వెండి వెలుగుల మండి బజార్‌ | - | Sakshi

వెండి వెలుగుల మండి బజార్‌

Mar 29 2025 12:55 AM | Updated on Mar 29 2025 12:55 AM

వెండి

వెండి వెలుగుల మండి బజార్‌

రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం కావడంతో మండి బజార్‌ వీధులన్నీ కిక్కిరిసి కనిపించాయి. ఇఫ్తార్‌ అనంతరం పండుగ షాపింగ్‌ చేసేవాళ్లు, హలీమ్‌, హరీస్‌ తినేవారితో ఈ ప్రాంతం రద్దీగా కనిపించింది. విద్యుద్దీపాల వెలుగుల్లో మండిబజార్‌ ప్రాంతం వెండి వెలుగులు కుమ్మరించినట్లుగా కనిపించింది. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, వరంగల్‌

కోత దశకు

వచ్చేదాకా ఆగాలి

పరకాల: వరి పొలాలు కోత దశకు వచ్చేదాక వేచి ఉండి ఆతర్వాతే హార్వెస్ట్‌ చేయాలని పరకాల ఆర్డీఓ డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్‌లోని రైతు వేదికలో శుక్రవారం వరికోత యంత్రాల యజమానులు, డ్రైవర్లు, రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. కోత మిషన్‌ ఉపయోగించే సమయంలో బ్లోయర్‌ ఆన్‌లో ఉంచాలని సూచించారు. కోత మిషన్‌ ఆర్‌పీఎం–18 ఉండాలని, గేర్‌ స్కోట్‌ ఏ–2 నుంచి బీ–1లో పెట్టి కోయాలన్నారు. తాలు, మట్టి రాకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ పరకాల ఏడీ వి.రవీందర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి వేణుగోపాల్‌, పరకాల, శాయంపేట, ఆత్మకూరు, నడికూడ, దామెర ఏఓలు శ్రీనివాస్‌, గంగా జమున, యాదగిరి, జైసింగ్‌, రాకేశ్‌ పాల్గొన్నారు.

వరంగల్‌ క్రైం: నగరంలోని విద్యారణ్యపురిలో బుధవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో జరిగిన చోరీతో వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల వేషధారణను బట్టి వచ్చిన వారు చెడ్డీ గ్యాంగా.. తార్‌ గ్యాంగా? అనే ఆలోచనలో పడ్డారు. పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది. దొంగలు గూగుల్‌ మ్యాప్‌ను వినియోగించి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను ఎంపిక చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. బుధవారం అర్ధరాత్రి వరకు కాకతీయ యూనివర్సీటీలోని చెట్ల మధ్య నిద్రించి ఆ తర్వాత పక్కనే ఉన్న విద్యారణ్యపురిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చాలాకాలం తర్వాత ఇలాంటి గ్యాంగ్‌లు చోరీలకు పాల్పడడంతో పోలీసులు రాత్రి పూట గస్తీ పెంచారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో మూడు పోలీస్‌ స్టేషన్లకు చెందిన సిబ్బంది, అధికారులతో పాటు స్పెషల్‌ పార్టీ బలగాలు నగరంలో అనుమానం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం సివిల్‌ డ్రెస్‌లలో దొంగల కోసం గాలిస్తున్నారు. వచ్చిన దొంగలు క్రూరత్వం కలిగి ఉన్నవారు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయా పోలీస్‌ స్టేషన్ల అఽధికారులు ప్రజలకు సమాచారం అందించారు.

చెడ్డీ, తార్‌.. ఏ గ్యాంగ్‌ ?

అప్రమత్తమైన కమిషనరేట్‌ పోలీసులు

గూగుల్‌ మ్యాప్‌లు వినియోగిస్తున్న దొంగలు

వెండి వెలుగుల మండి బజార్‌1
1/1

వెండి వెలుగుల మండి బజార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement