Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Illegal Liquor Case: Sit Search Balaji Govindappa Residency Hyderabad1
అక్రమ మద్యం కేసు.. ‘సిట్‌’ మరో కొత్త నాటకం

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్‌ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్‌ ప్రయత్నించింది. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్‌ అధికారులు హల్‌చల్‌ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్‌ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్‌ చేసింది‌. 74 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్‌ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఆయన పిటిషన్‌పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్‌ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్‌ ఇంటర్నేషనల్‌లో ఫుల్‌టైమ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. వికాట్‌ గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్‌ అధికారులు సోదాలు చేపట్టారు.

YS Jagan tweet on the deteriorating economic situation of AP2
మరింతగా దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి.. వైఎస్‌ జగన్‌ ఆందోళన

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారాయన. కాగ్‌ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్‌ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్‌ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని అన్నారాయన. జీఎస్‌టీ, సేల్స్‌ టాక్స్‌ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయ్‌ప్రభుత్వ విధానాలతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందిమొదటి త్రైమాసికంలో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందిఏపీలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదువిభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందిఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందిఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందిపన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయిగతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది.. జీఎస్‌టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయికొన్ని శాఖల్లో అత్యంత అధ్వాన్నమైన వృద్ధిరేటు ఉందిరాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయికేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14 శాతం మాత్రమే పెరిగిందిఅప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా.. 15.61శాతం వేగంతో పెరిగాయిఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్‌ అన్నారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్‌ అభిప్రాయపడ్డారు.Fiscal stress worsens in the first quarter of this financial yearThe CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారాయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం.

KSR Comments On CBN And Amaravati Lands3
బాబుకు టెన్షన్‌!.. అమరావతి పుంజుకునేది ఇంకెన్నడు?

అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ కోసం రైతులకు ఇస్తున్న ప్యాకేజీ బాగుందా? లేక పంజాబ్‌లో ఇటీవల ప్రకటించింది మెరుగ్గా ఉందా?. అమరావతి రైతులు ఈ విషయంపై కొంత విశ్లేషణ చేసుకోవడం మేలు. పంజాబ్‌ ప్రభుత్వం గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగం కోసం ఇటీవలే 21 ప్రాంతాల్లో సుమారు 65 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. పరిహారం కోసం ముందుగా ‍ఒక ప్యాకేజీ ప్రకటించింది కానీ విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సవరించాల్సి వచ్చింది.కొత్త ప్యాకేజీతో పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కొన్నిచోట్ల మాత్రం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు పంజాబ్‌ మీడియా కథనాలు చెబుతున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇస్తే ఎకరా భూమికి 800 గజాల ప్లాట్‌ కేటాయించారు. పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తే వెయ్యి గజాల పారిశ్రామిక ఫ్లాట్‌, 300 గజాల నివాస ప్రాంతం, వంద గజాల వాణిజ్య ప్లాట్‌ ఇస్తామని పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.30 వేల కౌలు ముందు ప్రకటించారు. వ్యతిరేకతతో దీన్ని రూ.50 వేలకు పెంచారు. సేకరించిన భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భూమి అభివృద్దిలో ఆలస్యం జరిగితే కౌలు మొత్తాన్ని ఏడాదికి పది శాతం చొప్పున పెంచుతారు. సేకరించిన భూమి సెంట్లలో మాత్రమే ఉన్నా వారికి కూడా వాణిజ్య ప్లాట్లు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ‍ప్రకటించిన ల్యాండ్‌ పూలింగ్‌ ప్యాకేజీని పంజాబ్‌తో పోల్చి చూస్తే ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత కౌలు మొత్తం రూ.లక్ష చెల్లించే అంశం ఉన్నట్లు లేదు. ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి చేపట్టేలోగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆ భూములలో పట్టణాభివృద్ధి పనులు ఆరంభం అయ్యే వరకు రైతులు వ్యవసాయం కొనసాగించుకోవచ్చు. ఏపీలో అసలు అభివృద్ది పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాలలో గట్లను తొలగించి, రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ కంప కొట్టడానికి ఏపీ ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది.మరోవైపు రైతులు స్వచ్చందంగా ఇస్తేనే భూమి తీసుకుంటామని, బలవంతంగా సమీకరించబోమని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్‌ మాన్ చెప్పడం విశేషం. అయినప్పటికీ అక్కడి విపక్షం రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమును ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని చేసిన హామీ మాటేమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవంత్ సింగ్‌ మాన్ కొట్టిపారేసి, రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారు. ఈ రకంగా ఆలోచిస్తే ఏపీలో ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ సిక్స్‌లో ఒకటి అర హామీలు మాత్రమే అమలు చేసింది. అమలు చేయని వాటిలో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి సేకరణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకుని, అమరావతి సెంటిమెంట్‌ను ప్రయోగించి విపక్ష గొంతు నొక్కి అయినా తాను అనుకున్న విధంగా లక్ష ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కాని, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. ప్రభుత్వం సకాలంలో భూమిని అభివృద్ధి చేసి వారికి ప్లాట్లు ఇస్తే, వాటికి మంచి ధర పలికితేనే రైతులకు, లేదా భూమి సొంతదారులకు ఉపయోగం ఉండవచ్చు. కానీ, ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ది చేయలేకపోవడం, ఓవరాల్‌గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా కొంత మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్‌ను ప్రభావితం చేశాయి. దాంతో అమరావతి గ్రామాలలో కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం ఉంది. ధరలు కూడా గతంలో ఉన్న స్థాయిలో లేవని చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా బలంతో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పిస్తుంటారు. కొన్నిసార్లు ఆ వ్యూహం సక్సెస్ అయినా, ఎక్కువ సార్లు విఫలమవుతుంటుంది. అప్పుడు దానిని వదలిపెట్టి కొత్తదేదో చేపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొలుత అమరావతి రాజధాని నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేయడంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూములు కొన్నవారు అప్పట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, అంతర్గత సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాజధానిగా పరిగణిస్తున్న గ్రామాలలో టీడీపీ నేతలు పలువురు భూములు కొని లాభపడ్డారని చెబుతారు. కానీ, అది కూడా తాత్కాలికమే అయింది. రైతుల వద్ద కాస్త అధిక ధరకు కొనుగోలు చేసి, అంతకన్నా ఎక్కువకు అమ్ముకున్న వారు లాభపడ్డారు. కానీ, ఇంకా బాగా లాభాలు వస్తాయన్న భావనతో ఉన్నవారు మాత్రం కొంతమేర నష్టాల పాలయ్యారు.2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఎన్నికలలో కూడా ఆ పాయింట్ ఆధారంగా లబ్ది పొందే యత్నం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల రేట్లు కృత్రిమంగా పెంచడం కోసం టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనబడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44వేల ఎకరాల భూమి సేకరించబోతుందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్‌సెట్ అయ్యారు. ప్రభుత్వం ముందు రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలు అభివృద్ది చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కాని, అదేమీ చేయకుండా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికి అందలేదు. ఎకరాకు 1200 గజాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదట. నెల రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగం మరీ కుదేలైందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్లను అన్ని సదుపాయాలతో అభివృద్ది చేయాలి. ఆ పని ఇంతవరకు మొదలే కాలేదు. రైతులు ఎక్కడ భూమి ఇస్తారో, అక్కడే ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక గ్రామంలో ఒక సంస్థకు భూమి కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేకుండా రైతులు అడ్డుకున్నారట.మరోవైపు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, ఆదాని క్రీడా నగరమని, ఔటర్‌ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను పతాక శీర్షికలుగా వండి వారుస్తోంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.31 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం టెండర్లు మాత్రం రూ.ఏభై వేల కోట్లకు పైగానే పిలిచిందట. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్లు పట్టవచ్చని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఎంతమేర పుంజుకుంటుందో చెప్పలేం. వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త సంస్థలు వస్తే కొంత అభివృద్ది ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితి అంత అనువుగా లేదు.ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో సాగడం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇంకో మాట చెప్పాలి. విశాఖ వంటి నగరంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఎకరా ఇరవై కోట్లకు పైగానే అమ్ముడు పోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగితే ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.అమరావతి ద్వారా సంపద సృష్టి ఎప్పటి నుంచి మొదలు అవుతుందని ఒక విలేకరి చంద్రబాబును అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, మూడేళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుందని జవాబు ఇచ్చారు. ఒకప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ నగరం అని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం కోరుకున్న రీతిలో సాగడం లేదు. ఈ వ్యాపారం సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్‌లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదేమో ఆలోచించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Ind vs Eng 4th Test: Stokes Creates History England All Out For 6694
చరిత్ర సృష్టించిన స్టోక్స్‌!.. ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. స్కోరెంతంటే!

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు శతకం సాధించిన సారథుల సరసన చేరాడు. ఇంగ్లండ్‌ తరఫున ఈ ఫీట్‌ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గానూ చరిత్రకెక్కాడు.ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్‌- ఇంగ్లండ్‌ (Ind vs Eng) మధ్య నాలుగో టెస్టులో స్టోక్స్‌.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్‌ (61), శుబ్‌మన్‌ గిల్‌ (12)ల రూపంలో రెండు కీల​క వికెట్లు కూల్చిన స్టోక్స్‌.. శార్దూల్‌ ఠాకూర్‌ (41), వాషింగ్టన్‌ సుందర్‌ (27), అన్షుల్‌ కంబోజ్‌ (0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.141 పరుగులుఅనంతరం బ్యాటింగ్‌లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ఇరగదీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా స్టోక్స్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది వంద పరుగుల మార్కు దాటాడు. మొత్తంగా 198 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్‌.. 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో స్టోక్స్‌ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన కెప్టెన్లు వీరే🏏డెనిస్‌ అట్కిన్సన్‌ (వెస్టిండీస్‌)- 1955లో ఆస్ట్రేలియా మీద🏏గ్యారీ సోబర్స్‌ (వెస్టిండీస్‌)- 1966లో ఇంగ్లండ్‌ మీద🏏ముష్తాక్‌ మొహమ్మద్‌ (పాకిస్తాన్‌​)- 1977లో వెస్టిండీస్‌ మీద🏏ఇమ్రాన్‌ ఖాన్‌ (పాకిస్తాన్‌)- 1983లో టీమిండియా మీద🏏బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లండ్‌)- 2025లో టీమిండియా మీదఇంగ్లండ్‌ ఆలౌట్‌.. స్కోరెంతంటే?ఇదిలా ఉంటే.. 544/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ కాసేపటికే లియామ్‌ డాసన్‌ (26) వికెట్‌ కోల్పోయింది. జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో అతడు బౌల్డ్‌ అయ్యాడు. స్టోక్స్‌ వికెట్‌ను జడేజా దక్కించుకున్నాడు. అదే విధంగా.. బ్రైడన్‌ కార్స్‌ (47)ను వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ 157.1 ఓవర్లలో 669 పరుగులు స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.భారత బౌలర్లలో జడ్డూ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్ర పేసర్‌ అన్షుల్‌ కంబోజ్‌, మహ్మద్‌ సిరాజ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. చదవండి: గిల్‌.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌𝘾𝙖𝙡𝙢, 𝘾𝙤𝙤𝙡, 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙞𝙤𝙣 🔥#BenStokes shows great composure, calmly facing 6 dot balls on 99 before finally reaching a well-earned century with a confident shot 🙌#ENGvIND 👉 4th TEST, DAY 4 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/xkvCs073fI pic.twitter.com/TzhM6CBR6L— Star Sports (@StarSportsIndia) July 26, 2025

God should Have taken me instead  Mother of two loses5
ఆ దేవుడు నన్నైనా తీసుకు పోవాల్సింది: ఓ తల్లి కన్నీటి రోదన

రాజస్తాన్‌ ఝలవార్‌ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు పిల్లలు మృత్యవాత పడగా, 25 మంది వరకూ గాయపడ్డారు. శుక్రవారం(జూలై 25) ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్‌ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులు అప్పుడే క్లాస్‌ రూమ్‌కు వచ్చి కూర్చున్న సమయంలో జరగడంతో స్కూల్‌కు ఆలస్యంగా వెళ్లినా ఇంత దారుణం జరిగేది కాదని, బాధిత తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నన్ను తీసుకుపోయినా బాగుండు..తనకు తోడుగా ఉన్న ఇద్దరు పిల్లలు ఆ స్కూల్‌ పై కప్పు కుప్పకూలిన ఘటనలో మృత్యువాత పడటంతో ఓ తల్లి రోదిస్తున్న తీరు హృదయాల్ని కలిచి వేస్తోంది. ఆ దేవుడు ఇంత పని చేస్తాడనుకోలేదని తనను ఒంటరిని చేసి పిల్లల్ని తీసుకుపోయాడని కన్నీటి పర్యంతమవుతోంది. ‘ ఆ దేవుడు నా పిల్లలకి జీవితాన్నిచ్చి, నన్ను తీసుకుపోయినా బాగుండు. వాళ్లు లేకుండా నేను ఏం చేసేది. పిల్లలు ఇక తిరిగి రారని తెలిసి నా ఇళ్లు ఒంటరిదైంది. పిల్లలు ఆడుకునే ఆట స్థలం వారి కోసం ఎదురుచూస్తోంది. వారితో ఆటలు ఆడుకునే నేను ఇక ఎవ్వరితో ఆడుకోవాలి. నా కూతురు, నా తనయుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. ఇక నాకు ఈ జీవితం ఎందుకు?’ అంటూ ఆమె బోరున విలపిస్తోంది. స్కూల్‌ టీచర్లు బయట ఏం చేస్తున్నారు?స్కూల్‌ పైకప్పు కూలిన ఘటనలో మృతి చెందింది అంతా చిన్నారులే. ఈ ఘటనలో ఏ టీచర్‌కు ఏమీ కాలేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని లేవనెత్తింది ఇద్దరి పిల్లల్ని కోల్పోయిన తల్లి. ఆ సమయంలో స్కూల్‌కు ఎవరైతే టీచర్లు వచ్చారో వారంతా బయటే ఉండటంతో బ్రతికి పోయారని, పిల్లల్ని లోపలికి పంపి బయట టీచర్లు ఏం చేస్తున్నారని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. స్కూల్‌లో పిల్లల సంరక్షణ చూసుకోవాల్సిన టీచర్లు.. తమ పిల్లల్ని మాత్రం వారు పొట్టనపెట్టుకున్నారని చెదిరిన హృదయంతో విలపిస్తోంది. 2 ఏళ్ల మీనా, 6 ఏళ్ల కన్హాలను కోల్పోవడంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతంగా మారింది. ఇక ప్రభుత్వాలు ఎందుకు?స్కూల్‌ పైకప్పు కూలిన ఘటనలో అది ప్రభుత్వ పాఠశాల కావడం మరో చర్చకు దారి తీసింది. స్కూల్‌ పైకప్పుకు మరమ్మత్తులు చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది,. ప్రభుత్వాలు ఉన్నా కనీసం స్కూళ్లను కూడా బాగు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ స్కూల్‌ మరమ్మత్తులు కోసం చిన్నారులే స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని సమాచారం. చిన్నబోయిన గ్రామం..ఆ ఘటనలో మృతి చెందిన చిన్నారుల్లో 12 ఏళ్ల చిన్నారులు ఐదుగురు ఉన్నారు. పాయల్‌, ప్రియాంక, కార్తీక్‌, మీనా, కుందన్‌లు 12 ఏళ్ల వయసు గల పిల్లలు కాగా, ఎనిమిదేళ్ల హరీష్‌, ఆరేళ్ల కన్హాలు ఉన్నారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కన్హానే అత్యంత పిన్నవయసు గల చిన్నారి. చిన్నారుల మృత్యువాతతో మనోహర్‌ థానాలోని పిప్లోడి గ్రామం చిన్నబోయింది. ఎక్కడ చూసినా విషాద చాయలే కనిపిస్తున్నాయి. ఎంతో సరదాగా స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ గ్రామంలో శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. మృతదేహాలు అప్పగింత.. ఆ ఏడుగురు చిన్నారుల మృతదేహాలను ఈరోజు(శనివారం, జూలై 26) ఆయా కుటుంబాలకు అప్పగించారు. ఝల్‌వార్‌ ఎస్‌ఆర్‌జీ హాస్పిలల్‌ మెడికల్‌ కాలేజ్‌లో పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మార్చురీ నుంచి ఆ మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు. తమ పిల్లల మృతదేహాలను చూసి బోరున విలిపిస్తున్న తల్లి దండ్రులు ఒకవైపు, కన్నీళ్లను అదిమిపెట్టుకుని పిల్లల ముందు అలా కూర్చిండిపోయి మౌనంగా రోదిస్తున్న పేరెంట్స్‌ మరొకవైపు. అంతా హృదయ విదారకంగా మారింది.

Ntr War 2 Remuneration Details6
ఎన్టీఆర్‌కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే 'దేవర' సినిమా దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ 'వార్ 2'. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. మరోవైపు హీరోలు చేసిన హృతిక్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువ అనేది కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్‌)పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత మన హీరోలు ఇక్కడే సినిమాలు చేస్తూ హిందీలో డబ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్‌లోని 'వార్ 2'లో భాగమయ్యాడు. అయితే తారక్‌ది విలన్ రోల్ అని టాక్ నడుస్తోంది. ట్రైలర్‌లోనూ నెగిటివ్ టచ్ ఉన్నట్లే చూపించారు. మరి అందరూ అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ విలన్ లేదా మరో హీరోనా అనేది మూవీ వస్తే గానీ తెలియదు. అయితే ప్రస్తుతం తారక్‌కి ఉన్న ఫేమ్ దృష్ట్యా అందరి కంటే ఇతడికే ఎక్కువగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.'వార్ 2'లో నటించినందుకు గానూ ఎన్టీఆర్‌కు ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. హృతిక్ రోషన్‌కి రూ.45 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్‌గా చేసిన కియారా అడ్వాణీకి రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీకి రూ.32 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిబట్టి చూస్తుంటే హృతిక్‌పై అటు ట్రైలర్‌లోనే కాదు రెమ్యునరేషన్ విషయంలోనూ తారక్ డామినేషన్ చూపించినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)

Pakistan Willing To Talk To India: Awaiting New Delhi Response7
అందుకు రెడీ అన్న పాక్‌.. భారత్‌ స్పందన కోసం ఎదురుచూపు

భారత్‌తో చర్చలకు పాకిస్థాన్‌ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగశాఖ మంత్రి ఇషాక్‌ దార్ వెల్లడించారు. ఆయా అంశాలపై చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధమంటూ పునరుద్ఘాటించారు. దీనిపై భారత్‌ తుది నిర్ణయం తీసుకోవాలన్న దార్‌.. ఆ దేశ అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు బంతి.. భారతదేశ కోర్టులో ఉందంటూ దార్ వ్యాఖ్యానించారు.వాణిజ్యం నుంచి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి వివిధ అంశాలపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘అర్థవంతమైన చర్చలు’ అవసరమంటూ ఆయన నొక్కి చెప్పారు. కాశ్మీర్, భద్రత, ఆర్థిక సంబంధాలతో సహా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి చర్చలు తిరిగి ప్రారంభించాలని దార్‌ పిలుపునిచ్చారు.కాగా, పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్‌ కఠిన వైఖరి అవలంబించిన సంగతి తెలిసిందే. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు ఆ దేశంతో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను కట్‌ చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌తో పాటు పీవోకేలో ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్‌ మే 7వ తేదీన ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించింది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు మే 10వ తేదీన ఒక అంగీకారానికి రావడం తెలిసిందే.

Mother Or Wife Supreme Court Advise Husband in Marital Case8
తల్లా? పెళ్లామా?

తల్లా? పెళ్లామా? అనే పరిస్థితిలో.. ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక మదనపడే వాళ్లే మన మధ్యే కనిపిస్తుంటారు. అయితే అలాంటి మానసిక సంఘర్షణలో నలిగిపోతున్న ఓ వ్యక్తికి.. భారత సర్వోన్నత న్యాయస్థానం హితబోధ చేసింది.ఆ భార్యభర్తలిద్దరూ.. మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భర్త అమెరికాలో ఉండగా.. పెద్ద కూతురు అతని తల్లి(నాన్నమ్మ) దగ్గర, మైనర్‌ కొడుకు మాత్రం భార్యతో ఉంటున్నాడు. ఈ తరుణంలో కలిసి ఉండడం కుదరని భావించిన ఆ జంట కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం.. జస్టిస్‌ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథన్‌ ఈ పిటిషన్‌ను విచారించారు. ఈ క్రమంలో వర్చువల్‌ విచారణకు హాజరైన ఆ దంపతులు ధర్మాసనం సమక్షంలోనే వాదులాడుకున్నారు.తనపై తన భార్య తప్పుడు క్రిమినల్‌ కేసు పెట్టిందని ఆ భర్త, తన భర్త తనను పట్టించుకోవడం మానేశాడని ఆ భార్య పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ తరుణంలో బెంచ్‌ జోక్యం చేసుకుంది.మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకుని పిల్లల కోసం కలిసి జీవించాలని ధర్మాసనం ఆ జంటకు సూచించింది. అయితే పదే పదే ఆ వ్యక్తి తన తల్లి ప్రస్తావన తీసుకురావడాన్ని గమనించిన జస్టిస్‌ నాగరత్న.. కుటుంబాల్లో గొడవలు భార్యల మాటల్ని భర్తలు పెడచెవిన పెట్టినప్పుడే మొదలవుతాయని వ్యాఖ్యానించారు.‘‘తమ మాట కంటే తల్లుల మాటకు భర్తలు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అలాగని తల్లిని పక్కనపెట్టాలని మేం అనడం లేదు. భార్యలు చెప్పేది కూడా వినాలి. భర్తలు భార్యల భావాల్ని గౌరవించాల్సిందే’’ అని జస్టిస్‌ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భర్త తన కుమారుడిని చూడలేదని చెప్పడంతో, కోర్టు ఆ భార్య తీరును తప్పుబట్టింది. ఒక పిల్లవాడు తన తండ్రి, సోదరిని చూడకుండా ఉండడం సరికాదని అభిప్రాయపడింది. మధ్యవర్తిత్వ సమయంలోనైనా ఆ పిల్లాడి చూపించాలని, పిల్లల శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుకుని కలిసి జీవించాలని మరోసారి ఆ జంటకు సూచిస్తూ కేసు వాయిదా వేసింది.మరో కేసులో.. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగండని ఓ జంటకు సుప్రీం కోర్టు సూచించింది. భార్య, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని బాలాకోట్‌ దాడుల్లో పాల్గొన్న యుద్ధ విమాన పైలట్‌ ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరారాయన. అయితే.. జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదని, సర్దుకుపోయి ముందుకు సాగాలని ఆ జంటకు ధర్మాసనం సూచించింది.

No need for brains Harsh Goenka tweet viral as global CEO insult  Indian ceo9
వాళ్లకి బ్రెయిన్‌ అవసరం లేదట : హర్ష్‌ గోయెంకా ట్వీట్‌ వైరల్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గొయెంకా (Harsh Goenka)ఎక్స్‌లో మరో ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ చేశారు. ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలతో నెటిజన్లను ఆలోచింప చేసే ఆయన తాజా ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. యూకే గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక గ్లోబల్ CEO భారతీయ నిపుణుల మేధో సామర్థ్యాలను ఎలా అవమానించారో తెలుపుతూ ట్వీట్‌ చేశారు. అందుకే నిపుణులంతా భారతీయ కంపెనీలవైపు మొగ్గు చూపుతున్నారంటూ చురకలంటించారు. హర్ష్ గోయెంకా ట్వీట్‌ ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. హర్ష్‌గోయెంకా ట్వీట్‌: "భారతీయ అనుబంధ సంస్థ, అత్యంత ప్రగతిశీల సంస్థకు చెందిన గ్లోబల్ CEO నాతో ఇలా అన్నాడు. ‘‘బ్రెయిన్‌, చేతులు, కాళ్లు అవసరం లేకుండా కేవలం ప్లాన్‌ను అమలు చేసే ఇంజీన్‌లా నా భారతీయ CEO ఉండాలని కోరుకుంటా.. అని అన్నట్టు అని గోయెంకా గుర్తు చేసుకున్నారు. "ఈ విధానం వల్లే ఇప్పుడు భారతీయ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు " అని ఆయన పేర్కొన్నారు.ఈపోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. ముఖ్యంగా, భారతీయ సంతతికి చెందిన టెక్‌ నిపుణులు ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు, నూతన ఆవిష్కరణలతో టాప్‌లో కంపెనీలను నడిపిస్తున్న తరుణంలో హర్ష్‌ గోయెంకా ట్వీట్‌ విశేషంగా నిలిచింది."సో నయా వలసవాద వైఖరులు కొనసాగుతూనే ఉన్నాయి అన్నది నిజమన్నమాట అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఈ మనస్తత్వం వల్లే భారతీయ నిపుణులు స్వదేశీ కంపెనీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మెషీన్లలా పనిచేయం కాదు...మెదళ్ళకు విలువ ఇవ్వాలనుకుంటున్నాము" అని మరొకరు రాశారు.చదవండి : కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!బెన్‌హాన్స్ ఫార్మా MD ఎలియా జయరాజ్, “భారత జట్టును చేతులు, కాళ్ళు లేకుండా చేయాలనే UK CEO ప్లానా ఇది? ఒక క్రికెట్ స్టార్‌ను బంతిని అలా ఫెచ్‌ చేయమని అడిగినంత కామెడీగా ఉంది. TCS వంటి భారతీయ సంస్థల వైపు ఐటీ నిపుణులు పరిగెత్తడంలో ఆశ్చర్యం లేదు , అక్కడ వారు తమ తెలివితేటలను ప్రదర్శించగలరు. 2024లో రిటెన్షన్‌ (ఉద్యోగుల కొనసాగింపు) 10 శాతం బెటర్‌గా ఉందని నాస్కామ్ చెబుతోంది. భారతీయ CEOలు అవకాశాన్ని వాడుకోండి.. లేదంటే మీకు నష్టం అని వ్యాఖ్యానించారు. “ఇది బహుశా ఫార్మా లేదా ఆర్థిక సేవల సంస్థ అయి ఉండాలి. మరే ఇతర రంగంలోనూ బ్రిటీషోళ్లకి అంత సీను లేదు” అని మరొకరు కమెంట్‌ చేశారు. ఇది చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు

NALSA Veer Parivar Sahayata Yojana 2025 launched on Kargil Vijay Diwas10
‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’

భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సైనికుల కుటుంబాలకు న్యాయసహాయం అందించనున్నారు. ‘నల్సా వీర్ పరివార్ సహాయతా యోజన 2025’ పేరుతో ఈ కొత్త కార్యక్రమం ద్వారా భారతీయ సైనికులకు సాయం చేయనున్నారు. సొంత ఊళ్లకు దూరంగా దేశం కోసం సేవలందిస్తున్న సైనికులు, తమ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు స్థానికంగా న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో దేశం కోసం సుదూర ప్రాంతాల్లో పోరాడుతున్న సైనికులు స్వగ్రామాలకు రావడం కష్టంగా మారుతుంది. అలాంటివారికి, తమ కుటుంబ సభ్యులకు న్యాయసేవ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ శ్రీనగర్‌లో జరిగిన కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ సదస్సులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్‌ తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకోవడం సైనికులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని నమ్ముతున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో సాయుధ దళాలు చేసిన త్యాగాలను చూసి తీవ్రంగా చలించిపోయానని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. న్యాయవ్యవస్థ వారి శ్రేయస్సుకు మరింత ప్రత్యక్షంగా దోహదపడే మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..ఈ కార్యక్రమం ఉద్దేశం..సైనికులు విధుల్లో ఉన్నప్పుడు అపరిష్కృత ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, భూ సమస్యలు, ఇతర చట్టపరమైన విషయాల నుంచి ఉపశమనం కలిగించేలా న్యాయసేవ అందిస్తారు.సైనికులు వృత్తిపరమైన కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోయినా, కోర్టులో కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించడానికి నల్సా రంగంలోకి దిగుతుంది.ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలటరీ బలగాలు దీని పరిధిలోకి వస్తారు.ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లకు సులభంగా అందుబాటులో ఉండేలా రాష్ట్రాల్లోని సైనిక్ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.కేసు పురోగతిని పర్యవేక్షించడానికి, సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడానికి వీరు తోడ్పాటు అందిస్తారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement