
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మార్చి 4 నుంచి 14 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో గీతారెడ్డి తెలి పారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫాల్గుణ శుద్ధ విదియ 4న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభమై ద్వాదశ 14న ఉదయం 10 గం.కు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గం.కు శృంగార డోలోత్సవంతో ముగుస్తాయన్నారు.
ఎదుర్కోలు 10న, స్వామివారి తిరు కల్యాణోత్సవం 11న, దివ్య విమాన రథోత్సవాలు 12న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాలాలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవే చివరివని, వచ్చే ఏడాది నుంచి ప్రధానాలయంలోనే వేడుకలు జరుగుతాయన్నారు. కొండ కింద నిర్వహించే స్వామి వారి కల్యాణం ఈసారి చేయట్లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment