కరోనాతో కొడుకు మృతి, ఆగిన తల్లిదండ్రుల ఊపిరి | Three Members Of The Same Family Died Due To Corona In Medchal District | Sakshi
Sakshi News home page

కరోనాతో కొడుకు మృతి, ఆగిన తల్లిదండ్రుల ఊపిరి

Published Mon, May 10 2021 12:08 PM | Last Updated on Mon, May 10 2021 3:59 PM

Three Members Of The Same Family Died Due To Corona In Medchal District - Sakshi

జవహర్‌నగర్‌ పరిధి వంపుగూడలో విషాదం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కరోనాతో చికిత్స పొందుతూ నిన్న హరీష్‌రెడ్డి(31) మరణించగా, కుమారుడు మృతిని తట్టుకోలేక సోమవారం గుండెపోటుతో తల్లిదండ్రులు మృతి చెందారు.

సాక్షి, మేడ్చల్‌: జవహర్‌నగర్‌ పరిధి వంపుగూడలో విషాదం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కరోనాతో చికిత్స పొందుతూ నిన్న హరీష్‌రెడ్డి (31) మరణించగా, కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రుల గుండె ఆగింది. కుమారుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేని హరీష్‌రెడ్డి తల్లి, తండ్రి ఇద్దరూ సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో బంధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన అందరి మనసులను కలిసివేసింది.

చదవండి: Zero Covid Cases: ఆ ఊరికి కరోనా రాలే..!
లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement