
మతసామరస్యానికి ప్రతీక రంజాన్
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఉప్పరపల్లి క్రాస్రోడ్ వద్ద ఉన్న కల్యాణలక్ష్మి గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ముస్లింలకు పండ్లు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఇఫ్తార్ విందుతో సోదరభావం పెంపొందుతుందని తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మండల నాయకులు పాల్గొన్నారు.