ఇందుకు వారికి రాయితీలు కల్పించాలని సూచించింది. కోవిడ్ నిబంధనలను పాలసీదారులు అనుసరించేలా సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రోత్సహించాలని బీమా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో భాగంగా కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విదేశీ ప్రయాణ బీమా పాలసీలు తీసుకునే వారికి, పలు దేశాల్లో కరోనా పరీక్షల నిర్వహణ అవసరాల గురించి తెలియజేయాలని ఐఆర్డీఏఐ సూచించింది. కరోనాతో చికిత్స కోసం వచ్చే పాలసీదారుల నుంచి నెట్వర్క్ హాస్పిటళ్లు డిపాజిట్ తీసుకోకుండా చూడాలని కోరింది. నగదు రహిత సదుపాయం ఉన్న ఆస్పత్రుల్లో చేరినప్పటికీ, కరోనా మొదటి, రెండో విడతలో చాలా ఆస్పత్రులు రోగుల నుంచి డిపాజిట్లు తీసుకున్నాయి. దీంతో ఐఆర్డీఏఐ ఈ సూచన చేసింది. కరోనా కేసులు ఒకవేళ అధికంగా వస్తే సాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి బీమా సంస్థలు కరోనాకు సంబంధించి 2.25 లక్షల క్లెయిమ్లను పరిష్కరించడం గమనార్హం. -
ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్'.. భారత్ మైలురాళ్లు చెప్పిన మోదీ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. దేశ ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. 2022 చివరి ఎపిసోడ్ కావడంతో ఈ ఏడాది భారత్ సాధించిన మైలురాళ్ల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను ఈ ఏడాది అధిగమించినట్లు చెప్పారు. ఏ ఏడాదే జీ-20కి భారత్ నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం వేడుకల్లో భాగంగా నిర్వహించిన హర్ గర్ తిరంగా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఆధునిక యుగంలో యోగా, ఆయుర్వేదానికి ప్రాధాన్యం పెరగడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగులపై యోగా ప్రభావవంతంగా ఉందని టాటా రీసెర్చ్ సెంటర్ చేసిన పరిశోధనను కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయుర్వేదాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్ను సహకరించాలన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినెల చివరి ఆదివారం మోదీ మన్ కీ బాత్ రేడియా కార్యక్రమంలో మాట్లాడుతారు. మొత్తంగా ఇది 96వ ఎపిసోడ్ కాగా.. ఈ ఏడాది చివరిది. చదవండి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం.. -
కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
బీఎఫ్.7.. కరోనా ఒమిక్రాన్లో సబ్వేరియెంట్. ప్రస్తుతం చైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వేరియెంట్ ప్రపంచ దేశాలకు కొత్తేం కాదు. అక్టోబర్లోనే బిఎఫ్.7 కేసులు అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ సబ్ వేరియెంట్ అత్యంత బలమైనది. కరోనా సోకి యాంటీబాడీలు వచ్చిననవారు, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని ఎదిరించి మరీ ఇది శరీరంలో తిష్టవేసుకొని కూర్చుంటుంది. అందుకే ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అంటువ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. భారత్లో జనవరిలో థర్డ్ వేవ్ వచ్చిన సమయంలో ఒమిక్రాన్లోని బిఏ.1, బీఏ.2 సబ్ వేరియెంట్లు అధికంగా కనిపించాయి. ఆ తర్వాత బీఏ.4, బీఏ.5లని కూడా చూశాం. ఇన్నాళ్లు అతి జాగ్రత్తలు తీసుకున్న చైనా ఒక్కసారిగా అన్ని ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడ ప్రజల్లో కరోనాని తట్టుకునే రోగనిరోధక వ్యవస్థలేదు. అదే ఇప్పుడు చైనా కొంప ముంచింది. వాస్తవానికి ఇప్పుడు చైనాలో నెలకొన్నలాంటి స్థితిని దాటి మనం వచ్చేశామని కోవిడ్–19 జన్యుక్రమ విశ్లేషణలు చేసే సంస్థ ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. 2021 ఏప్రిల్–మే మధ్యలో డెల్టా వేరియెంట్తో భారత్లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని, ఆ సమయంలో కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని అన్నారు. ఇక ఒమిక్రాన్లో బీఎఫ్.7 చైనాలో అత్యధికంగా వృద్ధుల ప్రాణాలు తీస్తోందని, మన దేశంలో యువజనాభా ఎక్కువగా ఉండడం వల్ల భయపడాల్సిన పని లేదని డాక్టర్ అగర్వాల్ చెబుతున్నారు. అయితే విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వైరస్తో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వేరియెంట్లో ఎక్కువగా కనిపిస్తాయి. మాసు్కలు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటే బీఎఫ్.7తో భారత్కు ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులంటున్నారు. ఈ సబ్ వేరియెంట్ కేసులు అమెరికాలోని మొత్తం కేసుల్లో 5%, యూకేలో 7.26% ఉన్నాయి. అక్కడ మరీ అధికంగా కేసులు నమోదు కావడం లేదు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అంతగా లేదు. అందుకే భారత్లోనూ ఇది ప్రభావం చూపించదనే అంచనాలు ఉన్నాయి. చదవండి: దేశంలో క్యాన్సర్ విజృంభణ -
కావాలనే ‘కరోనా’ అంటించుకున్న ప్రముఖ సింగర్.. అందుకోసమేనటా..!
బీజింగ్: కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ, చైనాకు చెందిన ప్రముఖ సింగర్, పాటల రచయిత జేన్ జాంగ్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే కోవిడ్ తనకు సోకేలా చేసుకుంది. తాను కావాలనే కరోనా బారినపడినట్లు బయటకు చెప్పడంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. ఓ వైపు చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో ఆమె ఉద్దేశపూర్వకంగానే కోవిడ్ బారినపడటం విమర్శలపాలు చేసింది. అయితే, తాను కరోనా బారినపడేందుకు గల కారణాలను సోషల్ మీడియా వేదికగా వివరించింది సింగర్ జేన్ జాంగ్. కరోనా సోకిన తన స్నేహితులను చూసేందుకు వెళ్లినట్లు పేర్కొంది. కొత్త ఏడాది ఈవెంట్కు సన్నద్ధమయ్యే ప్రక్రియలో భాగంగానే కరోనా తనకు అంటుకునేలా చేసుకున్నానని పేర్కొంది. ఇప్పడే వైరస్ సోకి కోలుకోవడం ద్వారా న్యూఇయర్ ఈవెంట్లో మళ్లీ వైరస్ సోకదని భావించినట్లు పేర్కొంది. ‘న్యూఇయర్ కన్సర్ట్లో నా ఆరోగ్యం దెబ్బతింటే అది నా ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందాను. అందుకే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారితో కలిశాను. ఇప్పుడు నాకు కోలుకునేందుకు తగిన సమయం ఉంది.’ అని రాసుకొచ్చింది జేన్ జాంగ్. కోవిడ్ సోకిన వారిలాగే తనకు లక్షణాలు కనిపించాయని, కానీ, ఒక్కరోజు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. పగలు, రాత్రి నిద్రపోవటం వల్ల లక్షణాలు మాయమైనట్లు పేర్కొంది. విటమిన్ సీ తీసుకోవటం, నీళ్లు ఎక్కువ తాగడం వంటివి చేసినట్లు వెల్లడించింది. విమర్శల వెల్లువ..క్షమాపణలు సింగర్ పోస్ట్ వైరల్గా మారిన క్రమంలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. చైనాలో కోవిడ్ విజృంభణ వేళ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు కొందరు పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా నుంచి తన వివాదాస్పద పోస్ట్ను తొలగించింది సింగర్ జేన్ జాంగ్. ప్రజలకు క్షమాపణలు తెలిపింది. న్యూఇయర్ ఈవెంట్లో కరోనా సోకితే తనతో పాటు సిబ్బందికి సోకుతుందని అంతా ఇబ్బందులు పడతారనే కారణంతోనే ఇలా చేశానని, ప్రస్తుతం ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేనందున వైరస్ నుంచి కోలుకుంటే ఇబ్బందులు ఉండవని భావించినట్లు రాసుకొచ్చింది. ఇదీ చదవండి: Covid BF7 Variant: కొత్త వేరియంట్ భారత్లోనూ గుర్తింపు.. ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్ -
గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..!
బీజింగ్: చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగాయి. రోజు వేల మంది వైరస్ బారినపడుతున్నారు. వందల మంది చనిపోతున్నారు. ఆస్పత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నారు. శ్మశాన వాటికల్లో శవాలు గట్టలుగుట్టలుగా కన్పిస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. చైనా లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కరోనా వల్ల మంగళవారం ఒక్కరు కూడా చనిపోలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ బుధవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఐదుగురే మరణించారని పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 5,241 మంది మాత్రమే వైరస్ కారణంగా చనిపోయినట్లు చెబుతోంది. మంగళవారం కొత్తగా 3,101 మందికి వైరస్ సోకిందని చైనా వెల్లడించింది. వీరిలో 52 మంది విదేశాల నుంచి వచ్చిన వారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి చైనాలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,86,276కి చేరిందని పేర్కొంది. అయితే చైనా లెక్కలకు వాస్తవ పరిస్థితుల వ్యత్యాసానికి కారణం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా సోకిన వారు దుష్ప్రభావాలు లేదా మరే ఇతర కారణంతో చనిపోయినా దాన్ని కోవిడ్ మరణాల కిందే లెక్కకడుతున్నాయి. చైనాలో మాత్రం నిబంధనలు మరోలా ఉన్నాయి. వైరస్ సోకి శ్వాసకోస వ్యవస్థ దెబ్బతిని చనిపోయిన వారిని మాత్రమే కరోనా మృతులుగా గుర్తిస్తోంది. వైరస్ సోకి మిగతా ఏ కారణంతో చనిపోయినా.. వారిని కోవిడ్ మృతులుగా గుర్తించడం లేదు. అలాగే లక్షణాలు ఉంటేనే కరోనా కేసుగా లెక్కగడుతోంది. చైనాలోని ఓ ఆస్పత్రిలో శవాలు ఈ కారణంగానే చైనాలో రోజుకు ఎంతమంది చనిపోయినా.. అధికారిక కరోనా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ నిపుణుల అంచనాల ప్రకారం చైనాలో ప్రస్తుతం రోజుకు 40వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. వందల మంది వైరస్కు బలవుతున్నారు. అక్కడ ఆస్పత్రులు కూడా పడకల ఖాళీ లేనంత రద్దీగా మారాయి. శవాలను ఖననం చేసేందుకు శ్మశానవాటికల్లో ఖాళీ కూడా లేని దుస్థితి ఉంది. చదవండి: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు -
కరోనా మరణాలను దాచేందుకు చైనా కొత్త ఎత్తుగడ
బీజింగ్: ప్రజాగ్రహంతో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది చైనా. ఈ క్రమంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రానున్న 3 నెలల్లో దేశంలోని 60 శాతం మంది వైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈక్రమంలో కోవిడ్ ద్వారా సంభవించే మరణాలను దాచిపెట్టేందుకు డ్రాగన్ దేశం కొత్త ఎత్తుగడ వేసింది. శ్వాసకోశ అవయవాల వైఫల్యంతో మరణించిన వారినే అధికారికంగా కోవిడ్ మరణాలుగా పరిగణిస్తామని మంగళవారం ప్రకటించింది. ఆంక్షల సడలింపు తర్వాత మంగళవారం అత్యధికంగా 5 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అది అధికారిక లెక్కప్రకారమే. కానీ, ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య శాఖ ప్రకారం చైనాలోని ప్రధాన నగరాల్లో ఒమిక్రాన్ వేరియంట్లు బీఏ.5.2, బీఎఫ్.7లు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(ఎన్హెచ్సీ) ఈ ప్రకటన చేసింది. కేవలం శ్వాసకోశ సంబంధిత అవయవాల వైఫల్యంతో మరణించిన వారినే అధికారికంగా లెక్కల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ఏ విధంగా లెక్కిస్తామనే అంశాలపై నోటీసులు జారీ చేసింది. సైంటిఫిక్, రియలిస్టిక్ పద్ధతిలో ఆ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో కరోనా సోకిన తర్వాత గుండెపోటు, ఇతర వ్యాధులతో మరణించిన వారిని లెక్కల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక -
కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో తొలిసారి మరణాలు!
బీజింగ్: కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రభుత్వం అత్యంత కఠినతరమైన ఆంక్షలు అమలు చేసింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిబంధనలను డిసెంబర్ 7న ఎత్తివేసింది. ఆంక్షలు సడలించిన తర్వాత చైనాలో తొలి కరోనా మరణాలు నమోదైనట్లు సింగపూర్ డైలీ వెల్లడించింది. చైనా ప్రభుత్వ మీడియాలో పనిచేసిన మాజీ జర్నలిస్టులు ఇద్దరు కోవిడ్ కారణంగా చనిపోయినట్లు తెలిపింది. డిసెంబర్ 8న ఒకరు, డిసెంబర్ 15న మరొకరు వైరస్కు బలైనట్లు చెప్పింది. అయితే చైనా ఆరోగ్య శాఖ మాత్రం ఈ మరణాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఆంక్షలు సడలించిన తర్వాత ఎవరైనా వైరస్ కారణంగా చనిపోయారా? అనే విషయాలను ప్రభుత్వం వెల్లడించడం లేదు. జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేశాక కరోనా కేసులను ట్రాక్ చేయడం సాధ్యం కావట్లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ చేతులెత్తేసింది. చదవండి: రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే? -
భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. చేతులెత్తేసిన చైనా ప్రభుత్వం..!
బీజింగ్: కరోనా విషయంలో చైనా ప్రభుత్వం చేతులెత్తేసింది. రోజుకు ఎన్ని కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయో ట్రాక్ చేయడం అసాధ్యమని ఆ దేశ ఆరోగ్య శాఖ తేల్చిచెప్పింది. దీంతో గత నెలలో అత్యధిక కేసులు నమోదైన చైనాలో ఇప్పుడు ఎంతమంది వైరస్ బారినపడుతున్నారో తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కరోనా కఠిన ఆంక్షలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో జీరో కోవిడ్ పాలసీని చైనా ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. క్వారంటైన్, కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టుల విషయంలో నిబంధనలను సడలించింది. ఫలితంగా కరోనా కేసులను ట్రాక్ చేయడం అసాధ్యమైంది. సడలించిన నిబంధనలతో వైరస్ సోకి లక్షణాలు లేనివారు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. వీరంతా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు కూడా చేయించుకోవడం లేదు. కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటి సంఖ్యను కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో కరోనా కేసులను ఇక ట్రాక్ చేయలేమని చైనా ఆరోగ్య కమిషన్ బుధవారం ప్రకటించింది. చైనాలో కరోనా వ్యాప్తి మొదలై మూడు సంవత్సరాలు కావస్తున్నా.. వైరస్ను పూర్తిగా కట్టడి చేయడంలో ఆ దేశం విఫలమవుతోంది. టీకాలు పంపిణీ చేసినప్పటికీ అవి అంతంత మాత్రమే ప్రభావం చూపుతున్నాయి. పైగా ఇంకా కొన్ని లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో కొత్త కేసులు విపరీతంగా పెరగడం డ్రాగన్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చదవండి: 165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే -
కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..?
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కకావికలం చేసిన విషయం తెలిసిందే. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. అయితే రాబోయో రోజుల్లో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా విసరబోతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మార్బర్గ్ అనే వైరస్ కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వెలుగుచుశాయని, ఈ రోగులకు సరైన చికిత్స అందించి.. వైరస్ను కట్టడి చేయలేకపోతే మరో మహమ్మారిలా విశ్వమంతటా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి దీనికి 'డిసీజ్-ఎక్స్' గా నామకరణం చేసింది. డిసీజ్-ఎక్స్ ఎబోలా కంటే చాలా ప్రమాదకరం. ఈ వ్యాధి సోకినవారిలో 80 శాతం మంది రోగులు మరణిస్తారు. ఇప్పటికే కోట్ల మంది కరోనా బారినపడ్డారు. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గింది. ఈ సమయంలో డిసీజ్-ఎక్స్ ఎటాక్ చేస్తే వాళ్లు తట్టుకోలేరని, కరోనా కంటే ఊహించని ప్రాణనష్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మందు లేదు.. డిసీజ్-ఎక్స్కు ఇప్పటివరకు వ్యాక్సిన్ గానీ, ఔషధాలు గానీ అందుబాటులో లేవు. దీనికి సంబంధించిన సమాచారం కూడా లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు జరుపుతున్నారు. ఒకవేళ ఇది మరో మహమ్మారిలా పరిణమిస్తే మానవాళి మనుగడకే ప్రమాదమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు ఈ వైరస్కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ ఇంకా పూర్తిగా కోలేదు. అన్ని దేశాల్లో ఇప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డిసీజ్-ఎక్స్ కేసులు పెరిగి విశ్వమంతా వ్యాపిస్తే.. ఆ పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. చదవండి: ఎలాన్ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్కు అధికార పార్టీ గుడ్బై.. -
ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం
బీజింగ్: చైనాలో దాదాపు ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం సంభవించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించింది. వైరస్ను కట్టడి చేసేందుకు 'జీరో కోవిడ్ పాలసీ' పేరిట కఠిన ఆంక్షలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది డ్రాగన్ దేశం. ఇప్పుడు మరణించిన వ్యక్తి బీజింగ్కు చెందిన వృద్ధుడు అని అధికారులు తెలిపారు. వయసు 87 ఏళ్లు అని పేర్కొన్నారు. ఈయన మృతితో చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య 5,227కు చేరింది. చివరిసారిగా మే 26న షాంగైలో కరోనా మరణం నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే మరో వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయాడు. చైనాలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్కడోసు కరోనా టీకా తీసుకున్నారు. అయితే వృద్ధులకు టీకాలు సరిగా పంపిణీ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరణించిన వ్యక్తి కూడా టీకా తీసుకున్నాడా? లేదా? అనే విషయంపై ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేదు. కరోనా కట్టడికి ప్రపంచంలో ఏ దేశమూ అమలు చేయని విధంగా జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తోంది చైనా. కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్డౌన్ సహా కఠిన ఆంక్షలు విధిస్తోంది. వ్యాపారం, ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతున్నప్పటికీ ఆంక్షల విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. చైనాలో ఇప్పటివరకు 2,86,197 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 2,60,141 మంది కోలుకున్నారు. చదవండి: ఉక్రెయిన్కి సాయం అందిస్తాం: రిషి సునాక్ -
మాస్కు ధరించడం తప్పనిసరికాదు.. కేంద్రం కీలక ఆదేశాలు..
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు మాస్కు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే ప్రయాణికులు మాస్కుకు ప్రాధాన్యమిస్తే మంచిదేనని సూచించింది. విమానయాన సంస్థలు కూడా ఇకపై విమానాల్లో ప్రకటనలు చేసే సమయంలో మాస్కు తప్పనిసరి అని చెప్పొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. మాస్కులు, ఫేస్ కవర్లు ఉపయోగిస్తే మంచిదని మాత్రమే చెప్పాలని పేర్కొంది. ఈ ఆదేశాలకు ముందు వరకు విమానాల్లో మాస్కు తప్పనిసరి నిబంధన అమల్లో ఉంది. మాస్కు ధరించని కారణంగా ప్రయాణికులను కిందకు దింపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో కొత్త 501 కరోనా కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా 474 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2020 ఏఫ్రిల్ 6 తర్వాత ఇవే అత్యల్పం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే విమానాల్లో మాస్కు తప్పనిసరి నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. చదవండి: ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది.. -
జాగ్రత్తలు పాటించాల్సిందే!
రెండు సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి దెబ్బకు బతుకులు దయనీయంగా మారిన తీరు అందరికీ జ్ఞాపకం ఉంది. కొన్నాళ్లపాటు లాక్డౌన్ పేరున అందరూ తలుపులు పెట్టుకుని ఇళ్లలోనే బందీలు అయిన సంగతి వెంటాడుతూనే ఉన్నది. అయినా చాలా మంది మూతికి మాస్కులు పెట్టుకోవాలి అన్న సంగతి మరచిపోయారు. గుంపులు గుంపులుగా చేరడం గురించి ఎవరూ భయపడడం లేదు. చేతులు, పరిసరాలను శానిటైజ్ చేసుకోవడమూ తగ్గిపోయింది. బహుశా కోవిడ్ కేసులు బాగా తగ్గిపోవడం వల్లనే చాలామంది ఇలా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్నట్టున్నారు. అయితే కోవిడ్ పీడ ఇంతటితో విరగడైందని భావించరాదు. మహమ్మారి మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘సైన్స్’ పత్రికలో గ్రెచెన్ ఫోగెల్ అనే పరిశోధకుడు ఈ మధ్యనే ఒక పరిశోధన పత్రం వెలువరించాడు. మరొక పెద్ద కోవిడ్ వేవ్ రానున్నదని ఆ పత్రంలో ఆయన ప్రకటించాడు. కోవిడ్ గురించి బాగా పట్టించుకున్న వాళ్లకు ఒమిక్రాన్ అన్న పేరు జ్ఞాపకం ఉంటుంది. సార్స్ కోవ్ 2 అనే వైరస్ వల్ల కోవిడ్ వచ్చిందని తెలుసు. ఆ వైరస్లో జన్యు మార్పులు జరిగి కొత్త రకాలు వచ్చినట్టు కూడా తెలుసు. అందులో చివరిది ఒమిక్రాన్. అది కూడా మళ్లీ ఒకసారి మార్పులకు గురైందట. ఫలితంగా వచ్చిన మరో కొత్త రకానికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తట్టుకునే బలం ఎక్కువగా ఉందట. అటువంటి రకాలు ఒకటి కన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పరిశోధకులు. చలికాలం ముంచుకు వస్తున్నది. అప్పటికల్లా ఈ కొత్త రకాలు తలెత్తవచ్చు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద కొత్త కోవిడ్ కేసులు బాగా తరిగిన మాట వాస్తవమే. కానీ చైనా, యూరప్లలో అవి మళ్లీ తలెత్తుతున్నాయి. యూరప్లో వచ్చిన కేసులను బాగా పరిశీలించారు. అక్కడ రెండు రకాల వైరస్లు కనిపించాయి. అవి రెండూ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే బలం గలవని కూడా తెలిసింది. టీకా వేయించుకున్న వారికీ, అంతకుముందు వ్యాధి వచ్చి తగ్గిన వారికి కూడా ఈ కొత్త వైరస్ రకాల వల్ల వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అమెరికా లాంటి దేశాలలో ఎక్కువ వైరస్ రకాల మీద పనిచేయగల వ్యాక్సిన్లను ఇచ్చారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్ ఎక్కడ వచ్చినా ప్రపంచమంతటా వ్యాపించడానికి అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ‘సైన్స్’ వ్యాసంలో వ్యాధి ముందుగా అమె రికా, యూరప్లలో కని పిస్తుంది అని వివరించారు. కరోనా వైరస్ కనిపించకుండా పోయింది, ఇక వచ్చే అవకాశం లేదు అని చాలామంది భ్రమలో ఉన్నారు. కానీ ఈ కొత్తరకం వైరస్లు త్వరలోనే ప్రపంచాన్ని మళ్లీ గడగడలాడించ నున్నాయని మరికొన్ని పత్రికలు కూడా రాశాయి. కొత్త వేవ్ను తట్టుకునేందుకు ఏం చేయాలనే సంగతులపైనా పరిశోధనలు మొదలయ్యాయి. ప్రస్తుతం బీఏ 2.75.2, బీక్యూ 2.1 అనే స్ట్రెయిన్లు కొత్తగా కనిపిస్తున్నాయి. మనిషిలోని రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే బలం ఈ రెంటిలోనూ ఇంతకు ముందు వచ్చిన అన్నిరకాల కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశోధకులు. ఇందులో బీక్యూ 2.1 రకం త్వరగా వ్యాపిస్తుంది కూడా! త్వరలోనే ఇది ప్రపంచమంతటా ఉత్పాతం కలిగిం చనుందనేది పరిశోధకుల అభి ప్రాయం. ఈ చలి కాలంలో వైరస్ గనుక వచ్చిందంటే దానితో పోరాడ డానికి అన్ని రకాలా మనం సిద్ధంగా ఉండాలి అని వారు హెచ్చ రిస్తున్నారు. వ్యాధి వచ్చినప్పుడు తొందరగా ఏదో చేయాలని టీకాలు వేశారు తప్పిస్తే, ఎక్కువ కాలం ఆ వ్యాక్సిన్లు పనిచేసే తీరును గురించి పరిశీలించడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఆ దిశలోనూ శోధన జరగాలి. శాస్త్రవేత్తలు జనాన్ని భయపెట్టడం కోసం ఇటువంటి హెచ్చ రికలు చేయడం లేదు. రానున్న ముప్పు గురించి ముందుగానే జాగరూకులను చేయడం వారి విధి. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత. మన అజాగ్రత్త మరో మృత్యుహేలను సృష్టిస్తుందనేది అందరూ గుర్తించాలి. కేబీ గోపాలం వ్యాసకర్త అనువాదకుడు, రచయిత -
జీరో కోవిడ్ పాలసీ నా కొడుకుని పొట్టనబెట్టుకుంది..ఓ తండ్రి ఆవేదన
జీరో కోవిడ్ పాలసి నిబంధనల కారణంగానే నా మూడేళ్ల కొడుకు చనిపోయాడంటూ ఓ తండ్రి ఆగ్రహావేశాలతో విరుచుకుపడ్డాడు. ఈ కరోనా నిబంధనలే నా కొడుకు నిండు నూరేళ్ల జీవితాన్ని పరోక్షంగా పొట్టన బెట్టుకుందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తువో షిలీ గన్సు ప్రావిన్షియల్ రాజధాని లాన్జౌకి చెందిన టువో ఈ కోవిడ్-19 కఠిన నిబంధనల కారణంగానే తన కొడుకుని పొగొట్టుకున్నాని స్థానికి మీడియాకు తెలిపాడు. తన భార్య వంట చేస్తుండగా గ్యాస్ లీకైందని, మొదటగా తన భార్య స్ప్రుహతప్పి పడిపోయిందని, ఆ తర్వాత తన కొడుకు వెన్క్సువాన్ కూడా అపస్మారక స్థితిలో వెళ్లిపోయినట్లు చెప్పాడు. దీంతో తన కొడుకును వెంటనే సీఆర్పీ చేయించేందుకు స్థానిక కమ్యూనిటి ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది టువోని లోనికి వెళ్లనివ్వలేదు. కొందురు అంబులెన్స్కి ఫోన్ చేయమని సలహ ఇచ్చారు. అక్కడే 30 నిమిషాలు వృధా కావడంతో వెన్స్కువాన్ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అంబులెన్స్ కోసం చూడకుండా, స్థానికుల సాయంతో ట్యాక్సిలో కొడుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ ప్రాంతమంతా లాక్డౌన్ విధించడంతో పలుచోట్ల చెక్పోస్ట్ల వద్ద అనుమతి లిభించలేదు. ఏదోలా ప్రయాసపడి ఆస్పత్రికి చేరుకున్న తన కొడుకు ప్రాణాలు మాత్రం దక్కలేదని ఆవేదనగా చెప్పాడు. ఈ విషయమై లాన్జౌ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ స్పందించలేదు. ఈ కరోనా కఠిన ఆంక్షలు పరోక్షంగా నా కొడుకు ప్రాణాన్ని పొట్టనబెట్టుకుందంటూ టువో భోరున విలపించాడు. ఈ ఘటన సోషల్ మాధ్యమంలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీగాక రిటైర్డ్ స్థానిక అధికారి ఈ విషయామై ఆందోళన చేయను, పరిహారం కోరను అనే అగ్రిమెంట్పై సంతకం చేస్తే సుమారు రూ. 11 లక్షలు ఇస్తానంటూ ఒక ఆఫర్ ఇచ్చినట్లు టువో చెబుతున్నాడు. తాను దాన్ని తిరస్కరించినట్లు తెలిపాడు. ఆఖరికి తన కొడుకు అంత్యక్రియలు తన ఇంటి సమీపంలోనే జరిగాయని, క్యారంటైన్లో ఉండాల్సి వస్తుందన్న భయంతో హాజరు కాలేకపోయానని వాపోయాడు. (చదవండి: లాక్డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం) -
చైనా కర్కశత్వం.. వారిని పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..!
బీజింగ్: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కోవిడ్ రోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంది. కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షల విధించింది జిన్పింగ్ ప్రభుత్వం. ఈ క్రమంలో కోవిడ్ సోకిన ఓ రోగిని క్రేన్ ద్వారా తీసుకెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు చైనా ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రోగులను పశువలకన్నా హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఆంక్షలు విధించిన ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ భవనంలోని కిటికీలోంచి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాజిక దూరం పాటించే క్రమంలో వైరస్ సోకిన వ్యక్తిని క్రేన్ సాయంతో తీసుకెళ్లారు. ట్విటర్లో ఈ వీడియోను ఇప్పటి వరకు 221వేల మంది వీక్షించారు. 1.8వేల లైకులు వచ్చాయి. చైనాలో కరోనా వైరస్ కట్టడికి జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తోంది జిన్పింగ్ ప్రభుత్వం. కరోనా కేసులు వచ్చిన ప్రాంతంలో కఠిన లాక్డౌన్లు విధిస్తున్నారు. కీలక నగరాల్లో లాక్డౌన్లు విధించటం ద్వారా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉన్నందున చైనా ప్రభుత్వంపై అంతర్జాతీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ తొలిసారి గుర్తించిన వూహాన్ నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 26 నుంచి 30వ తేదీ వరకు లాక్డౌన్ విధించగా.. 8 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. 中国式现代化。【方老师,投稿一个防疫大革命的荒谬视频。一个阳性患者被吊机吊出小区,因为他们不敢进去接,也不想患者的细菌留在地板上,这样能保证最小的接触面积。】 pic.twitter.com/2BM3Afm3V6 — 方舟子 (@fangshimin) October 25, 2022 ఇదీ చదవండి: పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?.. అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్ -
వారెవ్వా.. కరోనా టైంలో పుట్టిన ఆలోచనే ఫ్యాషన్గా! (ఫొటోలు)
-
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు!
వాషింగ్టన్: కరోనా ఎంఆర్ఎన్ఏ టీకాలకు తీసుకుంటే 18-39 ఏళ్ల వయసు వారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ ఉందని అమెరికా ఫ్లోరిడా సర్జన్ జనరల్ డా.జోసెఫ్ లడాపో వెల్లడించారు. ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత కేసులపై(సెల్ఫ్ కంట్రోల్డ్ కేసెస్ సిరీస్) పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. టీకాల భద్రతను పరీక్షించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగించడం గమనార్హం. ఎంఆర్ఎన్ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత 18-39ఏళ్ల యువకుల్లో గుండెపోటు, ఇతర హృదయ సమస్యల కారణంగా మరణం సంభవించే ముప్పు 84శాతం ఉంటుందని ఈ విశ్లేషణలో తేలింది. అగ్ర దేశాలన్నీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లనే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళన కల్గిస్తోంది. అయితే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక ఉపయోగించని ఇతర కరోనా టీకాల వల్ల ఈ ముప్పు లేదని పరిశోధన స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని డా.జోసెఫ్ సూచించారు. ముఖ్యంగా మ్యోకార్డిటిస్, పెరికార్డిటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ల పట్ల అప్రమత్తతో ఉండాలని చెప్పారు. ఏ ఔషధాన్నైనా, వ్యాక్సిన్నైనా అభివృద్ధి చేసేటప్పుడు వాటి భద్రత, సమర్థతపై పరిశోధనలు అత్యంత కీలకమని డా.జోసెఫ్ పేర్కొన్నారు. కరోనా టీకాల వచ్చినప్పుడు ఎన్నో ఆందోళనలు వ్యక్తమయ్యాయని, కానీ వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించలేదన్నారు. ఇప్పుడు నిర్వహించిన కీలక అధ్యయనం తర్వాతైనా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అయితే భారత్లో ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఉపయోగించిన టీకాలు వినియోగంలో లేవు. సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కరోనా టీకాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పారేద్దామనుకున్న టికెట్కు 1.6 కోట్లొచ్చాయి -
కరోనా టీకాలపై వివాదం.. కోర్టుకెక్కిన మోడెర్నా..
వాషింగ్టన్: కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాలాడినప్పుడు వ్యాక్సిన్లు సంజీవనిలా మారిన విషయం తెలిసిందే. ఈ టీకాల వల్ల కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి. అయితే తమ టీకా సాంకేతికతను కాపీ కొట్టారాని మోడెర్నా సంస్థ ఆరోపించింది. ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫైజర్, బయోఎన్టెక్ ఏంఆర్ఎన్ఏ సాంకేతికతను ఉపయోగించి తొలి కరోనా టీకాను తయారు చేశాయి. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ హక్కులు తమవని, 2010-2016 మధ్యే దీన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు మోడెర్నా చెబుతోంది. ఈ విషయంపై కోర్టుకెక్కింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే.. ఫైజర్, బయోఎన్టెక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఎన్ఏ అనేది ప్రతి కణం ప్రోటీన్ తయారీకి డీఎన్ఏ సూచనలను కలిగి ఉండే జన్యు స్క్రిప్ట్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల తయారీలో ఈ సాంకేతికతనే ఉపయోగించారు. ఈ అధునాతన టెక్నాలజీతో తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చు. చదవండి: లండన్లో గోమాతకు పూజలు.. రిషి సునాక్పై నెటిజెన్ల ప్రశంసలు.. -
మీరు బతికున్నారంటే మోదీ చలవే.. 'డోసు' పెంచిన బిహార్ మంత్రి
పట్నా: ప్రధాని నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తారు బిహార్ మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్. ప్రజలు ఇప్పుడు బతికున్నారంటే అది మోదీ చలవే అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసి, ప్రజలందరికీ ఉచితంగా టీకా డోసులు అందించి అందరి ప్రాణాలను ప్రధాని కాపాడారని పేర్కొన్నారు. ముజఫర్పుర్లో శుక్రవారం ఓ ర్యాలీకి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కరోనా తర్వాత ప్రపంచ దేశాలు ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే చిక్కుకుని ఉంటే, భారత్ మాత్రం వేగంగా ఆర్థిక పురోగతి సాధిస్తోందని రామ్సూరత్ రాయ్ అన్నారు. పొరుగు దేశం పాకిస్థాన్లో పరిస్థితి ఎలా ఉందో టీవీలో చూస్తే అర్థమవుతోందన్నారు. భారత్ మాత్రం శాంతియుతంగా ఉందని తెలిపారు. కరోనా టీకాల క్రెడిట్ మొత్తం మోదీకే ఇస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ये बिहार सरकार में राजस्व मंत्री रामसूरत राय हैं जिनके अनुसार अगर आप ज़िंदा हैं तो इसके लिए प्रधान मंत्री @narendramodi का शुक्रगुज़ार होना चाहिए @ndtvindia pic.twitter.com/MDN3FzZbUr — manish (@manishndtv) July 31, 2022 జులై 17నాటికి దేశంలో 200 కోట్ల కరోనా టీకా డోసులు పంపణీ చేశారు. అంతేకాదు 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దేశంలో ఆదివారం కొత్తగా 19,673 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 39 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,43,676 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 204 కోట్ల 25లక్షల 69వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు. చదవండి: ‘ఆ డబ్బులు నావి కావు.. కాలమే సమాధానం చెబుతుంది’ -
డౌట్ లేదు కరోనా పుట్టింది అక్కడే.. తేల్చిన అధ్యయనం
బీజింగ్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దాని మూలలపై తీవ్ర చర్చ జరిగింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందనే ప్రచారమూ జరిగింది. చైనా మాత్రం దీన్ని ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్-19 ఎక్కడ పుట్టిందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా కరోనా మూలాలపై అధ్యయనం చేసిన రెండు నివేదికలు వైరస్ వ్యాప్తి వుహాన్లోనే మొదలైందని స్పష్టం చేశాయి. అయితే ఇది కచ్చితంగా వుహాన్ ల్యాబ్లో పుట్టలేదని, అదే నగరంలోని సీఫుడ్ మార్కెట్ నుంచే దీని వ్యాప్తి మొదలైందని పేర్కొన్నాయి. అడవి జంతువులు, క్షీరదాల విక్రయాలు జరిగే సమయంలో వైరస్ ఉత్పరివర్తనం చెంది మనుషులకు వ్యాపించి ఉంటుందని స్పష్టం చేశాయి. రెండు నివేదికలు అడవిలోని క్షీరదాల్లోనూ సార్స్ కోవ్-2 వైరస్ ఉన్నట్లు వెల్లడించాయి. 2019 నవంబర్ ముందు వరకు సార్స్ కోవ్-2 మనుషులకు వ్యాపించలేదని అధ్యయనం స్పష్టం చేసింది. 2019 డిసెంబర్ 20 నాటికి వెలుగు చూసిన తొలి 8 కరోనా కేసులు వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ ఉన్న పశ్చిమ ప్రాంతంలోనే నమోదయ్యాయని అధ్యయానాలు పేర్కొన్నాయి. చైనాలో వెలుగుచూసిన కరోనా ఆ తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించి అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా 60లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పాయరు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. చదవండి: మంకీపాక్స్ అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్ఓ -
Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్కు కరోనా పాజిటివ్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు కరోనా సోకింది. గత నాలుగు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్కు వెళ్లినట్లు పేర్కొంది. గత నాలుగు రోజులుగా నితీశ్ కుమార్ అనారోగ్యానికి గురైనట్లు ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ ప్రత్యాయ అమృత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: MK Stalin Covid Positive: తమిళనాడు సీఎం స్టాలిన్కు కరోనా.. ట్విటర్ ద్వారా ప్రకటన -
కోవిడ్, మంకీపాక్స్కు తేడా ఏంటి? ఏది ఎక్కువ డేంజర్?
కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో పెనుముప్పు ఎదురవుతోంది. ఈ వ్యాధి ఇప్పటికే 70దేశాలకు పైగా వ్యాపించింది. 16 వేలకుపైగా కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా దీన్ని హెల్త్ ఎమెర్జెన్సీగా ప్రకటించింది. భారత్లోనూ ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో కోవిడ్, మంకీపాక్స్ రెండు వైరస్లకు ఉన్న తేడా ఏంటి? వ్యాధి తీవ్రత విషయంలో ఏది మనిషి ప్రాణాలపై అధిక ప్రభావం చూపిస్తుంది అనే చర్చ మొదలైంది. రెండూ భిన్నం.. కోవిడ్ 19, మంకీపాక్స్ వైరస్లు పూర్తిగా భిన్నం. సార్స్ కోవ్-2 వల్ల కరోనా వస్తుంది. మంకీపాక్స్.. పాక్స్విరిడే కుటుంబంలోని ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందింది. ఇందులో వేరియోలా వైరస్ (మశూచి కారకం), వ్యాక్సినియా వైరస్ (మశూచి వ్యాక్సిన్లో ఉపయోగించేది), కౌపాక్స్ వైరస్లు ఉన్నాయి. సార్స్ కోవ్-2 వైరస్ మనుషుల శ్వాసకోశ వ్యవస్థ ద్వారా లోనికి ప్రవేశించి ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడి చేస్తుంది. మంకీపాక్స్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ రెండింటి మధ్య తేడాను మెరీలాండ్ యూనివర్సిటీ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్ సింపుల్గా తేల్చారు. కోవిడ్ పాము కాటుతో సమానం అయితే.. మంకీపాక్స్ నల్లుల లాంటివని పేర్కొన్నారు. లక్షణాలు ఇలా.. కోవిడ్, మంకీపాక్స్ లక్షణాలు చూడటానికి కాస్త ఒకేలా కన్పించినప్పటికీ రెండింటి మధ్య తీవ్రత విషయంలో చాలా తేడా ఉంటుంది. కరోనా రోగుల్లో జ్వరం, చలి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది, అలసట, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, గొంతులో నొప్పి వంటి లక్షణాలుంటాయి. మంకీపాక్స్ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలుగజేస్తాయి. వ్యాప్తి ఇలా.. కరోనా ఒకరి నుంచి ఒకరికి సులభంగా, వేగంగా వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా, ఒకరు తాకిన వస్తువులను ఇతరులు ముట్టుకోవడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ మాత్రం ప్రధానంగా స్కిన్ టు స్కిన్ (చర్మం చర్మం కలుసుకోవడం) ద్వారా ప్రబలుతుంది. వ్యాధి సోకిన వారు ఉపయోగించిన వస్త్రాలు, దుస్తులను ఇతరులు వాడినా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్ లైంగికంగా సంక్రమిస్తోందని ఇప్పటికే తేలగా.. వ్యాధి విస్తరణకు ఇంకా ఇతర కారణలేమైనా ఉన్నాయా? అని కనుగొనేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్ వ్యాధి.. స్వలింగ సంపర్గం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. చికిత్స ఏంటి? కోవిడ్ మహమ్మారి బారినపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో పరిశోధనల అనంతరం కరోనా వైరస్ నివారణకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో మరణాలు రేటు తగ్గింది. అయితే మంకీపాక్స్ గురించి ప్రపంచదేశాలకు దశాబ్దాలుగా తెలుసు. దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. స్మాల్పాక్స్ (మశూచి) వ్యాక్సిన్నే మంకీపాక్స్ బాధితులకు ఇస్తున్నారు. అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. అయితే కరోనా వ్యాక్సిన్లలా మంకీపాక్స్ వ్యాక్సిన్ను ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేయడం లేదు. డెన్మార్క్కు చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. చదవండి: రాజ్యసభ సీటు కావాలా? గవర్నర్ పదవి కావాలా? రూ.100 కోట్లివ్వు పని అయిపోద్ది..! -
వ్యాక్సిన్ తీసుకుంటే రూ.5 వేల రివార్డు! నిజమెంత..
ఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది కేంద్రం. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్, రాష్ట్రాన్ని బట్టి కొంత మేర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో 199.12 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇదిలా ఉంటే.. వాట్సాప్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 'కోవిడ్-19 టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం రూ.5వేలు రివార్డ్ అందిస్తోంది' అంటూ ఓ సందేశం వాట్సాప్లో వైరల్గా మారింది. ఆ మెసేజ్ హిందీలో ఉంది. అది 'ముఖ్యమైన సమాచారం.. ఎవరైతే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి ప్రధానమంత్రి సంక్షేమ నిధి నుంచి రూ.5వేలు అందుతాయి. ఈ అవకాశం జులై 30 వరకే. ' అని ఉంది. మరోవైపు.. తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలంటూ ఓ లింక్ సైతం ఏర్పాటు చేశారు. एक वायरल मैसेज में दावा किया जा रहा है कि जिन लोगों ने कोविड वैक्सीन लगवा ली है उन्हें एक ऑनलाइन फॉर्म भरने के बाद प्रधानमंत्री जन कल्याण विभाग द्वारा ₹5,000 प्रदान किए जा रहे हैं #PIBFactcheck: ▶️ इस मैसेज का दावा फर्जी है ▶️ कृपया इस फर्जी मैसेज को फॉरवर्ड न करें pic.twitter.com/AV8asQzexu — PIB Fact Check (@PIBFactCheck) July 12, 2022 ఫేక్న్యూస్ను వ్యాప్తి చేయొద్దు.. కరోనా వ్యాక్సిన్పై వాట్సప్లో వైరల్గా మారిన నేపథ్యంలో అది ఫేక్న్యూస్గా పీఐబీ ఫాక్ట్ చెక్ ద్వారా స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దని సూచించింది.' ఈ మెసేజ్ను ఇతరులకు ఫార్వర్డ్ చేసే ముందు అది పూర్తిగా ఫేక్న్యూస్గా మీరు గుర్తుంచుకోవాలి. కరోనా టీకా తీసుకున్నవారికి రూ.5వేలు రివార్డ్ అందుతుందనే వార్త పూర్తిగా తప్పు.' అని పీఐబీ ఫాక్ట్ చెక్ తెలిపింది. అందులో ఉండే లింక్పైన ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని, అలాంటి వాటితో సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది. ఇదీ చదవండి: మంత్రి మహిళను కొట్టాడని వీడియో షేర్ చేసిన బీజేపీ.. 48 గంటలు డెడ్లైన్ -
ఒకరికి కరోనా పాజిటివ్.. లాక్డౌన్లోకి 3 లక్షల మంది!
బీజింగ్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్ ప్రభావిత నగరాలపై లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా.. ఓ చిన్న నగరంలో మంగళవారం ఒకరికి కోవిడ్ పాజిటివ్గా తేలటం వల్ల ఆ నగరం మొత్తం లాక్డౌన్ విధించింది జిన్పింగ్ ప్రభుత్వం. దీంతో 3 లక్షల మందికిపైగా లాక్డౌన్లోకి వెళ్లాల్సి వచ్చింది. హెనాన్ ప్రావిన్స్లోని వుగాంగ్ నగరంలో సోమవారం ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వ్యాధిని అరికట్టేందుకంటూ మూడు రోజుల లాక్డౌన్ విధించారు అధికారులు. నగరంలోని 3,20,000 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలోని ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. అయితే.. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను స్థానిక ప్రభుత్వ సంస్థలు అందిస్తాయని తెలిపారు. మరోవైపు.. అత్యవసర పరిస్థితిలో కారులో వెళ్లేందుకు స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆంక్షల చట్రంలో 25 కోట్ల మంది చైనాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రకాల ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆంక్షల చట్రంలో ఉన్నట్లు జపనీస్ బ్యాంక్ నోమురా వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఆ సంఖ్య రెండింతలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మంగళవారం 347 స్థానిక కేసులు నమోదయ్యాయి. అందులో 80 శాతానికిపైగా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇదీ చూడండి: ప్రమాదకరంగా బీఏ5 వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకుతోంది -
దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 18,257 మందికి పాజిటివ్గా తెేలింది. వైరస్ బారినపడినవారిలో 14,553 మంది కోలుకున్నారు. మరో 42 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,22,651కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,428కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,28,428(0.30 శాతం) యాక్టివ్ కేసులున్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.08శాతంగా నమోదైంది. కరోనా రికవరీ రేటు 98.50శాతంగా ఉంది. మరణాల రేటు 1.20శాతంగా నమోదైంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.76 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మరో 4,32,777 కరోనా పరీక్షలు నిర్వహించారు. -
ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్కు కరోనా
న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహిత అయిన అమర్త్యసేన్కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమర్త్యసేన్ ప్రస్తుతం తన శాంతినికేతన్ నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూలై 1న తన నివాసానికి వచ్చిన అమర్త్యసేన్ కొద్దిరోజులకే అనారోగ్యం బారిన పడ్డారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ మేరకు ఆయన డాక్టర్లను సంప్రదించడంతో వైద్య పరీక్షల్లో కరోనా వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. వాస్తవానికి అమర్త్యసేన్ కోల్కతాలోని పెళ్లికి హాజరు కావల్సి ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది కూడా. ఐతే ప్రస్తుతం ఆ ప్రయాణాలన్ని రద్దయ్యాయి. అమర్త్యసేన్ ప్రస్తుతం తన నివాసంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతని కటుంబం వెల్లడించింది. (చదవండి: యోగి రాయబారం: ‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్కి ఒకేసారి డబుల్ షాక్) -
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మరో 28 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 16,159 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,35,47,809కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,270కి పెరిగింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసుల సంఖ్య 737 పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,15,212 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడినవారిలో 98.53 శాతం మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. మరణాల శాతం 1.21గా నమోదైంది. రోజూవారి పాజిటివిటీ రేటు 3.56శాతం కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.54శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.20 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన 4,54,465 కరోనా పరీక్షలతో కలిపి మొత్తం పరీక్షల సంఖ్య 86.49 కోట్లకు చేరింది. -
విషాదం: కేన్సర్తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి
Assamese Actor Kishor Das Dies At Age 30 After Battle With Cancer: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అస్సామీ నటుడు కిశోర్ దాస్ శనివారం (జులై 2) కన్నుమూశారు. 30 ఏళ్ల కిశోర్ దాస్ కేన్సర్తో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఈ ఏడాది మార్చి నుంచి చెన్నై ఆస్పత్రిలో కేన్సర్ చికిత్స పొందుతున్న కిశోర్ దాస్కు కరోనా సోకినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. కేన్సర్తో పోరాడుతున్న అతనికి కరోనా సోకడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కిశోర్ దాస్ అంత్యక్రియలను చెన్నైలోనే నిర్వహించనున్నారు. కొవిడ్-19 ప్రొటోకాల్ కారణంగా అతని మృతదేహాన్ని అస్సాంలోని కామ్రూప్లో ఉన్న స్వస్థలానికి పంపించట్లేదు. అస్సామీ వినోద పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో కిశోర్ దాస్ ఒకరు. బంధున్, బిధాత, నేదేఖ ఫాగున్ వంటి తదితర అనేక పాపులర్ టీవీ సీరియల్స్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. సీరియల్స్లోనే కాకుండా 300కుపైగా మ్యూజిక్ ఆల్బమ్స్లో నటించి సంగీత ప్రియులకు అభిమాన నటుడిగా మారాడు. 'తురుట్ తురుట్' సాంగ్తో ఓవర్నైట్ స్టార్గా ఎదిగాడు. కిశోర్ చివరిసారిగా జూన్ 24న విడుదలైన 'దాదా తుమీ డస్తో బోర్' చిత్రంలో నటించాడు. కిశోర్ దాస్ 2019లో క్యాండిడ్ యంగ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందాడు. చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! కిశోర్ మృతితో అస్సామీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కిశోర్ అకాల మరణంపై అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి కేశబ్ మహంత ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా 'తీరని లోటు' అంటూ నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు Deeply saddened by the news of young Assamese actor, model and dancer Kishore Das' demise. He lost the battle to Cancer after giving a tough fight. My condolences to the bereaved family. May his soul rest in eternal peace. Om Shanti! pic.twitter.com/CIG1x3FJ6f — Keshab Mahanta (@keshab_mahanta) July 2, 2022 Deeply Saddened to hear about the death of Kishor Das, a very popular actor from Assam. The untimely demise of the actor of such talent is a huge loss to the cultural arena. I extend my deepest condolences to his bereaved family and fans. May his soul rest in Peace. Om shanti! pic.twitter.com/BvoMqejfQ3 — Ajanta Neog (@AjantaNeog) July 2, 2022 -
కమెడియన్కు రెండోసారి కరోనా.. అభిమానులకు క్షమాపణలు
Comedian Vir Das Test Positive For Covid 19 Second Time: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది. బ్రేక్ ఇచ్చినట్టే ఇచ్చి ఒక్కసారిగా విరుచుకుపడుతున్నట్లుగా ఉన్నాయి కొవిడ్ కేసులు. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కత్రీనా కైఫ్తో పాటు పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు, కమెడియన్ వీర్ దాస్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా బుధవారం (జూన్ 15) తెలిపాడు. ఇలా ఆయనకు కరోనా సోకడం ఇది రెండోసారి. ఇదివరకు ఈ ఏడాది జనవరిలో మహమ్మారి బారిన పడ్డాడు. ప్రస్తుతం గుజరాత్లో ఉన్న దాస్.. తన కామెడీ షోలు వాయిదా పడటంతో అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. రాష్ట్రంలో జరగాల్సిన ఈ కామెడీ షోలు తర్వాతి తేదిలలో నిర్వహిస్తారని పేర్కొన్నాడు. 'మీకు కావాలంటే మీ టికెట్లు వాపసు ఇవ్వబడతాయి. క్షమించండి గుజరాత్. నేను ఈ విషయం గురించి చాలా విచారంగా ఉన్నాను. కానీ తర్వలో మిమ్మల్ని లైవ్లో చూడాలని కోరుకుంటున్నాను. మీరు కొత్త తేదిలలో షోకు తిరిగి వస్తారని ఆశిస్తున్నాను.' అని 43 ఏళ్ల వీర్ దాస్ తెలిపాడు. చదవండి:👇 ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ -
దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు ఒక్క రోజు వ్యవధిలో భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల ప్రకారం.. మంగళవారం 4.40 లక్షల మందిని పరీక్షించగా.. 8,822 మందికి వైరస్ సోకినట్లు తేలింది. క్రితం రోజు ఆ సంఖ్య 6,594 గా ఉంది. దీంతో ఒక్క రోజు తేడాలో 33 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఒక్క రోజులో 15 మంది మరణించగా.. ఇప్పటివరకు మొత్తం 5,24 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 98.66 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మరణాల రేటు 1.21 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 195.35 కోట్ల కోవిడ్ టీకాలను కేంద్రం పంపిణీ చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. చదవండి: Agnipath Recruitment Scheme: రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరే వారు తప్పక తెలుసుకోండి -
కోలుకుని బయటపడ్డా... వెంటాడుతున్న కరోనా లక్షణాలు
న్యూఢిల్లీ: కరోనాతో గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్నీ ఎంతలా అతలాకుతలమయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆ కరోనామహమ్మారి నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే కరోనా నుంచి బయటపడి బతికి ఉన్నవారు ఇంకా ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలను ఎదుర్కొంటునే ఉన్నారని లాన్సెట్ మెడికల్ జర్నల్ తన అధ్యయనం తెలిపింది. మరి కొంతమంది కోవిడ్ నుంచి కోలుకుని వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండానే శారీరికంగా, మానసికంగానూ ఆరోగ్యంలో మంచి మెరుగుదల కనిపించిందని వెల్లడించింది. రెండేళ్ల తదనంతరం కొంతమంది మునుపటివలే తమ పనులను చేసుకోగలగడమే కాకుండా తమ రోజువారి పనిలో యథావిధిగా నిమగ్నమవుతున్నారు కూడా. కానీ ఇంకా కొంత మంది ఆ వ్యాధికి సంబంధించిన దుష్ఫలితాలను ఎదుర్కొంటునే ఉన్నారు. భవిష్యత్తులో కోవిడ్కి సంబంధించి పొంచి ఉన్న దీర్ఘకాలిక వ్యాధి లక్షణాల ప్రమాదంపై మరిన్ని పరిశోధనలు చేయడమే కాకుండా మరింత మెరుగైన వైద్యం అందించే దిశగా కృషి చేయాలని తెలిపింది. అంతేగాదు గత రెండేళ్లలో కరోనా నుంచి బయటపడిన వారందరూ సాధారణ జనాభా కంటే చాల తక్కువ ఆరోగ్య స్థితిని కలిగి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. మరోవైపు యూకే అధ్యయనం ప్రకారం ఆస్పత్రిలో చేరిన నలుగురిలో ఒకరు మాత్రమే కోవిడ్ బారిన పడి ఒక ఏడాది తర్వాత పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. కండరాల నొప్పి, శారీరకంగా మందగించడం, నిద్రలేమి, శ్వాస ఆడకపోవడం, అవయవాల పటుత్వం లేకపోవడం, జీవన నాణ్యతలో మార్పులు తదితరాలు సాధారణ దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు. ఏదీఏమైన కరోనాతో ఆసుపత్రిలో చేరిన చాలామంది రోగులు సుమారు ఐదు నెలల నుంచి ఒక ఏడాదిలోపు పరిమిత సంఖ్యలో పూర్తిగా కోలుకోవడం మాత్రం అద్భుతమైనది అని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాచెల్ ఎవాన్స్ చెప్పారు. (చదవండి: Covid 19: ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం) -
Danish Siddiqui: మరణానంతరం భారతీయ ఫొటోగ్రాఫర్కు పులిట్జర్
న్యూఢిల్లీ: భారతీయ ఫొటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖికి రెండోసారి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. మరణానంతరం ఆయనకు ఫీచర్ ఫొటోగ్రఫీ కేటగిరీలో ఈ విశిష్ట గౌరవం విశేషం. డానిష్తో పాటు మరో ముగ్గురు భారతీయులకు సైతం ఈ గౌరవం దక్కింది. ఈ నలుగురికీ భారత్లో కొవిడ్ పరిస్థితుల మీద తీసిన ఫొటోలకే అవార్డులు దక్కడం విశేషం. రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ అయిన డానిష్ సిద్దిఖి.. కిందటి ఏడాది అఫ్గన్ ప్రత్యేక దళాలు-తాలిబన్ల మధ్య ఘర్షణల్లో విధి నిర్వహణలో ఉండగానే తుటాలకు బలైన విషయం తెలిసిందే. పులిట్జర్ ప్రైజ్ 2022 విజేతలను సోమవారం ప్రకటించారు. జర్నలిజం, రచనలు, నాటకం, సంగీతం.. రంగాల్లో పులిట్జర్ ప్రైజ్ను అందిస్తారని తెలిసిందే. డానిష్ సిద్ధిఖితో పాటు అమిత్ దవే, అద్నన్ అబిది, సన్నా ఇర్షద్ మట్టోలకు పురస్కారం ప్రకటించారు. 2018లో రొహింగ్యా శరణార్థ సంక్షోభం మీద తీసిన ఫొటోలకు గానూ అద్నాన్ అబిదితో కలిసి తొలిసారి పులిట్జర్ అందుకున్నారు డానిష్ సిద్ధిఖి. అదే సమయంలో వివిధ కేటగిరీలతో పాటు ఉక్రెయిన్ సంక్షోభం, అమెరికా జనవరి 6 కాపిటోల్ మీద దాడి, అఫ్గన్ గడ్డ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ, ఫ్లోరిడాలో సముద్రతీరంలో సగ భాగం కుప్పకూలిన భవనం లాంటి వాటి మీద కవరేజ్లకు సైతం ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు పులిట్జర్ ప్రైజ్ నిర్వాహకులు. 1917లో కొలంబియా యూనివర్సిటీ నిర్వాహకుడు, ప్రముఖ పాత్రికేయుడు జోసెఫ్ పులిట్జర్ పేరు మీద ఈ గౌరవాన్ని అందిస్తూ వస్తున్నారు. -
వర్క్ఫ్రం హోం వద్దంటే ఎలా?
కరోనా కష్ట కాలం వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం అనేది కామన్ అయిపోయింది. కానీ అంతకు ముందు అత్యవసర పని ఉన్నా, ఆపత్కాలం వచ్చినా ఇంటి నుంచి పని అంటే యాజమన్యాలు ఒప్పుకునేవి కావు. పని జరగడం కంటే పాలసీలే ముఖ్యం అన్నట్టుగా కర్ర పెత్తనం చలాయించేవి. ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించిన విషయాలను ఓ ఉద్యోగి @బౌసర్డేంజర్ యూజర్ నేమ్తో రెడ్డిట్లో షేర్ చేయగా నెట్టింట వైరల్గా మారింది. బౌసర్డేంజర్ అనే రెడ్డిట్ యూజర్ నేమ్ కలిగిన వ్యక్తి అమెరికాలోని ఓ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పని చేసేవాడు. అతడు నివసిస్తున్న ఇంటి నుంచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి కనీసం గంట ప్రయాణం. ఎప్పటిలాగే ఒక రోజు ప్లాంటుకు వెళ్లేందుకు రెడీ అవగా.. బయట దట్టమైన మంచు కురుస్తోంది. కారుతో సహా రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. వర్క్ ఫ్రం హోం చేస్తాను మంచు వల్ల ఆఫీసుకు రాలేకపోతున్న విషయాన్ని వెంటనే ప్లాంటులో తన సూపర్ వైజర్కి ఈమెయిల్ ద్వారా తెలిపాడా ఉద్యోగి.. ఆ మెయిల్లో బయట మంచు తీవ్రంగా కురుస్తోందని, ప్రయాణం చేసేందుకు వీలుగా బయట పరిస్థితులు లేవని, కాబట్టి ఈ రోజు నేను ప్లాంటుకు వచ్చి స్వయంగా చేయదగ్గ పనులు కూడా లేనందున వర్క్ ఫ్రం హోంకి అనుమతి ఇవ్వాలని కోరాడు. తనకు అప్పగించిన పేపర్ వర్క్ని ఇంటి దగ్గరే ఉంటూ ల్యాప్ట్యాప్లో పూర్తి చేసి పంపిస్తానంటూ వివరించాడు. మన పాలసీ అది కాదు ఉద్యోగి నుంచి వచ్చిన ఈమెయిల్కి సూపర్వైజర్ స్పందిస్తూ.. ఒక ఉద్యోగిగా ఆఫీస్కు రావడం నీ బాధ్యత, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పని చేస్తామంటూ కుదరదు. ఆఫీసుకు వస్తున్నందుకే నీకు జీతం చెల్లిస్తోంది. కంపెనీ పాలసీ ఇదే విషయం చెబుతుంది. ఏదో కారణం చెప్పి ఆఫీసుకు రానంటే ఎలా.. అయినా నీవు చెప్పినంత దారుణంగా బయట పరిస్థితులు లేవు. నేను ఆఫీసులోనే ఉన్నారు. నువ్వు రావడమే మంచిది. నీకు రావడం వీలు కాని పక్షంలో నిరంభ్యతరంగా సెలవు తీసుకోవచ్చు. కానీ వర్క్ ఫ్రం హోం చేస్తానంటూ కోరడం సంస్థ పాలసీలకు విరుద్ధం. కాబట్టి నీ రిక్వెస్ట్ను ఆమోదించడం లేదంటూ బదులిచ్చాడు. చేయగలిగిందేం లేదు సూపర్వైజర్ వర్క్ ఫ్రం హోంకి అంగీకరించకపోవడంతో... వెంటనే బటయకు వచ్చి చూస్తే ఊహించనదాని కంటే మంచు ఎక్కువగా ఉంది. అతి కష్టం మీద సమీపంలో ఉన్న స్టోరుకి వెళ్లి మంచును తొలగించే వస్తువులను తీసుకుని వచ్చి ఇంటి ప్రాంగణం శుభ్రం చేసుకునే పనిలో మునిగిపోయాడు. ఆ తర్వాత మంచు కురిసే సమయంలో వేడివేడి స్నాక్స్ తింటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇంటి దగ్గరయినా పని చేయ్ ప్లీజ్ ఇంతలో సూపర్ వైజర్ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఆఫీసకు వస్తున్నావా ? లేదా అంటూ ప్రశ్నించాడు. దానికి బదులుగా ‘ బయట మంచు ఎక్కువగా ఉంది. నేను సంస్థ పాలసీ రూల్స్ను పాటిస్తూ ఈ రోజు సెలవు తీసుకున్నాను. కాబట్టి ఆఫీసుకు రావరడం లేదంటూ బదులిచ్చాడు. వెంటనే ఆఫీసుకు రానక్కర్లేదు అర్జంటుగా చేయాల్సిన పేపర్ వర్క్ ఉంది. నువ్వు ఇంటి దగ్గరి నుంచైనా ఆ పని చేసి త్వరగా పంపించు అంటూ రిక్వెస్ట్ చేశాడా సూపర్వైజర్. ఇప్పుడు పాలసీలో భాగం పై అధికారి కోరినట్టు సంస్థ అవసరాలకు తగ్గట్టుగా సెలవు రోజున కూడా ఇంటి దగ్గర పని చేసినట్టు ఆ ఉద్యోగి తెలిపాడు. ఈ ఘటన 2018లో జరిగింది. కరోనాకి ముందు వర్క్ ఫ్రం హోం అంటే యజమాన్యాలు సహించేవి కావు. ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటారనే అపోహా ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వర్క్ ఫ్రం హోం అనేది కామన్గా మారింది. చాలా సంస్థలు ఇప్పడు వర్క్ ఫ్రంహోంను తమ పాలసీలో భాగంగా చేశాయి. కేవలం రెండేళ్లలోనే ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. చదవండి: ఐటీ కంపెనీ 'యాక్షన్ స్టెప్' బంపరాఫర్, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోవచ్చు! -
'వర్క్ ఫ్రమ్ హోమ్'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే!
చైనాలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. 2019 తరువాత మళ్లీ తీవ్రస్థాయిలో విలయ తాండవం చేస్తోంది.దాన్ని కట్టడి చేసేందుకు చైనా ప్రభ్వుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రముఖులుండే బీజింగ్ నగరంలోని అన్నీ రెస్టారెంట్లపై ఆంక్షలు విధించింది. థీమ్ పార్క్ యూనివర్సల్ స్టూడియోను షట్ డౌన్ చేసింది. గత తొమ్మిది రోజుల్లో 350 కేసులు నమోదు కావడంతో జిన్ పింగ్ ప్రభుత్వం బీజింగ్ ప్రజలపై ఆంక్షలు విధించింది. షాంఘై తరహాలో..బీజింగ్లో కరోనా కేసులు నమోదైన భవనాలు, గృహాల్లో నివాసం ఉంటున్న ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హాలిడేస్ కావడంతో జిమ్లు, థియేటర్లను సైతం స్థానిక అధికారులు మూసివేశారు. గ్రేట్ వాల్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించే సందర్శకులు గడిచిన 48 గంటలలోపు కోవిడ్ రిపోర్ట్ను చూపించాల్సి ఉండగా..ఇప్పుడు చైనాలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో భారత వ్యాపార వేత్త హర్ష గోయెంకా సెటైరికల్గా స్పందించారు. I asked my Guru “What is discipline?” He replied “When you are tired, lazy and do not have a single reason to wake up from that cozy bed in the morning and go for work, there comes a small voice from deep inside your heart to let up and push forward. That voice is discipline!” — Harsh Goenka (@hvgoenka) April 30, 2022 'చైనాలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని నేను హర్షానంద స్వామిని అడిగాను. వైరస్ అలసిపోయింది. అందుకే వర్క్ ఫ్రమ్ హోం చేయాలనుకుంటుంది. అని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు, కరోనా (చైనాను మినహాఇస్తే) తగ్గడంతో ఇన్నిరోజులు వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇంటికే పరిమితమైన ఉద్యోగులు.. ఇప్పుడు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. పై అంశాలనే ప్రస్తావిస్తూ హర్ష్ గోయాంక్ సరదా ట్వీట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి👉 అరెభాయ్.. బయటకురా.. వర్క్ ఫ్రం హోంపై ప్రముఖ ఇండస్ట్రియలిస్టు స్పందన