సీపీని కలిసిన అటవీ, ఎకై ్సజ్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

సీపీని కలిసిన అటవీ, ఎకై ్సజ్‌ అధికారులు

Apr 11 2025 12:57 AM | Updated on Apr 11 2025 12:57 AM

సీపీని కలిసిన అటవీ,  ఎకై ్సజ్‌ అధికారులు

సీపీని కలిసిన అటవీ, ఎకై ్సజ్‌ అధికారులు

వరంగల్‌ క్రైం: జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్‌ అగర్వాల్‌, ఎకై ్సజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ అంజన్‌రావు గురువారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ అంశాలపై చర్చించారు.

వాహనాలు తీసుకెళ్లండి: సీపీ

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను భీమారంలోని సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంలో భద్రపర్చినట్లు, స్టేషన్ల వారీగా గుర్తించి సంబంధిత వాహన యజమానులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందించనున్నట్లు వివరించారు. మరింత సమాచారం కోసం 87126 85143, 87126 85158, 87125 84557 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement