దామెర : గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. మండలంలోని సీతారాంపురంలో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. నాటుకోళ్ల షెడ్, డ్రాగన్ ఫ్రూట్ సాగు తదితర పనులను పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఇంటికి తాగునీరు అందేలా, పైపులైన్ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీ సంఖ్యను పెంచాలని, పనులపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కుట్టు శిక్షణ కేంద్రంలో అధునాతన యంత్రాలతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మేన శ్రీను, అదన పు డీఆర్డీఓ శ్రీనివాసారావు, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీధర్, స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మి దేవి, ఎంపీడీఓ కల్పన, ఎంపీఓ రంగాచారి, ఏపీఎం ఝాన్సీ, ఏపీఓ శారద, పీఆర్ ఏఈ సమ్మిరెడ్డి, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య