వంట త్వరగా చేయమన్నందుకు వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వంట త్వరగా చేయమన్నందుకు వివాహిత ఆత్మహత్య

Jun 11 2024 12:52 AM | Updated on Jun 11 2024 9:35 AM

క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య

క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య

అగనంపూడి: క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన దువ్వాడ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. దువ్వాడ సీఐ వావిలపల్లి ఎర్రం నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కణితిలో నివాసముంటున్న వ్యాన్‌ డ్రైవర్‌ వియ్యపు బాలాజీ గవర కంచరపాలెంకు చెందిన జ్యోతి (26)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

 వీరికి ఏడాది పాప (యోక్షిత) ఉంది. సోమవారం ఉదయం తన తండ్రికి క్యారేజ్‌ పట్టుకెళ్లాలి వేగంగా వంట చేయమని బాలాజీ భార్య జ్యోతికి చెప్పాడు. ఇంట్లో పనులన్నీ తానే చేయాలా అంటూ జ్యోతి రుసరుసలాడుతూ చంటిపాపను కింద దించేసి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు గడియపెట్టి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

బాలాజీ గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కలవాళ్లు పిలిచినా పలకపోవడంతో బాలాజీ తలుపు గెడను విరగ్గొట్టి లోపలికి వెళ్లి రక్షించే ప్రయత్నం చేశాడు. ముందుగా ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అగనంపూడిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే జ్యోతి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్‌, దువ్వాడ సీఐ ఎర్రంనాయుడు చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement