విషాదం: నిమిషాల వ్యవధిలో భార్యాభర్తలు మృతి.. | Wife And Husband LifeLess In Jangaon District | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని బంధం

Jun 23 2021 9:45 AM | Updated on Jun 23 2021 9:48 AM

Wife And Husband LifeLess In Jangaon District - Sakshi

సాక్షి, పర్వతగిరి(జనగామ): వివాహ బంధంతో ఒక్కటైన వారు కష్టసుఖాలు పంచుకుంటూ జీవనం సాగించారు. చివరకు మృత్యువులోనూ తమనెవరూ విడదీయలేరన్నట్లుగా నిమిషాల తేడాతో కన్నుమూసిన ఘటన ఇది. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన దారం అన్నపూర్ణ(65), దారం కాశయ్య(68) దంపతులు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నా, ఇతర ప్రాంతాల్లో నివనిస్తున్నారు. కాగా, అన్నపూర్ణ కొద్ది రోజులుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. అప్పటి నుంచి భార్యకు అన్నీ తానై కాశయ్య సేవలు చేస్తున్నాడు. ఇంతలోనే అన్నపూర్ణ సోమవారం అర్ధరాత్రి దాటాక అకస్మాత్తుగా మృతి చెందింది.

ఈ విషయం తెలియగానే ఆమె భర్త కాశయ్య సైతం శ్వాస విడిచారు. దీంతో బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పక్షవాతం బారిన పడిన తనకు భర్త సేవ చేస్తుండడాన్ని తట్టుకోలేక అన్నపూర్ణ మనస్తాపంతో మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు కుమారుడు, కుమార్తెలు చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించగా, ఆర్యవైశ్య సంఘం బాధ్యులు దారం పూర్ణచందర్, దారం రాము, దారం వెంకన్న, చిదురాల వేణుగోపాల్, దారం సంతోష్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement