డాక్టర్‌ ప్రసాద్‌కు కన్జ్యూమర్‌ వారియర్‌ అవార్డు | - | Sakshi

డాక్టర్‌ ప్రసాద్‌కు కన్జ్యూమర్‌ వారియర్‌ అవార్డు

Mar 17 2023 2:00 AM | Updated on Mar 17 2023 2:00 AM

అతిథుల చేతుల మీదుగా అవార్డు 
అందుకుంటున్న డాక్టర్‌ ప్రసాద్‌ మారెళ్ల
 - Sakshi

అతిథుల చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న డాక్టర్‌ ప్రసాద్‌ మారెళ్ల

సీతంపేట: నగరానికి చెందిన వరహా వెంకటేశ్వర ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ప్రసాద్‌ మారెళ్ల నేషనల్‌ కన్జ్యూమర్‌ వారియర్‌ అవార్డు అందుకున్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్‌ న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో గురువారం ఈ వేడుకలు నిర్వహించింది. 27 రాష్ట్రాల ప్రతినిధులు, అన్ని రాష్ట్రాల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. వినియోగదారులకు కమిషన్‌ అందిస్తున్న సేవలు, భవిష్యత్‌ కార్యాచరణపై సదస్సులో చర్చించారు. డాక్టర్‌ ప్రసాద్‌ మారెళ్ళ నేషనల్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ కమిషన్‌లో సౌత్‌ ఇండియా చైర్మన్‌ ఫర్‌ మెడికల్‌ అండ్‌ ఫుడ్‌సేఫ్టీగా ఉంటూ విశేష సేవలందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కమిషన్‌ ఆయనకు అవార్డు ప్రకటించింది. ఒడిశా ప్లానింగ్‌ బోర్డు సభ్యులు ప్రసన్నకుమార్‌ పట్సన్‌ చేతుల మీదుగా డాక్టర్‌ ప్రసాద్‌ అవార్డు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement