husband and wife
-
Meerpet Case: రోలును తిరగేసి.., పొత్రంతో పొడిచేసి!
సాక్షి, హైదరాబాద్: ‘భార్యను చంపి, ఉడకబెట్టిన’ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ముక్కలు చేశాక..ఉడకబెట్టడానికి కాస్టిక్ సోడాను, ఎముకలను పొడి చేయడానికి రోలు, పొత్రం వినియోగించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి ఓ సినిమాతోపాటు ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ద్వారా లభించిన వీడియోలను చూసి ఈ ప్లాన్ అమలు చేశాడని గుర్తించినట్టు సమాచారం. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇదే పనిలో ఉన్నాడని తేల్చినట్టు తెలిసింది. రాచకొండ పోలీసు కమిషనరేట్లోని మీర్పేట పరిధి జిల్లెలగూడలో జరిగిన వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు ఒక్కో చిక్కుముడి విప్పుతున్నారు. ఆధారాలు సేకరించడానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదిస్తూ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. బయటికెళ్లి సామగ్రి కొనుక్కొచ్చి.. ఈ నెల 14న రాత్రి గొడవ జరగడంతో గురుమూర్తి మాధవి తలను బలంగా గోడకేసి కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, కాసేపటికే మరణించింది. గురుమూర్తి మరుసటి రోజున ఐదుసార్లు ఇంట్లోంచి బయటికి వెళ్లి వచి్చనట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అలా వెళ్లి వస్తూ మాంసం కొట్టే మొద్దు, కత్తి, కాస్టిక్ సోడా, కొత్త వాటర్ హీటర్ కొనుక్కువచి్చనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని బాత్రూమ్లోకి లాక్కుపోయిన గురుమూర్తి..అక్కడే మాంసం కొట్టే మొద్దుపై కత్తితో ముక్కలు చేశాడు. పెద్ద బకెట్లో హీటర్ పెట్టి నీళ్లు మరిగిన తర్వాత ముక్కల్ని అందులో వేశాడు. మాంసం పూర్తిగా ఉడికిపోయి విడిపోవడానికి అందులో కాస్టిక్ సోడా కలిపి ఉంటాడని.. ఉడికిపోయాక కమోడ్లో వేసి ఫ్లష్ చేసి ఉంటాడని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. ఇక ఎముకలను స్టవ్ మీద పెట్టి కాల్చి..తర్వాత రోలుపై పెట్టి పొత్రంతో కొట్టి పొడిగా మార్చాడని పోలీసులు నిర్ధారించినట్టు తెలిసింది. తర్వాత ఎముకల పొడి, కత్తిని జిల్లెలగూడ చెరువులో పారేసినట్టు సమాచారం.మృతదేహాన్ని మాయం చేయడం పూర్తయ్యాక ఆధారాలేవీ చిక్కకుండా రోలు, పొత్రం, మొద్దును, బాత్రూమ్ను పలుమార్లు కడిగేశాడని...పదే పదే నీటిని ఫ్లష్ చేస్తూ డ్రైనేజీలోనూ ఎలాంటి ఆనవాళ్లు మిగలకుండా చేశాడని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అయితే ఫోరెన్సిక్ నిపుణులు స్టవ్పై చిన్న మాంసం ముక్క, వెంట్రుకలతోపాటు మాధవి తలను గోడకు కొట్టిన చోట రక్తపు మరకల్ని గుర్తించారని..డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారని సమాచారం. -
భర్తతో కలిసి ఉండకపోతే భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్త నుంచి విడాకులు తీసుకోకుండా విడిగా ఉంటున్న మహిళ అతడి నుంచి భరణం పొందడానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భర్తతో కలిసి ఉండలేకపోవడానికి తగిన కారణం ఉంటే భరణం కోరవచ్చని వెల్లడించింది. జార్ఖండ్కు చెందిన యువతి, యువకుడికి 2014 మే 1వ తేదీన పెళ్లి జరిగిది. 2015 ఆగస్టులో వారు విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు. చివరకు ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టుకు చేరింది. వారిద్దరూ కలిసి ఉండొచ్చని, వివాహ సంబంధం ఎప్పటిలాగే కొనసాగించవచ్చని సూచిస్తూ ఫ్యామిలీ కోర్టు 2022 మార్చి 23న డిక్రీ జారీ చేసింది. అయితే, భార్య ఈ డిక్రీకి కట్టుబడి ఉండలేదు. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెకు నెలకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ దేశాలను భర్త జార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశాడు. భార్య తన వద్దకు తిరిగి రాలేదు కాబట్టి భరణం చెల్లించే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు. అతడి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. భర్తతో కలిసి ఉండకపోయినా భార్య భరణం పొందవచ్చని తేల్చిచెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం పొందడం భార్య హక్కు అని గుర్తుచేసింది. -
సందేహాలను నివృత్తి చేసే.. దుల్హా–దుల్హన్
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..! టోలిచౌకి బాల్రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ.. హోమ్ మేనేజ్మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.మంచి స్పందన మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్లైన్ క్లాస్లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం. – ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటు.. ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. -
‘పెళ్లాం చెబితే వినాలి'.. ఇది పుష్పగాడి మాటే కాదు..
‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని తాజాగా విడుదలైన ‘పుష్ప2’ ట్రైలర్లో హీరో అంటాడు. సానుకూల వివాహ అనుబంధంలో భార్య మాటకు విలువ ఇవ్వడం కుటుంబానికి మంచిది అంటారు నిపుణులు. ‘భార్య మాట వినే భర్త’ను లొంగుబాటుగా చెప్పే పితృస్వామ్య పరంపర ఉన్నా దాని వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు.కుటుంబ జీవనంలో కీలక నిర్ణయాలే కాదు మంచీ చెడూల్లో భార్య సలహా వినదగ్గది. కొన్ని పరిశీలనలు. ఒక వివాహబంధం విజయవంతం కావాలంటే ముందు వినడం నేర్చుకోవాలి’ అంటున్నారు ప్రవర్తనా నిపుణులు. ‘భార్యాభర్తలు మొదట ఎదుటి వారు ఏం చెప్తున్నారనేది ఓపిగ్గా వింటే చాలు ఆ బంధం సగం సఫలమైనట్టే’ అని వారు అంటున్నారు. మన సమాజంలో భార్య మాట వినే భర్త గురించి పరిహాసం ఆడటం ఉంది. ‘భార్యా విధేయుడు’ అంటూ గేలి చేసేవారు కూడా ఉంటారు. సమాజం ఇంత ముందడుగు వేసినా ‘భార్య మాట వినడంలో తప్పు ఏముంది’ అని ఆలోచించే పరిస్థితి లేదు. అమెరికాలో కొత్తగా పెళ్లయిన దాదాపు 130 జంటలను పరిశీలించిన ఒక జాన్ గోట్మ్యాన్ అనే సైకాలజిస్ట్ ‘భార్య చెప్పేది సానుకూలంగా వినే భర్త ఉన్న జంటలు సంతోషంగా గడపడం’ గమనించాడు. ‘అలాగని ఈ జంటల్లో భర్త మాట భార్య వినకపోవడం అంటూ లేదు. వారు ఎలాగూ వింటారు’ అంటాడు గోట్ మ్యాన్. భారతీయ సమాజంలో భర్తకు ఎదురు నిలవడం అందరు భార్యలు చేయరు. అయితే జోక్గానో, గొణుగుతున్నట్టుగానో, అనునయంగానో చెప్పే భార్యలు ఉంటారు. ‘అలాంటి భార్యలు చెప్పింది విని ముందుకు సాగే భర్త ఉన్న జంటలు కూడా ఇంచుమించు గొడవలు లేకుండా ఉంటున్నాయి’ అంటాడు గోట్మ్యాన్. భార్యాభర్తల్లో ‘అతను చెప్పేది ఏముందిలే’ అని భార్య అనుకున్నా ‘ఆమెకేం తెలుసు ఆమె ముఖం’ అని భర్త అనుకున్నా ఆ వివాహబంధం ప్రమాదంలో పడుతుంది. ఏ వివాహ బంధమైనా ఒకరి దృష్టికోణం నుంచి నడవదు. కాపురంలో తల్లి తరపు వాళ్లు, తండ్రి తరుపు వారు ఉంటారు. స్నేహితులు ఉంటారు. ఇద్దరి వేరు వేరు కెరీర్లు ఉంటాయి. అంటే ఒక సమస్యకు కచ్చితంగా కనీసం రెండు దృష్టికోణాలుంటాయి. భర్తలు కేవలం తమ దృష్టికోణమే సరైనది అనుకోకూడదు. ‘స్త్రీలు జాగ్రత్తగా అన్నీ గమనించి భర్తకు సూచనలు చేస్తారు. ఆ సూచనలను భర్త ఆమెతో చర్చించాలి. నా మాటే నెగ్గాలి అని తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం ఇద్దరికీ వస్తుంది’ అంటాడు గోట్మ్యాన్.భర్త తన స్పందన, అప్పులు, ఇచ్చిన హామీలు, కొన్న/కొనబోయే ఆస్తులు, పిల్లల కోసం పొదుపు, ఆరోగ్య విషయాలు... ఇవన్నీ భార్యకు తెలియచేస్తూ ఆమె సలహాను వినాల్సి ఉంటుంది. అలాగే భర్త ఇంట్లో లేనప్పుడు పిల్లల ప్రవర్తన, వారి కదలికలు, బంధువుల రాకపోకలు వచ్చే డిమాండ్లు ఇవన్నీ భార్య తప్పకుండా భర్తకు చేరవేయాలి. ముఖ్యంగా పిల్లలను కరెక్ట్ చేయాల్సిన అంశాలు భార్య లేవనెత్తినప్పుడు భర్త నిర్లక్ష్యం చేయరాదు.అవి సమస్యలు తెస్తాయి. అందుకే గతంలో స్త్రీల మాట చెల్లుబాటయ్యే సందేశం ఇస్తూ ‘పెళ్లాం చెబితే వినాలి’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ‘ఫైర్’లాంటి పుష్ప కూడా ‘పెళ్లాం మాట వినాలి’ అంటున్నాడు. భార్య సరైన సలహా ఇస్తే దానిని ఎందుకు వినకూడదు చెప్పండి? (చదవండి: హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!) -
మంచానపడ్డవాణ్ని మామూలు మనిషిని చేస్తే.. మరో పెళ్లి చేసుకున్నాడు!
బొమ్మనహళ్లి: కష్టసుఖాలలో భర్తకు వెన్నంటి ఉండేది భార్య, భర్తకు ఏ కష్టం వచ్చినా తోడుండి ఊరడిస్తుంది. అదే రీతిలో భర్త తీవ్ర అనారోగ్యంగా ఉన్న సమయంలో అతనిని కళ్ళలో పెట్టుకొని చూసుకొన్న భార్యను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్న సంఘటణ మంగళూరులో జరిగింది. వివరాలు.. స్థానిక యువతి సయాజ్ సైజ్వాని అనే యువతికి, మలేషియాలో నివాసం ఉంటున్న వ్యక్తితో 2016లో పెళ్లయింది. రెండేళ్ల తరువాత ఓ ప్రమాదంలో అతనికి పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు.ఈ సమయంలో సైజ్వాని భర్తకు సహాయంగా నిలిచింది. అన్నం తినిపించ డం, మందులు ఇవ్వడం తదితరాల సేవలు చేసే ది. భార్య చేసిన సేవల వలన పూర్తిగా కోలుకున్న భర్త అసలు బుద్ధిని చూపించాడు. భార్యకు విడాకులు ఇచ్చిన అతడు మరో మహిళను వివాహం చేసుకొన్నాడు. సైజ్వాని సోషల్ మీడియా ద్వారా తన మాజీ భర్తకు రెండవ పెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా, అతని కథ తెలుసుకున్న నెటిజన్లు బంగారం లాంటి భార్యను వదులుకొని చాలా పెద్ద తప్పు చేశాడని శాపనార్థాలు పెట్టారు. -
పచ్చని సంసారంలో చిచ్చురేపిన మద్యం
నెల్లూరు (క్రైమ్): పచ్చని సంసారంలో మద్యం చిచ్చు రేపింది. ఉరేసుకుని భార్య, రైలు కింద పడి భర్త ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్నగర్లో శనివారం జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. దంపతులు బలవన్మరణం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏం జరిగిందో తెలియక మృతుల కుమారులిద్దరూ అటు ఇటూ తిరుగుతూ ఉండడం చూపరులను కంట తడి పెట్టించింది. ఎన్టీఆర్ నగర్కు చెందిన కె. నాగరాజు(23), సురేఖ (19) నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా రు. వారికి మూడేళ్లు, పదకొండు నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు మార్బుల్స్, టైల్స్ పనులు చేసుకుంటుండగా, సురేఖ మాగుంట లేఅవుట్లోని ఓ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు సంతోషంగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం విచ్ఛిన్నం చేసింది. మద్యానికి బానిసైన నాగరాజు సంపాదించిందతా మద్యానికి ఖర్చు చేయడంతో పాటు అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం సురేఖపై పడింది. ఆమె తాను సంపాదించిన మొత్తంలో కొంత కుటుంబ పోషణకు ఖర్చు చేసి మిగిలిన దాంతో అప్పులు తీర్చింది. పలుమార్లు మద్యం మానేయమని, అప్పులు చేయొద్దని భర్తను ప్రాధేయపడింది. అయినా అతని తీరులో మార్పు రాలేదు. కొద్ది రోజులుగా పుట్టింటికి వెళ్లి నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం నాగరాజు పని నిమిత్తం బయటకు వెళ్లగా సురేఖ తన ఇంట్లోనే ఉరేసుకుంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలు సుకున్న ఆమె తల్లిదండ్రులు గీత, సురేష్ హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకుని ఆమెను కిందకు దించారు. ఆమెను నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సురేఖ మృతి చెందిందని నిర్ధారించారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న నాగరాజు హాస్పిటల్ వద్దకు వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. భార్య లేని జీవితం వ్యర్థమంటూ రోదించాడు. ఇక తాను బతకలేనంటూ అక్కడి నుంచి పరుగున వెళ్లి విజయమహాల్ రైల్వే గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అందరి హృదయాలను కలిచి వేసింది. సురేఖ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఎస్ఐ విజయ్శ్రీనివాస్, నెల్లూరు తహసీల్దార్ హాస్పిటల్కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి దీప్తి ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు ఆత్మహత్య ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త తర్వాత భార్య
బెంగళూరు: ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమంటే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అన్నీ తానై వ్యవహరించడం. కర్నాటకలో ఈ కీలక పోస్టును భర్త తర్వాత భార్య చేపట్టే అరుదైన రికార్డును రజనీష్ గోయల్, శాలినీ రజనీష్ లు దక్కించుకున్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న రజనీష్ గోయల్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా శాలినిని నియమిస్తూ కర్నాటక ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. 1989 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ అయిన శాలిని గ్రామీణాభివృద్ధిలో పీహెచ్డీ చేశారు. మేనేజ్మెంట్, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారికతలపై పలు పుస్తకాలు రచించారు. రజనీష్ దంపతులకంటే ముందు కర్నాటకలో మరో జంట కూడా ప్రధాన కార్యదర్శులుగా పని చేసింది. 20 ఏళ్ల కిందట బి.కె.భట్టాచార్య, ఆయన భార్య థెరెసా భట్టాచార్యలు ఇద్దరూ సీఎస్లుగా చేశారు. -
తుపాకీతో భార్య కాల్చివేత
మండ్య: ఓ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపిన ఘటన కొడగు జిల్లా విరాజపేటె సమీపంలోని బేటోళి గ్రామంలో జరిగింది. బేటోళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు శిల్పా సీతమ్మ (40) అనే మహిళను ఆమె భర్త సి. నాయకండ బోపణ్ణ తుపాకీతో కాల్చి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య చాలా రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి శిల్పా వేరొకరితో ఫోన్లో మాట్లాడుతుండగా, బోపణ్ణ అడ్డు చెప్పాడు. ఈ విషయమై గొడవ జరగడంతో కసితో రగిలిపోయిన బోపణ్ణ శనివారం ఉదయం ఇంట్లోని సింగిల్ బ్యారెల్ తుపాకీతో భార్య శిల్పాపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించింది. శిల్పా సీతమ్మ 2012 నుంచి 2017 వరకు బేటోళి గ్రామ పంచాయతీ సభ్యురాలిగా పనిచేశారు. జిల్లా ఎస్పీ కే.రామరాజన్, విరాజపేటె గ్రామీణ పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలించి నిందితున్ని అరెస్టు చేశారు. కొడగు జిల్లాలో ఇళ్లలో తుపాకులు ఉంచుకోవడం సాధారణం. దీని వల్ల అప్పడప్పుడు తుపాకీ కాల్పుల ఘటనలు జరుగుతూ ఉంటాయి. -
భర్త పెడ్లర్ భార్య ట్రాన్స్పోర్టర్!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేసుకోవచ్చు, నగరంలో విక్రయిస్తున్న భార్యభర్తల దందాకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–నాబ్) అధికారులు చెక్ చెప్పారు. ఈ దంపతులుసహా ఐదుగురిని అరెస్టు చేసి, రూ.4 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్ స్వా«దీనం చేసుకున్నట్లు టీఎస్–నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య బుధవారం వెల్లడించారు. అంబర్పేటకు చెందిన సయ్యద్ ఫైజల్ పెట్స్ విక్రయిస్తుంటాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా మొదలెట్టాడు. ఇతడిపై గతంలో అంబర్పేట, బాలానగర్ ఎక్సైజ్ పోలీసుస్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. కొన్నిసార్లు భార్య ముస్రత్తున్నిస్సా బేగంతో కలిసి ఈ దందా చేయడంతో ఆమె పైనా ఓ కేసు నమోదైంది. జైలుకు వెళ్లివచ్చినా తమ పంథా మార్చుకోలేదు. బెంగళూరుకు చెందిన జునైద్ ఖాన్, డబీర్పుర వాసి మహ్మద్ అబ్రార్, రహ్మత్ ఖాన్లను తమతో కలుపుకున్నారు. జునైద్ డ్రగ్ సరఫరాలో సహకరిస్తుండగా... మిగిలిన ఇద్దరూ నగరంలో కస్టమర్లను గుర్తించేవారు. పోలీసుల నిఘా పెరిగిందని గుర్తించిన సయ్యద్, వారికి చిక్కకుండా ఉండటం కోసం కొత్త పంథా మొదలెట్టాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తూ పెడ్లర్గా మారాడు. కస్టమర్లకు సరఫరా చేయడానికి మస్రత్తున్నిస్సా బేగంను ట్రాన్స్పోర్టర్గా వాడుతున్నాడు. బెంగళూరుకు వెళ్లి వచ్చా... ఇటీవల బెంగళూరు వెళ్లిన ఈ నలుగురు నిందితులు అక్కడ జునైద్ను కలిసి 34 గ్రాముల ఎండీఎంఏ ఖరీదు చేశారు. అనంతరం జునైద్తో కలిసి వారు నగరానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్–నాబ్ అధికారులు బహదూర్పుర పోలీసులతో కలిసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.4 లక్షల విలువైన డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి క్రమం తప్పకుండా డ్రగ్ ఖరీదు చేస్తున్న 19 మంది కస్టమర్లను పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కస్టమర్ల పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడానికి కృషి చేస్తున్నామన్న పోలీసులు వీటిపై సమాచారం తెలిస్తే 87126–71111 నెంబర్కు ఫోన్ చేసి లేదా ( tsnabho& hyd@tspolice. gov. in)కు ఈ–మెయిల్ ద్వారా తెలపాలని కోరారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
వధూవరులిద్దరిది ఒకే నక్షత్రం అయితే వివాహం చేయకూడదా..?
కొత్త ఏడాది నేపథ్యంలో పంచాగ శ్రవణం చేస్తాం. ఈ ఏడాది పెళ్లి ఈడు కొచ్చిన పిల్లలకు పెళ్లి చేయదలచుకున్న తల్లిదండ్రలు వాళ్ల గ్రహస్థితి ఎలా ఉందని తెలుసుకుంటారు. ఎలాంటి వరుడని చేస్తే మంచిది, ఏ నక్షత్రం అయితే బెటర్ అని ముందుగా పంచాగంలో చూసుయకోవడం వంటివి చేస్తారు. తరుచుగా అందరిలో వచ్చే అతిపెద్ద సందేహం.. వధువరులిద్దరిది ఒకే నక్షత్రం అయితే చెయ్యొచ్చా? లేదా?. చేస్తే ఏమవుతుంది? ఏయే నక్షత్రాల వారు చేసుకోకూడదు.. వధూవరులు ఒకే నక్షత్రములు రాశిభేదమున్నను ఏకరాశి అయి ఉండి వేరే నక్షత్రములైయున్నను శుభము. అయితే కొన్ని నక్షత్రాల వద్దకు వచ్చేటప్పటికీ..వధువరులిద్దరిది ఒకే నక్షత్రమైతే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. కొందరికైతే అస్సలు పొసగదు. అందువల్లే నక్షత్రం వారి రాశి ఆధారంగా కొన్ని నక్షత్రాలు ఇరువురి ఒకటే అయినా సమస్య ఉండదు. కొన్ని నక్షత్రాల విషయంలో మాత్రం వివాహం చేసే విషయంలో జాగ్రత్తుతు తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు. ఇంతకీ ఏయే నక్షత్రాలు వధువరులిద్దదరిది ఒకటే అయినా సమస్య ఉండదు? వేటికి సమస్య అంటే.. రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఎనిమిది నక్షత్ర ములలోను వధూవరులు ఏకనక్షత్రము వారైనను వివాహము చేయవచ్చును. అశ్వని, భరణి, ఆశ్లేష, పుబ్బ, స్వాతి, మూల, శతభిషము మధ్యమములు. తక్కిన నక్షత్రములు ఒక్కటైనచో వధూవరులకు హాని కలుగును. 27 నక్షత్రములలో ఏ నక్షత్రము ఏక నక్షత్రము అయినప్పటికీ పాదములు వధూ వరులు ఇరువురుకి వేరువేరుగా ఉన్నచో వివాహం చేయవచ్చు. గ్రహమైత్రి బ్రాహ్మణులకు, క్షత్రియులకు గణకూటమి (దేవ, రాక్షస, మనుష్య గణములు) వైశ్యులకు స్త్రీ దీర్ఘ కూటమి, శూద్రులకు యోని కూటమి (జంతువులు) ప్రధానంగా చూడవలెను. పాయింట్ల పట్టిక చూసినప్పటికీ ఈ కూటములు చూడనిదే ఎటువంటి ప్రయోజనం లేదు. (చదవండి: ఈ కొత్త సంవత్సరం మేష రాశివారికి ఆర్థిక లాభాలు ఉంటాయి) -
భర్త, అత్త వేధింపులతో వివాహిత తీవ్ర నిర్ణయం..! చివరికి..
ఆదిలాబాద్: వివాహిత ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తకు నిర్మల్ న్యాయస్థానం బుధవారం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు సమన్వయల అధికారి సక్రియనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ పట్టణం శాంతినగర్కు చెందిన బైరి లక్ష్మి(25), కడెం మండలం పాతమద్దిపడగ గ్రామానికి చెందిన బైరీ రమేష్కు 23 మే 2013న వివాహమైంది. పెళ్లిలో కట్నంగా లక్ష రూపాయలు, తులం బంగారం, మోటార్ సైకిల్ ఇచ్చారు. పైళ్లెన తర్వాత వీరికి ఓ పాప జన్మిచ్చింది. ఆ తర్వాత బైరి రమేష్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతో గ్రామం వదిలి వెళ్లిపోయాడు. నెల రోజుల తరువాత ఆమెను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బైరి లక్ష్మి, తల్లి కౌసల్య కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. గ్రామ పెద్దలు బైరి రమేష్కు రూ.20వేల జరిమానా విధించారు. కొద్ది రోజుల తర్వాత బైరి రమేష్ భార్యను డబ్బులు నువ్వే కట్టాలని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో లక్ష్మి తల్లి రూ.20వేలు కట్టి నచ్చజెప్పి సంతోషంగా ఉండాలని చెప్పింది. మళ్లీ కొన్ని రోజులకు బైరి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు రూ.50వేలు కట్నం తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో 23 జూలై 2017వ తేదీ రాత్రి 8గంటల ప్రాంతంలో పాతమద్దిపడగ గ్రామ శివారులోని పొద్దుటూరి నరసింహారెడ్డి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి కౌసల్య కడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై రాము కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం అప్పటి డీఎస్పీ మనోహర్రెడ్డికి అప్పగించాడు. డీఎస్పీ కేసు విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరు పరిచాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్రావు 17మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేశాడు. దీంతో వారికి పైవిధంగా శిక్ష విధిస్తూ.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ తీర్పునిచ్చారు. ఇవి చదవండి: ప్రేమోన్మాదికి బెయిల్ రాకుండా చూడాలి.. -
మరో పెళ్లి చేసుకుంటున్నాడని.. భర్త ఇంటి ఎదుటే భార్య?
నిజామాబాద్: అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు తనకు తెలియకుండా మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఓ మహిళ తన భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కామారెడ్డి పట్టణంలోని భవానీనగర్ కాలనీకి చెందిన వడ్ల కార్తీక్కు సిరిసిల్లకు చెందిన శివానితో 2019లో వివాహమైంది. పెళ్లిసమయంలో శివానీ కుటుంబ సభ్యులు కార్తీక్కు రూ.5లక్షల నగదుతోపాటు 15తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా, గర్భిణీగా ఉన్న శివానీని కార్తీక్ ఆమె తల్లిగారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. పాప పుట్టిన తరువాత పెద్ద మనుషుల సమక్షంలో రాజీకుదర్చగా హైదరాబాద్లో కాపురం పెట్టారు. మరో 6 నెలల గడిచిన తరువాత రూ.10 లక్షలు అదనపు కట్నం తేవాలని శివానీని వేధించడం మొదలు పెట్టిన కార్తీక్.. శివానీని మళ్లీ తల్లి గారి ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయాడు. వారి మధ్య గొడవలు పోలీస్స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ క్రమంలో కార్తీక్ మరో పెళ్ళికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకున్న శివాని.. తన మూడేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు, సోదరునితో కలిసి ఆదివారం కామారెడ్డికి వచ్చింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. తమకు కార్తీక్ వచ్చి తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడని శివానీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు కుటుంబాల సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇవి చదవండి: క్యాబ్ డ్రైవర్ది హత్యా? ఆత్మహత్యా? -
భార్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించిన న్యాయస్థానం!
చిక్కడపల్లి: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ సీతయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రజని, జి.బాలకృష్ణ దంపతులు బాగ్లింగంపల్లి అచ్చయ్యనగర్లో నివాసం ఉండేవాడు. బాలకృష్ణ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో 2013 సెప్టెంబర్ 27న రాత్రి తన భార్య రజనిని కత్తితో పొడిచి హత్య చేశాడు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి మూడో అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జె.కవిత వాదోపవాదాల అనంతరం బాలకృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లూరి రామిరెడ్డి వాదనలు వినిపించారు. -
వేధింపులు భరించలేక.. భర్తను హతమార్చిన భార్య
బల్మూర్: మద్యం తాగి నిత్యం వేధిస్తున్న భర్తను కుమారుడితో కలిసి కట్టుకున్న భర్త హతమార్చిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగులలో సోమవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎండి మహమూద్ (45) తాపీమేసీ్త్రగా, భార్య నిరంజన్బీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉండగా కుమార్తె వివాహం జరిగింది. మహమూద్ నిత్యం మద్యం తాగొచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఆదివారం అర్ధరాత్రి కూడా ఘర్షణకు దిగి భార్యపై గొడ్డలితో దాడి చేయగా.. ఆమె ఎదురుతిరిగి కుమారుడు పాషాతో కలిసి అదే గొడ్డలి తీసుకొని కొట్టగా తల, గొంతుకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఖైరున్బీ ఫిర్యాదు మేరకు నిరంజన్బీ, కుమారుడు పాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
భర్తను వదిలేసి చాటింగ్ ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య.. ఆ యువకుడిపై భర్త దాడి!
ఉండవెల్లి: చాటింగ్లో పరిచయం పెంచుకుని, యువకుడితో ఓ వివాహిత భర్తను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో వారు తిరిగి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వివాహిత భర్త, మరో ఆరుగురు వారిని పట్టుకుని చితకబాదిన ఘటన పుల్లూరు టోల్ప్లాజా సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ ఈరన్న తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా కోవెలకుంట్లకు చెందిన ఇంద్రవతి, అయిజకు చెందిన హరీష్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. కాగా ఇంద్రవతికి ఆన్లైన్ చాటింగ్ ద్వారా కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన హరిచరణ్తో పరిచయం పెరిగింది. పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరు ఈ నెల 13వ తేదీన హైదరాబాద్కు పరారయ్యారు. వీరు తిరిగి ఆదివారం కర్నూల్కు వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వివాహిత భర్త హరీష్, ఆరుగురు మిత్రులతో కలిసి పుల్లూరు టోల్ప్లాజా వద్ద వారి వాహనాన్ని అడ్డుకుని కర్రలతో దాడి చేశారు. ఘటనలో హరిచరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని వివాహితను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లగా, హరిచరణ్ను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హరిచరణ్ తండ్రి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర నిర్ణయం! కానీ భర్త?
నల్గొండ: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామంలో ఈ నెల 12న తేదీన జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన భాషపోలు నవీన్(35)ది వ్యవసాయ కుటుంబం. నవీన్కు 14 ఏళ్ల కిందట నిర్మలతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు అక్షిత, దీక్షిత ఉన్నారు. నవీన్, నిర్మల మధ్యన చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడడంతో గత రెండేళ్ల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టగా.. చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడవద్దని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 12న భార్యభర్తలిద్దరు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడ కూడా ఘర్షణ పడ్డారు. క్షణికావేశంలో నిర్మల అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. దీంతో తాను కూడా తాగుతానని నవీన్ అక్కడే ఉన్న గడ్డి మందును తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. నిర్మల సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కోలుకుంటుంది. కాగా నవీన్ మృతదేహానికి గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు అర్వపల్లి ఎస్ఐ బి. అంజిరెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: పెళ్లి చేసుకుంటానని ఇలా చేశాడు. చివరికి యువతి? -
దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం!
న్యూఢిల్లీ: భార్యాభర్తల గొడవలంటే ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఆ గొడవ దెబ్బకు బుధవారం ఏకంగా ఓ అంతర్జాతీయ విమానాన్నే దారి మళ్లించాల్సి వచ్చింది! మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానం ఈ ఘటనకు వేదికైంది. విమానం మ్యూనిచ్ నుంచి బయల్దేరిన కాసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్తది జర్మనీ కాగా భార్యది థాయ్లాండ్. భార్య ఫిర్యాదుతో విమానాన్ని పైలట్ ఢిల్లీ మళ్లించి భర్తను పోలీసులకు అప్పగించారు. అయితే, క్షమాపణలు చెప్పడంతో అతన్ని మరో విమానంలో బ్యాంకాక్ పంపడం కొసమెరుపు! ఇదీ చదవండి: నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ.. -
నా భర్త మృతికి ఆ ఇద్దరే కారణం: నాయని సరిత
విద్యానగర్(కరీంనగర్): ఇటీవల కోర్టు ఆవరణలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న నాయిని శ్రీనివాస్ మృతికి కరీంనగర్ కార్పొరేటర్ గుగ్లిళ్ల జయశ్రీ– శ్రీనివాస్ దంపతులే కారణమని ఆయన భార్య నాయిని సరిత ఆరోపించారు. కరీంనగర్ ప్రెస్భవన్లో బుధవారం మాట్లాడుతూ.. తన భర్త నాయిని శ్రీనివాస్ వద్ద నుంచి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్ ఖర్చుల నిమిత్తం రూ.8.50లక్షలు, మూడున్నర తులాల బంగారం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి ఇమ్మని అడిగితే.. ఇవ్వకపోగా.. తమ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఆ భయంతోనే తన భర్త ఆత్మహత్మ చేసుకున్నాడని వివరించారు. ఈ ఘటనకు కారణమైన కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్పై కరీంనగర్ రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అరెస్టు చేయడం లేదని, మంత్రి గంగుల కమలాకర్ అండతోనే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ డబ్బు, బంగారం ఇప్పించి, కార్పొరేటర్ జయశ్రీ– శ్రీనివాస్ను అరెస్టు చేయాలని కోరారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. -
చీకటి నీడ!..ఒక బాస్ జంటల మధ్య సాగే థ్రిల్లింగ్ కథ!
వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..! ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్ కార్డుపై గోల్డ్ కలర్లోని ‘మానస వెడ్స్ తరుణ్’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్షిప్ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్ యార్. తరుణ్తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం..’ అని ఎంత ఈజీగా చెప్పేసింది. నా మనసులో మానసకు తప్ప మరో మనిషికి చోటు లేదు. కానీ తనెందుకు ఇలా చేసింది! బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించాను. ఆమె పరిచయం, సాన్నిహిత్యం తరువాత నేనొక అనాథనని మరచిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరినని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. బెడ్ పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరి చేరటం లేదు. నాలుగేళ్ల క్రితం నాటి మా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది. ∙∙ చురుకుగా ఉండటం, సమయస్ఫూర్తి, కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం.. చిన్న వయసులోనే.. పేరున్న కంపెనీలో టీమ్ లీడర్గా ఎదగటానికి దోహదపడింది. అది నా రెండో ప్రాజెక్ట్ అనుకుంటా. కొత్తగా ఒక జావా డెవలపర్ అవసరం పడింది. షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసి రిక్రూట్ చేసుకొనే బాధ్యతను నాకు అప్పగించారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ప్రొఫైల్స్ చూస్తే ముగ్గురూ టాలెంటెడ్ అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరినీ నా క్యాబిన్లోకి పంపించమన్నాను. మొదట వచ్చిన అమ్మాయిది.. బంగారు వర్ణం. ఒకసారి చూస్తే ఏ మగాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం. కొన్ని కోడ్స్, ప్రాబ్లెమ్ ఎనాలిసింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేశాక ఎందుకో సంతృప్తి కలగలేదు నాకు. తరువాత వచ్చిన అబ్బాయి ఎన్.ఐ.టి గ్రాడ్యుయేట్. కానీ అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు దోరణి నచ్చక రిజెక్ట్ చేశాను. చివరగా వచ్చింది మానస. చామనఛాయ రంగు దేహం.. ఆ కళ్ళలోని మెరుపు సమ్మోహనంగా ఉంది. ‘గుడ్ మార్నింగ్’ అంటూ సన్నని నవ్వు. అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చక్కిలిగింతలు పెడుతోంది. ఇదేమి వింత! ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపించింది. కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి, మెడ దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకోనివ్వ లేదు. తమాయించుకొని ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ డిస్కస్ చేశా. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలే. ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ముచ్చటేసింది. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని చెప్పాను. ‘థాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఈ జాబ్ నాకు రావటానికి మీరే కారణం. మీ గైడెన్స్లో పనిచెయ్యటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ మెత్తని స్పర్శకు నా నరనరాల్లో వేల వోల్ట్ల విద్యుత్ ప్రవహించిన అనుభూతి. సర్దుకొని ‘బై ద వే.. నీ డేట్ అఫ్ బర్త్ చూశాను. నువ్వే నా కన్నా ఆరు నెలలు పెద్ద. సో నేను నీ బాస్ అయినప్పటికీ మీరు అనొద్దు. నువ్వు అని సింగిలర్ యూస్ చెయ్యి. నో ప్రాబ్లెమ్’ అన్నాను. కళ్ళతోనే నవ్వింది. ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తియ్యని అలజడి మొదలయ్యింది. అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది. తరువాత నుండి ప్రతిరోజు తనను చూడాలనే తహ తహ మొదలయ్యింది. అయితే ఒకటే టీమ్ అయినా ఆఫీస్లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైమ్ అస్సలు ఉండేది కాదు. మీటింగ్స్ కుడా జూమ్లోనే అయ్యేవి. కానీ నాకు మాత్రం రోజుకి ఒక్కసారైనా మానసని చూడాలని, చలాకీగా తను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది. మానస ఇదేమీ గమనించేది కాదు. నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమ పూరిత భావనలు తను కనిపెట్టే అవకాశం అస్సలు లేదు. ‘నువ్వు సిగరెట్లు తగ్గించు. పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి’ అంది ఒక రోజు. ‘ఇంత అందంగా ఉంటావు. ఆఫీస్లో ఇప్పటివరకు ఎవ్వరూ ప్రపోజ్ చెయ్యలేదా నీకు?’ చొరవగా అడిగింది ఇంకో రోజు. ‘నువ్వు మామూలు డ్రెస్లో కంటే జీన్స్.. టీ షర్ట్లో సూపర్ ఉంటావు’ మరో రోజు కాంప్లిమెంట్. ఎప్పుడూ క్యాంటీన్లోనే తినే నాకోసం అప్పుడప్పుడు తన లంచ్ బాక్స్ షేర్ చేసేది. కొద్ది రోజుల్లోనే ఒక స్నేహితురాలిగా దగ్గరయ్యింది. ఆఫీస్ విషయాలు, ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది. ఎప్పుడైనా తను లీవ్ పెడితే ఆ రోజంతా నా మనసు విలవిల్లాడేది. తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన భావన నాలో! నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది. మా ఆఫీస్లో తన లాస్ట్ వర్కింగ్ డేనాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళలోని తడిని చూసి ‘హే.. ఇప్పుడు ఏమైంది? నేను వేరే కంట్రీకి ఏమీ పొవట్లేదు. ఈ సిటీలోనే ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీస్ల మధ్య దూరం పది నిమిషాలే. రెగ్యులర్గా టచ్లో ఉందాం. ఓకే నా’ అంటూ హగ్ చేసుకొంది. ఆ కౌగిలి తను కాజువల్గా ఇచ్చినా అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం క్లాక్, మొబైల్ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను. టైమ్ చూస్తే పది. మానస గురించి ఆలోచిస్తూ లేట్గా పడుకున్నానేమో మెలకువ రాలేదు. మొబైల్ చూస్తే తన నుండే కాల్. ‘హలో.. గుడ్ మార్నింగ్ ’ అన్నాను. నా గొంతులో విషాదం నాకే తెలుస్తోంది. ‘హే గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? కమాన్ క్విక్గా రెడీ అయ్యి బేగంపేట షాపర్స్ స్టాప్కి వచ్చేయ్. చిన్న షాపింగ్. తరుణ్ కూడా వస్తున్నాడు. నువ్వుంటే నాకు బాగుంటుంది’ అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. ఏమనుకుంటుంది ఈ మనిషి అసలు! మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు ఇంత క్యాజువల్గా ఎలా మాట్లాడుతుంది? తరుణ్తో షాపింగ్ చెయ్యటానికి నన్నెందుకు రమ్మంటోంది? వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూస్తే నేను తట్టుకోగలనా! అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్ స్టార్ట్ చేశాను. రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరతో మొదలయ్యింది. కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు. డ్రైవ్ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కొన్నాను. మొదటిసారి తను నా కార్ ఎక్కటానికి కూడా ఇలాంటి వర్షమే కారణం. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి చిన్న ముసురు. నా కార్ దగ్గరికి వెళ్తూ, నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో మానస గుర్తుకు వచ్చింది. స్కూటీ పై ఆఫీస్కి వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించి మొబైల్ తీసి కాల్ చేశా. నేనేం మాట్లాడక ముందే ‘హే.. హౌ అర్ యూ? ఒక్క మెసేజ్ లేదు, కాల్ లేదు. మర్చిపోయావనుకున్నా బేబీ’ అన్నది గారాలు పోతూ. ఆ గొంతులో ఆ చనువుకి నా వొళ్ళు సంతోషంతో పులకరించింది. ‘ఐ యామ్ గుడ్. వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తావు? ఫైవ్ మినిట్స్లో వస్తా. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా’ అన్నాను. ‘థాంక్ గాడ్. క్యాబ్ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్ రావట్లేదు. కమాన్ తొందరగా వచ్చేయ్. నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతోంది. వెయిటింగ్ ఫర్ యూ..’ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించింది నన్ను. రెడ్ కలర్ చుడీదార్ పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కార్లో కూర్చుంది. ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది నాలో. ఎప్పటిలాగానే గలగలా మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాలనే చూస్తున్నా. ‘హే.. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చల్లటి ఐస్క్రీమ్ చప్పరించాలని ఉంది’ అంది. ‘నిజం చెప్పనా! నాకైతే నిన్ను చూస్తూ చిల్డ్ బీర్ కొట్టాలని ఉంది’ అన్నాను. ‘అబ్బా.. నీకెప్పుడూ బోల్డ్ థాట్స్ వస్తాయి.. లెట్స్ డూ ఇట్..’ అంటూ కన్ను గీటింది. తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్ ఫీలింగ్ కలిగింది నాకు. ‘అయితే చలో నా ఫ్లాట్కే పోదాం. ఫ్రిజ్లో ఐస్క్రీమ్, బీర్ రెండూ ఉన్నాయి’ అంటూ నేను కూడా కన్ను గీటాను కావాలని. ‘డన్..’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాల్కనీలో కూర్చొని, వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్ స్కాచ్ని, నేను బడ్వైజర్ని రుచి చూస్తున్నాం. ఎలా మొదలు పెట్టాలో అర్థంకావటం లేదు నాకు. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుంటే భరించలేను. నా గురించి అందరికీ చెపితే ఆ అవమానాన్ని తట్టుకోలేను. బాల్కనీ కుండీల్లో రకరకాల మొక్కలు ఉంటే, వాటివైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానస. బీర్తో పాటు నైట్ క్వీన్ గుబాళింపు ఒక వైపు, మరువం పరిమళం ఇంకో వైపు నాకు మత్తుని కలిగిస్తున్నాయి. ధైర్యం చేసుకొని తన దగ్గరగా వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. అదే మెరుపు. నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా..చప్పున తన భుజాలు పట్టుకొని ముద్దు పెట్టి ‘లవ్ యూ మానసా..’ అన్నాను. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయి నిలుచుంది తను. నా వొంట్లో భయం కలిసిన ఉద్విగ్నత. ‘నీకు ఎందుకు ఇలా అనిపించింది. ఇది కరెక్టేనా?’అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది. ‘కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నీ తోడు కావాలి’ అన్నాను. అంతే లతలా నన్ను పెనవేసుకొని ‘లవ్ యూ టూ డియర్’ అని నా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలయ్యింది. ఎన్నో కబుర్లు, సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ.. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్గా తరుణ్తో నా పెళ్లి అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బేగంపేట్ వచ్చింది. ∙∙ నేను వెళ్లేసరికి వెడ్డింగ్ డ్రెస్ సెలక్షన్లో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ‘తరుణ్.. మీట్ మై బాస్ ఇన్ మై ఫస్ట్ జాబ్. అఫ్కోర్స్ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక్క క్లోజ్ ఫ్రెండ్ అనుకో’ అని నన్ను పరిచయం చేసింది. ఆ మాటకు నా హృదయం భగ్గుమంది. ‘ఎంతకు తెగించావే రాక్షసి. నేను క్లోజ్ ఫ్రెండ్ అంతేనా? ఇంకేమీ కానా? అయినా ఎలా చెపుతావు లే!’అని మనసులో అనుకున్నాను. మొహం మీద బలవంతంగా నవ్వు పులుముకొని ‘హాయ్’ అన్నాను. ఇంకేం మాట్లాడబుద్ధి కాలేదు. వాళ్లిద్దరినీ అలా చూస్తుంటే బాధ, కోపం, కసి, చిరాకు.. మనసంతా చేదుగా అయిపోయింది. మానస లేకుండా నేను అసలు జీవించగలనా! ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఇడియట్ తరుణ్ గాడు? మమ్మల్ని వేరు చెయ్యటానికే పుట్టినట్లున్నాడు. నాకు వాడంటే అసూయ, అసహ్యం రెండూ కలిగాయి. షాపింగ్ అయిపోయింది. వస్తుంటే ‘మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఇది నా నుండి ఇన్విటేషన్’ అన్నాడు తరుణ్. ‘ష్యూర్.. సీ యూ’అని చెప్పి బయట పడ్డాను. మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి. తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది. దేవుడా ఎలాగైనా ఈ పెళ్లి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుడికి మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు. వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నా కళ్ల ముందు అంతా శూన్యం. ఇంత చేసినా ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు. ప్రతిరోజు తన గొంతు వినాలని, తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది. కాల్ చేస్తే జస్ట్ హాయ్, బాయ్ అని రెండు మూడు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేది అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేనో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అది ఎంత కఠినమయినా కచ్చితంగా ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తరువాత ఒక రోజు ఉదయాన్నే ఫోన్ చేసింది మానస. ‘హేయ్.. ఏం చేస్తున్నావ్? మరిచిపోయావా మమ్మల్ని? ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్లట్లేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. వచ్చేయ్ ఇంటికి’ అంది. అడ్రస్ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను. ఎందుకు రమ్మంది? క్యాజువల్గానా లేక ఇంకేదైనా చెప్పటానికా? నాలో అంతులేని ప్రశ్నలు. నేను వెళ్లేసరికి తరుణ్ ఇంకా పోలేదు. రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యంగా ‘అరే చెప్పకుండా వచ్చారు? ముందే చెపితే నేను కూడా లీవ్ పెట్టే వాడిని కదా! ఎనీవే ఆఫ్టర్ నూన్ వచ్చేస్తాను. లంచ్ ముగ్గురం కలిసే చేద్దాం. బాయ్’ అంటూ వెళ్ళిపోయాడు. వీడికి మా ఇద్దరి మీద డౌట్ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను. నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకొని ‘మిస్ యూ బేబీ..’ అంటూ ముద్దు పెట్టింది మానస. నాకు ఏడుపు ఆగలేదు. ‘ఎందుకిలా చేశావ్? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావ్? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా?’ నిలదీశాను. నా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ‘ఇప్పుడేమైంది? నిన్ను దూరం పెట్టను అని చెప్పాగా. నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే’ అంది. ‘మరి అలాంటప్పుడు ఆ తరుణ్గాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు?’ కొంచెం కోపంగా అడిగాను. ‘ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి. చూడు అమృతా.. నాకు నీ ప్రేమ కావాలి. సోషల్ లైఫ్ కావాలి. అలాగే పిల్లలు కూడా కావాలి. అందుకోసం తరుణ్ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు..’ అని చెప్పుకుంటూ పోతోంది. తన నుండి దూరంగా జరిగి ‘ప్రేమంటే రెండు దేహాల కలయిక మాత్రమే కాదు. రెండు మనసుల అపూర్వ సంగమం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. ఇంకో వ్యక్తికి చోటు ఉండదు. కానీ నువ్వు అలా కాదు. నీది నిజమైన ప్రేమ కాదు’ అన్నాను. ‘అమృతా.. ప్లీజ్ అలా అనకు. నన్నర్థం చేసుకో’ నా చేతులు పట్టుకుంటూ అడిగింది. ‘ఒకే జెండర్ అయినా, జెండర్స్ వేరైనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితో రిలేషన్ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అది మానసిక వ్యభిచారం లాంటిదే’ స్థిరంగా చెప్పాను. ‘అమృతా.. చెప్పానుగా.. సమాజం కోసం.. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కోసమే నేను తరుణ్ని పెళ్లి చేసుకుంది. నాకు నువ్వే ప్రాణం’ అంది. ‘నేను నీ ప్రాణమే అయితే నన్నిలా వదిలేసే దానివి కాదు. జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి. నీ కోసం ఎవ్వరినైనా ఎదిరించి బతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు? నీది స్వార్థం. నిజమైన ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది నీ మీద నాకు ఇప్పుడు లేదు. మళ్ళీ నా జీవితంలో ప్రవేశించాలని చూడకు. గుడ్ బై’ అని చెప్పి బయటకు నడిచాను. --మొగలి అనిల్ కుమార్ రెడ్డి (చదవండి: -
తోడొకరుండిన అదే భాగ్యము!
తోడుండటమే పండు జీవితం. ఏడడుగులతో పడే బంధం. ఏడు జన్మలు కొనసాగాలనుకునే బంధం వైవాహిక బంధం. భార్యకు భర్త.. భర్తకు భార్య.. సంసారాన్ని ఈదాక ఏడు పదుల వయసు దాటాక ఒకరికి ఒకరై మరీ మెలగాలి. తమిళనాడులోని ఒక వృద్ధ జంట మధ్యాహ్న భోజనం తయారు చేసుకునే వీడియో పది లక్షల వ్యూస్ పొందింది. రోజులు కొందరికి కలిసి వస్తాయి. పెళ్లయిన నాటి నుంచే భార్య మనసు భర్తకు అర్థమయ్యి, భర్త స్వభావాలు భార్య అకళింపు చేసుకుని కాపురాన్ని కాపాడుకుంటూ వస్తారు. పిల్లల్ని కని, పెద్ద చేసి ఒక దారికి చేరుస్తారు. ఆ తర్వాత? తామిద్దరూ జీవించాలి. ఏం భయం? ఇప్పటికే ఎంతో జీవితం గడిపారు. కష్టసుఖాలు పంచుకున్నారు. అనుబంధాన్ని దృఢం చేసుకున్నారు. పిల్లలు దూరంగా ఉన్నా హాయిగా జీవిస్తారు. అతను కూరగాయలు తెస్తాడు. ఆమె వంట చేస్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్కు వెళ్లి వస్తారు. గుళ్లకు తిరుగుతారు. ఓపికుంటే పర్యటనలు చేస్తారు. నేనున్నానని.. నీకై నిలిచే.. తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము అని రాశాడు శ్రీశ్రీ. తమిళనాడులో ఒక జంట అలాంటిదే. మధ్యతరగతికి చెందిన ఈ జంట ముదిమి వయసులో కలిసి మధ్యాహ్న వంట చేసుకుంటున్న వీడియోను అభిషేక్ చందరమరక్షణ్ అనే ఇన్స్టా యూజర్ పోస్ట్ చేశాడు. తన భార్యతో కలిసి వీడియోలు చేసే అభిషేక్ ఈ వీడియో పోస్ట్ చేస్తూ ‘భవిష్యత్తులో నువ్వూ నేనూ’ అనే క్యాప్షన్ పెట్టాడు. నిజమే.. ఈ వీడియో చూసిన యువ జంటలు ఆ వయసులో తాము అలా ఉంటే ఎంత బాగుంటుంది అని వ్యాఖ్యానించారు. జీవితం పండాలి... అని పెద్దలు అంటారు. పండు వయసులో భార్యకు భర్త; భర్తకు భార్య. (చదవండి: అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!) -
అన్నా చెల్లెళ్ల దారుణ హత్య
తిరుపతి: నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో అన్నా చెల్లెళ్లు దారుణంగా హత్యకు గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అలిపిరి సీఐ అబ్బన్న కథనం మేరకు.. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన యువరాజ్, మనీషా దంపతులకు షక్షీమ్(6), ప్రజ్ఞాన్(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఏడాది నుంచి భర్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో దూరంగా ఉండేవారు. అయితే యువరాజ్ 4 రోజుల కిందట తిరుపతి కి చేరుకుని నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో బస చేశాడు. ఇదే క్రమంలో భార్యకు ఫోన్ చేసి, తిరుపతి కొస్తే మాట్లాడుకుందామని చెప్పా డు. దీంతో మనీషా పిల్లలను తీసుకుని హైదరాబాద్ వర కు రైలులో వచ్చి, అక్కడి నుంచి తన అన్న హర్షవర్దన్తోపాటు విమానంలో తిరుపతికి చేరుకుంది. ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో యువరాజ్ తన భార్య మనీషాతోపాటు ఆమె అన్న హర్షవర్ధన్(25) కూడా దారుణంగా కత్తితో పొడిచి, హత్య చేశాడు. అయితే హత్యకు కారణాలు పలు కోణాల్లో వినిపిస్తున్నాయి. వీరి మధ్య ఆస్తి తగాదాలున్నాయని, యువరాజును హత్య చేస్తే పెద్ద మొత్తంలో ఆస్తి వస్తుందని, అతడిని చంపడానికి వారు తిరుగు తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ క్రమంలోనే యువరాజ్ చంపి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. యువరాజ్ అన్నతో మనీషాకు వివాహేతర సంబంధం ఉండడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు కూడా తెలిసిందని సీఐ చెప్పారు. అయితే నిజాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉందన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చామని, వారు వస్తే నిజాలు బయటపడతాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామన్నారు. -
డ్యాన్స్! నువ్వు చేయకపోతే వేరేవాళ్లతో వెళ్లిపోతా..జాగ్రత్త!
‘ఎంత ఇంజినీర్ అయితే మాత్రం.. విస్తరిలో ప్రాజెక్ట్ కట్టాలా?’ అన్నాడు చందర్. గతి తప్పిన ఆలోచనలతో నా చేయి నా ప్రమేయం లేకుండానే విస్తరిలో అన్నాన్ని ఇష్టమొచ్చినట్టు అక్కడక్కడా చిన్నచిన్న ముద్దలుగా పేర్చింది. ప్రతిదాన్నీ కళాదృష్టితో చూసే చందర్కి ఆ ముద్దలు ఇరిగేషన్ ప్రాజెక్టులా కనిపించడంలో తప్పు లేదనిపించింది. దానికి తోడు విస్తరిలో వడ్డించిన పప్పులో పప్పు కన్నా ఎక్కువున్న నీళ్ళు ఆ ముద్దల మధ్య నుండి ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తున్న తీరు కూడా చందర్ మాటలను సమర్థిస్తున్నట్టుగా ఉంది. ‘అరేయ్.. విజ్జూ..’ అని చందర్ మళ్లీ నా భుజం తట్టడంతో ఊహల్లో నుండి బయటపడ్డ నేను త్వరత్వరగా భోజనం ముగించి అప్పుడే వేసిన పెళ్ళి పందిరి కింద మూలన ఉన్న కుర్చీలో ఒరిగి కూర్చున్నా. చూస్తుండగానే మండుటెండలో కూడా కునుకు పట్టేసింది. నా పక్కన కూర్చుని, పెళ్ళి పందిరి కింద కునుకు తీస్తున్న నాకు నిద్రాభంగం చేస్తూ ‘పొద్దున్నుండి ఎందుకలా ఉన్నావ్?’ అంది నా భార్య శారద. ‘ఏమీ లేదు’ అన్నాన్నేను ఏదో ఉన్నట్టు. ‘ఈ రోజు డాన్స్ చేయాల్సొస్తుందనా!!’ నాకళ్ళల్లోకి చూస్తూ అంది తను. అడ్డంగా తలూపాను ‘కాదు’ అన్నట్టు. వెంటనే ఏదో అర్థం అయినట్టు ‘మన పెళ్ళికి తప్పించుకున్నావ్! మీ చెల్లి పెళ్లికి కూడా నోరు చేసి పక్కకు జరిగావ్. చివరికి నీ కొడుకు మొదటి పుట్టినరోజు.. మీ అమ్మతో నాకు చెప్పించి జారిపోయావ్. కాని రేపు మా తమ్ముడి పెళ్ళి.. ఈరోజు రాత్రి హల్దీలో నేను డాన్స్ చేయాల్సిందే! నేను చేస్తే నువ్వూ నాతో పాటు చేయాలి. ఒకవేళ నువ్ చేయలేదనుకో.. ఆ గుంపులో ఎవడు నా చేయిపట్టుకుని డాన్స్ చేస్తే వాడితో వెళ్ళిపోతా’ అంది శారద నా చెవిలో మెల్లిగా. ఇంతకుముందు అయితే నన్ను డాన్స్ చేయమని అడగడానికి భయపడేది తను. బెదిరిస్తే వింటాడు అనుకుందో లేదా నన్ను బతిమిలాడి విసిగిపోయిందో తెలీదుగాని, నా మనసు చివుక్కుమనేలా మాట్లాడింది ఇప్పుడు. ఏం చెప్పాలో తెలీక ‘సరే’ అన్నాను.. తన కళ్ళల్లోకి చూడకుండా నా కళ్ళల్లో పైకి ఉబికి వస్తున్న నీళ్ళను ఆపుకుంటూ. ఓ రెండు నిమిషాల తర్వాత ‘ఆ అన్నూ కూడా డాన్స్ చేస్తోంది బాబు..’ అంది శారద.. ఫోన్లో ఏదో డాన్స్ వీడియో చూస్తూ. అన్నూ.. నా అక్క కూతురు. తన వయసు రెండు సంవత్సరాలు. రెండు సంవత్సరాల పాపకు చేతనైంది కూడా నీకు చేతగాదా అన్నట్టు ఉన్నాయి శారద చూపులు, మాటలు. నేనేం మాట్లాడలేదు. కొన్నిసార్లు మౌనమే మేలు అనుకుని మౌనంగా ఉండిపోయాను. ఏమీ మాట్లాడకుండా ఉన్నానే గాని, రాత్రి జరగబోయే హల్దీ ఫంక్షన్ గురించిన ఆలోచనలతోనే నా మైండ్ అంతా నిండి పోయింది. ‘ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్లో నేను చేయకున్నా తనొక్కతే డాన్స్ చేస్తుంది. కాని తమ్ముడి పెళ్ళి కాబట్టి ఈసారి నాతో జంటగా చేయాలనుకుని ముచ్చట పడుతోంది. నేను చేస్తే నాతో పాటు చేస్తుంది.. లేకపోతే..’ నా మెదడు ఆ ప్రశ్నను పూర్తిచేయడానికి కూడా ఇష్టపడలేదు. ఉండబట్టలేక, వెంటనే ‘నేను చేయకుంటే ఎవరితో చేస్తావ్?’ అంటూ అడిగాను శారదను. ఓ ఐదుసెకన్ల నిశ్శబ్దం. అడిగానే గాని ఆమె వైపు నేను కూడా చూడలేదు. చూసే ధైర్యం లేదు. తను ఎప్పుడూ నన్ను అనే ‘నువ్వు పిరికివాడివి’ అన్న మాటలు ఇంకోసారి గుర్తొచ్చాయి. ఐదుసెకన్ల తర్వాత ‘నీలాంటి వాడితోనే’ అంది.. ఫోన్లోనే మొహం పెట్టి. ‘నాలా ఉంటాడా!!’ ‘అవును నీలాగే ఉంటాడు. కాని మొహంలో కళ ఉంటుంది. నీలా ఎప్పుడూ ఏదో కొల్పోయిన వాడిలా ఉండడు. నవ్వుతూ ఉంటాడు. నేనేం చెప్పినా కాదనడు.’ ‘నిజమా?’ ‘నీ మీద ఒట్టు బాబు!’ శారద గొంతులో వెటకారం, పెదవులపై ఆపుకుంటున్న నవ్వు. ఆ మాటలతో నేల మీద ఓ కన్నీటి బొట్టు రాలింది. అది నాదే అని నేలతల్లికి కూడా తెలిసినట్టుంది.. ‘నేనైనా నీ పరువు కాపాడుతా’ అన్నట్టు ఓ రెండుసెకన్లలో దాన్ని తనలో కలిపేసుకుని మాయం చేసింది. ‘తమ్ముడితోనా.. ఉహూ అయ్యుండదు.. మరెవరు? ఎప్పుడూ వదినా వదినా అంటూ వెంటతిరిగే కిరణా? అవునేమో.. వాడు డాన్స్ బాగా చేస్తాడు. నాలా కాకుండా అందరితో ఇట్టే కలిసిపోతాడు. మంచి స్టైల్ మెయింటేన్ చేస్తాడు. ఫుల్ పోష్గా కనిపిస్తాడు. అన్నింటికీ మించి నాలా పిసినారి కాడు. ఆడవాళ్ళు ఇష్టపడే అన్ని లక్షణాలు ఉన్నాయి వాడిలో. అయితే మాత్రం నా శారు..’ అంటూ నా మెదడు మళ్ళీ తనకు తానే ప్రశ్నలు వేసుకుంది. తన కుడి చేతితో ఎవరి చేయినో గట్టిగా పట్టుకుంది శారు. నా హృదయం తట్టుకోలేక పోయింది. కాళ్ళు ఒక్కసారిగా వణికాయి. ‘నేను పిరికివాణ్ణి కాదు’ అని నాకు నేను చెప్పుకుని. ధైర్యం తెచ్చుకుని తలకొద్దిగా పైకిలేపేసరికి అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాను. శారు ‘వేరేవాడితో వెళ్ళిపోతా’ అన్న మాటలు నా మనసుని ముక్కలు చేస్తే, బాధతో నాకు నేను వేసుకుంటున్న ప్రశ్నలు నా మెదడుని మొద్దుబార్చేశాయి. వెంటనే ఒక్కసారిగా కళ్ళు మూతలు పడ్డాయి. దానికితోడు అస్పష్టంగా కిరణ్ గొంతు మళ్ళీ ‘వదినా.. వదినా’ అంటూ ఎక్కడో వినిపించడంతో.. ఒక్కసారిగా విచక్షణ జ్ఞానం కోల్పయినట్టయింది. కుర్చీలో ఉన్న నాకు, సినిమాలో లాగా చేయి నేలకు తాకించగానే ఏదో రాయిలాంటి ఆయుధం దొరికింది. అంతే ఒక్కసారిగా పిడికిలి బిగించి.. పళ్లుకొరికి ఉన్న శక్తినంతా కూడదీసుకుని ‘రేయ్..’ అంటూ పైకి లేచి చేతిలో ఉన్న రాయిని విసురుగా విసిరేశాను... బరువుగా కళ్ళు తెరిచేసరికి అంతా చీకటి.. ‘నేను శారుని చూసి బాధపడకూడదని నా కాళ్ళు తీసేశారా?’ అతికష్టం మీద అనగలిగాను. ‘అబ్బబ్బ.. డాన్స్ చేయాల్సొస్తుందని ఇంత నాటకాలెందుకురా?’ అంది నా చెల్లి సోని.. రూమ్లో లైట్వేస్తూ. నా కాలికి చిన్న కట్టు కనిపించింది. ‘ఏంటీ ఇది?’ అని అడిగితే.. ‘ఏంటా? చూడు ఎంత అమాయకుడిలా అడుగుతున్నావో అన్నయ్యా.. బాగా తిని నీ బావమరిది పెళ్ళి పందిరి కింద కుర్చీలో కూర్చుని.. కుంభకర్ణుడిలా నిద్రపోయావా మధ్యాహ్నం అంతా! అదే వింత అనుకుంటే.. ఇంకో వింతలా వదిన చిన్న డాన్స్ చేయమంటే కళ్ళు మూసుకుని దయ్యం పట్టినట్టు ఏదేదో వాగావ్! ఆ తర్వాత ఇదిగో ఈ రాయితో నీ కాలిని నువ్వే పొడుచుకున్నావ్. నీ పిరికితనంతో మా పరువు తీస్తున్నావ్ రా అన్నయ్యా..’ అంటూ రాయి చూపించింది. అందరూ నన్నే నిందిస్తున్నట్టు అనిపించి తట్టుకోలేకపోయాను. అందుకే ‘నేను ఈరోజు డాన్స్ చేయకపోతే మీ వదిన వేరేవాడితో డాన్స్ చేస్తా అందిరా!’ అన్నాను. ‘అవునా.. ఆ అందగాడి పోలికలు కూడా చెప్పి ఉంటుందే!’ ‘అవును.. నీకేలా తెలుసు?’ ఆశ్చర్యపోయాన్నేను. ‘వాడు నాక్కూడా రెండేళ్ళ నుండి తెలుసు. రా చూపిస్తాను ఆ అందగాడిని!’ అంటూ సోని నన్ను మెల్లిగా వాకిట్లోకి తీసుకెళ్ళింది. వాకిలి మొత్తం రంగురంగుల లైట్లతో మెరిసిపోతుంటే.. డీజే పాటలకు బంధువులు అందరూ ఊగిపోతున్నారు. నా కళ్ళు మాత్రం నా శారు కోసం ఆత్రంగా వెతికాయి. నరాలు తెగే ఉత్కంఠలాగా అనిపించింది. అందరి మొహాలకు పసుపు ఉండడంతో శారుని అంతమంది మధ్యలో గుర్తుపట్టలేక పోయాను. ఇంతలో ‘అదిగో వదిన’ అంటూ సోని గుంపు మధ్యలోకి చేయి చూపించింది. ఆ చేయి వెంబడి చూసిన నాకు.. అదిగో అక్కడ కనిపించింది నా శారు. అందరితో కలిసి నవ్వుతూ.. తన తమ్ముడి పెళ్ళికి ఉత్సాహంగా డాన్స్ చేస్తోంది. కానీ నా దృష్టి తను పట్టుకున్న చేయి వైపు మళ్ళింది. తన కుడి చేతితో ఎవరి చేయినో గట్టిగా పట్టుకుంది శారు. నా హృదయం తట్టుకోలేక పోయింది. కాళ్ళు ఒక్కసారిగా వణికాయి. ‘నేను పిరికివాణ్ణి కాదు’ అని నాకు నేను చెప్పుకుని. ధైర్యం తెచ్చుకుని తలకొద్దిగా పైకిలేపేసరికి అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాను. ‘అదిగో ఆ అబ్బాయే.. వదిన డాన్సింగ్ పార్ట్నర్’ అంది సోని నా రెండేళ్ళ కొడుకుని చూపిస్తూ. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్ళు.. నోటి నుండి ‘శారు’ అన్న మాట బయటకొచ్చింది. వినిపించినదానిలా నా వైపు చూసిన శారు ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వు ‘ఇంత అమాయకుడివైతే ఎలా బాబు’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టనిపించింది. (చదవండి: Neeraj Chopra: బంగారు బాలుడు.. మన నీరజ్ చోప్రా) -
నువ్వంటే ప్రాణం ప్రియాంక.. లెటర్ రాసి భర్త బలవన్మరణం
ఏలూరు: భార్యాభర్తల మధ్య వివాదాలు ఒక మనిషి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్య తరఫు బంధువులు, పోలీసుల వేధింపులు భరించలేక మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి, బంధువులు ఆరోపించారు. దెందులూరు గ్రామానికి చెందిన చెక్క రామ్ప్రసాద్ కుమారుడు చెక్క తేజ మూర్తి (26) సోమవారం తెల్లవారుజామున దెందులూరులో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద సూసైడ్ నోట్ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తేజమూర్తి తల్లి ధర్మ రత్నమాల, పెదనాన్నలు మానేపల్లి ఉదయ్భాస్కర్, మానేపల్లి మురళీ, బావమరిది చలంచెర్ల సత్యకిషోర్ సోమవారం మధ్యాహ్నం దెందులూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు ఆరోపణలు చేశారు. మూడు నెలల క్రితం ఏలూరుకు చెందిన ప్రియాంకతో తేజమూర్తికి వివాహం జరిగిందని, వారిద్దరూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత నెల 26న ప్రియాంక ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో భర్త తేజమూర్తిపై ఫిర్యాదు చేసింది. పెద్దలు మాట్లాడినా, నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ప్రియాంక అంగీకరించలేదని తెలిపారు. విచారణ పేరుతో సీఐ రాజశేఖర్ వేధించారని ఆరోపించారు. కేసు పరిష్కారానికి నెల గడువు ఇవ్వమని అడిగినా తమ మాట వినలేదని వాపోయారు. ఈ మానసిక ఒత్తిడితోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తేజ తల్లి, బంధువులు ఆరోపించారు. సూసైడ్ నోట్లో నిన్ను ప్రేమించానని.. జరగనిది జరిగినటు్ల్ నిందలు వేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని భార్యనుద్దేశించి తేజమూర్తి పేర్కొన్నాడు. తన మృతికి ప్రియాంక తండ్రి తవ్వ సత్యనారాయణ, అక్క సౌజన్య, మావయ్య సురేష్ కారణమని రాశాడు. తనకు తగిన న్యాయం చేసే వరకు పోరాడాలని బంధువులను కోరాడు. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. ఈ సంఘటనలో తేజ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తేజమూర్తి మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి పంపించారు. కేసును రైల్వే ఎస్సై డీ.నర్సింహరావు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నాం ఏలూరు టౌన్: తేజ మూర్తి ఆత్మహత్య ఘటనలో వన్టౌన్ సీఐపై ఆరోపణలు వచ్చాయని.. వాస్తవాలపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని, అసత్య ప్రచారాలు చేయవద్దని ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు తెలిపారు. తేజమూర్తి భార్య ఫిర్యాదు మేరకు సీఐ ఇరు పక్షాల కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారని తెలిపారు. సూసైడ్ నోట్లో మృతుడు సీఐ తనను వేధించినట్లు చెప్పలేదన్నారు. చట్టం మేరకే సీఐ విచారణ చేశారని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భూమి ఆక్రమిస్తున్నారని..
నర్మెట: తమ పట్టాభూమి ఆక్రమణకు గురవుతోందని మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దంపతులు పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసు కోవడం కలకలం రేపింది. జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండతండాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాలో ఇరువర్గాల మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. 257, 258, 259, 263 సర్వే నంబర్లలో అసైన్డ్ భూమి తో పాటు పట్టాభూమి ఉంది. ఇందులో భూక్య ఈర్యా, మేగ్యా, కిష్ట, మోహిలా సోదరులకు 258 సర్వే నంబర్లో 12.18 గుంటల పట్టాభూమి ఉంది. వీరికి 12 మంది వారసులు ఉన్నారు. మరోవర్గంలో భూక్యా పాపా వారసులు చంద్రు, లక్ష్మా, సకృ, రాములు, జయరాంలకు 257 సర్వేనంబర్ లో పట్టా భూమితో పాటు అసైన్డ్ భూమి ఉంది. కాగా, భూక్య జయరాం.. ఇటీవల హిటాచీతో భూమి చదును చేపట్టడంతో మరో వర్గానికి చెందిన మేగ్యా కుమారుడు భూక్య గురు, జయరాంల మధ్య తగాదా ఏర్పడింది. దీంతో వీరు పోలీసులను ఆశ్రయించగా భూమి సర్వేకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న సర్వే నిర్వహించిన అధికారులు 257, 258 సర్వేనంబర్లకు హద్దులు గుర్తించి, 14న పత్రాలు అందిస్తామని చెప్పి వెళ్లినట్లు సమాచారం. అనంతరం ఈ భూమిని పరిశీలించిన పోలీసులు సర్వే రిపో ర్టులు వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని చెప్పినా, జయరాం 258 సర్వేనంబర్లో హిటాచీతో భూమి చదును చేయించాడు. దీంతో తమకు న్యాయం జరగదని ఆందోళనకు గురైన భూక్య గురు, సునీత దంపతులు పురుగు మందుతాగడంతో అది గమనించిన తండావాసులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు వీరికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ దేవేందర్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. -
పిల్లలను హతమార్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దంపతుల ఆత్మహత్య
మచిలీపట్నంటౌన్: బందరుకోటలో విషాదఛాయలు అలముకున్నాయి. నగరంలోని 21వ డివిజన్ బందరుకోటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండు వీరార్జున వినయ్ (కన్నా) తో పాటు కుటుంబ సభ్యుల మృతదేహాలు శనివారం స్వస్థలానికి చేరుకున్నాయి. కన్నా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల నుంచి భార్య, ఇద్దరి కుమార్తెలతో బెంగళూరులో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం కన్నా భార్య హైమావతి తల్లిదండ్రులు.. ఆమెకు ఫోన్ చేస్తున్నా తీయలేదు. అనుమానం వచ్చిన వారు బెంగళూరులో కుమార్తె ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా లోపలి నుంచి దుర్వాసన వస్తుండటంతో సమీపంలోని కడిగోడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యభర్తలతో పాటు పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. పిల్లలను హతమార్చి తరువాత భార్యభర్తలు ఉరివేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే ఘటనకు పాల్పడ్డారనే చర్చ జరుగుతోంది. వీరికి రెండేళ్ల వయసున్న హనీ, ఎనిమిది నెలల వయసున్న కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని కడిగోడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనపై కడిగోడి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి..
సాక్షి, హైదరాబాద్: తనని మోడల్గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఓ మహిళకు బ్యూటీ పార్లర్ షాక్ ఇచ్చింది. పొడవాటి కురుల కోసం ప్రయత్నించి ఉన్న జుట్టును పొగొట్టుకుంది. అందం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ అబిడ్స్లోని బ్యూటీ పార్లర్కి వెళ్లింది. జుట్టును అందంగా చేస్తానని చెప్పిన బ్యూటిషియన్.. ముందుగా మహిళ హెయిర్ కొంచెం కట్ చేసింది. బాధిత మహిళ అభ్యంతరం చెబుతున్నా విన్నకుండా ఏదో హెయిర్ ఆయిల్ కూడా పూసారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ మహిళ జుట్టు మొత్తం ఊడిపోయింది. జుట్టు ఊడిపోయిన భార్యను చూసి భర్త షాక్ అయ్యాడు. అందగా కనిపించాలనుకున్న తన భార్యకు వెంట్రుకలు ఊడిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆలుమగల మధ్య చిచ్చు పెట్టిన బ్యూటీ పార్లర్పై బాధితురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊడిపోయిన జుట్టును పట్టుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి.. బ్యూటీ పార్లర్ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, హెయిర్ కలర్ కోసం అబిడ్స్లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్కి వచ్చాను. స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని నా హెయిర్ మొత్తం కాలిపోయేలా చేసింది. పార్లర్ నిర్వహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతామన్నారు. అది వాడితే పూర్తిగా నా జుట్టు రాలిపోయింది. వాటర్ పెడితే.. దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతుంది. క్వీన్ పార్లర్ను వెంటనే సీజ్ చేయాలి’’ అని ఆమె పేర్కొంది. -
రిమ్జిమ్ గిరే సావన్.. ఒక జంట.. ఒక వాన.. ఒక పాట..
వానొస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? కిటికీలో నుంచి చూస్తారు. బయటకెళ్లకండి అని భార్య అంటుంది. టీ పెట్టమని భర్త అంటాడు. కాని ముంబైకి చెందిన శైలేష్, వందన అనే భార్యాభర్తలు మాత్రం ముంబై రోడ్ల మీద తడవడానికి బయలుదేరారు. ఒకప్పటి‘మంజిల్’ సినిమాలో ‘రిమ్జిమ్ గిరే సావన్’ హిట్ పాటలో ఎలాగైతే అమితాబ్, మౌసమీ చటర్జీ తడుస్తూ తిరిగారో అచ్చు అలాగే తిరిగారు. పాటను షూట్ చేసి వదిలితే వైరలే వైరలు. ఒక జంట. ఒక వాన. ఒక పాట. గతం మళ్లీ వర్తమానం అయ్యింది. నిజ పాత్రలు నటీనటులు అయ్యారు. ముంబై నగర వీధుల్లో ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. చూసిన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆనంద్ మహీంద్ర అంతటి వాడు ట్వీట్ చేసి మెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ లక్షల మంది వీక్షించారు. ఇంతకూ ఏమిటది? రిమ్జిమ్ గిరె సావన్ పాట. రీమేక్ పాట. మంజిల్ సినిమా నుంచి అమితాబ్, మౌసమీ చటర్జీ నటించిన ‘మంజిల్’ (1979) సినిమాకు దర్శకుడు బాసూ చటర్జీ. సినిమా ఓ మోస్తరుగా ఆడినా ‘రిమ్జిమ్ గిరె సావన్’ పాట పెద్ద హిట్. కిశోర్ కుమార్ వెర్షన్, లతా వెర్షన్ ఉంటాయి. లతా వెర్షన్ను బాసూ చటర్జీ నిజమైన వర్షంలో తీయాలనుకున్నాడు. ముంబైలో వాన కురుస్తున్న రోజు ఒక చిన్న యూనిట్ను పెట్టుకుని సూట్లో ఉన్న అమితాబ్ను, చీరలో ఉన్న మౌసమీ చటర్జీని రోడ్ల మీద నడిపిస్తూ పిక్చరైజ్ చేశాడు. ఈ పాట పెద్ద హిట్. సేమ్ ఇదే పాటను ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ అభినయించింది. వారి పేర్లు శైలేష్, వందన ముంబైలోని థానేలో నివసించే శైలేష్, వందనలకు పెళ్లయ్యి 26 ఏళ్లు. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, ఇష్టం. ఈ ఇష్టం ఒక వానరోజున రికార్డు చేద్దామని, అదీ రిమ్జిమ్ గిరే సావన్ పాటలా ఉండాలని శైలేష్ కోరిక. భార్య దగ్గర ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా ఆమె సిగ్గుతో ‘నేను చేయనండీ’ అనేది. శైలేష్ పట్టు వీడక ఈ సంగతి తన స్నేహితుడు అనుప్ రింగాన్గవాకర్కు చెప్పాడు. అనుప్ భార్య అంకిత ఇది విని ఉత్సాహపడింది. వాళ్లిద్దరినీ మనిద్దరం వానలో షూట్ చేద్దాం అని చెప్పింది. ఇంకేముంది శైలేష్ అచ్చు మంజిల్ సినిమాలోని సూట్ లాంటిది కుట్టించుకున్నాడు. వందన అలాంటి చీరలోనే నిరాడంబరంగా తయారైంది. మొన్న మొదలైన వానల్లో ఒకరోజు మొత్తం పాటను సేమ్ అవే లొకేషన్లలో తీశారు. పెద్ద హిట్ పాత పాట ఎంత హిట్టో ఈ పాట అంతే హిట్ అయ్యింది. ‘మేము ఇంత రెస్పాన్స్ ఊహించలేదు’ అని శైలేష్ అన్నాడు. ‘మా లొకాలిటీలో మేము సెలబ్రిటీలం అయిపోయాం’ అని చెప్పాడు. దేశవిదేశాల్లో ఈ వీడియోకు ఆదరణ లభించింది. ‘మనసుండాలి గాని ప్రతి సందర్భాన్ని ఆనందమయం చేసుకోవచ్చు’ అని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ జంటను చాలామంది డిన్నర్కు పిలుస్తున్నారు. అన్నట్టు ‘మంజిల్’ కోసం ఈ పాటను నిజమైన వానలో తీసేప్పుడు అమితాబ్ నడకను అందుకోవడానికి మౌసమీ చటర్జీ పరుగులు తీయాల్సి వచ్చేది. అమితాబ్ కాళ్లు పొడవు కదా. ‘చాలాసార్లు ఆయన మెల్లగా నడిచి బేలెన్స్ చేసేవాడు. షూటింగ్ కోసం చాలాసేపు చీర నానడం వల్ల ఇంటికొచ్చాక దాని రంగు నా ఒంటి మీద అంటుకుపోయింది. వానలో పాట మాకు ఏమీ వినిపించేది కాదు. దూరం నుంచి డైరెక్టర్ కర్చీఫ్ ఆడిస్తే యాక్షన్ అని, మళ్లీ ఆడిస్తే కట్ అని భావించే నటించాం’ అని మౌసమీ చటర్జీ గుర్తు చేసుకుంది. వానలు మనకు అంతగా పడట్లేదు. పడినప్పుడు ఈ పాట చూడండి. -
వివాహేతర సంబంధం: భార్యపై వేడి సాంబార్ పోసిన భర్త
తిరువొత్తియూరు: విల్లుపురం సమీపంలోని తిరువెన్నె నల్లూరులో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్యపై భర్త వేడి సాంబార్ పోశాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. విల్లుపురం జిల్లా తిరువైన్నె నల్లూరు సమీపంలోని తడుతొట్ట కొండూరు గ్రామానికి చెందిన ఆరోగ్యస్వామి (40) ప్రొక్లైన్ ఆపరేటర్గా పనిచేస్తున్నా డు. ఇతనికి కడలూరు జిల్లాకు చెందిన పెరియనాయకి(30)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి ఆరోగ్యసామికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో శుక్రవారం వంట చేస్తున్నప్పుడు, భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆగ్రహించిన ఆరోగ్యసామి వేడి సాంబార్ను పెరియనాయకిపై పోశాడు. తీవ్రంగా గాయపడిన పెరియనాయకిని ఇరుగుపొరుగు వారు అంబులెన్స్లో ముండియంబాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరువెన్నెనల్లూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెంటనే విడాకులు
న్యూఢిల్లీ: వివాహ బంధం పునరుద్ధరించలేనంతగా దెబ్బ తింటే దంపతులు పరస్పర అంగీకారంతో తక్షణం విడాకులు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఇలాంటి సందర్భాల్లో హిందూ వివాహ చట్టం (1955)లో విధించిన ఆరు నెలల తప్పనిసరి వెయిటింగ్ పీరియడ్ వర్తించదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 కింద ఉన్న అసాధారణ అధికారాలతో వెంటనే విడాకులు మంజూరు చేసే విచక్షణాధికార పరిధి అత్యున్నత న్యాయస్థానానికి ఉందని తేల్చి చెప్పింది. ఫ్యామిలీ కోర్టులతో నిమిత్తం లేకుండా సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేయడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్టికల్ 142(1) కింద తక్షణం విడాకులు మంజూరు చేసే అధికార పరిధి సుప్రీంకోర్టుకు ఉందా వంటి ప్రశ్నలను లేవనెత్తాయి. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎ.ఎస్.ఓకా, జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం గత సెప్టెంబర్లో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. ఆ అధికారాన్ని ఆచితూచి వాడాలి ఆర్టికల్ 142(1) కింద దఖలు పడిన అసాధారణ అధికారాల ద్వారా సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి. వాటి పరిధి అత్యంత విస్తృతమైనదని ధర్మాసనం గుర్తు చేసింది. కనుక ఆ అధికారాలను ఆచితూచి వాడాలని అభిప్రాయపడింది. ‘‘వివాహ బంధం పూర్తిగా దెబ్బ తిన్న సందర్భాల్లో విడాకుల మంజూరు సుప్రీంకోర్టు అధికారానికి సంబంధించిన విషయం కాదు. విచక్షణకు సంబంధించినది. సుప్రీంకోర్టు సమస్యల పరిష్కర్తగా వ్యవహరిస్తుంది. కనుక ఇలాంటి విచక్షణాధికారాలను ఇరుపక్షాలకూ పరిపూర్ణ న్యాయం జరిగే రీతిలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటూ అత్యంత జాగరూకతతో వినియోగించాల్సి ఉంటుంది. వివాహం పూర్తిగా విఫలమైందని, దంపతులు ఇంకెంత మాత్రమూ కలిసి జీవించే పరిస్థితులు లేవని అసందిగ్ధంగా రుజువై, ఆ బంధాన్ని ఇంకా కొనసాగించడం అన్యాయమని న్యాయస్థానం విశ్వసిస్తే తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చు’’ అని పేర్కొంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు భరణం (సీఆర్పీసీ సెక్షన్ 125), వివాహితపై గృహ హింస (ఐపీసీ 498–ఎ) తదితరాల నిబంధనలను కూడా ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు పక్కన పెట్టవచ్చని స్పష్టం చేసింది. అయితే 32, 226 అధికరణల కింద విడాకుల కోసం నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది. -
నిద్రమత్తు భార్యతో వేగలేను సార్...
కర్ణాటక: భార్య మొద్దునిద్రతో విరక్తి చెందిన భర్త ఆమైపె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య అయేషా పర్వీన్ రాత్రి భోజనం చేసి నిద్రపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిద్రలేస్తుంది, భోజనం చేసి సాయంత్రం 5.30 పడుకుంటే రాత్రి 9.30 గంటలకు మేలుకుంటుంది. గత ఐదేళ్లుగా ఇదే తంతు అని భర్త ఇమ్రాన్ఖాన్ ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ మేరకు బెంగళూరు బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వంట కూడా చెయ్యదు ఆమె వంట కూడా చేయదని, తన తల్లి వంటచేసి వడ్డించాలని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఆమె కుటుంబసభ్యులతో దాడిచేయిందని వాపోయాడు. భార్య ప్రవర్తన వల్ల నరకయాతన అనుభవిస్తున్నానని, భార్య ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మొర పెట్టుకున్నాడు.తనపై కొంచెం కూడా ప్రేమ, మమకారం లేదని, ఆస్తిని కాజేయడానికి పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెడుతోందని చెప్పాడు. ఇటీవల పుట్టినరోజు నెపంతో 20–25 మందిని ఇంటికి ఆహ్వానించి తనపై దాడిచేయిందని ఆరోపించాడు. ఆమెకు పెళ్లికి ముందే రోగాలు ఉండగా వాటిని దాచిపెట్టి ఐదేళ్ల క్రితం తనకు ఇచ్చి వివాహం చేశారని అతడు చెప్పాడు. మామ అరీఫుల్లా, అత్త హీనా కౌసర్, బావమరిది మహమ్మద్ మొయిన్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
భర్త పాయిజన్ తీసుకుని చనిపోవడంతో భార్య..
భార్యభర్తలిద్దరు ఒకరు తరువాత ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. భర్త చనిపోయిన కొద్ది క్షణాల్లోనే ఆయన లేని జీవితం తనకూ వద్దంటూ మృతుడి భార్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అజయ్ పాల్(37), మౌనిక (32) ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. బుధవారం మౌనిక పాల్ భర్త నోటి నుంచి నురగతో స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో మౌనిక భర్తను హుటాహుటినీ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె భర్త చనిపోయినట్లు ధృవీకరించారు. దీన్ని జీర్ణించుకోలేని మౌనిక వెంటనే ఇంటికి వచ్చి పాయిజన్ తీసుకుని అదే రోజు మధ్యాహ్నాం చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలుగొట్టి చూడగా.. మౌనిక విగతజీవిగా పడి ఉంది. దీంతో పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో ఆమె భర్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని, ఇటీవలే అతను ఎయిర్ ఫోర్స్ జాబ్ నుంచి వైదొలగినట్లు వెల్లడించారు పోలీసులు. పైగా ఆ జంటకు రెండేళ్ల క్రితమే వివాహం అయ్యిందని తెలపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన బలమైన కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: మాఫియాపై ఉక్కుపాదం..ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుల నివాసాలు బుల్డోజర్లతో కూల్చివేత) -
భార్యను హతమార్చి.. వాటర్ ట్యాంకులో దాచి
సాక్షి, దొడ్డబళ్లాపురం: భార్యను హతమార్చి శవాన్ని ఖాళీ వాటర్ ట్యాంకులో దాచిన ఘటన హుళియాళలో చోటుచేసుకుంది. శాంతకుమారి (38) భర్త చేతిలో హతమైన మహిళ. తెరెగాంవ గ్రామానికి చెందిన తుకారాం మడివాళ నిందితుడు. తుకారాం పక్కింటి మహిళతో మాట్లాడిన విషయానికి సంబంధించి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో తుకారాం భార్య గొంతు నులిమి హత్య చేసాడు. శవాన్ని వాటర్ ట్యాంకులో దాచాడు. అనంతరం ఖానాపురకు చెందిన రిజ్వాన్కుంబారి అనే వ్యక్తికి చెందిన టాటాఏస్ వాహనాన్ని అద్దెకు తీసుకుని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పారవేయాలని ప్రయత్నిస్తుండగా హుళియాళ, రామనగర పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితుడిని అరెస్టు చేసారు. (చదవండి: భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..) -
భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..
సాక్షి, అల్వాల్: క్షణికావేశంలో భార్యపై చేయి చేసుకున్నానని మనస్తాపానికిలోనైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన సురేంద్రకుమార్ (35) బసంతి దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చారు. సురేంద్రకుమార్ జీడిమెట్లలోని సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేస్తుండగా అతడి భార్య బసంతి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది. ఇటీవల బసంతి ఉద్యోగం మానేసింది. అప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో భార్య ఉద్యోగం మానేయడంతో ఆగ్రహానికిలోనైన సురేంద్రకుమార్ ఆదివారం చేయి చేసుకున్నాడు. దీంతో మానసిక వేధనకు లోనైన అతను భార్య, కుమార్తెలను బెడ్రూంలో వేసి బయటి నుంచి గడియ పెట్టి హాల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బసంతి తెలిసిన వారికి ఫోన్ చేసి సమాచారం అందించింది. వారు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్లో కాళ్లను దాచి..) -
వింత ఘటన: భర్త చెల్లినే పెళ్లి చేసుకున్న భార్య! అత్తింటి వారిపై కేసు
ఒక మహిళకు వివాహమై పదేళ్లు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. ఆమె తన భర్త, పిల్లలతో హాయిగా జీవిస్తోంది కూడా. ఏమైందో ఏమో ఉన్నట్టుండి భర్త చెల్లినే పెళ్లి చేసుకుంది. పైగా ఆమహిళ తన మరదలితో భార్యభర్తల్లా కలిసి జీవిస్తున్నారు. దీనికి ఆమె భర్త సైతం అడ్డు చెప్పలేదు. ఇదంతా నచ్చని ఆ మహిళ అత్తమామలు ఆమె మరదలిని (భాగస్వామిని) తీసుకు వెళ్లిపోయారు. దీంతో సదరు మహిళ వారిపై కిడ్నాప్ కేసు పెట్టింది. ఈ విచిత్ర ఘటన బిహార్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బిహార్లో నివశిస్తున్న ప్రమోద్ దాస్, శుక్లా దేవి జంటకు వివాహమై పదేళ్లు అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా. ఐతే ఏమైందో ఏమో ఆమె ఒక రోజు భర్త చెల్లెలు 18 ఏళ్ల సోని దేవిని పెళ్లి చేసుకుంది. పైగా వారిద్దరూ భార్యభర్తల్లా జీవించడం ప్రారంభించారు. అందుకు భర్త వ్యతిరేకించకపోగా, తన భార్య సంతోషమే తన సంతోషం అని శుక్లా దేవి భర్త దాస్ చెబుతుండటం విశేషం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇక్కడ వరకు కథ అంతా బాగానే సాగింది. ఎప్పుడైతే దాస్ భార్య అతడి చెల్లిని పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి దాస్తో జరిగిన పెళ్లిని వ్యతిరేకిస్తోంది. అంతేగాదు అతడి భార్య తన పెళ్లి చేసుకున్న భర్త చెల్లెలుతో జీవించేందుకు మగవాడిగా మారాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా వేషధారణ మార్చంది కూడా. అక్కడితో ఆగక పోగా మగవాడిలా మారేందుకు సర్జరీ చేసుకోవాలని ప్లాన్ చేయడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుబ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేగాదు ఆ మహిళ అత్తమామలు సోని దేవిని ఆమె నుంచి బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. దీంతో శుక్లాదేవి పోలీసులను ఆశ్రయించింది. పైగా అత్తింటి వారిపై కిడ్నాప్ కేసు కూడా పెట్టింది. పైగా ప్రేమ ఎప్పుడూ ఎలా పుడుతుందో తెలియదు, ఇది మనసుకు సంబంధించింది అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతోంది సదరు మహిళ శుక్లా దేవి. ఈ మేరకు ఇన్స్పెక్టర్ కృష్ణ ప్రసాద్ ఇది కాస్త వివాదాస్పదమైన కేసు అని వాస్తవాలను వెలకితీసేలా సున్నితంగా దర్యాప్తు చేయాల్సి అంశం అని చెప్పారు. (చదవండి: మోదీపై తృణమూల్ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు, జైశంకర్పై కూడా..) -
ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్లో..
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఇంట్లో పని కోసం మొదటిరోజు వచ్చిన భార్యాభర్తలు, మరుసటి రోజు అదే ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రామకృష్ణాపురం ప్రాంతంలో చెందిన నెట్ల లక్ష్మీప్రసాద్, జయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వారు ఇద్దరూ వృద్ధులు కావడంతో తమ ఇంటిలో సామాన్లు సర్దడం కోసం పనివారు కావాలని తెలిసిన మహిళను అడిగారు. ఆమె ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ సమీపంలో నివసించే అక్కరబోతు అంజిబాబు, లీలాదుర్గ దంపతులను పనికి మాట్లాడింది. లక్ష్మీప్రసాద్ ఇంటికి మంగళవారం పనికి వచ్చిన అంజిబాబు, లీలాదుర్గ రాత్రి 11 గంటల వరకూ సామాన్లన్నీ సర్ది, కూలి తీసుకొని వెళ్లిపో యారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వారిరువురు మళ్లీ లక్ష్మీప్రసాద్ ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు. అతని భార్య జయలక్ష్మి ఇంటి తలుపు తీయగా వారు వెంటనే ఆమెను లోపలకు నెట్టేసి, నోరు నొక్కేసి ఐదు కాసుల బంగారు నానుతాడు, నాలుగు కాసుల బంగారు లాకెట్, చెవిదిద్దులు, రెండు పేటల నల్లపూసలగొలుసు లాక్కొని పారిపోయారు. దీంతో అంజిబాబు, లీలాదుర్గను పనికి మాట్లాడిన మహిళ దగ్గరకు లక్ష్మీప్రసాద్, జయలక్ష్మి వెళ్లి విషయం చెప్పారు. అనంతరం వారు ముగ్గురూ కలిసి అంజిబాబు, లీలాదుర్గ ఇంటికి వెళ్లగా తలుపులకు తాళాలు వేసి కనిపించాయి. చదవండి: మహిళపై వీఆర్వో వేధింపులు.. వాట్సాప్లో మెసేజ్లు చేస్తూ.. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగ్నగర్ సీఐ ఎస్.వి.వి.ఎస్.లక్ష్మీనారాయణ, క్రైం ఎస్ఐ సత్యనారాయణ, హెడ్కానిస్టేబుల్ ఖాన్, కానిస్టేబుల్ మహేష్, ఉమెన్ కానిస్టేబుల్ జానకి, హోమ్గార్డ్ నటరాజ్ బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గవర్నర్పేట బ్రిడ్జి డౌన్లో అనుమానా స్పదంగా తిరుగుతున్న అంజిబాబు, లీలాదుర్గను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన మొత్తం సొత్తును వారి వద్ద స్వా«దీనం చేసుకుని, ఇద్దరినీ అరెస్ట్ చేశారు. -
యూట్యూబ్ చూసి.. ఏకంగా రూ. 40 లక్షలు చోరీ
సాక్షి, హుబ్లీ: యూట్యూబ్ చూసి అందులో చోరీ చేయడం ఎలాగో తెలుసుకుని రూ.40 లక్షల చోరీకి పాల్పడిన ఘరానా జంటను ధార్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వైష్ణవి, యువరాజులుగా గుర్తించారు. ధార్వాడలో కోర్టు సర్కిల్ వద్ద వీరేశ్వర కో–ఆపరేటివ్ సొసైటీలో కొత్త సంవత్సరం వేడుకల రోజున తొలి ప్రయత్నంగా చోరీకి పాల్పడి భారీగా నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధార్వాడ టౌన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాష్ట్ర మంత్రి శశికళా జొల్లెకి చెందిన ఎక్సంబాదా సొసైటీకి చెందిన ధార్వాడ శాఖలో నిందితులు బంగారు ఆభరణాలతో పాటు నగదు మొత్తం కలిపి రూ.40 లక్షలు చోరీ చేశారు. నెల రోజుల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. (చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు..) -
భార్య నుంచి కాపాడాలని మొర
సాక్షి, బనశంకరి: భార్య వేధింపులు భరించలేక భర్త బెంగళూరు డీజీపీ, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. రామనగర తాలూకాకు చెందిన రామచంద్ర రూ. 5 లక్షల కోసం తనపై భార్య, కుమారుడితో కలిసి దాడికి చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేసిన రామచంద్ర న్యాయం లభించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం పెట్టరు నేను కట్టిన ఇంట్లో ఉండనివ్వరని వాపోయాడు. (చదవండి: పథకం ప్రకారమే లయస్మిత హత్య ?) -
చితి మంటల్లోనూ ఒక్కటిగా..
సాక్షి, ప్రత్తిపాడు: ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో పరాయి దేశం వెళ్లారు. పగలూ రాత్రీ కష్టపడ్డారు. ఇద్దరు పిల్లాపాపలతో జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతున్న వేళ విధికి కన్నుకుట్టినట్లుంది. వారిపై విషం చిమ్మింది. మంచు గడ్డల రూపంలో మృత్యువు కాపు కాసి భార్యాభర్తలిద్దరినీ కానరాని లోకాలకు తీసుకువెళ్లి, వారి ఇద్దరి కుమార్తెలను ఒంటరులను చేసింది. అమెరికాలో దుర్మరణం పాలైన తెలుగు దంపతుల అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు ఉద్యోగ రీత్యా ఏడేళ్లుగా అమెరికాలోని అరిజోనాలో ఉంటున్నారు. ఈ నెల 26న సెలవు కావడంతో పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలో దంపతులు సరస్సులో గల్లంతై, చివరకు మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలు అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నాయి. టీసీఎస్ కంపెనీ సహకారంతో సోమవారం ఉదయం అమెరికాలోని డల్లాస్ నుంచి మృతదేహాలను హైదరాబాద్కు విమానంలో తరలించారు. అక్కడి నుంచి అంబులెన్సులో పాలపర్రులోని స్వగ్రామానికి తీసుకువచ్చారు. వారి పిల్లలను రెండు రోజుల కిందటనే తీసుకువచ్చారు. నారాయణ, హరిత దంపతుల మృతదేహాలను చూడగానే రోదనలు మిన్నంటాయి. బిడ్డా.. ఇక నుంచి మాకు ఫోన్లు ఎవ్వరు చేస్తారు.. అంటూ నారాయణ తల్లి వెంటరత్నం విలపించింది. హరిత తల్లిదండ్రులూ కన్నీరుమున్నీరయ్యారు. నారాయణ, హరిత పిల్లలు పూజిత, హర్షిత నిర్జీవంగా ఉన్న తల్లిదండ్రులను చూసి దిగాలుగా ఉండిపోయారు. నారాయణ, హరిత దంపతుల చితిలను ఒక్కచోటే పేర్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. వారిని ఆఖరి చూపు చూసేందుకు ఊరంతా కదిలివచ్చింది. భౌతికకాయాల వద్ద ఎమ్మెల్సీ లక్ష్మణరావు నివాళులరి్పంచారు. (చదవండి: రాజమండ్రి: తక్షణ సాయం.. సీఎం జగన్ సాయం జీవితాంతం మరువలేనిది) -
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన వదినపై..
సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తల మధ్య వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి, అమీన్పూర్ ఎస్ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం జయ్యారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం వచ్చి బాల్నగర్ చింతల్లో ఉంటున్నారు. కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శ్రీనివాస్ అతడి భార్య సునీత కొన్ని రోజులుగా గొడవపడుతున్నారు. సునీత అమీన్పూర్ శ్రీవాణి నగర్లో ఉంటున్న తన అక్క సుజాత(46) వద్దకు నెల క్రితం వచ్చింది. అక్కడే ఉంటూ బాచుపల్లి సమీపంలోని అరవిందో పరిశ్రమలో కూలి పనిచేస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటలకు సునీత డ్యూటీకి వెళ్లింది. వెనుక అక్క సుజాత, ఆమె కుమారుడు సాయికిరణ్ బైక్పై వచ్చారు. పరిశ్రమ సమీపంలో సునీత ఆమె భర్త శ్రీనివాస్ గొడవపడుతున్నారు. వారిని ఆపే ప్రయతనం చేసేందుకు వెళ్లిన సుజాత, సాయికిరణ్తో పాటు సునీతపై శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. దాడిలో సుజాత అక్కడికక్కడే మృతిచెందగా, సునీత, సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక మమత ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చదవండి: (భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా..) -
మరో మహిళతో వివాహేతర సంబందం.. భర్త దాష్టీకాన్ని తట్టుకోలేని భార్య..
సాక్షి, బెంగళూరు(కృష్ణరాజపురం): భర్తకు మరో మహిళతో వివాహేతర సంబందం, పైగా కట్నం వేధింపులకు గురి చేయడంతో విరక్తి చెందిన మహిళ బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హోసకోటె తాలూకాలోని కల్కుంటి అగ్రహార గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. శ్వేత (24), ఏడాదిన్నర బాలుడు యక్షిత్ మృతులు. శ్వేతకు మూడేళ్ల కిందట రాకేష్ అనే యువకునితో పెళ్లయింది. అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. దీనిపై చాలాసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. పెద్దలు వచ్చి రాజీ పంచాయతీలు చేశారు. అయినా వివాహేతర సంబంధం మానుకోలేదు. దీనికి తోడు పుట్టింటి నుంచి డబ్బు తేవాలని శ్వేతను వేధించేవాడు. ఇదంతా భరించలేక ఆమె బాలున్ని గొంతు పిసికి చంపి, తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. అనుగొండనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: (బెంగళూరులో విషాదం.. విగతజీవులుగా తల్లీ, కొడుకు కూతురు) -
5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు
ఇద్దరు కెనడియన్బిలినియర్ దంపతులు 5 ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మొదట్లో ఆత్మహత్య చేసుకున్నారని భావించారు అంతా. ఆ తర్వాత హత్య అని తేలినా ఇప్పటికి వరకు ఈ కేసు మిస్టరీ అంతుచిక్కలేదు పోలీసులకు. దీంతో హంతకుడు తలపై భారీ మొత్తంలో నగదును సైతం ప్రకటించారు మృతుల కుటుంబ సభ్యులు. వివరాల్లోకెళ్తే...డ్రగ్ దిగ్గజం అపోటెక్స్ వ్యవస్థాపకుడు బారీ షెర్మాన్ అతని భార్య హనీ ఐదేళ్ల క్రితం టోరంటోలోని వారి ఇంటిలో హత్యకు గురయ్యారు. ఆ బిలినియర్ దంపతులు డిసెంబర్ 15, 2017న మృతి చెందారు. ఐదేళ్లైన ఇప్పటికీ ఈ కేసులో కీలక నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారు పోలీసులు. వాస్తవానికి భారీ షెర్మాన్ 1974లో అపోటెక్స్ అనే డ్రగ్ కంపెనీని స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని ప్రధాన ఔషధ కంపెనీగా తీర్చిదిద్ది అంచెలంచెలుగా బిలినియర్ స్థాయికి ఎదిగాడు. ఆ జంట సుమారు రూ. 400 కోట్ల డబ్బును దాతృత్వ సేవలకు వినియోగించారు. ఆ జంట చనిపోయేటప్పటికీ వారి నికర చరా ఆస్తుల విలువ సుమారు 20 వేల కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. ఆ జంట అంత్యక్రియలకు ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరియు అంటారియో ప్రావిన్స్ ప్రీమియర్ కాథ్లీన్ వైన్తో సహా వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. తమ తల్లిదండ్రుల హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తుందని వారి పిల్లలు కుమారుడు జోనాథన్ షెర్మాన్ , కుమార్తె అలెక్స్ క్రావ్జిక్ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ఈ హత్యకేసు సాధ్యమైనంత తొందరగా చేధించి నిందితుడుని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు కోరారు వారు. ఆ హంతకుడి ఆచూకి తెలిపిన వారికి దాదాపు రూ. 500 కోట్లు వరకు అందజేస్తామంటూ ఇది వరకు ప్రకటించిన ఆఫర్ని రెడ్డింతలు పెంచి మరీ ప్రకటించారు. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి పలువురు కుటుంబసభ్యులను విచారించారు. ఐతే ఈ కేసులో కీలక నిందితులను ఆచూకి మాత్రం లభించలేకపోవడం గమనార్హం. (చదవండి: -
ఆ టైంలో బయట ఉన్నందుకు...దంపతులకు రూ. 3000లు జరిమానా!
ఒక జంట అర్ధరాత్రి బయట ఉన్నందుకు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో బయటకు రావడం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ మూడు వేలు జరిమానా విధించారు పోలీసులు. కట్టేంత వరకు వారిని రకరకాలుగా వేధింపులకు గురిచేశారు. దీంతో సదరు బాధితుడు సహాయం కోసం కమిషనర్ ఆఫ్ పోలీసును ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...కర్ణాటకలోని బెంగళూరులో ఒక జంట తమ స్నేహితుడు బర్త్డే కేక్ కటింగ్ ఈవెంట్కి హజరై తిరిగి ఇంటికి పయనమయఆయరు. ఆ క్రమంలోనే ఆ జంట తమ ఇంటికీ సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వారికి సమీపంలో ఒక పెట్రోలింగ్ వ్యాన్ ఆగింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఐడీ కార్డులు చూపించమని ఆ జంటను డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ జంట అవాక్కయ్యింది. సాధారణ రోజుల్లోనే కదా మేము బయటకు వచ్చింది, ఎందకని తమను ఇలా ఐడీ కార్డులు చూపించమని నిలదీస్తున్నారో వారికి ఒక్కసారిగా అర్థం కాదు. ఆ తర్వాత ఆ దంపతలు తమ ఐడీ కార్డులను పోలీసులకు చూపించారు. ఆ తదనంతరం పోలీసులు ఆ జంట వద్ద నుంచి ఫోన్లు లాక్కుని వ్యక్తిగత వివరాలను విచారించడం ప్రారంభించారు. అర్థరాత్రి సమయం కావడంతో వారు కూడా ఓపికగా సమాధానాలు చెప్పారు. ఇంతలో వారిలో ఒక పోలీసు ఆ జంట పేర్లను, ఆధార్ నెంబర్లను నమోదు చేయడం చూసి...మాకు ఎందుకు చలానా జారీ చేస్తున్నారని ప్రశ్నించాం. అందుకు పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరగడానికి అనుమతి లేదని చెప్పారు. అలాంటి నియమం లేదని తెలిసినా...ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి తీవ్రతరం కాకూడదనే ఉద్దేశ్యంతో దీని గురించి తమకు తెలియదని మర్యాదపూర్వకంగా చెప్పడమే గాక క్షమాపణలు కూడా చెప్పింది ఆ జంట. అయినా పోలీసులు వారిని వదలకుండా వేధింపులకు గురి చేశారు. పైగా రూ. 3000లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ జంట ఎంతగా ప్రాథేయపడిన వినకపోగా అరెస్టులు చేస్తామని బెదిరించారు పోలీసులు. కాసేపటికి పోలీసుల్లో ఒకరూ ఆ జరిమానాలో కనీసం మొత్తం చెల్లించేస్తే వదిలిపెట్టేస్తారని చెప్పారు. ఆ తర్వాత తాను పేటీఎం ద్వారా చెల్లించేంత వరకు పోలీసులు తమను వదలలేదని బాధితుడు కార్తీక్ పత్రి అన్నారు. ఆఖరికి నా భార్య కన్నీరు పెడుతున్న దయాదాక్షిణ్యం చూపకుండా అత్యంత అమానుషంగా ప్రవర్తించారని వాపోయాడు కార్తీక్. ఈ వియషయాంలో తనకు సాయం చేయాల్సిందిగా బాధితుడు కార్తీక్ బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వివరించాడు. ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ అనూప్ శెట్టి స్పందించి...ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చినందకు కార్తీక్కి ధన్యావాదాలు. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: మొబైల్లో గేమ్ ఆడుతుండగా పేలుడు..తీవ్రంగా గాయపడ్డ చిన్నారి) -
అర్థరాత్రి షాకింగ్ ఘటన.. దంపతులపై దాడి.. మహిళను కారు ఎక్కాలంటూ..
జహీరాబాద్(సంగారెడ్డి జిల్లా): అర్ధరాత్రి దంపతులు బస్సుదిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో యువకులు దాడి చేసిన వీడియో వైరల్గా మారింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దంపతులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బస్టాండ్లో బస్సుదిగి కాలినడకన తమ ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో యువకులు వారిని అనుకరిస్తూ బ్లాక్రోడ్డులో అటకాయించారు. కారులో ఎక్కాలంటూ మహిళపై దాడి చేయగా, ఆమె కేకలు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. యువకులు తాగిన మైకంలో వారిని అటకాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఐ శ్రీకాంత్ను వివరణ కోరగా దంపతులపై జరిగిన జరిగిన దాడిపై ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్ట్చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! -
టేకాఫ్ అయిన కొద్ది క్షణంలోనే కుప్పకూలిన విమానం ఆ తర్వాత...
మరణం అంచులదాక వెళ్లి అనూహ్యంగా బయటపెడితే ఎవరికైనా ఏడుపూ ఆనందం ఒకేసారి తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఔను! జీవితం మనకు మరో అవకాశం ఇచ్చిందనుకుంటాం. మళ్లీ సమర్ధవంతంగా జీవితాన్ని ఎలా పునర్నిర్మించాలో ఆలోచించుకుంటాం కదా. అచ్చం అలానే ఇక్కడొక జంట చచ్చపోతాం అనుకునేంత భయానక ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే....పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో రన్వేపై కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సిబ్బంది తోపాటు, దాదాపు 120 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఐతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక జంట వెంటనే సెల్ఫీ తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదం తర్వాత కాసేపు భయాందోళనలకు లోనవ్వడం సహజం. కానీ జీవితం మరో అవకాశం ఇచ్చిందన్న ఆనందంతో తాము ఇలా సెల్ఫీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఆనందంగా చెబుతున్నారు ఆ దంపతులు. ఈ సెల్ఫీ ఫోటోను ఏ 320 సిస్టమ్స అనే ఫేస్బుక్లో 'సెల్ఫీ ఆఫ్ ద ఇయర్' అనే క్యాప్షన్తో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: లాటరీ తగలడమే శాపమైంది...లవర్తో భార్య జంప్) -
కిరాతక భర్త.. భార్య పిల్లలపై పెట్రోల్ పోసి..
యశవంతపుర: పిల్లలను చూపించలేదని భార్య, పిల్లలు ఇంటిలో నిద్రిస్తుండగా భర్త నిప్పు పెట్టిన ఘటన హాసన్ తాలూకా దొడ్డబీకనహళ్లి గ్రామంలో జరిగింది. ఘటనలో తల్లీ గీతా, ఇద్దరు కొడుకులు గాయపడ్డారు. వివరాలు.. అంకనహళ్లికి చెందిన రంగస్వామి–గీత దంపతుల మధ్య భూ వివాదం ఉండగా, తరచూ గొడవ పడేవారు. గోరూరు పోలీసుస్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. ఇంట్లోకి రానివ్వలేదని.. గీత నాలుగు నెలల నుంచి ఇద్దరు కొడుకులు రతన్ (7), నందన్ (5)లతో కలిసి దొడ్డబీకనహళ్లి గ్రామంలో బాడుగ ఇంటిలో వేరేగా ఉంటోంది. శుక్రవారం రాత్రి రంగస్వామి పిల్లలను చూడాలని గీతా ఇంటికెళ్లగా ఆమె రానివ్వలేదు. దీనితో ఆక్రోశానికి గురైన రంగస్వామి అందరూ నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టాడు. మంటల్లో చిక్కుకుని గీత, పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు కాపాడి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారికి తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. గోరూరు పోలీసులు రంగస్వామిని అరెస్ట్ చేశారు. (చదవండి: రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు) -
డ్యూటికి వెళ్లి వచ్చేసరికి ఘోరం...షాక్లో భర్త
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కె.భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మహేశ్, అనిత(22) దంపతులకు వర్షిణి(22 నెలలు), శ్రీహాన్ (9నెలలు) సంతానం. వారు గత నాలుగేళ్లుగా బాలానగర్ డివిజన్ గౌతంనగర్లో నివాసం ఉంటున్నారు. మహేష్ వృత్తిరీత్యా డ్రైవర్. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మహేష్ డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. పలుమార్లు పిలిచినా అనిత తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన మహేష్ కిటికీ లోంచి చూడగా అనిత ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అనిత ఉరేసుకుని ఉండగా ఇద్దరు పిల్లలు మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. (చదవండి: పెళ్లై మూడేళ్లే అంతలోనే....ప్రాణం తీసిన కట్నపిశాచి) -
భార్యభర్తలపై పెట్రోల్ దాడి..చనిపోకపోతే మరోసారి చంపేవాడిని
హిమాయత్నగర్: భార్య, భర్త, పది నెలల చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఇద్దరి మృతికి కారకుడైన నాగుల సాయి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆదివారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలను రాబట్టారు. ఈనెల 7న రాత్రి బాటిల్లో పెట్రోల్ తీసుకువచ్చిన నాగుల సాయి నారాయాణగూడ ఎక్స్రోడ్స్ వద్ద దానిని జగ్గులో పోసుకున్నాడు. అనంతరం సమీపంలో పూలు అమ్ముతున్న ఆర్తీ, ఆమె పక్కనే ఉన్న నాగరాజులపై చల్లి నిప్పంటించాడు. అక్కడి నుంచి బర్కత్పురా వైపు పరిగెత్తిన అతను బర్కత్పురా వద్ద సికింద్రాబాద్కు వెళ్లే బస్సు ఎక్కి ఆ రోజు రాత్రి సికింద్రాబాద్లో తలదాచుకున్నాడు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నల్లగొండ మీదుగా వెళ్లే రైలు ఎక్కి నల్లగొండ చేరుకున్నాడు. అప్పటి నుంచి అక్కడే రోడ్డుపై చిత్తు కాగితాలు ఏరుకుని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం నాగులసాయి తన స్నేహితుడికి ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నాడు. సదరు స్నేహితుడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ల్లగొండకు చేరుకున్న పోలీసులు ఆదివారం రాత్రి అతడిని ఆదుపులోకి తీసుకుని నారాయణగూడకు తరలించారు. కోర్టు ధిక్కారం కేసులో ఏడాది జైలు రెండేళ్ల క్రితం నాగులసాయి అతని బామ్మరిది జితేంద్రను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో మూడు నెలల పాటు జైలు పాలయ్యాడు. జైలు నుంచి బయటికి వచి్చన తర్వాత విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం అతడికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. సోమవారం చేసిన దాడిలో ఆర్తీ, ఆమె భర్త నాగరాజు చనిపోకపోతే మరోసారి వారిని చంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులతో పేర్కొన్నాడు. మంగళవారం నాగుల సాయిని రిమాండ్కు పంపనున్నట్లు ఎస్హెచ్ఓ రాపోలు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. (చదవండి: మొదటి భర్త ఘాతుకం...తనని కాదని మరో పెళ్లి చేసుకుందని పెట్రోల్తో...) -
మతిస్థిమితం లేదని.. సోదరి హత్య
మైసూరు: మానసిక అస్వస్థురాలు అయిన మహిళను ఆమె సోదరి దంపతులు హతమార్చారు, సుమారు రెండు సంవత్సరాల తరువాత ఈ ఘోరం బయటపడింది. చామరాజనగరకు చెందిన లక్ష్మిని ఆమె సోదరి రూపా, భర్త సిద్దరాజుతో కలిసి హత్య చేసింది. వివరాలు.. హేమ కుమార్తె అయిన లక్షి్మని తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన రాజేష్కు ఇచ్చి పెళ్లి చేయగా 7 ఏళ్ల ప్రీతం అనే కుమారుడు ఉన్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మి మానసిక అస్వస్థకు గురి కావడంతో భర్త ఆమెను పుట్టింటిలో వదిలిపెట్టాడు. అక్కడ రాయనహుండి గ్రామంలో ఆమె సోదరి రూపా ఇంట్లో ఉండేది. రెండేళ్ల క్రితం లక్ష్మీకి మతిస్థిమితం పూర్తిగా కోల్పోయి ఉద్రేకంగా ప్రవర్తించసాగింది. మర్యాద పోతుందని ఆగ్రహంతో లక్ష్మీ కాళ్లు చేతులు కట్టి వేసి, నోట్లో బట్టలు కుక్కి రూపా, ఆమె భర్త సిద్దరాజు కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా లక్ష్మి ఊపిరి ఆడక చనిపోయి ఉంది. గుట్టుగా ఇంటి వెనుకాల అర్ధరాత్రి గుంత తీసి పూడ్చిపెట్టారు. ఎక్కడికో వెళ్లిపోయిందని బంధువులకు చెప్పారు. ఇటీవల తల్లి గట్టిగా నిలదీయడంతో రూపా అసలు విషయం చెప్పింది. తల్లి వరుణా పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. (చదవండి: కంట్లో కారం చల్లి.. చేతులు నరికి) -
ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి.. ఏమైందో ఏమో కత్తితో పొడిచి...
భార్య తనతో వచ్చేందుకు నిరాకరించిందన్న అక్కసుతో కత్తితో దాడి చేసి పారిపోయాడు ఆమె భర్త. ఈ ఘటన రాజస్తాన్ ధోలపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకాం....ఈ జంట ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకుసుని బారీ అనే పట్టణంలో నివసిస్తున్నారు. అయితే జైపూర్లో ఉంటున్న భర్త కుటుంబసభ్యులు ఆ మహిళతో సహా తిరిగి ఇంటికి వచ్చేయమని బలవంతం చేశారు. ఈ నేఫథ్యంలోనే దంపతులు రైలు ఎక్కేందుకు రైల్వేస్టేషన్కి వచ్చారు. కానీ ఆమె అతడి కుటుంబసభ్యుల వద్దకు తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తనతో వచ్చేందకు ఒప్పుకోవడం లేదన్న కోపందో ఆమె భర్త కోపంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమె తాను చనిపోతానన్న భయంతో బెంచ్ మీద రక్తంతో తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లను రాసింది. ఆ తర్వాత ఆమె ఒక జీఆర్పీ జవాన్ సాయంతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: మొదటి భర్త ఘాతుకం...తనని కాదని మరో పెళ్లి చేసుకుందని పెట్రోల్తో...) -
రూ. 10వడ్డీ అంటే.. బయట ఐదుకు తీసుకొచ్చి మరీ ఇచ్చారు.. అప్పుడే అసలు కథ..
సాక్షి, గుంటూరు(తెనాలి): అధిక వడ్డీ ఆశ చూపి పలువురిని మోసగించిన కేసులో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండూరు గ్రామానికి చెందిన రెడ్డి వెంకాయమ్మ అలియాస్ రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావుతోపాటు షేక్ హసీనా అనే మహిళను చుండూరు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది. వీరిపై సెక్షన్–420, డిపాజిటర్స్ యాక్ట్, చిట్ఫండ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు చుండూరు సీఐ కళ్యాణ్రాజు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. మండూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోడలు, రియల్టరైన రెడ్డి లత పెట్టుబడి కోసం అదే గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీలత అనే మహిళకు 20 శాతం వాటా ఆశచూపింది. శ్రీలత గ్రామంలో తనకు తెలిసిన వారిని ఆశ్రయించి వారికి రూ.10 వడ్డీ ఇస్తానని చెప్పి కొందరి నుంచి రూ.లక్షల డబ్బు వసూలు చేసింది. షేక్ హసీనా అనే మహిళ తన ఇంటి సమీపంలోని సగర కులానికి చెందిన మహిళలకు రూ.5 వడ్డీ ఆశ చూపి మరికొన్ని రూ.లక్షలు సమకూర్చింది. మొత్తం కలిపి శ్రీలత చేతులమీదుగా రూ.1.83 కోట్ల వరకు రెడ్డి లతకు అప్పగించినట్టు బాధితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: (Hyderabad: పాతబస్తీలోని కాలాపత్తర్లో దారుణం.. వీడియోకాల్లో..) కేవలం శ్రీలత నుంచి మాత్రమే మొత్తం డబ్బులు తీసుకున్న రెడ్డి లత ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. గొల్లుమన్న బాధితులు పురుగుమందు డబ్బాలతో ధర్నాకు దిగారు. నోట్లు, పత్రాలు లేకుండా ఇచ్చిన అప్పులు కావటంతో వీరి మొర ఎవరూ ఆలకించలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 4న ఉయ్యూరు శ్రీలత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పటికే ఈ కేసు విషయంలో పోలీసులు కూపీ లాగుతూ వచ్చారు. రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావు హైదరాబాద్లో ఉంటున్న బంధువుకు కోటి రూపాయల వరకు బాకీ పడ్డారు. ఇటీవల ఆ బకాయిని తిరిగి చెల్లించినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే కూచిపూడి లాకుల వద్ద కొంత స్థలాన్ని కూడా రెడ్డి లత కొన్నట్టు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఆ స్థలాన్ని వేరొకరికి అమ్మేందుకు యత్నించగా, బాధితులు అక్కడకు వెళ్లి గుడిసెలు వేసుకుని ఆందోళన చేశారు. దీంతో కొనేందుకు వచ్చిన పార్టీ వెనక్కు వెళ్లిపోయింది. ఈ అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ బ్యాంకు లావాదేవీల ద్వారానే జరిగాయని తెలుసుకున్న పోలీసులు రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావును, వడ్డీ ఆశతో ఈ మోసంలో పాత్రధారి అయిన హసీనాను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరికొన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఏడుగురు బాధితులు రూ.1.28 కోట్ల వరకు మోసపోయినట్టు సమాచారం. చదవండి: (మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?) -
భార్యాభర్తల గొడవలోకి దూరాడు.. దారుణంగా హత్యకు గురయ్యాడు
భోపాల్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. చిన్న చిన్న విషయాలకు సైతం గొడవ పడినా.. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే, ఇరువురు గొడవపడుతుంటే చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నించటమూ మామూలే. కానీ, ఒక్కోసారి అది ప్రాణాలపైకి తెస్తుందనేందుకు ఇదే సరైన ఉదాహరణ. భార్యాభర్తలు గొడవ పడుతున్నారని కలుగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మా మధ్యకే వస్తావా అని దారుణంగా కొట్టి చంపాడు భర్త. ఈ అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది. పప్పు అనే వ్యక్తి మంగళవారం రోజు ఇంట్లో మటన్ కూర వండాలని భార్యకు చెప్పాడు. అయితే, మంగళవారం మాంసం తినకూడదని వాదించింది భార్య. ఈ విషయంపై ఇరువురు గొడవకు దిగారు. గొడవ పడుతున్న భార్యాభర్తలను గమనించిన పొరుగింటి వ్యక్తి బిల్లు.. వారి వద్దకు వెళ్లి సర్దిచెప్పాడు. తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. కానీ, బిల్లుపై కోపం పెంచుకున్న భర్త పప్పు.. అతడి ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో బిల్లు ప్రాణాలు కోల్పోయాడు. పప్పు భార్య ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదీ చదవండి: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి ఇచ్చారని.. రెస్టారెంట్కు నిప్పుపెట్టిన మందుబాబు.. -
భార్యా హంతకునికి జీవితఖైదు రద్దు: హైకోర్టు సంచలన తీర్పు
బనశంకరి: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో 2016లో వినాయక చవితి రోజున భార్య రాధ వంట చేయకుండా మద్యం తాగి పడుకుంది. కోపోద్రిక్తుడైన భర్త సురేశ్ కట్టెతో దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. 2017లో స్థానిక కోర్టు అతనికి యావజ్జీవిత ఖైదు శిక్ష విధించగా అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. అతడు ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేశాడు. హైకోర్టు ఏం చెప్పిందంటే మంగళవారం కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే.సోమశేఖర్, టీజీ శివశంకరేగౌడల ధర్మాసనం.. అతడు చేసింది ఉద్దేశపూర్వక హత్యగా పరిగణించలేమని పేర్కొన్నారు. ఈ నేరాన్ని హత్యగా భావించలేమని, కాబట్టి హత్యానేరం సెక్షన్ను తొలగించాలని స్పష్టంచేశారు. ఇప్పటికే 6 ఏళ్లు జైలుశిక్ష అనుభవించడంతో, అతనిపై ఎలాంటి కేసులు లేకపోవడంతో తక్షణం జైలు నుంచి విడుద చేయాలని ఆదేశించారు. (చదవండి: ప్రేమిస్తే చంపేస్తారు!) -
ప్రేమ పెళ్లి, విడాకులు.. అడ్డుగా ఉన్న బిడ్డను తొలగించుకునేందుకు, ప్లాన్!
ద్వారకాతిరుమల: వాళ్లిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పదిహేను నెలల్లోనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోవాలనుకున్నారు.ఇందుకు అడ్డుగా ఉన్న తమ నాలుగు నెలల వయసు గల మగబిడ్డను అమ్మేసి, వచ్చిన సొమ్మును పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బిడ్డ తల్లిదండ్రులు, తాత పోలీసులకు చిక్కారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి కొండపై గురువారం జరిగింది. కాకినాడకు చెందిన కేశినేని వసంత (20)కు తల్లిదండ్రులు లేరు. ఆమె రాజమండ్రిలో బైక్ షోరూంలో పనిచేస్తోంది. ఆమెకు రాజమండ్రిలోనే ఒక ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న పి.రారాజు(25)తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు. ఇటీవల భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమకు అడ్డుగా ఉన్న బిడ్డను అమ్మేసి, వచ్చిన డబ్బును పంచుకోవాలని భావించారు. ఈ మేరకు కుమారుడిని తీసుకుని రారాజు, వసంత, రారాజు తండ్రి ప్రసాద్ 25 రోజుల కిందట ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఒక వ్యక్తి ద్వారా భీమవరానికి చెందిన వృద్ధుడికి బాబును అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో పిల్లాడి కోసం కొండపైన శ్రీనివాసా నిలయం కాటేజీ ప్రాంతానికి చేరుకున్న వృద్ధుడిని రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రసాద్ డిమాండ్ చేశాడు. తాను డబ్బులు ఇవ్వబోనని, బాబును జాగ్రత్తగా పెంచుతానని ఆ వృద్ధుడు చెప్పుకొచ్చాడు. దానికి ప్రసాద్ ససేమిరా అనడంతో... కనీసం రూ.2లక్షలు ఇస్తే బాబును ఇస్తామని రారాజు చెప్పాడు. దీంతో రారాజు, అతని తండ్రికి మధ్య గొడవ జరిగింది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న చుట్టుపక్కల భక్తులు అక్కడికి చేరుకుని వారిని నిలదీశారు. దీంతో బాలుడి కోసం వచ్చిన వృద్ధుడు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బిడ్డతోపాటు రారాజు, వసంత, ప్రసాద్ను పోలీస్స్టేషన్కు తరలించారు. -
కలికాలం అంటే ఇదేనేమో భయ్యా.. నా భర్త జీతం ఎంతో చెప్పండి!
భారత సాంప్రదాయ పద్దతుల్లో భార్యాభర్తల బంధం ఎంతో విలువైంది. ఈ బంధం దృఢంగా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే లక్షణం ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. నాలుగు గోడల మధ్యే తేల్చుకోవాలని కానీ.. బయటకు రాకుండా చూసుకోవాలంటారు. అయితే, ఇక్కడ ఓ జంట మధ్య ఏ సమస్య వచ్చిందో ఏమో కానీ.. తన భర్త జీతం ఎంతో తెలుసుకునేందో ఓ భార్య ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. జీతం వివరాల కోసం ఏకంగా ఆర్టీఐRight To Information (RTI)నే ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. సంజూ గుప్తా అనే మహిళ తన భర్త జీతం వివరాలు కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఆర్టీఐ అధికారులు ఊహించని విధంగా షాకిచ్చారు. కాగా, భర్త అంగీకారం లేకుండా ఆదాయ పన్ను శాఖలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీపీఐఓ) వివరాలు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తపరిచిన సంజూ గుప్తా.. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించింది. వివరాల కోసం అక్కడ అప్పీల్ చేసుకుంది. అనూహ్యంగా అక్కడ కూడా ఆమె చేదు అనుభవమే ఎదురైంది. ఎఫ్ఏఏ కూడా సీపీఐఓ చెప్పిన సమాధానాన్నే సమర్థించింది. ఆ వివరాలు ఇచ్చేలా చూడాలంటూ ఈసారి ఆమె.. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(సీఐసీ)కు దరఖాస్తు చేసుకుంది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఆమెకు ఎట్టకేలకు సీఐసీ గుడ్న్యూస్ చెప్పింది. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న సీఐసీ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. 15 రోజుల్లోగా ఆమె భర్తకు సంబంధించిన జీతం వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉన్నప్పటికీ.. సంజూ గుప్తా ఇలా భర్త జీతం వివరాలు ఎందుకు అడగాల్సి వచ్చిందో అనేది మాత్రం తెలియరాలేదు. బహుషా వారి మధ్య ఆర్థికపరమైన విషయాల్లో గొడవలు వచ్చినట్టు తెలుస్తోంది. Sanju Gupta filed an RTI application to acquire the details of her husband’s gross and taxable income for two financial years.https://t.co/SwwjXedxZc — News18.com (@news18dotcom) October 3, 2022 -
సొంతింటికి ‘జంట’ దారి..!
సొంతింట్లో ఉన్నంత సంతృప్తి అద్దె ఇంట్లో లభించదు. కిరాయి ఇచ్చినంత మాత్రాన అన్ని హక్కులూ రావు. గోప్యత, ఇంటి వినియోగంలో స్వేచ్ఛ, బంధువుల రాకపోకలు ఇలా చెప్పుకుంటూ పోతే.. అద్దె ఇళ్ల విషయంలో ఎన్నో ప్రతికూల అంశాలున్నాయి. అందుకే నేటితరం పెళ్లికి ముందే లేదంటే పెళ్లయిన కొన్నాళ్లకే సొంతింటి వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు సొంతిల్లు అన్నది ఓ పెద్ద కల. కానీ, నేడు విశాలమైన (కనీస అవసరాల మేరకు) ఇల్లు అన్నది కలగా మారిందని చెప్పుకోవాల్సిందే. చదువుకునే పిల్లలు ఏకాంతం కోరుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే దంపతులు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇంట్లోనే తమకంటూ ప్రైవేటు స్థలం ఉండాలని భావిస్తున్నారు. కనుక మారుతున్న అవసరాల నేపథ్యంలో సొంతింటికి ప్లాన్ చేసుకునే వారు కనీసం టూ లేదా త్రీ బెడ్ రూమ్ ఉండాలంటున్నారు..! ఇల్లు విశాలంగా ఉండాలంటే భారీ మొత్తమే సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో దంపతులు ఇద్దరూ కలసి ఉమ్మడిగా గృహ రుణం (జాయింట్ హోమ్ లోన్) తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. అయితే, దీనికి ఎలా సిద్ధం కావాలి.. నిబంధనలు ఎలా ఉంటాయి.. వంటివన్నీ వివరించే కథనం ఇది.. చిన్న కుటుంబం అనుకున్నా భార్యా భర్త, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. వీరికి తోడుగా తల్లిదండ్రులు కూడా ఉంటే ఇల్లు కాస్త విశాలంగా ఉండాల్సిందే కదా. శివ, అపూర్వ దంపతులకు సైతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివ తల్లిదండ్రులు అతడితోనే ఉంటున్నారు. శివ పెళ్లయిన కొత్తలో తనకున్న బడ్జెట్తో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఇటీవల కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసుకోవాల్సి వచ్చింది. కానీ, అందరూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల్లో అతడికి ఏకాంతంతో కూడిన కాస్తంత స్థలం కరువైంది. అందుకనే అతడు త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడున్న ఒక్క పడకగది ఫ్లాట్ విక్రయించగా వచ్చే మొత్తాన్ని డౌన్ పేమెంట్ కింద జమ చేసి, మిగతా మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాలన్నది అతడి ప్రణాళిక. ఇలా కోరుకునే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. నగరంలో త్రిబుల్ బెడ్ రూమ్ అంటే భారీ పెట్టుబడి అవసరపడుతుంది. కనుక జాయింట్ హోమ్లోన్ ఆప్షన్ను పరిశీలించొచ్చు. దీనికి ముందు జాయింట్ హోమ్లోని సాధక, బాధకాల గురించి అవగాహన కల్పించుకుంటే, సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. నిబంధనలు – అర్హతలు చెల్లించే సామర్థ్యం ఉంటే ఒక్కరి పేరుమీదనే గృహ రుణాన్ని తీసుకోవచ్చు. కానీ, దంపతులు కలసి తీసుకోవడం వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీలైతే జాయింట్గానే చాలా మంది గృహ రుణానికి మొగ్గు చూపుతుంటారు. చాలా బ్యాంకులు సహ రుణ గ్రహీత కింద కుటుంబ సభ్యులనే అనుమతిస్తున్నాయి. ఒక వ్యక్తి తన తండ్రితో లేదంటే భార్యతో కలసి ఉమ్మడిగా రుణం తీసుకోవచ్చు. అలాగే, తండ్రి కూడా తన కుమారుడు, పెళ్లి కాని కుమార్తెతో కలసి రుణం పొందొచ్చు. ఇక ఇద్దరు సోదరీ మణులు, ఒక సోదరి ఒక సోదరుడు, వివాహిత అయిన కుమార్తెతో కలసి తండ్రి, స్నేహతులు ఉమ్మడిగా గృహ రుణం పొందడానికి అర్హత లేదు. జాయింట్ హోమ్ లోన్లో ప్రధాన రుణ గ్రహీత, సహ రుణ గ్రహీత ఉంటారు. సహ రుణ గ్రహీతలు రెండు రకాలు. ఎంత రుణం మంజూరు చేయాలన్న అర్హత కోసం సహ రుణ గ్రహీత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం ఇందులో ఒకటి. సహ రుణ గ్రహీత ఆదాయాన్ని సైతం రుణ అర్హతకు పరిగణనలోకి తీసుకోవడం రెండో రకం. ఉదాహరణకు రిటైర్ అయిన వారికి పెన్షన్ మినహా వేరే ఆదాయం ఉండదు. కనుక తల్లిదండ్రుల్లో ఒకరు ఆదాయం లేని సహ రుణ దరఖాస్తుదారుగా చేరొచ్చు. రుణానికి ఇద్దరు దరఖాస్తు చేసుకుంటుంటే, ఆ ప్రాపర్టీకి ఇద్దరూ సహ యజమానులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక ప్రాపర్టీకి భార్య, భర్త సహ యజమానులుగా ఉండేట్టు అయితే అప్పుడు బ్యాంకులు ఇద్దరి పేరిట జాయింట్ హోమ్ లోన్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కనుక ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇక జాయింట్ హోమ్ లోన్ అంటే ఇద్దరే తీసుకోవాలని లేదు. ముగ్గురు కూడా కలసి తీసుకోవచ్చు. ప్రయోజనాలు ఎన్నో.. ఉమ్మడిగా రుణం తీసుకుంటే ఎక్కువ మొత్తమే లభిస్తుంది. మంచి ఖరీదైన ఇంటికి ప్లాన్ చేసుకునే దంపతులు ఇద్దరూ వేతన జీవులు లేదా సంపాదనాపరులు అయితే ఇక బ్యాంకులు పిలిచి మరీ రుణం ఇస్తాయి. ఇద్దరి ఆదాయాన్ని అర్హత కింద లెక్కలోకి తీసుకుంటాయి. కనుక అధిక మొత్తాన్ని రుణం రూపంలో అందుకోవచ్చు. దీంతో తమ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఒక్కరి పేరు మీద రుణంతో పోలిస్తే ఇద్దరి పేరిట రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఎక్కువ మొగ్గు చూపుతాయి. ఎందుకంటే ఒకరి నుంచి కాకపోయినా, మరొకరి నుంచి అయినా రికవరీ చేసుకోవచ్చన్న ధీమాయే కారణం. పైగా ఇలా జాయింట్ హోమ్లోన్లో ఎగవేతలు చాలా తక్కువ. ఒకరికి ఇబ్బందులు వచ్చినా మరొకరు చెల్లింపుల బాధ్యతను తీసుకోగలరు. అందుకే బ్యాంకులకు, రుణ గ్రహీతలకు ఇది అనుకూల ఆప్షన్ అవుతుంది. పెద్ద మొత్తం వస్తుండడంతో చెల్లించే విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడదు. పైగా ఇంటి సౌకర్యాల విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్నా ఆదాయపన్ను ప్రయోజనాలకు ఢోకా ఉండదు. ఎక్కువ మందికి జాయింట్ హోమ్ లోన్ విషయంలో ఎదురయ్యే సందేహం ఇదే. కనుక ఈ సందేహం అక్కర్లేదు. విడిగా ఎవరికి వారు ఆదాయపన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటే.. ముందుగానే ఈఎంఐలో ఎవరి వాటా ఎంతో తేల్చుకోవాలి. నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి నెలా ఈఎంఐను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా జాయింట్ హోమ్ లోన్ విషయంలో పన్ను పరంగా ఓ ప్రత్యేక వెసులుబాటు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, విడిగా ఒక్కరే గృహ రుణం తీసుకుంటే, అసలు, వడ్డీ భాగాలకు ఆదాయపన్ను ప్రయోజనం పూర్తిగా పొందలేని పరిస్థితి ఉండొచ్చు. అటువంటప్పుడు ఇరువురు కలసి తీసుకోవడం వల్ల మిగులు ప్రయోజనాన్ని వేరొకరు సొంతం చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ఈఎంఐ వాటా మార్చుకుంటే సరిపోతుంది. ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ఇక అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద మినహాయించి చూపించుకోవచ్చు. ఈ పరిమితి ఎవరికి వారికే విడిగా అమలవుతుంది. చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మహిళా రుణ గ్రహీతలకు రుణ రేటులో కొంత తగ్గింపును ఇస్తున్నాయి. ఇందుకోసం ఇద్దరు దరఖాస్తుదారుల్లో ఒకరు మహిళ అయి ఉండాలి. ప్రధాన రుణ దరఖాస్తుదారుగా లేదా సహ రుణ దరఖాస్తుదారుగా ఉండొచ్చు. ప్రతికూలతలూ ఉన్నాయ్.. ► ఇద్దరు సహ రుణ గ్రహీతల్లో ఒకరికి ఆదాయం ఉన్నట్టుండి ఆగిపోతే, మరొకరు ఆ బాధ్యత తీసుకోవచ్చు. ఇది ఒక విధంగా అనుకూలం, మరో విధంగా ప్రతికూలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కరే తీసుకుని, ఆదాయం ఆగిపోతే డిఫాల్ట్ అవుతారు. ఈఎంఐ చెల్లించలేకపోతే రుణ చరిత్రపై నల్లటి మచ్చ పడుతుంది. ఉమ్మడిగా తీసుకుంటే ఈ ఇబ్బంది రాకుండా రెండో వారు చెల్లింపులతో ఆదుకుంటారు. దీనివల్ల ఒక్కరిపైనే మొత్తం ఈఎంఐ చెల్లింపుల భారం పడుతుందని మర్చిపోవద్దు. కాకపోతే ఇది మరీ పెద్ద ప్రతికూలత కాదనుకోండి. దురదృష్టవశాత్తూ ఇద్దరిలో ఒకరు శాశ్వతంగా సంపాదించలేని పరిస్థితులు ఎదురైతే తప్ప.. జాయింట్ హోమ్ లోన్లో తాత్కాలిక ఆదాయ నష్టాలను ఒక్కరే భారం మోయడం ద్వారా అధిగమించొచ్చు. కాకపోతే ఇందుకు ముందుగానే సిద్ధపడాలి. ► రుణ గ్రహీతల మధ్య విభేదాలు, స్పర్థలు తలెత్తితే సమస్య ఎదురుకావచ్చు. అప్పుడు ఇద్దరిలో ఒకరు ఈఎంఐ చెల్లించేందుకు నిరాకరించొచ్చు. దీనివల్ల క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. సిబిల్ స్కోర్ పడిపోతుంది. దీంతో భవిష్యత్తులో రుణం ఇచ్చేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ముందుకు రాకపోవచ్చు. రుణ చరిత్ర దెబ్బతినకూడదని అనుకుంటే, కష్టమైనా కానీ రెండో వ్యక్తి ఈఎంఐ భారాన్ని మోయాల్సి రావచ్చు. ఇలాంటి కేసులు తక్కువే ఉంటాయి. కీడెంచి మేలెంచమన్నట్టు.. ముందే ఈ విధమైన సమస్యలకు సన్నద్ధులు కావాలి. వీలైతే జాయింట్ హోమ్ లోన్ తీసుకునే సమయంలోనే ఒక అగ్రిమెంట్ రాసుకోవడం మంచిది. ► దంపతులు కలసి గృహ రుణం తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైనా కారణంతో విడిపోవాల్సి వస్తే..? అప్పుడు మిగిలిన గృహ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాపర్టీపై ఎవరి హక్కులు ఏ మేరకు? ఇలాంటి అంశాల్లో పక్కా స్పష్టత అవసరం. ఇందుకోసం ముందే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం ఎందుౖMðనా మంచిది. మరొకరు ఈఎంఐ భారం మోసి, చివర్లో ఇద్దరూ పంచుకోవడమా? లేక అంతటితో ముగించడమా..? ఇలా చాలా అంశాల్లో స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది. ముందే ఆయా అంశాలకు వచ్చి, న్యాయపరమైన సలహా ప్రకారం నడుచుకోవడం మంచింది. ► ఇక సహ రుణ గ్రహీతల్లో ఒకరు ఏదైనా కారణంతో మరణించినట్టయితే అప్పుడు ఏం చేయాలో ముందే ఆలోచించుకోవాలి. మిగిలిన దరఖాస్తుదారులపై రుణ ఈఎంఐ భారం పడుతుంది. ఇలా జాయింట్ హోమ్ లోన్లో ఏ కారణం వల్ల ఈఎంఐ చెల్లించకపోతే తీవ్ర సమస్యే. రుణం ఇచ్చిన సంస్థ ఇంటిని జప్తు చేసి వేలానికి పెడుతుంది. ఇక దంపతులు కలసి గృహ రుణం తీసుకున్న తర్వాత, వారిలో ఒకరు మరణించినట్టయితే.. మిగిలిన జీవిత భాగస్వామి మొత్తం ప్రాపర్టీలో ఒకటో వంతు వాటాకే హక్కుదారులు అవుతారు. మరో రెండు భాగాల్లో మరణించిన జీవిత భాగస్వామి తల్లిదండ్రులకు ఒక భాగం, పిల్లలకు ఒక భాగం లభిస్తుంది. ఉమ్మడిగా రుణం తీసుకునే ముందు, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా అధిగమించడంపై కార్యాచరణను ముందే సిద్ధం చేసుకోవాలి. -
బాహుబలి అంటే ఈయనే.. భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన భర్త
గోదారోళ్ళు అంటే భక్తి, ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు. ఊరికే మాటలు చెప్పడం కాదు చేతలతో చూపిస్తుంటారు. తాజాగా తన భార్యపై ఉన్న ప్రేమను ఓ భర్త ఇలా చూపించుకున్నాడు. ఆయన చేసిన పని చూసి పలువురు ప్రశంసలతో ముంచెత్తుతూనే ఆశ్చర్యానికి లోనవుతున్నారు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు) లావణ్య దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. ఈ క్రమంలో దర్శనం కోసం కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ సరదగా నడుస్తున్నారు. ఇంతలో.. వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని మెట్లు ఎక్కండి అంటూ సరదాగా సవాల్ చేసింది. దీంతో, భార్య సవాల్ను సీరియస్గా తీసుకున్న సత్తిబాబు.. ఆమెను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే మిగిలిన భక్తులు ఫొటోలు, వీడియోలు తీయడానికి పోటీపడ్డారు. అయితే, పెళ్లైన కొత్తలో ఇలాంటి ప్రేమలు సర్వసాధారణమే అని కొట్టి పడేయకండి. వీరికి పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. వీరిద్దరికీ 1998లో వివాహం జరిగింది. అంటే ఇరవై నాలుగేళ్లు. ఇక్కడ మరో విశేషం ఎంటంటే.. వీరి ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు కూడా చేశారు. తాత, అమ్మమ్మలు కూడా అయిపోయారు. కాగా.. వీరి పెద్ద అల్లుడు గురుదత్త(చందు)కు మంచి సాప్ట్ వేర్ ఉద్యోగం వస్తే పుట్టింటి, అత్తంటి వారందరనీ తిరుమల తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే సత్తిబాబు ఈ సాహసం చేశాడు. ఇక, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందరో యువ జంటలకు సవాల్ విసురుతోంది. అలాఅని.. తొందరపడి ఈ సాహసానికి అందరూ ప్రయత్నించకండోయ్.. తేడా వస్తే అసలుకే ఎసరు వస్తుంది. -
ఘోరం: కలుద్దామని పిలిచి... కత్తితో దాడిచేసిన ఇక్బాల్ షేక్
ఇటీవలకాలంలో పలు జంటలు ఏవేవో కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. దీంతో వారికి పుట్టిన పిల్లల విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడం తదనంతరం ఒకరినోకరు చంపుకునే స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ఇరు జీవితాలు నాశనమవ్వడం తోపాటు వారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసుల కథనం ప్రకారం...ముంబైలోని 36 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్ ఇక్బాల్ షేక్ హిందు మహిళ రూపాలిని 2019లో పెళ్లి చేసుకున్నాడు. రూపాలి అతన్ని పెళ్లి చేసుకోవడంతోనే తన పేరును జరా గా మార్చుకుంది. ఆ తర్వాత వారికి 2020లో ఒక కొడుకు జన్మించాడు. మొదట్లో అంతా బాగానే ఉంది. రానురాను ఇక్బాల్ బురఖా ధరించాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అందుకు అంగీకరించని రూపాలి తన కుమారుడిని తీసుకుని విడిగా ఉంటోంది. ఐతే ఇక్బాల్ షేక్ విడాకులు తీసుకునే విషయమై చర్చించేందుకు కలుద్దాం అంటూ ఆమెని పిలిపించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొడుకు కస్టడీ విషయమై వాగ్వాదం తలెత్తింది. అంతే ఒక్కసారిగా ఇక్బాల్ కోపంతో కత్తి తీసుకుని రూపాలిని పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి విలాస్ రాథోడ్ తెలిపారు. నిందితుడు ఇక్బాల్ షేక్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: యువకుడు సజీవ సమాధి...పోలీస్ ఎంట్రీతో తప్పిన ప్రమాదం) -
ముక్కలవుతున్న మూడుముళ్ల బంధం.. తాళి బంధాన్ని తెంచేస్తూ..
ధర్మేచ..అర్థేచ..కామేచ..మోక్షేచ..అహం ఏవం నాతిచరామి..అని పెళ్లి ప్రమాణం చేసి ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల బంధంలో రెండు మనసుల గుండె చప్పుడు ఏకమైతే వివాహ బంధం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. వివాహ బంధం అందమైన పుస్తకం లాంటిది. ఏదైనా జరిగే పొరపాటు పుస్తకంలో ఒక పేజీ మాత్రమే. అటువంటప్పుడు పుస్తకాన్ని సవరించుకోవాలి. పొరపాటు ఉందని మొత్తం పుస్తకాన్నే చించేయకూడదు. జీవితాంతం తోడుంటానని అగి్నసాక్షిగా తాళిబంధంతో ఒక్కటైన దంపతులు ముచ్చటగా మూడేళ్లయినా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సిన వారు అపోహలు, అనుమనాలతో విడిపోతూ తాళి బంధాన్ని ఎగతాళి చేస్తున్నారు. విజయనగరం: నీవే నా ప్రాణం, నీవు లేకపోతే చచ్చిపోతానంటూ పెళ్లి అయిన తొలినాళ్లలో ఎంతో ప్రేమ చూపే వారు..తర్వాత అన్నీ మరిచిపోయి ఒకరిని ఒకరు చీదరించుకుంటూ.. కోపగించుకుంటూ..చివరికి విడాకుల వరకు వెళ్తున్నారు. స్వల్ప కారణాలతో కొందరు కోర్టు మెట్లు ఎక్కుతుంటే, అవగాహన లేక కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు. గృహహింస విభాగం, పోలీసుల కౌన్సెలింగ్తో మరి కొందరు సర్దుకుపోతున్నారు. మరి కొందరైతే మూర్ఖంగా వ్యవహరిస్తూ భవిష్యత్తు అంధకారం చేసుకోవడంతో పాటు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, అప్యాయతలను దూరం చేస్తున్నారు. ఎన్ని కౌన్సెలింగ్లు ఇచ్చినా ఫలితం శూన్యం విభేదాలు వచ్చిన దంపతులను కలపడానికి ఎన్ని కౌన్సెలింగ్లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడడం వల్ల సంప్రదాయాలు, సత్ససంబంధాల గురించి తెలియడం లేదు. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకోకపోవడంతో పాటు కొందరు మొండిగా వ్యవహరిస్తున్న కారణంగా భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. నేను చెప్పిందే వినాలనే ధోరణిలో అధికంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. వారికి సర్దిచెప్పేందుకు పెద్దలు లేకపోవడం, ఒక వేళ ఉన్నా వారి దృష్టికి సమస్యలు తీసుకు వెళ్లేందుకు భార్యాభర్తలు ఇష్టపడని కారణంగా రోజురోజుకు విడాకుల పెరుగుతూ వస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడిపోవాలనుకునే భార్యాభర్తలకు పోలీసులు, గృహాహింస విభాగం కౌన్సిలర్లు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే కలిసి జీవించేందుకు ఇష్టపడుతున్నారు. మరి కొంతమంది విడాకులు తీసుకోవడంకోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వేరు కాపురాలపై యువతుల ఆసక్తి ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించేందుకుఅధికశాతం మంది యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్తమామాలు, అడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని అలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో కుమార్తె హాయిగా జీవించగలదనే భరోసా కల్పించలేకపోతున్నారు. ఎవరికి వారే మొండి పట్టు గతంలో సంప్రదాయలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏవైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్ధలను తొలగించడానికి కుటుంబ పెద్దలు ప్రయతి్నంచేవారు. అప్పటికీ మాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి భార్యభర్తలను ఒక్కటి చేసేవారు. ప్రస్తుతం వివాహ బంధం అందుకు విరుద్ధంగా ఉంది. గృహహింసకు వచ్చిన ఫిర్యాదుల వివరాలు 2006వ సంవత్సరంలో గృహహింస విభాగాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈఏడాది ఆగస్టు నెలాఖరు వరకు జిల్లాలో 858 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 150 మంది కౌన్సెలింగ్తో రాజీపడ్డారు. 128 మంది ఫిర్యాదులు ఉపసంహరించుకున్నారు. 580 ఫిర్యాదులు కోర్టులో కేసు ఫైల్ అయ్యాయి. వాటిలో 74 కేసులు కోర్టుకు హాజరైన తర్వాత రాజీ అయ్యాయి. మరో 93 కేసులు కోర్టులో విత్డ్రా అయ్యాయి. 107 కేసులు డిస్మిస్ అయ్యాయి. 72 కేసులు కోర్టులో పరిష్కారమయ్యాయి. 122 మంది విడాకులు తీసుకున్నారు. 78 మంది మనోవర్తి తీసుకుంటున్నారు. సర్దుకుపోయే గుణం అవసరం సర్దుకుపోయే గుణం భార్యాభర్తలు అలవర్చుకున్నప్పుడు కాపురం సాఫీగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న నెలకొన్న సల్ప వివాదాలకు సర్దిచెప్పేవారు ఆయా కుటుంబాల్లో నేడు ఉండడం లేదు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జి.మాధవి, లీగల్ కౌన్సిలర్, గృహహింస విభాగం -
అదే బావి.. నాడు భర్త, నేడు భార్య
సాక్షి, మొయినాబాద్ (రంగారెడ్డి): రెండేళ్ల క్రితం భర్త.. ప్ర స్తుతం భార్యను ఒకే బావి బలితీసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి పంచాయతీ అనుబంధ గ్రామం చాకలిగూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం చాకలిగూడకు చెందిన దగ్గుల వినోద (30) మంగళవారం పనిచేయంకోసం వ్యవ సాయ పొలం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న బావిలో ప్రమాదవశాత్తు జారిపడింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను గమనించలేదు. మంగళవారం రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. బంధువులకు ఫోన్ చేసి వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో గురువారం బావిలో వినోద మృతదేహం తేలి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రెండేళ్ల క్రితం వినోధ భర్త శ్రీనివాస్ కూడా అదే బావిలో నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. చదవండి: (మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి) -
టిక్టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య
సాక్షి, తిరుపతి: భర్త మరో అమ్మాయితో చనువుగా ఉన్నాడని తెలిస్తేనే తట్టుకోలేదు భార్య. అలాంటిది మరో పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తుందా? కానీ, ఇక్కడ సీన్ రివర్స్. భర్తకు ప్రియురాలిని ఇచ్చి భార్య దగ్గరుండి పెళ్లి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో జరిగింది. టిక్టాక్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. వెతుక్కుంటూ వచ్చిన యువతితో తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసింది. ఈ అరుదైన వివాహం గురించి తెలుసుకుందాం రండీ... డక్కిలి మండలం అంబేద్కర్ నగర్కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. టిక్టాక్లో విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిశాయి. ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు.. ఆ తర్వాత యువతి నుంచి యువకుడు దూరమయ్యాడు. కొద్దిరోజులు తర్వాత మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు. ఇంతలో ప్రియుడి కోసం కొన్నాళ్లు వేచిచూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి వచ్చింది. తన ప్రియుడికి ఇప్పటికే పెళ్లి జరిగిన విషయం తెలిసి బాధపడింది. కానీ, ఆ యువతి అంతటితో ఆగిపోలేదు.. తన ప్రేమికుడి భార్యను కలిసి మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని.. అందరం కలిసి ఉందామని నచ్చజెప్పింది. మొదటి భార్యకు ఏం చేయాలో పాలుపోలేదు. తొలుత అయోమయంలో పడినా.. చివరకు ముగ్గురూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి భార్య ఒప్పుకుంది. దీంతో భర్తతో కలిసి ప్రియురాలు పెళ్లి పీటలెక్కింది. భార్యే దగ్గరుండి భర్తతో ప్రియురాలికి వివాహం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: పాఠశాలనే మద్యం గోదాం.. లిక్కర్ మాఫియా పనితో టీచర్స్ షాక్! -
కట్టుకున్న భార్యే కాటికి పంపింది
యశవంతపుర: బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా హొసూరు వద్ద వ్యక్తి హత్యకు అక్రమ సంబంధమే కారణమని తేలింది. భార్యతో పాటు ఆమె ప్రియుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి రామదుర్గ తాలూకా హొసూరుకు చెందిన రైతు పాండప్ప (35) హత్యకు గురయ్యాడు. పాండప్ప, భార్య లక్ష్మీలు దంపతులు. లక్ష్మీకి రమేశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో పాండప్ప ఊరి నుంచి దూరంగా ఉన్న పొలంలోని షెడ్కు నివాసాన్ని మార్చాడు. దీంతో లక్ష్మి రమేశ్ను కలవడం కష్టంగా మారింది. పాండప్ప ఉంటే తాము జల్సాగా ఉండలేమని ఇద్దరూ భావించారు. రాత్రి నిద్రపోతున్న పాండప్పపై ఇద్దరూ బండరాయితో బాది హత్య చేశారు. శవాన్ని బైకుపై తీసుకెళ్లి సమీపంలోని కాలువలో పడేశారు. కోడలు, ఆమె ప్రియుడే ఈ హత్య చేశారని హతుని తండ్రి దుండప్ప ఫిర్యాదు చేశారు. (చదవండి: స్టేషన్లో గొడవతో హత్యకు సుపారీ) -
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
గార్లదిన్నె: భార్య పుట్టింటికి పోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన షాహినాకు గుంతకల్లు నివాసి జిలాన్ (38)తో వివాహమైంది. అదే గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకుని బేల్దారి పనులతో జీవనం సాగించేవారు. పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. శనివారం భర్త గొడవ పడడంతో షాహిన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన జిలాన్ అదే రోజు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి దుర్వాసన వెలువడుతుండడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఫ్యాన్కు వేలాడుతున్న జిలాన్ మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమేదార్ దేవకుమార్ తెలిపారు. (చదవండి: వింత మనుషులు..చీకటి గదిలో నుంచి వెలుగులోకి) -
హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి...
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: అనుమానం పెనుభూతమైంది. భర్త చేతిలో ఇల్లాలు హతమైంది. వివరాలను అనంతపురం నాల్గో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన బోయ రాజప్ప, సావిత్రి (50) దంపతులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. బతుకు తెరువు కోసం నాలుగేళ్ల క్రితం అనంతపురానికి వలస వచ్చారు. వాచ్మెన్గా, కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై రాజప్పకు అనుమానాలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అతను భార్యతో గొడవకు దిగాడు. రాజప్ప ఇటుక తీసుకుని సావిత్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో కుప్పకూలిన ఆమె కాళ్లు పట్టుకుని షెడ్లోకి లాక్కెళ్లి కొడవలితో తలపై నరికి హతమార్చాడు. శనివారం తెల్లవారుజామున రాజప్ప రుద్రంపేట బైపాస్ మీదుగా కాలినడకన వెళుతుంటే పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్ట్ చేసి, హతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. (చదవండి: పోలీసులమంటూ కిడ్నాప్లు) -
‘భార్యంటే.. వాడుకుని వదిలేసే వస్తువు కాదు’
ఆయనకు పెళ్లైంది. ముగ్గురు పిల్లలు. కానీ, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా హింసించాడు. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. భార్యను శాశ్వతంగా వదిలించుకుని ప్రియురాలికి దగ్గరయ్యేందుకు ‘విడాకుల’నే మాస్టర్ ప్లాన్ వేశాడు. పైగా భార్య తనపై దాడి చేసిందంటూ ‘వైవాహిక క్రూరత్వం’ కారణంగా చూపించాడు. మరి న్యాయస్థానం ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇచ్చిందంటే.. వివాహ బంధం.. ఏదో వస్తువును కొనుక్కున్నట్లు కాదు. భార్యంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు. మన సంప్రదాయం అది కానే కాదు. ఇప్పటి యువతరం మనస్తత్వాన్ని, పాటిస్తున్న ఆచార వ్యవహారాలను, సంప్రదాయపు అంశాలను పరిగణనలోకి తీసుకునే మేం ఈ వ్యాఖ్యలు చేస్తున్నాం. కొత్త తరం దాదాపుగా.. పెళ్లంటే ఒక అరిష్టంగా భావిస్తోంది. సహజీవన సంప్రదాయం పెరిగిపోతోంది. ఇది సమాజపు మనస్సాక్షిని ఇబ్బందికి గురి చేస్తోంది. WIFE అంటే.. ఈరోజుల్లో.. అంతా పెళ్లిని ఒక ‘చేదు’ అనుభవంగా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా స్వేచ్ఛ జీవితానికి, బాధ్యతలకు, విధులకు పెళ్లి ఒక ఆటంకంగా మారిపోయినట్లు ఫీలైపోతున్నారు. ఒకప్పుడు వైఫ్ అంటే Wise Investment For Ever అనే అర్థం ఉండేది. ఇప్పుడది Worry Invited For Everగా మారిపోయింది. 'యూజ్ అండ్ త్రో' అనే వినియోగదారుల సంస్కృతి మన వివాహ సంబంధాలను కూడా ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. విడిపోయినప్పుడు వీడ్కోలు చెప్పుకోవడానికే.. లివ్-ఇన్-రిలేషన్షిప్స్ అన్నచందాన మారిపోయింది పరిస్థితి. విడాకులతో నాశనం కాబడ్డ కుటుంబాల ఆర్తనాదాలు మొత్తం సమాజం మనస్సాక్షిని కదిలించే శక్తి ఉంది. విడాకుల కోసం కోర్టుకెక్కిన జంటలు, విడాకుల తర్వాత పిల్లలను విడిచిపెడుతున్నవాళ్లు, విడాకులు తీసుకున్నవారు.. పెరిగిపోతున్నప్పుడు.. కచ్చితంగా అది సామాజిక జీవితంలోని ప్రశాంతతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు అని కేరళ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ఏంటంటే.. కేరళ అలపుజ్జాకు చెందిన జంటకు సౌదీ అరేబియాలో స్థిరపడింది. 2009లో వివాహం జరగ్గా.. 2018లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాడు భర్త. తన భార్య తనపై దాడి చేసిందని, క్రూరత్వం కింద తనకు విడాకులు ఇప్పించాలని కోరాడతను. అయితే.. 2017 నుంచి ఓ మహిళతో తన భర్త వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడని, ప్రశ్నించినందుకే ఇలా తన నుంచి విడిపోవాలనుకుంటున్నాడని సదరు భార్య వాదనలు వినిపించింది. ఈ క్రమంలో భార్య క్రూరత్వాన్ని నిరూపించే సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడంతో క్ట్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్.. డైవోర్స్ యాక్ట్ 1869 ప్రకారం.. ఫ్యామిలీ కోర్టు ఆ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే.. అతని తల్లి మాత్రం కోడలి వైపే నిలబడింది. తన కొడుకు కోడలు, వాళ్ల పిల్లలతో మంచిగా బతకాలని పోరాడింది. మరోవైపు భార్య(38) కూడా తన భర్త వివాహేతర సంబంధాన్ని వదులకుని తనతో సంతోషంగా ఉంటే చాలనుకుంటోంది. దీంతో ఈ మొత్తం అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ హైకోర్టు బెంచ్.. పైన చెప్పిన విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని నొక్కి మరీ చెప్పి.. విడాకుల పిటిషన్ను తిరస్కరించింది. అంతేకాదు.. భార్యతో సజావుగా కాపురం చేసుకోవాలని సదరు భర్తకు సూచిస్తూ డివిజన్ బెంచ్ జస్టిస్ ముహమ్మద్ ముస్తాక్యూ, జస్టిస్ సోఫీ థామస్లు కీలక వ్యాఖ్యలతో ఆగస్టు 24వ తేదీన తీర్పు ఇచ్చారు. ఇదీ చదవండి: డాక్టర్ కోసం పడిగాపులు.. కన్నతల్లి ఒడిలోనే పసికందు మృతి -
SPSR Nellore Double Murder: ఎవరు? ఎందుకు?
నెల్లూరు(క్రైమ్): ఆ దంపతులను గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం నెల్లూరులో కలకలం రేపింది. ఈ హత్యలను ఎవరు? ఎందుకు చేశారని తెలుసుకునేందుకు పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం ఇందుగపల్లి గ్రామానికి చెందిన వాసిరెడ్డి కృష్ణారావు (54), వాసిరెడ్డి సునీత (50)లు దంపతులు. వారికి సాయిచంద్, గోపీచంద్ పిల్లలు. దంపతులు సుమారు 26 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికొచ్చారు. తొలినాళ్లలో కరెంటాఫీస్ సెంటర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటూ అదే ప్రాంతంలో శ్రీరామ్ క్యాంటీన్ (హోటల్)ను ప్రారంభించారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి వివాహాలు చేశారు. పెద్ద కుమారుడు పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు గోపీచంద్ రాంజీనగర్లో నివాసముంటూ పొగతోటలో మధుర హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా కృష్ణారావు పడారుపల్లి అశోక్నగర్ (ఏఎన్ఆర్ కల్యాణ మండపం సమీపంలో) డూప్లెక్స్ హౌస్ను నిర్మించాడు. ఆరేళ్లుగా భార్యతో కలిసి అక్కడ నివాసముంటున్నాడు. అందరితో మర్యాదపూర్వకంగా ఉండేవారు. ఎవరితోనూ విభేదాల్లేవు. రోజూ తెల్లవారుజామున ఐదు గంటలకు కృష్ణారావు ఇంటి నుంచి హోటల్కు వెళ్లేవాడు. భార్య ఇంట్లో పనులు పూర్తి చేసి ఉదయం 11 గంటలకు హోటల్కు వెళ్లి సాయంత్రం వరకు ఉండేది. కృష్ణారావు మాత్రం రాత్రి 11.30 గంటలకు ఇంటికొచ్చేవాడు. ఆమె కేకలు వేయడంతో.. అదే ప్రాంతానికి చెందిన పాల వ్యాపారి రమణమ్మ రోజూ ఉదయం కృష్ణారావు దంపతులకు పాలు పోసేది. ఎప్పటిలాగే రమణమ్మ ఆదివారం ఉదయం పాలు పోసేందుకు వెళ్లింది. వరండాలో కృష్ణారావు మృతిచెంది ఉండడాన్ని గమనించిన ఆమె కేకలు వేస్తూ అక్కడి నుంచి వీధిలోకి పరుగులు తీసింది. స్థానికులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర ఇన్చార్జి డీఎస్పీ అబ్దుల్ సుభాన్, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. స్థానికుల ద్వారా పడారుపల్లిలో నివాసముంటున్న కృష్ణారావు అన్న సుధాకర్రావుకు సమాచారం అందించారు. ఆయన ద్వారా మృతుడి కుమారుడు గోపీచంద్కు విషయం చెప్పారు. ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా రక్తపుమడుగులే దర్శనమిచ్చాయి. నగదు కోసం మాత్రమేనా.. కృష్ణారావు స్కూటీని ఇంటి బయట పార్క్ చేసి లోనికి వచ్చే సమయంలో వరండాలో హతమార్చారు. మృతుడి జేబులోనో.. చేతులోనో ఉండాల్సిన బైక్ తాళాలు కప్బోర్డులో ఉండడాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇంటిపై గదిలోని బీరువాలో హోటల్కు సంబంధించిన రోజువారి కలెక్షన్ను, ఆస్తికి సంబంధించిన విలువైన పత్రాలు ఉంచుతారని బంధువులు పేర్కొన్నారు. కింద పడకగదిలోని బీరువాలో బంగారు ఆభరణాలుంటాయి. దాన్ని పగులగొట్టేందుకు దుండగులు యత్నించారు. అయితే సాధ్యం కాకపోవడంతో పైగదిలోని బీరువాను పగులగొట్టారు. అందులో ఉన్న నగదు మాత్రమే అపహరించారా? డాక్యుమెంట్లనూ తీసుకెళ్లారా? అనే అంశాలపై స్పష్టత లేదు. హత్యలు దోపిడీలో భాగమేనని అందరూ భావిస్తున్నా ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలోనూ ఇదే ఇంట్లో దొంగలు చోరీకి యత్నించారు. తాళం పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ఘటనా స్థలాన్ని ఎస్పీ సీహెచ్ విజయారావు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హత్య కేసు ఛేదించాలని ఆదేశించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ, సీసీఎస్ డీఎస్పీలు అబ్దుల్ సుభాన్, శివాజీరాజ్ల పర్యవేక్షణలో వేదాయపాళెం, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు కె.నరసింహారావు, గంగాధర్లు తమ సిబ్బందితో కలిసి విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి ఆరాతీస్తున్నారు. గోపీచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జీజీహెచ్లో ప్రభుత్వ వైద్యులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించగా వారు తమ స్వగ్రామానికి తరలించారు. సోమవారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖాళీ స్థలం వరకు వెళ్లి.. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. హత్య జరిగిన ఇంటి నుంచి పోలీసు జాగిలం సమీపంలోని ఖాళీ స్థలం వరకు వెళ్లి వెనుదిరిగింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా రక్తపుమరకలతో ఉన్న కత్తి, సవకకర్రను, అపహరణకు గురైన రెండు సెల్ఫోన్లలో ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే.. శనివారం రాత్రి కృష్ణారావు ఆదివారం హోటల్కు అవసరమైన కూరగాయలు తీసుకురావాలని అక్కడ పనిచేసే మణికి సూచించాడు. 11.30 గంటల ప్రాంతంలో పనులు ముగించుకుని తన వద్ద పనిచేస్తున్న మరో వ్యక్తి వంశీని స్కూటీలో ఎక్కించుకుని నిప్పో సెంటర్లో వదిలిపెట్టి ఇంటికెళ్లాడు. అప్పటికే గుర్తుతెలియని దుండగులు సునీతను హత్య చేశారు. పైఅంతస్తులోని బీరువాను తెరిచి నగదు దోచుకుని వెనుదిరిగారు. ఈక్రమంలోనే కృష్ణారావు ఇంటికి చేరుకుని స్కూటీని బయట పార్క్ చేసి లోనికెళ్తుండగా వరండాలో దుండగులు అతడిని అడ్డుకుని గొంతుకోసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతుల సెల్ఫోన్లతో పరారయ్యారు. -
మిస్సింగ్ కాదు.. డబుల్ మర్డర్!
దేవరకద్ర రూరల్: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం పేరూర్లో భార్యాభర్తల మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఎనిమిదేళ్ల తర్వాత పోలీసులు ఛేదించారు. దంపతుల అదృశ్యాన్ని హత్యగా తేల్చారు. వివాహేతర సంబంధమే అందుకు కారణమని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ రజితరెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం దేవరకద్ర మండలంలోని ఇస్రంపల్లికి చెందిన బుర్రన్ పేరూర్లో తన బావమరుదులు నానేష్, మహమ్మద్ రఫీతో కలిసి బొగ్గు అమ్మేవాడు. ఈ క్రమంలో పేరూర్కే చెందిన దంపతులు బోయ శాంతమ్మ (32), బోయ ఆంజనేయులు (37)తో బుర్రన్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బుర్రన్ దగ్గర వారు రూ. 20వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చాలంటూ బుర్రన్ తరచూ వారి ఇంటికి వెళ్లే క్రమంలో శాంతమ్మతో బుర్రన్ వివాహేతర సంబ«ం«ధం ఏర్పర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు తన భార్యతో మాట్లాడితే చంపుతానని బుర్రన్ను హెచ్చరించాడు. అడ్డొస్తున్నాడని.. గొంతు నులిమి.. తన వద్ద తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతోపాటు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఆంజనేయులును హతమార్చాలని బుర్రన్ నిర్ణయించుకున్నాడు. 2014 ఏప్రిల్ 19న మాట్లాడుకుందామంటూ ఆంజనేయులను పెద్దమందడి మండలంలోని పెద్దమునగల్ చేడ్ గ్రామ శివారులోని ఓ పొలం వద్దకు తీసుకెళ్లి నానేష్, రఫీతో కలసి గొంతు నులిమి చంపాడు. అనంతరం ఈ విషయాన్ని శాంతమ్మకు చెప్పాడు. ఆమె ఈ హత్యోదంతాన్ని బయటకు చెబుతాననడంతో బావమరుదుల సాయంతో ఆమెను గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి చీర కొంగును గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. ఈ హత్యలు బయటపడకుండా ఉండేందుకు మృతదేహాలను పూడ్చి పెట్టారు. డీఎన్ఏ పరీక్షతో కేసు ఛేదన.. 2020 ఏప్రిల్ 17న మండలంలోని పేరూర్ శివారులో శ్మశానవాటిక నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా ఓ చీర, ఎముకలు బయటపడ్డాయి. ఈ సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు... గత పదేళ్లలో తప్పిపోయిన మహిళల సమాచారాన్ని సేకరించే క్రమంలో శాంతమ్మ పేరు రావడంతో మృతురాలి కుమారుడు శ్రీకాంత్కు డీఎన్ఏ టెస్టు చేశారు. అది ఎముకలతో సరిపోలడంతో మృతి చెందింది శాంతమ్మగా నిర్ధారించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు సర్పంచ్ను కలిసి నిజం చెప్పారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో నిందితుడు రఫీ ఏడాది క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. -
Bheemeshwari- Naveen: కన్నీరు పెట్టిస్తున్న ప్రేమకథ
సాక్షి, నారాయణపేట: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పేదరికం వెంటాడుతున్నా ఇరు కుటుంబాలకు దూరంగా వెళ్లి బతుకు బండిని సాగిస్తున్నారు. అంతలోనే విధి వక్రీకరించింది. ఓ పాపకు జన్మనివ్వగానే ఆ తల్లి కన్నుమూసింది. భార్య మరణం తట్టుకోలేని భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టిన పసిబిడ్డ అనాధ అయ్యింది. వివరాల్లోకెళ్తే.. నారాయణ పేట జిల్లా మఖ్తల్కు చెందిన నవీన్, అదే గ్రామానికి చెందిన భీమేశ్వరి ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్తే వారు పెళ్లికి నిరాకరించారు. అంతేకాకుండా భీమేశ్వరి 2021 మేలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ పెళ్లి ఇష్టంలేని యువతి రెండు నెలలకే నవీన్కుమార్తో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ కుటుంబ సభ్యులకు దూరంగా హైదరాబాద్లోని మౌలాలిలో ఉంటున్నారు. ఆగస్టు 18న భీమేశ్వరి పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేర్చారు. అదే రోజు రాత్రి ఓ పాపకు జన్మనిచ్చిన భీమేశ్వరి.. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ సంజీవయ్య పార్కు వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టిన పసిబిడ్డ అనాధగా మారింది. చదవండి: (కొత్త కాపురంలో విషాదం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం) -
పిల్లలు చూస్తుండగానే భార్య గొంతు కోసి...
సాక్షి , హైదరాబాద్: భార్యను అర్ధరాత్రి కన్నకొడుకు , కూతురు చూస్తుండగానే గొంతు కోసి దారుణంగా హతమార్చిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా, రామగుండం ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన కంది చంద్రయ్య కుమార్త పుస్తకాల దివ్య భారతి(32)కి అంబర్ పేట ప్రాంతానికి చెందిన దీపక్ కుమార్తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరు కుర్మానగర్లో కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు సంతానం అనంత్ కుమార్(11), దీక్షిత(7) ఉన్నారు. కాగా దీపక్ కుమార్కు ఇంతకు ముందే పెళ్లి జరిగింది. ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన విషయాన్ని గోప్యంగా ఉంచి దివ్య భారతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా అతను అదనపు కట్నం తేవాలని భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త తోపాటు అత్త, ఆడపడచు, ఆడపడచు భర్త సైతం వేధింపులకు గురి చేసేవారు. దీంతో బాధితురాలు ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. పోలీసుల కౌన్సెలింగ్, పెద్దల అంగీకారంతో ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు. మళ్లీ వేధింపులు తీవ్రం కావడంతో దివ్యభారతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. దీపక్ను పిలిపించిన పోలీసులు హెచ్చరించి పంపారు. ఇటీవల మళ్లీ గొడవ జరగడంతో గత కొన్నాళ్లుగా దీపక్ ఇంటికి రావడం లేదు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన దీపక్ భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో భార్యను ఇటుకతో తలపై బాదాడు. దీంతో ఆమె కుప్పకూలగానే కూరగాయల కోసే కత్తితో పిల్లలు చూస్తుండగానే గొంతు కోసి పారిపోయాడు. దీంతో భయాందోళకులోనైన పిల్లలు చుట్టు పక్కల వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికి దివ్య భారతి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లికి ముందే భార్యకు వివాహేతర సంబంధం!.. రెండుసార్లు హత్యాయత్నం.. చివరికి) -
ఇంటి యజమానితో భార్య వివాహేతర బంధం..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. వేరే వ్యక్తితో ఉండడాన్ని కళ్లారా చూసి జీర్ణించుకోలేకపోయాడు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కమీషన్ విషయంలో రియల్టర్లు మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య, పిల్లలు దూరం కావడంతో మహిళలపై ద్వేషం పెంచుకుని సైకోలా మారాడు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని కడతేర్చాడు. నగర శివారు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన వరుస హత్యలకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. భార్య వివాహేతర బంధంతో కుమిలిపోయి... చందక రాంబాబు అలియాస్ సందక రాంబాబు (49) కోటవురట్ల మండలం ధర్మసాగరం గ్రామ నివాసి. 2006లో జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అనంతరం 2013లో ఒంటిరిగా విశాఖపట్నం వచ్చి విమాననగర్లో ఉండేవాడు. భార్య, పిల్లలు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ, హైదరాబాద్లోని భరత్నగర్లో నివసించేవారు. 2015లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనికి చేరిన రాంబాబు అప్పుడప్పుడూ హైదరాబాద్ వెళ్లి భార్య, పిల్లలను చూసేవాడు. ఈ క్రమంలో అతని భార్య హైదరాబాద్లో వారు నివసిస్తున్న ఇంటి యజమానితో వివాహేతర బంధం ఏర్పరచుకోవడంతో కుమిలిపోయాడు. భార్యతో గొడవ పడి 2018 మే 21న భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి కుమారుడు, కుమార్తె కూడా రాంబాబును విడిచి పెట్టేసి తల్లి వద్దే ఉంటున్నారు. ఒంటరితనం... స్త్రీలపై పగతో... భార్య, పిల్లలకు దూరమైన రాంబాబు ఒంటరిగా మారాడు. 2021 అక్టోబర్లో పెందుర్తి సమీప ప్రశాంతినగర్లో అద్దెకు ఇల్లు తీసుకుని నివసించేవాడు. అయితే ఏ పనికీ వెళ్లకపోవడంతో అద్దె చెల్లించలేక ఇల్లు విడిచి బస్టాప్లో ఆశ్రయం పొందాడు. సమీపంలోని ఫంక్షన్ హాల్స్, దేవాలయాల వద్ద భోజనం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో భార్య ప్రవర్తన కారణంగా రాంబాబు స్త్రీలపై పగ, ద్వేషం పెంచుకున్నాడు. మహిళలను కొట్టి, దారుణంగా చంపి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక స్క్రాప్ దుకాణం నుంచి ఇనుప రాడ్డు దొంగలించాడు. ముందుగా గత నెల 9న పెందుర్తి బృందావన్ గార్డెన్స్లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో పనిచేస్తున్న 50 ఏళ్ల తోట నల్లమ్మ, ఆమె కుమారుడు నిద్రపోతుండగా దాడి చేసి గాయపరిచాడు. అనంతరం ఈ నెల 6న రాత్రి పెందుర్తి చినముషిడివాడ సప్తగిరినగర్లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న సుతారి అప్పారావు, సుతారి లక్షి్మపై ఇనుప రాడ్డుతో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. తర్వాత ఈ నెల 14న రాత్రి పెందుర్తి సుజాతనగర్ నాగమల్లి లే అవుట్, లాలం రెసిడెన్సీ సెల్లార్లో అపార్టుమెంట్ వాచ్మెన్గా ఉంటున్న అప్పికొండ లక్ష్మిని దారుణంగా హత్య చేశాడు. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే... రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేసినప్పుడు కమీషన్ విషయంలో బిల్డర్లు తనను మోసం చేయడంతో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే దాడులు, హత్యలకు పాల్పడాలని చందక రాంబాబు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే జన సంచారం తక్కువగా ఉండడం, సరైన భద్రత లేని అపార్టుమెంట్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి హత్యాంకాండకు పాల్పడ్డాడు. దీంతో వరుస హత్యలపై పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు కోసం పలు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ పుటేజ్, సాంకేతిక ఆధారాలు క్షుణంగా పరిశీలించారు. అన్ని కోణాల నుంచి ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అనంతరం రిమాండ్కు తరలించారు. సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
పిల్లల్ని బాగా చూసుకో..
కుత్బుల్లాపూర్: నాకు బతకాలని లేదు.. నా భర్త మంచోడు.. ఇంకో పెళ్లి చేసుకో..పిల్లలని బాగా చూసుకో.. అంటూ ఓ మహిళ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్బరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది . పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరిజిల్లా, మందపల్లి గ్రామానికి చెందిన చుక్క శ్రీను, దేవి (32) దంపతులు నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్లోని పద్మానగర్ ఫేస్–2 సంజీవయ్యనగర్లో ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీను ఆటోడ్రైవర్గా పని చేస్తుండగా, దేవి షాపింగ్ మాల్లో సేల్స్ ఉమెన్గా పని చేసేది. మంగళవారం షాపింగ్ మాల్లో పనికి వెళ్లిన దేవి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచి్చంది. ఇంట్లో ఉన్న భర్తతో తనకు కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో అతను మందులు తెచ్చి ఇచ్చి ఆటో తీసుకుని బయటికి వెళ్లాడు. సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా దేవి ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. స్థానికుల సాయంతో కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహం పక్కనే సూసైడ్ లెటర్ కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పేట్బïÙరాబాద్ ఎస్ఐ రామకృష్ణ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వంచన! ) -
కోర్టు ఆవరణలోనే భార్యపై కత్తితో దాడి...
పెద్దలు కుదిర్చిన వివాహమైన లేదా ఇష్టపడి పెళ్లి చేసుకున్న చాలా జంటలు ఏవో చిన్న సమస్యలతో విడిపోతున్నారు. అంతవరకు భాగానే ఉంది. కానీ కక్ష్య పెంచేసుకుని చంపుకునేంత కిరాతకానికి ఒడిగట్టి ఇరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో వారికి పుట్టిన సంతానం అనాథలుగా మిగిలిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....కర్ణాటకకు చెందిన చైత్ర, శివ కుమార్ అనే ఒక జంట విడిపోవాలనుకుని కోర్టులో కేసులు వేసుకున్నారు. వీరికి పెళ్లై ఏడేళ్లయింది, ఒక పాప కూడా ఉంది. ఐతే తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకోవాలను ఇద్దరు నిర్ణయించుకున్నారు అందుకోసం ఆ జంట శనివారం లోక్ అదాలత్ని సంప్రదించారు. దీంతో ఆ జంటకి శనివారం అక్కడున్న అధికారులు ఒక గంటపాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ తదనంతరం చైత్ర కోర్టు ఆవరణలో ఉన్న వాష్రూమ్కి వెళ్తుండగా శివకుమార్ ఆమె వెంటపడి కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు. అతను అక్కడితో ఆగక ఆమె వద్ద ఉన్న చిన్నారి పై కూడా కత్తి దూసేందుకు యత్నించాడు. ఈ ఘటన ఈ జంట విడాకుల కేసును విచారిస్తున్న హోలెనరసిపుర టౌన్ కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. ఐతే ఈ హఠాత్పరిణామానికి పక్కనే ఉన్నవారు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే చైత్రకు తీవ్రగాయాలు కావడంతో హోలెనర్సిపుర నుంచి అంబులెన్స్లో హాసన్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. (చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి) -
భర్త మోసాన్ని జీర్ణించుకోలేక... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య
భార్యభర్తల గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. అవి ఓ మాదిరిగా ఉన్నంత వరకు ఓకే. గానీ శృతీ మించితే ఇరువురికి ప్రమాదమే. ఐతే ఇక్కడోక జంట కూడా అట్లానే పోట్లాడుకుంటున్నారు. దీంతో సదరు మహిళ ఓపిక నశించపోయి భర్త తీరుని బహిరంగంగా అందరికి తెలియపర్చాలనుకుంది. అందుకోసం ఏం చేసిందో వింటే అమో! అని నోరెళ్లబెడతారు. ఏం జరిగిందంటే....ఆస్ట్రేలియాలోని జెన్నీఅనే మహిళ తన భర్త స్టీవ్ తనను మోసం చేస్తూ... వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని జెన్నీ అతన్ని ఎలాగైన అవమానించుకోవాలని కంకణం కట్టుకుంది. అందుకోసం అని ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ వారపత్రిక (వీక్లీ మ్యాగజీన్) 'మాకే అండ్ విట్ సండే లైఫ్' లో బహిరంగంగా భర్త గురించి ఒక ప్రకటన ఒకటి ఇచ్చింది. అందులో ప్రియమైన స్టీవ్ నువ్వు ఇప్పుడు ఆమెతో చాలా సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాను. నువ్వు ఎంత నీచమైన మోసగాడివో అందరికి తెలిసిపోతుంది అని వారపత్రికలోని ఒక ఫుల్ పేజ్లో అతడి గురించి బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఆమె అ్కడితో ఊరుకోకుండా ప్రకటన చివరల్లో ఇంకో షాక్ ఇచ్చింది. ఈ ప్రకటనను నీ క్రెడిట్ కార్డును ఉపయోగించే ఇచ్చానంటూ.. తన భర్త స్టీవ్కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇది చదివిన పాఠకులలో ఉత్సుకతను పెంచి ఆమె ఎవరు ఎందుకలా మోసం చేశాడంటూ ఆత్రుతతో సదరు మ్యాగజీన్ కార్యాలయానికి ప్రత్యుత్తరాలు రాశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఈ విషయమై పలు పోస్టుల రూపంలో ప్రశ్నల వెల్లువెత్తినట్లు ప్రముఖ వీక్లీ మ్యాగజీన్ నిర్వాకులు తెలిపారు. సదరు వారపత్రిక తమకు స్టీవ్ గురించి తెలియదని పాఠకులకు వివరణ ఇచ్చింది. పైగా అతను చెడ్డవాడని మాత్రం చెప్పింది. ఇకపోతే జెన్నీ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించమని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటనను ఆమె క్రెడిట్ కార్డుతో డబ్బులు చెల్లించలేదని కూడా స్పష్టం చేసింది. ఏదీఏమైన జెన్నీ బహిరంగ ప్రకటన ఒక పెద్ద తుపాను సృష్టించింది. పలువురు పాఠకులు మాత్రం జెన్నీ మీకు మంచి జరగాలి, అతనికి తగిన శాస్తి చేశారంటూ ఆమెను పొగడ్తలతో ముంచేత్తారు. (చదవండి: చిరుతకు రాఖీ కట్టిన మహిళ: ఫోటో వైరల్) -
భార్యను ఏడు గంటల పాటు చెట్టుకి కట్టి...చిత్రహింసలకు గురి చేసి...
చిన్న అనుమానం తలెత్తిన భార్యలపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంతమంది వ్యక్తులు. వాస్తవం తెలుసుకునేందుకు యత్నించకుండా ఇరు జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మహిళల భద్రతకై ఎన్ని చట్టాలను ప్రభుత్వ యంత్రాంగం తీసుకువచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టవేయలేక పోతున్నాం. ఇక్కడొక వ్యక్తి అలానే కట్టుకున్న భార్య పై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే....రాజస్తాన్లోని బన్స్వారా జిల్లాలో ఓ మహిళను ఆమె భర్త, భర్త తరుపు ఇతర బంధువులు ఆమెను చెట్టుకి కట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆ మహిళ దెబ్బలకి తాళలేక కేకలుపెడతూనే ఉంది. అసలేం జరిగిందంటే ఆమెను తన స్నేహితుడితో ఉండటం చూసిన సదరు వ్యక్తి ఆగ్రహవేశాలకు లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో కనిపించిన వ్యక్తిని కూడా చెట్టుకు కట్టి ఇలానే హింసించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బీజేపీ నేతలు రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శల ఎక్కుపెట్టారు. దీంతో ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) రాజస్తాన్ డీజీపీకి లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయడమే కాకుండా బాధితురాలికి తగిన వైద్యం అందించి, భద్రత కల్పించాలని అధికారులను కోరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి భర్త, బావతో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: పార్ట్ టైం పని అని రూ.3 లక్షలు టోపీ ) -
చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త... కోపంతో కాల్చి చంపిన మహిళ
భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వాళ్ల పిల్లల సంరక్షణ కోసం డే కేర్ సెంటర్లో పెట్టక తప్పని పరిస్థితి. ఉద్యోగరీత్యానే కాకుండా చిన్నచిన్న కుటుంబాలు కావడం, ఇంట్లోని పెద్దవాళ్లు కూడా చూసే అవకాశం లేకపోవటం తదితర కారణాల వల్ల చాలామంది తల్లిదండ్రులు ఈ డే కేర్ సెంటర్లనే ఆశ్రయిస్తున్నారు. ఎంత డబ్బైన పర్లేదని పెద్ద మొత్తంలో ఈ సెంటర్లకి ఖర్చుపెట్టి మరీ తమ పిల్లలను ఉంచుతున్నారు. అలాంటి సెంటర్లో కూడా అభం శుభం తెలియని చిన్నారుల పై లైంగిక దాడులు జరుగుతున్నాయంటే ఏమనాలి. రక్షణ అనేపదానికి అర్థం వెతుక్కోవాల్సిన స్థితికి వచ్చేస్తున్నాం. అచ్చంల అలానే అమెరికాలోని ఒక డే కేర్ సెంటర్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....యూఎస్లోని వాషింగ్టన్లో మాండరిన్ ఓరియంటల్ హోటల్లో ఉంటున్న ఒక జంట డేకేర్ సెంటర్ నడుపుతోంది. అయితే భర్త జేమ్స్ వీమ్స్ జూనియర్ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అతడి భార్య శాంతేరీ వీమ్స్ గుర్తించింది. ముగ్గురు చిన్నారులపై దారుణైన అఘాయిత్యాలకు పాల్పడటంతో ఆమె సహించలేకపోయింది. దీంతో ఆమె ఈ విషయమై అతడిని గట్టిగా నిలదీసింది. కొద్దిసేపు వారి మధ్య ఘర్షణతో కూడిన వాతావరణం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆమె అతడిని తుపాకితో కాల్చి చంపింది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే అతను పిల్లలను లైంగికంగా వేధించడని ఆరోపణలు చేస్తూ...అందువల్లే తన భర్తను హత్య చేశానని ఆమె చెప్పింది. వారు ఉన్న గదిలో పోలీసులకు దొరికిన ఒక డైరీ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ డైరీలో..తన భర్త ముగ్గురి పిల్లల జీవితాలను నాశనం చేశాడని, పలువురి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు రాసి ఉందన్నారు పోలీసులు. అంతేకాదు ఒక వ్యక్తిని పక్షవాతం వచ్చే వరకు ఎలా కాల్చాలో కూడా వివిరించి ఉందని చెప్పారు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు ఆ మహిళ తాను నేరం చేశానని అంగీకరించటం లేదు. దీంతో పోలీసులకు ఈ కేసు అత్యంత సవాలుతో కూడిన మిస్టరీగా ఉంది. ప్రస్తుతం ఈ విషయమై యూఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేకాదు సదరు నిందితురాలు ప్రాథమిక విచారణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉందని కూడా చెప్పారు. (చదవండి: అంత ఘోరంగా చంపాడు.. వాడి ఉరి దేశమంతా చూడాలి) -
జీన్స్ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ
ఇటీవల కాలంలో చాలాచిన్న చిన్న విషయాలే ఘోర తప్పిదాలుగా కనిపిస్తున్నాయి. సామరస్య పూర్వకంగా మాట్లాడుకుని పరిష్కారించుకునే దిశగా ఆలోచించడం మాని ప్రాణాలు తీసుకునేంత కోపాలు తెచ్చుకుంటున్నారు. చివరికి ఇరు జీవితాలను నాశనం చేసుకుని కుటుంబికులకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఘోరమైన దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకెళ్తే...జార్ఘండ్కి చెందిన ఒక జంట గోపాల్పూర్ గ్రామంలో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది. ఐతే ఆ జాతర చూసి ఇంటికి తిరిగి వచ్చాక భార్యభర్తలిద్దరూ తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. ఇంతకీ ఆ దపంతులకు గొడవకు కారణం జీన్స్ వస్తధారణ. ఆమె జీన్స్ ధరించి జాతరకు వచ్చిందని ఆమెను దూషించడం మొదలు పెట్టాడు భర్త. అయినా పెళ్లి తర్వాత మహిళలు జీన్స్ ధరించకూడదంటూ భార్యతో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. భర్త తీరుకి కోపంతో ఊగిపోయిన అతడి భార్య కత్తి తీసుకుని అతని పై దాడి చేసింది. దీంతో వెంటనే అతడి కుటుంబసభ్యులు హుటాహటినా ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు బాధితుడి తండ్రి కర్ణేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. జీన్స్ విషయంలో కొడుకు కోడలు మధ్య వాగ్వాదం వచ్చిందని, ఆ కోపంలోనే తన కోడలు కొడుకుని చంపేసిందని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: జస్టిస్ ఫర్ శ్రీమతి: టీచర్లు హరిప్రియ, కృతిక అరెస్ట్) -
ఆషాడంలో కొత్త జంట కలిసి ఉంటె ఏం అవుతుంది ?
విద్యానగర్(కరీంనగర్) పెళ్లయిన కొత్త దంపతులు ఆషాడంలో నెల రోజుల పాటు విడిగా ఉండాలనే నిబంధన వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. తొలకరి వర్షాల అనంతరం వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. సాగు పనుల్లో కుటుంబ సభ్యులందరూ భాగస్తులయ్యేవారు. కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాదలు చేసే అవకాశం ఉండదనేది ఒక కారణం. మరో కోణంలో... ఆషాడ∙మాసంలో గ ర్భం దాల్చితే ప్రసవ సమయానికి ఏప్రిల్ నెల (ఛెత్రమాసం) వస్తుంది. ఎండలు మండే ఈ కాలంలో ప్రసవం జరిగితే లేత శిశువు తట్టుకోలేదని, తల్లీ బిడ్డల ఆరోగ్యం ప్రభావితమవుతుందని ఈ నియమాన్ని విధించారు. పైగా నెల రోజుల ఎడబాటు భా ర్యభర్తల మధ్య అనురాగబంధాన్ని మరింత పెంచుతుందనేది కూడా మరో కారణం. అయితే వివాహమైన తొలి ఏడాదిలో వచ్చే ఆషాడంలో కొత్త జంట కలిసి ఉండకూడదనే నియమం అనాది నుంచి ఆచరణలో ఉంది. అత్తా, కోడళ్లు ఒకే గడప దాటరాదని, ఒకరినొక్కరు చూసుకోరాదనే నిబంధనను ఇప్పటికీ అనుసరిస్తుండగా.. ఆషాడంలో ఎడబాటుపై కొత్త దంపతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ఆచారాలు మంచివే.. మన ఆచారాలు, సంప్రదాయాలు మంచివే. వాటిని ఆచరించడం కూడా మంచిదే. శాస్త్రీయతతో కూడిన మన ఆచారాలు పాటించాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. – నాగుల అనిల్కుమార్–శ్రీజ, మంకమ్మతోట, కరీంనగర్ ఉద్యోగాలరీత్యా సాధ్యం కాదు ప్రస్తుతం భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలరీత్యా దూరంగా ఉండడం కొంచం కష్టమే. నెలరోజుల సెలవులంటే సాధ్యం కాదు. మెట్టింటి వారికి దూరమే కనుక ఆషాడ సంప్రదాయం పాటిస్తున్నట్లే కదా. – తాల్లం సతీశ్–రవళి, భగత్నగర్, కరీంనగర్ ప్రేమ పెరుగుతుంది దూరం ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. అనుబంధాలు మరింత గట్టిపడుతాయి. ఒక్కరి గురించి ఒక్కరు ఆ లోచించే సమయం లభిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. – సంగోజు మనీశ్–మౌనిక, జ్యోతినగర్, కరీంనగర్ ఎడబాటు మంచిదే.. పెళ్లి తర్వాత కొంత ఎడబాటు మంచిదే. మాములుగా అంతే ఎడబాటు ఎవరు ఆచరించరని ఆషాఢం మంచిది కాదనే వాడుకలోకి పూర్వీకులు తీసుకొచ్చారు. ఏదైనప్పటికీ దూరం అనుబంధాన్ని పెంచుతుంది.– పీసర మహేందర్–దీపిక, చింతకుంట, కరీంనగర్ శాశ్వత బంధానికి పునాది అవుతుంది శాస్త్రీయ నియమాలతో రూపొంది, అనాదిగా ఆచరణలో ఉన్న సంప్రదాయాలను అందరూ గౌరవించాలి. ఆషాడ మాసం నవ దంపతులకు జీవన మాధుర్యాన్ని రెట్టింపు చేస్తుంది. విరహంతో అనురాగబంధం ద్విగుణీకృతమవుతుంది. వివాహమనే శాశ్వత బంధానికి ఆషాఢంలో ఎడబాటు మంచి పునాది అవుతుంది. – పవనకృష్ణ శర్మ, ప్రధానార్చకులు, దుర్గాభవానీ ఆలయం, నగునూర్, కరీంనగర్ -
తలుపులు ఆలస్యంగా తెరిచిందని...భార్యను చంపి సూట్ కేసులో పెట్టి...
యశవంతపుర: ఇంటి తలుపులను ఆలస్యంగా తెరిచి, అన్నం పెట్టలేదనే కోపంతో భర్త భార్యను హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. కొప్పళ జిల్లా గంగావతికి చెందిన మంజుళ మొదటి భర్తను వదిలి, రాము అనే వ్యక్తిని పెళ్లాడి కామాక్షిపాళ్యలో నివాసం ఉంటూ పీణ్యా పారిశ్రామికవాడలో కూలీ పనులు చేసేది. వారికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రాము ఇంటికి రాగా మంజుళ ఆలస్యంగా తలుపు తీసిందని, అన్నం పెట్టలేదనే కారణంతో గొడవ పడ్డాడు. ఆమెను చంపి శవాన్ని సూట్కేసులో పెట్టుకొని తుమకూరు మార్గంలోని దాబస్పేట వద్ద పడేసి రాము చెన్నైకి పారిపోయాడు. కేసును విచారించిన బెంగళూరు గ్రామీణ పోలీసులు నిందితున్ని అరెస్ట్ రిమాండ్కు పంపినట్లు ఏఎస్పీ లక్ష్మీ గణేశ్ తెలిపారు. (చదవండి: రక్షకుడే భక్షకుడై దారుణకాండ) -
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..
శిడ్లఘట్ట: శిడ్లఘట్ట తాలూకా గంజికుంటె గ్రామంలో గత ఏడాది నవంబర్లో దాదాపీర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి హత్యగా తేలింది. హతుడి భార్యనే తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించినట్లు నిర్ధారించారు. ఈమేరకు దాదాపీర్ భార్య మెహర్, ఆమె ప్రియుడు తౌసీఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తాడనే నెపంతో నిందితులు దాదాపీర్ను గ్యాస్ వెల్డింగ్ పరికరంతో కాల్చి హత్య చేశారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు దిబ్బూరహళ్లి పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. అయితే దాదాపీర్ మృతిపై అనుమానంతో గతనెల 30న మృతుడు సోదరుడు జావీద్బాషా ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు మెహర్, తౌసీఫ్ను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని మాత్రలను పాలలో వేసి దాదాపీర్కు ఇచ్చామని, తాగిన దాదాపీర్ చలనం లేకుండా పడిపోయిన తర్వాత కాళ్లు, చేతులు కట్టివేసి గ్యాస్ వెల్డింగ్ పరికరంతో కాల్చినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. (చదవండి: రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..) -
ప్రియునితో భార్య పరార్.. కూతుళ్లను చంపిన తండ్రి
యశవంతపుర: భార్య మరొకరితో వెళ్లిపోవడంతో ఉన్మాదిగా మారిన భర్త ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్య చేశాడు. ఈ ఘటన కలబురిగిలో జరిగింది. వివరాలు... భోవి నగరకు చెందిన లక్ష్మికాంత్, అంజలి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మికాంత్ ఆటోడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంజలి ఇటీవల ప్రియునితో కలిసి పరారైంది. దీంతో లక్ష్మికాంత్ నలుగురు పిల్లలను అవ్వ వద్ద ఉంచాడు. బుధవారం రాత్రి నలుగురు పిల్లలకు చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరిని ఆటోలో కుర్చోపెట్టి, మరో ఇద్దరు కూతుళ్లు సోని (11), మయూరి (10)లను పక్కకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపాడు. ఇద్దరి మృతదేహాలను ఆటోలో పెట్టుకొని నేరుగా ఎంబీ నగర పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం నగరంలో సంచలనం కలిగించింది. లక్ష్మీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. (చదవండి: టీచర్ వికృతానందం.. మహిళలకు అసభ్యకరంగా ఎస్సెమ్మెస్లు, వీడియోలు పంపి..) -
వేల కోట్ల సోలార్ స్కామ్: భర్తకి 30 ఏళ్లు.. భార్యకి 11 ఏళ్ల జైలు శిక్ష!
లాస్ ఏంజెల్స్: యూఎస్లోని భార్యభర్తలిద్దరు సోలార్ పిరమిడ్ స్కామ్కి పాల్పడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. సోలార్ జనరేటర్ల అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని చెప్పి దాదాపు 20 మంది పెట్టుబడిదారులును మోసం చేశారని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు పాలెట్ కార్పస్ అనే 51 ఏళ్ల మహిళ తన భర్త జెఫ్తో కలిసి దాదాపు 7 వేల కోట్ల రూపాయిల స్కామ్ తెరలేపారని స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టు కార్పస్కి 11 ఏళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతకముందు ఆమె భర్తకి ఇదే స్కాంలో సుమారు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ జంట ప్రాథమిక విచారణలో నేరాన్ని అంగీకరించనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ స్కాంలో ఈ జంట సుమారు 17 మంది పెట్టుబడుదారుల నుంచి రూ. 7 వేల కోట్లు తీసుకున్నారు. ఈ డబ్బుల్లో కొంత భాగాన్ని ఈ జంట తమ విలాసాలకు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్)