
నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి
పరకాల: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పంచాయతీరాజ్శాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి పనులతో పాటు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చేపడుతున్న చర్యలపై సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మంజూరైన రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ డివిజన్, మండలాల అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి