
మావోయిస్టులు అజ్ఞాతం వీడాలి
● సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావో యిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డును సోమవారం సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అడవి బాట పట్టిన మావోయిస్టులు హింసను వది లి జనంలోకి రావాలని, లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను అందుకొని వారి కుటుంబాలతో ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.