బుట్టాయగూడెం: మండలంలోని మంచులవారిగూడెంలో స్వయంభుగా వెలసి భక్తుల పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మతల్లి, కనకదుర్గమ్మ, నాగమ్మతల్లి, నాగేంద్రుల ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కోయ గిరిజన సంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో బోనం ఎత్తుకుని గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కోలాటాల ఊరేగింపు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా అమ్మవారికి పుట్టింటి సారె కావిడ్లతో, నాటు కోళ్లు, మేకపోతులతో మొక్కులు చెల్లిస్తామని ఆలయ పీఠాధిపతి కేరం మధు తెలిపారు.
ఘనంగా ఉగాది ఉత్సవాలు