ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ | TSRTC MD VC Sajjanar Gives Clarity On RTC Bus Fare Hike, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ

Published Wed, Jun 12 2024 9:16 PM | Last Updated on Thu, Jun 13 2024 12:06 PM

Tsrtc Md Vc Sajjanar Clarity On Rtc Bus Fare Hike

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ చార్జీల పెంపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ ఆర్టీసీ స్పందించింది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.

సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్‌లోని టోల్‌ సెస్‌ను సంస్థ సవరించింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్‌ను యాజమాన్యం సవరించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని సజ్జనార్‌  ట్వీట్ చేశారు.

టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్‌ హెచ్చరించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement