West Godavari District Latest News
-
సంక్షోభంలో మామిడి పరిశ్రమ
చింతలపూడి: మామిడి పరిశ్రమ ఈ సంవత్సరం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అకాల వర్షాలు, వడగళ్లు, మంగుతెగులు వంటి అనేక కారణాలతో మామిడి దిగుబడి తగ్గింది. మామిడి ఎగుమతుల్లో ఏలూరు జిల్లాలో నూజివీడు తరువాత స్థానం చింతలపూడిదే.. ఈ ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంతవరకూ ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేవు. కాయ దిగుబడి లేకపోవడం, కోతకు వచ్చిన కొద్దిపాటి కాయ నాణ్యత లోపించడంతో ఎగుమతులు మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు. కాయ మంచి సైజుకు ఎదిగే వరకూ చెట్టుమీదే ఆపడానికి రైతులకు ధైర్యం చాలడంలేదు. అకస్మాత్తుగా గాలి దుమ్మో, వడగళ్ల వానో వస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే సమయానికి రోజుకు 25 లారీల సరుకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది ఐదు లారీలు కూడ ఎగుమతి చేయలేక పోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఇంతవరకు చింతలపూడి ప్రాంతం నుంచి 300 లారీల సరుకు మాత్రమే ఎగుమతి చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో టన్ను రూ.70 వేలు ఉన్న మామిడి ధర ఇటీవల హఠాత్తుగా పడిపోయింది. ప్రస్తుతం టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేలుగా ఉంది. ప్రస్తుత ధర రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. నాలుగేళ్లుగా మార్కెట్లో మామిడి ధరలు చూస్తే 2022లో ప్రారంభంలో టన్ను రూ.లక్షకు అమ్ముడైంది. సీజన్ చివరికి వచ్చేసరికి టన్ను రూ.25 వేలకు పడిపోయింది. 2023లో ప్రారంభంలో టన్ను రూ.80 వేలు అమ్మగా సీజన్ చివరిలో రూ.20 వేలకు చేరింది. 2024లో టన్ను రూ.90 వేలు అమ్మగా సీజన్ చివరిలో టన్ను రూ.30 వేలకు పడిపోయింది. ఇక్కడి నుంచి ముంబయ్, కోల్కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిశా వంటి ప్రాంతాలకు వ్యాపారులు మామిడి ఎగుమతి చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడిని రవాణా చేయడం వ్యాపారులకు భారంగా మారింది. ఈ ప్రాంతం నుంచి నాగపూర్ ఎక్కువగా ఎగుమతవుతుంది. విడికాయలు గ్రేడింగ్, ప్యాకింగ్ చేస్తే టన్నుకు రూ.5 వేల వరకూ ఖర్చవుతుందని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో పాటు కిరాయి రూ 50,000 అవుతుందంటున్నారు. ఈ దశలో అటు రైతుల్లో, ఇటు వ్యాపారుల్లో ఇకపై మామిడి లాభసాటి కాదన్న అభిప్రాయం నెలకొంది. జిల్లాలో తగ్గిన విస్తీర్ణం జిల్లాలో అన్ని రకాల ఉద్యాన పంటలు కలిపి 1,08,300 హెక్టార్లలో ఉన్నాయి. ఒకప్పుడు జిల్లాలో లక్షలాది ఎకరాల్లో విస్తరించి ఉండే మామిడి తోటలు ప్రస్తుతం 40,000 ఎకరాలకు తగ్గిపోయాయి. అధిక భాగం మామిడి తోటలు తొలగించి రైతులు పామాయిల్ తోటలు వేసుకున్నారు. మామిడి స్థానంలో పామాయిల్ 44 వేల హెక్టారుల్లో ఆక్రమించింది. జిల్లాలో నూజివీడు నియోజకవర్గంతో పాటు చింతలపూడి, ద్వారకా తిరుమల, నల్లజర్ల, టి.నరసాపురం ప్రాంతాల్లో మాత్రమే మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ప్రోత్సాహం అందించక పోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది. భారీగా తగ్గిన దిగుబడి గిట్టుబాటు ధర లేక దిగాలు మెట్ట ప్రాంతంలో ఏటా రూ.10 కోట్ల వ్యాపారం మామిడి రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. ఏటా సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడులు లేవు. ఏటా మామిడి వల్ల నష్టాలను తట్టుకోలేక నాకున్న 4 ఎకరాల తోటను తొలగించాల్సి వచ్చింది. – చేపూరి ఖాదర్బాబు, రైతు, చింతలపూడి మండలం నష్టం తప్పేలా లేదు ఈ ఏడాది నష్టం వచ్చేలా ఉంది. నాణ్యత లేని కారణంగా ఎగుమతులు మందగించాయి. ధర పెరిగితేనే కాని నష్టాల నుంచి బయటపడడం కష్టం. ప్రారంభంలో టన్ను రూ.70 వేల వరకూ ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేలు అమ్ముతుంది. ప్రస్తుతం ధర ఇలాగే కొనసాగితే రైతులు, వ్యాపారులు నష్టపోవాల్సిందే. – చిక్కాల నాగేశ్వర్రావు, మామిడి కమిషన్ వ్యాపారి, చింతలపూడి -
కారు ఢీకొని 8 గొర్రెల మృతి
ద్వారకాతిరుమల: మండలంలోని లైన్ గోపాలపురం జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం కారు ఢీకొని ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. స్థానికుల కథనం ప్రకారం.. లైన్ గోపాలపురానికి చెందిన రైతు దండుబోయిన కొండయ్య గొర్రెలను సమీపంలోని ఒక తోటలో మేపి, సాయంత్రం ఇంటికి తోలుకెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి రోడ్డు దాటుతున్న గొర్రెలను ఏలూరు నుంచి రాజమండ్రి వైపుకు వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వరకట్న వేధింపుల కేసు నమోదు కై కలూరు: వరకట్న వేధింపులతో పాటు, పరాయి సీ్త్రతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడంటూ భర్తపై భార్య రూరల్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చటాకాయి గ్రామానికి చెందిన ఘంటసాల చామంతి(29)తో అదే గ్రామానికి చెందిన ఘంటసాల వెంకన్నబాబు(35)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. భర్త మద్యానికి బానిసై వరకట్నం కోసం వేధిస్తున్నాడని, అతని తల్లిదండ్రులు సహకరిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుపై రూరల్ ఎస్ఐ రాంబాబు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమరావతి సభకు వెళ్లొస్తుండగా ప్రమాదం
నరసాపురం రూరల్: మండలంలోని సీతారామపురంలో 216 జాతీయ రహదారిపై శనివా రం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అమరావతిలో ప్రధాని సభకు వెళ్లి వస్తున్న రాజోలు డిపో బస్సు బ్రేక్ డౌన్ కావడంతో సంఘటనా స్థలంలో నిలిపివేశారు. అదే సభకు వెళ్లి తిరిగి వస్తున్న రాజోలు డిపో మరో బస్సు ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్, సిబ్బందికి గాయాలు కాగా 108లో నరసాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల్లో నియామకాలు భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ కేంద్ర కమిటీ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్గా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన ఉనికిలి శ్రీను, రాష్ట్ర ఎంప్లాయీస్, పెన్షనర్స్ వింగ్ సెక్రటరీగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన చామన సూర్యచంద్రరావు నియమితులయ్యారు. వేసవి సెలవులను నిరోధించేలా ప్రొసీడింగ్స్ భీమవరం: రెమిడియల్ తరగతుల పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉపాధ్యాయుల వేసవి సెలవులను నిరోధించడమేనని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి శనివారం ప్రకటనలో తెలిపారు. టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన 18.86 శాతం మంది పిల్లల కోసం సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఫెయిలైన పిల్లల కోసం ఉపాధ్యాయులను మండు వేసవిలో వేధించకుండా ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ను ఉపసంహరించుకుని, టీచర్లు వేసవి సెలవులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గోపిమూర్తి కోరారు. దళిత క్రైస్తవుల ర్యాలీ భీమవరం: ఎస్సీలు చర్చిలకు వెళితే ఎస్సీ హో దాను కోల్పోతారని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దళిత క్రైస్తవుల ఆధ్వర్యంలో స్థాని క అంబేడ్కర్ సెంటర్ వద్ద శనివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ కన్వీనర్ కోనా జోసెఫ్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చని, హైకో ర్టు తీర్పును పునః పరిశీలించాలని కోరారు. గంటా సుందర్కుమార్, ఈది రవికుమార్, గాతల సందీప్, కమలాకర్, ఈది రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 12న అప్రెంటీస్ మేళా ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12న ప్రధానమంత్రి అప్రెంటీస్ మేళా నిర్వహించన్నుట్టు ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరాజు శనివారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2021 నుంచి 2024 మధ్య వివిధ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ల జెరాక్సులతో హాజరుకావాలని సూచించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు ఏలూరు (టూటౌన్): దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20 నుంచి సమ్మె లోకి వెళుతున్నట్టు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎ. అప్పరాజు తెలిపారు. శనివారం సమ్మె నోటీసును ఏలూరు అడిషనల్ కమిషనర్ చంద్రయ్యకు అందజేశారు. ఏలూరు కార్పొరేషన్లో ప నిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్ చే యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, సరెండర్ లీవ్ బకాయిలు, డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని సిబ్బందికి కనీస వేతనం రూ.35 వేలు ఇవ్వాలని కోరారు. -
రైతులకు కూటమి ప్రభుత్వం దగా
భీమవరం: ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్సార్సీపీ జి ల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. దాళ్వా ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, దళారుల ప్రమేయం అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జేసీ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పంట దిగుబడులు బాగున్నా దళారులు, మిల్లర్ల ప్రమేయంతో రైతులు బస్తాకు రూ.400 వరకు నష్టపోతున్నారన్నారు. సంచుల కొరత, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వద్దకు అధికారులు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసేవారని ప్రసాదరాజు, కారుమూరి అన్నారు. అయితే ప్రస్తుతం దళారులు, మిల్లర్ల ప్రమేయంతో పట్టుబడులు ముందు కు సాగడం లేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ప్రకటించడంతో రైతుల్లో ఆందోళనలు రేకెత్తించి దళారులు అయినకాడికి దో చుకుంటున్నారని విమర్శించారు. సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు రైతుల గో డు పట్టడం లేదని దుయ్యబట్టారు. సంచుల కొరత, తేమశాతం పేరుతో రైతులు దోపిడీకి గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో రైతు లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట పడుతుందని హెచ్చరించారు. మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనాలి జిల్లాలో సుమారు 10 లక్షల టన్నుల ధాన్యాన్ని పూ ర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, తేమ శా తం, ముక్క పేరుతో రైతులను వేధించకుండా చ ర్యలు తీసుకోవాలని, ధాన్యం డబ్బులు వెంటనే చె ల్లించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డి మాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉండి, పాలకొల్లు సమన్వయకర్తలు పీవీఎల్ నర్సింహరాజు, గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, భీమవరం ఎంపీపీ పేరిచర్ల విజయ నర్సింహరాజు, నాయకులు బంధన పూర్ణచంద్రరావు, గాదిరాజు రామరాజు, చవాకులు సత్యనారాయణ, జల్లా కొండయ్య, చిగురుపాటి సందీప్, కోడే యుగంధర్, ఇంటి సత్యనారాయణ, గుంటి ప్రభు, పెనుమాల నర్సింహస్వామి, రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం రైతుల ఇబ్బందులు జేసీకి వివరించిన వైఎస్సార్సీపీ నేతలు -
గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్య
భీమవరం: భీమవరం పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్తి చాకుతో గొంతుకోసుకుని మృతిచెందాడు. ఉండి గ్రామం పెదపేటకు చెందిన గాతల క్రాంతికుమార్(35) కొంతకాలంగా మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. శుక్రవారం పనికి వెళ్లిన క్రాంతికుమార్ అక్కడ పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి శనివారం భీమవరం ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం కుటుంబసభ్యులు తీసుకువెళ్లగా.. దెయ్యాలు వస్తున్నాయంటూ వైద్యానికి సహకరించలేదు. దీంతో ఇంటికి తీసుకు వెళ్తుండగా అంబేడ్కర్ సెంటర్కు వచ్చే సరికి యనమదుర్రు డ్రెయిన్లోకి దూకాడు. వెంటనే బయటకు తీయగా అక్కడే పండ్లు అమ్ముతున్న వ్యక్తి నుంచి చాకు తీసుకుని పరుగులు పెడుతూ ఒంటిపై గాయాలు చేసుకున్నాడు. ఉండి రోడ్డులోని మల్టీఫ్లెక్స్ వద్దకు వెళ్లేసరికి గొంతు కోసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి జాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై ఇజ్రాయిల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో బస్సు దగ్ధం కై కలూరు: బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల స్కూల్ బస్సు దగ్ధమైన ఘటన కై కలూరు మాత ఇంగ్లీషు మీడియం స్కూల్ గ్రౌండ్లో శనివారం మధ్యాహ్నం జరిగింది. వేసవి సెలవులు కావడంతో బస్సు గ్రౌండ్లో ఉంచారు. బస్సు నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్ సిబ్బందితో హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. రూ.3 లక్షలకు పైగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. కొబ్బరి చెట్టుకు మంటలు కై కలూరు: మండవల్లి మండలం చావలిపాడు రైల్వేగేటు సమీపంలో జమ్ము గడ్డికి నిప్పంటుకుని కొబ్బరి చెట్టు మొదలు వరకు మంటలు వ్యాపించాయి. సమీపంలో ఇళ్లతో పాటు ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కై కలూరు అగ్నిమాపక అధికారి సకాలంలో మంటలు అదుపు చేశారు. కలిదిండి పోలీసు స్టేషన్ వెనక భాగంలో కిక్కిస పొదలలో మంటలు వ్యాపించగా.. అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పివేశారు. -
అంజన్నకు అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆంజనేయస్వామికి శనివారం అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామి ఉత్సవ మూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మద్యాహ్నం వరకు వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,41,401 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. స్వామి నిత్యాన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులతో పోటెత్తిన శ్రీవారి క్షేత్రం ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. ఆలయ అనివేటి మండపంలో ఒడుగు వేడుకలు అధిక సంఖ్యలో జరిగాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తెలపండి ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, దీనిపై ఎవరికై నా అభ్యంతరాలున్నా తెలపాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జీ.నాగమణి ఒక ప్రకటనలో కోరారు. ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించి గత ఏప్రిల్ 22వ తేదీ వరకూ అభ్యంతరాలకు గడువు ఇచ్చామని, అనంతరం తమకు అందిన అభ్యంతరాల ప్రకారం జాబితాను తయారు చేసి ఆర్జేడీ కాకినాడ వెబ్సైట్లో, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణ జిల్లా విద్యాశాఖల వెబ్సైట్లో, నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు. -
సీహెచ్ఓల సమ్మెకు మద్దతు
భీమవరం: తమ సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్ఓ) అసోసియేషన్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భీమవరం కలెక్టరేట్ వద్ద ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న సీహెచ్ఓల శిబిరం వద్దకు శనివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీహెచ్ఓలకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంతో పోరాడి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఉండి, పాలకొల్లు సమన్వయకర్తలు పీవీఎల్ నర్సింహరాజు, గుడాల గోపి, ఎంపీపీ పేరిచర్ల విజయ నర్సింహరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, నాయ కులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో ఉత్తరం కలకలం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆకాశ రామన్న ఉత్తరంతో కలకలం రేగింది. కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ, మెంటార్లందరికి ఈ ఉత్తరం శనివారం పోస్టులో వచ్చింది. యూనివర్సిటీ యాజమాన్యం కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ పట్ల ఒక విధంగా వ్యవహరిస్తూ , పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా దోచిపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తాము జీతాలు పెంచమని, గతంలో నెట్, సెట్ లేకుండా పీహెచ్డీకి ఇచ్చిన ఇంక్రిమెంట్లను ఇవ్వమని అడిగితే నిబంధనలంటూ అడ్డుపడుతున్న యాజమాన్యం, పర్మినెంట్ అధ్యాపకులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ తేదీలను మూడేళ్లు ముందుకు జరుపుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వమని అడిగితే జీవో నెంబరు 110ని బూచిగా చూపిస్తున్నారని, అదే శాశ్వత అధ్యాపకులకు మాత్రం జీవో నెంబరు 14, జీవో నెంబరు 20లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పెయిడ్ జర్నల్స్, కాన్ఫరెన్స్ పేపర్లను చూపించి పదోన్నతుల తేదీలు జరిపించుకుంటున్నట్లు లేఖలో వివరించారు. ఇలా పలు ఆరోపణలు చేశారు. లోతైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అర్జీయూకేటీ కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఉన్నవన్నీ సత్యాలేనని, పీహెచ్డీ చేసిన మెంటార్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.5 వేలు అదనపు ఇంక్రిమెంట్ కొన్నాళ్లు ఇచ్చి జీవో నెంబరు 110ను సాకుగా చూపించి ఆపేశారని, దీనివల్ల ఎంతో నష్టపోయామని వాపోతున్నారు. -
సంచుల కోసం రైతుల ధర్నా
కుళ్లిపోతున్నా పట్టించుకోరా? ఏలూరు సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలోని శవ పరీక్ష కేంద్రం (మార్చురీ)లో ఫ్రీజర్ బాక్సులు పనిచేయక మృతదేహాలు పాడవుతున్నాయి. IIలో uపెనుమంట్ర: ధాన్యం మాసూళ్లు చేసి రోజులు గడుస్తున్నా రైతు సేవా కేంద్రాల్లో గోనె సంచులు సరఫరా చేయడం లేదని, మిల్లుల వద్ద తూకా ల్లో మోసాలను అరికట్టాలంటూ శనివారం జుత్తిగ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. వీరికి జిల్లా కౌలు రైతు సంఘం మద్దతు తెలిపింది. తహసీల్దార్, వ్యవసాయ అధికారి ఇక్కడకు వచ్చి ఆదివారం నాటికి జు త్తిగ గ్రామానికి 25 వేల సంచులు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అనంతరం జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడు కూసంపూడి సుబ్బరాజు మాట్లాడుతూ వాతావరణంలో మార్పులు, సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీఆర్ 126 రకం ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, బయట అమ్ముకోవాలని చెబుతున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ సంచికి అదనంగా ధాన్యం తూకం వేయడం, తేమ శాతం, నూక శాతం పేరుతో రైతులను మిల్లర్లు దోచుకుంటున్నారని విమర్శించా రు. ధాన్యం తూకంలో తాము మోసపోయిన విషయాన్ని అధికారుల దృష్టికి రైతులు తీసుకువచ్చారు. సంచికి అదనంగా 600 గ్రాముల తరుగు మిల్లర్లు మినహాయిస్తున్నారన్నారు. -
సీజనిల్ సేల్స్
ఎన్నో ఏళ్లుగా హోమ్నీడ్స్ వ్యాపారం చేస్తున్నాను. ఏటా సమ్మర్ సీజన్లో 150 వరకు ఏసీ యూనిట్లు అమ్మేవాళ్లం. ఈ ఏడాది సరిగా అమ్మకాలు జరగడం లేదు. అప్పుడే రెండు నెలలు గడిచిపోయినా ఇంకా 25 యూనిట్లు కూడా అమ్మలేదు. ఫ్రిజ్లు, కూలర్ల సేల్స్ కూడా పడిపోయాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇదీ భీమవరానికి చెందిన ఓ వ్యాపారి ఆవేదన. సాక్షి, భీమవరం: వేసవి వస్తుందంటే వినియోగదారులతో కిటకిటలాడుతూ కనిపించే ఏసీ, ప్రిజ్, కూలర్లు తదితర హోమ్నీడ్స్ షాపులు ఈ సమ్మర్ సీజన్లో వెలవెలబోతున్నాయి. సమ్మర్ సేల్లో రెండు నెలలు గడిచిపోగా 50 శాతం కూడా అమ్మకాలు జరగలేదని వ్యాపార వర్గాలంటున్నాయి. జనం దగ్గర డబ్బులు లేకపోవడం, విద్యుత్ చార్జీలు పెరిగిపోవడం సేల్స్ పడిపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో 60 వరకు షాపులు : జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో స్థానిక వ్యాపారులకు చెందిన ఎలక్ట్రికల్ హోమ్నీడ్స్ దుకాణాలు 60 వరకు ఉన్నాయి. సోనోవిజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ తదితర ప్రముఖ కంపెనీలకు చెందిన బ్రాంచీలు, కార్పొరేట్ షోరూమ్లు 25 వరకు ఉంటాయి. ఆయా సంస్థలు, ఈ–కామర్స్లో సమ్మర్ సేల్స్ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మార్చి నుంచే మొదలు ఎండల తీవ్రత పెరగడం వలన ఏసీలు, ఫ్రిజ్లు, కూలర్లు, ఇన్వెర్టర్ల సమ్మర్ సేల్స్ మార్చి నుంచే మొదలవుతాయి. మున్ముందు మరింత పెరిగే ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ఆయా గృహోపకరణాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. కొత్తగా కొనేవారు కొందరైతే, ఎక్ఛేంజీ ఆఫర్లో పాత వాటిని ఇచ్చేసి కొత్త వస్తువులను తీసుకునే వారు మరి కొందరు. ఆన్లైన్తో పాటు షాపుల్లోనూ ఈఎంఐల పద్ధతిలో ఫైనాన్స్ సదుపాయం ఉండటంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు నెలనెలా వాయిదాలు కట్టుకోవచ్చన్న భావనలో ఏసీలు, ఫ్రిజ్ల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తున్నారు. సమ్మర్ సీజన్లో జిల్లావ్యాప్తంగా నెలకు 8,000 నుంచి 10,000 ఏసీలు, 3,000 వరకు ఫ్రిజ్లు, 5,000 వరకు కూలర్లు, 4,000 వరకు ఇన్వెర్టర్లు అమ్ముడవుతుంటాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ప్రభావం వలన గతేడాది అనుకున్నదాని కంటే దాదాపు రెట్టింపు అమ్మకాలు జరిగినట్టు తణుకుకు చెందిన ఓ వ్యాపారి తెలిపారు. సమ్మర్ సీజన్ కోసం మార్చికి ముందే వ్యాపారులు స్టాకులు పెట్టుకున్నారు. చుక్కలు చూపిస్తున్న విద్యుత్ చార్జీలు కూటమి పాలనలో విద్యుత్ చార్జీలు సామాన్యు లకు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ వినియోగమే అయినా గతంతో పోలిస్తే రెట్టింపు బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు వాపో తున్నారు. అప్పు చేసి ఏసీ కొందామన్న విద్యుత్ చార్జీలు మరింత పెరిగిపోతాయని, వీటిని సాకుగా చూపించి ప్రభుత్వం భవిష్యత్లో తమకు సంక్షేమ పథకాలు రాకుండా చేస్తుందన్న భయంతో పేద, మధ్యతరగతి వర్గాలు వెనుకడుగేస్తున్నాయి. దీంతో వినియోగదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో సగం అమ్మకాలు కూడా జరగలేదని వ్యాపారులు అంటున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నా అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని చెబుతున్నారు. షాపులు వెలవెల కొద్దినెలలుగా మార్కెట్ డల్ అయిపోవడం సమ్మర్ సేల్స్ పైనా పడింది. గత ప్రభుత్వంలో ప్రతి నెలా పథకాలు పేదవర్గాల తలుపు తట్టేవి. కూటమి పాలనలో సంక్షేమం జాడ లేకుండా పోయింది. పనులు కూడా సరిగా లేకపోవ డం, నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడం పేద, మధ్యతరగతి వర్గాల జీవన ప్రమాణాలను దుర్భరంగా మార్చేశాయి. సమ్మర్ మార్కెట్ డల్ పడిపోయిన ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ల అమ్మకాలు గతంలో వేసవి ప్రారంభానికి ముందు నుంచే సమ్మర్ సేల్స్ జోరు ఏటా సమ్మర్ సీజన్లో జిల్లాలో రూ.100 కోట్లకు పైగా అమ్మకాలు గత రెండు నెలల్లో 50 శాతం కూడా అమ్మకాలు లేవంటున్న వ్యాపారులు ఎండలు మండుతున్నా.. సంక్షేమం జాడలేక జనం జేబులు ఖాళీ బెంబేలెత్తిస్తున్న విద్యుత్ బిల్లులు -
రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులకు గాయాలు
ద్వారకాతిరుమల: మండలంలోని రాళ్లకుంట సెయింట్ గ్జేవియార్ పాఠశాల వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం.. రాళ్లకుంటకు చెందిన పరసా జనార్ధన్, సరోజిని దంపతులు ద్వారకాతిరుమలలోని సొసైటీ పెట్రోల్ బంకు సమీపంలో నిమ్మకాయలు, కొబ్బరి కాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం ముగించుకుని సాయంత్రం టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి జి.కొత్తపల్లి నుంచి ద్వారకాతిరుమల వైపుకు వెళుతున్న ఆటోను వీరి వాహనం ఎదురుగా ఢీకొట్టింది. దాంతో జనార్ధన్, సరోజిని దంపతులు రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు శ్రీవారి దేవస్థానం ఆంబులెన్స్లో పీహెచ్సీకి తరలించారు. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి తణుకు అర్బన్: వాహనం ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని శుక్రవారం తణుకు ఆర్యోబీపై వాహనం ఢీకొట్టింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి, మాజీ మంత్రి కారుమూరి కాళ్ల: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు గడుస్తున్నా అభివృద్ధి జాడలేదని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలోనూ విఫలమైందని, ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదు నూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి నా గేశ్వరరావు అన్నారు. మండలంలోని పెద అమిరంలో శనివారం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అబ ద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించి కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో మ ట్టి, గ్రావెల్ మాఫియాలతో రౌడీ పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, అధైర్యపడవద్దని భరో సా ఇచ్చారు. పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, పార్టీకి 2019 నాటి పునర్వైభవం తప్పక వస్తుందని స్పష్టం చేశారు. సంస్థాగతంగా పునర్నిర్మాణం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మాణం చేస్తూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అన్నా రు. ఇప్పటికే జిల్లాస్థాయిలో కమిటీల నియామకం పూర్తి చేశామని, రానున్న రోజుల్లో గ్రామ, బూత్ స్థాయిలో కమిటీలు వేస్తామని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంపద సృష్టి బాబు కుటుంబానికే.. రాష్ట్రంలో సంపద సృష్టి చంద్రబాబు కుటుంబానికే అని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. ప్రతి రైతుకూ న్యాయం చే స్తామని ప్రగల్భాలు పలికిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఇక్కకి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గోనె సంచు లు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అప్పుడు నీరు–మట్టి.. ఇప్పుడు చాక్లెట్ అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాని మోదీ ఏదో ఇస్తారని ప్రజలంతా ఎదురు చూశారని, గతంలో నీరు–మట్టి, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్క ల్యాణ్ కోసం చాక్లెట్ తెచ్చారని ఎద్దేవా చేశారు. అమరావతి శంకుస్థాపన పేరుతో కూటమి ప్రభు త్వం అప్పులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని మండిపడ్డా రు. అనంతరం జిల్లా పరిశీలకుడు మురళీ కృష్ణంరాజును నేతలు ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల ఇన్చార్జులు పీవీఎల్ నరసింహరాజు, గుడాల గోపి, నేతలు పేరిచర్ల విజయ నరసింహరాజు, బంధన పూర్ణచంద్రరావు, గాదిరాజు రామరాజు, చిగురుపాటి సందీప్ పాల్గొన్నారు. -
శవాలు కుళ్లిపోతున్నా పట్టించుకోరా?
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో శవ పరీక్ష కేంద్రం(మార్చురీ) పనిచేస్తోంది. నిత్యం జిల్లా పరిధిలో రోడ్డు, రైలు ప్రమాదాల్లో మరణించినవారు, అనుమానాస్పద మృతులు, హత్యలు, ఆత్మహత్యలు, చికిత్స పొందుతూ మృతిచెందిన వారి మృతదేహాల్ని మార్చురీలో భద్రపరుస్తారు. మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగానికి చెందిన వైద్య నిపుణులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తుంటారు. మార్చురీలోని ఫ్రీజర్ బాక్సులు పనిచేయక బంధువుల మృతదేహాలు పాడవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సరిగా అంతిమ సంస్కారాలు చేయలేని పరిస్థితి నెలకొందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఐదు ఫ్రీజర్లే దిక్కు ఏలూరు జిల్లా వ్యాప్తంగా రోజూ రెండు, మూడు లేదా ఒక్కోసారి నాలుగైదు మృతదేహాలు జీజీహెచ్లోని మార్చురీకి వస్తాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారు, గుర్తు తెలియని మృతదేహాలు, రైల్వే డెత్స్ మృతదేహాలు మార్చురీలో రోజుల తరబడి భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. మార్చురీలో కేవలం రెండు పాత ఫ్రీజర్ బాక్సులు, మరో మూడు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేసిన అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన కొత్తలో 12 మృతదేహాలను భద్రపరిచేలా ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉంచారు. మొదటి నుంచి ఈ ఫ్రీజర్ బాక్సులు పనిచేయటంలేదు. మరో రెండు పాత ఫ్రీజర్ బాక్సులు పూర్తిగా పాడైపోవటంతో బయో మెడికల్ ఇంజనీర్ విభాగం వాటిని పక్కన పెట్టేసింది. ఫ్రీజర్ బాక్సులు సక్రమంగా పనిచేయటం లేదని ఉన్నతాధికారులకు మొదట్లోనే నివేదించారని మెడికల్ కాలేజీ అధికారులు చెబుతున్నారు. జీజీహెచ్లో పరిష్కారం కాని ఫ్రీజర్ల సమస్యఆవేదనలో మృతుల బంధువులు ఏలూరు జీజీహెచ్లోని మార్చురీలో ప్రస్తుతం మరమ్మతులు చేసిన రెండు పాత ఫ్రీజర్ బాక్సులు, మరో మూడు స్వచ్చంద సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని మెడికల్ కాలేజీ అధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో రోజూ మూడు నుంచి నాలుగు మృతదేహాలు మార్చురీకి వస్తాయి. రైల్వే ప్రమాదాల్లో మృతదేహాలకు వారం రోజులకు పైగా పోస్టుమార్టం నిర్వహించే పరిస్థితి ఉండదు. సరాసరి రోజుకు మూడు నుంచి నాలుగు మృతదేహాలు మార్చురీలో భద్రపరుస్తారు. ఒక్కోసారి ఐదారు మృతదేహాలు మార్చురీకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2 పాత ఫ్రీజర్ బాక్స్ లు, స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన 3 ఫ్రీజర్ బాక్స్లు మాత్రమే ఉంటే మృతదేహాలను భద్రపర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఫ్రీజర్ బాక్సులు లేకుంటే బంధువుల మృతదేహాలు పాడై దుర్గంధం వెదజల్లితే వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనకు గురవుతారనేది అధికారులకు పట్టదా? అని ప్రశ్నిస్తున్నారు. -
పేదల ఇళ్ల తొలగింపు అన్యాయం
పాలకోడేరు: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల్లను అన్యాయంగా తొలగిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. అభివృద్ధికి వైఎస్సార్సీపీ అడ్డు కాదని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు మానుకోవాలని అన్నారు. మండలంలోని గొల్లలకోడేరులో ఇటీవల తొలగించిన వ్యాపార సముదాయాల ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ నాయకుల బృందం శనివారం పరిశీలించింది. అనంతరం పార్టీ నేత చేకూరి రాజా నరేంద్రరాజు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ముదునూరి మాట్లాడుతూ కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు తొలగించడంపై పేదలు ఆవేదన చెందుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లక్షలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఇళ్లు తొలగించిన బాధితులకు మూడు సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికార బలం ఉందని పేదలపై జులుం సరికాదన్నారు. పలు నియోజకవర్గాల్లో సమస్యలు చాలా ఉన్నాయని, పలుచోట్ల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, డెల్టా ఆధునికీకరణకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని, ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా పెరగ్గా నియంత్రించాల్సిన ప్ర భుత్వం పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. సూపర్ సిక్స్పై ముఖం చాటేసిన సర్కారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ముఖం చాటేసిందని విమర్శించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై బురద చల్లి తిరిగి అదే కొనసాగిస్తున్నారంటే కూటమి నాయకులు అబద్ధాలు చెప్పి ఎలా అధికారం చేపట్టారో అర్థమవుతుందన్నారు. డెల్టా ప్రాంతంలో కాలువలు, డ్రె యిన్లు, రోడ్ల వెంబడి ఆక్రమణలు ఉండటం సహజమని, అయితే ఉండి నియోజకవర్గంలో ఇళ్లు ధ్వంసం సరికాదన్నారు. పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రత్యామ్నాయం చూపకుండా తొలగింపా? ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ పేదలకు ఎటువంటి సమయం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఉండి నియోజకవర్గంలో అవసరం లేకపోయినా పేదల ఇళ్లను తొలగిస్తున్నారని అన్నారు. బాధితులకు కూటమి మేనిఫెస్టో ప్రకారం మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం జరిగితే వారి పక్షాన పోరాడటానికి వైఎస్సార్సీపీ ముందుంటుందన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి, పేరిచర్ల విజయ్ బాబు యూత్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, బంధన పూర్ణచంద్రరావు, నాయకులు చేకూరి రాజా నరేంద్ర రాజు, ఆవుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో మృతి
నూజివీడు: మండలంలోని మీర్జాపురం హైస్కూల్ విద్యాకమిటీ చైర్మన్ పిన్నిబోయిన రామకృష్ణ (36) విద్యుత్షాక్తో గురువారం రాత్రి మృతిచెందారు. మీర్జాపురం శివారం కండ్రికలో రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బజారుకు వెళ్తుండగా కరెంటు స్తంభానికి చేయి తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. స్థానికులు, అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన హనుమాన్ జంక్షన్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. రూరల్ ఎస్ఐ జ్యోతిబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ మృతితో కుటుంబం ఆధారం కోల్పోయినట్లయింది. విద్యుత్ షాక్తో మృతిచెందిన పిన్నిబోయిన రామకృష్ణ కుటుంబ సభ్యులను శుక్రవారం గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి పరామర్శించారు. సీపెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం యలమంచిలి :విజయవాడలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్)లో పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల వ్యవధి డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ), డిప్లమో ఇన్ పాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సీపెట్ డైరెక్టర్ అండ్ హెడ్ సీహెచ్ శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ విద్యార్హతతో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ కోర్సులకు మే 29లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూన్ 8న పరీక్ష నిర్వహించి వచ్చిన ర్యాంక్ ఆధారంగా విజయవాడ కేంద్రంలో 150 సీట్లు భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్లాస్టిక్ రంగంలో జూనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్), మౌల్డ్ డిజైనర్ అండ్ మేకర్ జూనియర్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు వస్తాయని వివరించారు. మరిన్ని వివరాలకు 9398050255 నెంబరులో సంప్రదించాలని కోరారు. -
పంటల్లో పెరిగిన ఎరువుల వినియోగం
పెనుమంట్ర : వరి, మొక్కజొన్న లాంటి పంటల్లో ఎరువుల వినియోగం చాలా ఎక్కువగా ఉందని, దానికి తగ్గట్టు దిగుబడిలో పెరుగుదల కనిపిస్తుందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రెండో రోజు గోదావరి మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని, సిఫార్సు చేస్తున్న పురుగు మందుల మోతాదును కూడా పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి శివనారాయణ మాట్లాడుతూ పరిశోధనా స్ధానాలు, విత్తనోత్పత్తి సంస్ధలపై భారం తగ్గించడానికి రైతు విత్తనోత్పత్తిదారులను గ్రామాలలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని విస్తరణ కేంద్రాలను ఆదేశించారు. వరి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పండించే 127 లక్షల టన్నుల ధాన్యం నుంచి సుమారు 80 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుందని, మన రాష్ట్ర అవసరాలకు సుమారు 50 లక్షల టన్నుల బియ్యం సరిపోతుందని, మిగిలిన 30 లక్షల టన్నుల బియ్యాన్ని బాసుమతి యేతర రకాల కేటగిరి కింద ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల రైతులకు అధిక ఆదాయంతో పాటు రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి మరింత మేలు జరిగే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ టి.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
జోరుగా మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం : పొంగుటూరు పంచాయతీ కన్నాయగూడెం ఊర చెరువులో మట్టి అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెల్లవారుజాము వరకు అక్రమార్కులు జేసీబీలతో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అధికారుల అండతో చట్టవిరుద్ధంగా తవ్వకాలు సాగిస్తున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ఊర చెరువులో పశువుల కోసం ఉంచిన తాగునీటిని కూడా ఇంజిన్లతో తోడి అక్రమార్కులు తమకు అనువుగా ర్యాంపులను నిర్మించి మట్టి తోలకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, మైనింగ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, అధికారుల సహకారంతోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీడబ్ల్యుఏడి పరిధిలోని నందాల చెరువు, శ్రీరామ కట్టు, భీముని చెరువుల్లో రాత్రి వేళ రహస్యంగా తోలకాలు చేస్తున్నారు. తవ్వకాలు జరిపే వారి గురించి అధికారులకు సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే జేసీబీలు, టిప్పర్లు మాయమవుతున్నాయి. తవ్వకాల వల్ల చెరువు ఆకారం మారిపోతూ, భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. జెడ్పీలో పదోన్నతులు ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. ముగ్గురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఎంపీడీవోలుగా, సీనియర్ అసిస్టెంట్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు వారికి ప్రమోషన్ ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మశ్రీ శుక్రవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో అందజేశారు. బర్డ్ హాస్పిటల్ ఇన్చార్జ్ డైరెక్టర్గా జగదీష్ ద్వారకాతిరుమల: టీటీడీ బర్డ్ హాస్పిటల్ ఇన్చార్జ్ డైరెక్టర్గా ద్వారకాతిరుమల విర్డ్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్, ప్రముఖ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ గుడారు జగదీష్ నియమితులయ్యారు. ఈ మేరకు టీటీడీ ఈఓ శ్యామలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ జగదీష్ గతంలో బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇదిలా ఉంటే గత నెల 2న అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, టీటీడీ బర్డ్ హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు ఆమోదం మేరకు ఈఓ శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. డాక్టర్ జగదీష్ బర్డ్ హాస్పిటల్ ఇన్చార్జి డైరెక్టర్గా కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది పాటు కొనసాగుతారు. అన్న కొడుకుపై కత్తితో దాడి పెంటపాడు: ఇంట్లో ఫ్యాన్ ఏర్పాటుపై వివాదం ఏర్పడి అన్న కొడుకుపై చిన్నాన దాడి చేసిన సంఘటన పరిమెళ్లలో చోటు చేసుకొంది. పెంటపాడు ఎస్సై కె.స్వామి తెలిపిన వివరాల ప్రకారం పరిమెళ్లకు చెందిన అన్నదమ్ములు వెన్నపు రాంబాబు, తన అన్న వెన్నపు రామకృష్ణలు రెండు పోర్షన్ల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాంబాబు తన ఇంట్లో సీలింగ్ ప్యాన్ బిగించుకుంటున్నాడు. ఈ విషయంపై అన్న కొడుకై న నాగరాజుతో వాగ్వాదం జరిగింది. రాత్రి మళ్లీ ఘర్షణ పడగా.. చాకుతో నాగరాజుపై రాంబాబు దాడికి చేశాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
నేత్రపర్వం చాత్మార్ ఉత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారికి చాత్మార్ ఉత్సవం శుక్రవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో నేత్రపర్వంగా జరిగింది. శ్రీమద్రామానుజుల తిరు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో అలంకరించారు. అనంతరం పూజాధికాలు జరిపి హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. -
ఫ్లాట్లు.. పడిగాపులు
భీమవరంలో 8,352 మందికి ఫ్లాట్లు మంజూరయ్యాయి. వీటిలో 300 చదరపు అడుగుల సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 3,520 ఉండగా, 365 చ.అ. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 3,520, 430 చ.అ. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 1,312 ఉన్నాయి. 2,944 ఫ్లాట్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయగా వీటిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాగ్దానం మేరకు లబ్ధిదారులకు ఉచితంగా ఇచ్చిన 300 చ.అ ఫ్లాట్లు సుమారు 1,218, మిగిలిన కేటగిరీల్లోనివి 1,726 ఉన్నాయి. ఇంకా 5,408 ఫ్లాట్లు అప్పగించాల్సి ఉండగా పెయింటింగ్స్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ తదితర పనులు చేయాల్సి ఉంది. రెండో సైట్లో ఓవర్ హెడ్ ట్యాంకు ఇంకా పిల్లర్ల దశలోనే ఉంది. అప్రోచ్ రోడ్డు, ఫ్లాట్ల వద్ద రోడ్లు, డ్రెయిన్లు, ఎస్టీపీ ప్లాంట్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. సాక్షి, భీమవరం: పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం 2016లో కేంద్రం అందరికీ ఇళ్ల పథకాన్ని తెచ్చింది. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకులో 21,144 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) పర్యవేక్షణలో షీర్వాల్ టెక్నాలజీ విధానంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. 2019 ఎన్నికలకు ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల పనులు పూర్తికాకుండానే హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయించి చేతులు దులుపుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చొరవ పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనం చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ చూపింది. తాగునీరు, సెప్టిక్ ట్యాంకు, రోడ్లు, డ్రెయిన్లు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని 8,736 ఫ్లాట్లను లబ్ధిదారులకు అప్పగించింది. మాజీ సీఎం జగన్ మాట ప్రకారం 300 చ.అ ఫ్లాట్లను లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా ఇవ్వగా, 365 చ.అ కేటగిరీలో లబ్ధిదారుల డిపాజిట్ సొమ్ములో రూ.25 వేలు, 430 చ.అ కేటగిరీలో రూ.50 వేలు మినహాయింపు ఇచ్చారు. నత్తనడకన పనులు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఇంకా పనులు పూర్తి చేయలేదు. టిడ్కో గృహాల వద్ద మౌలిక వసతుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 11,136 ఫ్లాట్లలో 4,668 ఇళ్లు 90 శాతం, 6,368 ఇళ్లు 95 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ పనుల కోసం 9,400 మంది లబ్ధిదారుల పేరిట సుమారు రూ.250 కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నా చాలా మందికి ఫ్లాట్లు స్వాధీనం చేయలేదు. దీంతో ఇంటి అద్దెతో పాటు బ్యాంకు వాయిదాలు చెల్లించేందుకు అవస్థలు పడాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు. జిల్లాలో టిడ్కో ఫ్లాట్ల వివరాలు పట్టణం ఫ్లాట్లు అప్పగించినవి అప్పగించాల్సినవి భీమవరం 8,352 2,944 5,408 పాలకొల్లు 6,144 2,560 3,584 తణుకు 912 0 912 తాడేపల్లిగూడెం 5,376 3,232 2,144 గూడు.. గోడు శ్రావణంలో టిడ్కో ఫ్లాట్లు ఇస్తామంటూ ఎన్నికల్లో నిమ్మల ప్రచారం శ్రావణం వెళ్లి ఏడు నెలలైనా మంత్రి ఇలాకాలో పూర్తికాని పనులు జిల్లాలోని నాలుగు పట్టణాల్లో 21,144 ఫ్లాట్ల మంజూరు గత ప్రభుత్వంలోనే 8,736 మందికి ఇళ్లు స్వాధీనం మిగిలిన లబ్ధిదారుల ఎదురుచూపులు ఈసారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అన్ని పనులు పూర్తిచేసి శ్రావణ మాసంలో లబ్ధిదారులు అందరికీ టిడ్కో ఫ్లాట్లు అప్పగించే బాధ్యత తీసుకుంటాం. – నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లులో పదేపదే ఈ విషయం చెబుతూ వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చింది. నిమ్మలను మంత్రి పదవి వరించింది. శ్రావణ మాసం వచ్చి అప్పుడే ఏడు నెలలు గడిచిపోయింది. లబ్ధిదారులకు మాత్రం ఫ్లాట్లు రాలేదు. ఎప్పుడు అప్పగిస్తారో స్పష్టత లేదు. -
ఆక్వా వేసవి సాగులో అప్రమత్తం
కై కలూరు: ఉష్ణోగ్రతల పెరుగుదల ఆక్వాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు మేలని మత్స్యశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. మొత్తం 2.90 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు జరుగుతోంది. వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా.. వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లకుపైనే.. ప్రభుత్వానికి అధిక ఆదాయం తీసుకొచ్చే ఆక్వారంగం వేసవిలో నష్టాల పాలవుతోంది. నీటి కొరత, హెచ్చు ఉష్ణోగ్రతలతో చేపలు, రొయ్యలు వ్యాధుల బారినపడుతున్నాయి. వేసవిలో ఆక్వా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాకినాడకు చెందిన విశ్రాంత ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ పి.రామ్మోహనరావు వివరించారు రొయ్యల, చేపల పెరుగుదల 28–32 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర బాగుంటుంది. వేసవిలో నీటి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి 35 డిగ్రీలు దాటుతోంది. ఈ పరిస్థితులలో నీటిలో ప్రాణవాయువు కరిగే శక్తి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల కొన్ని చెరువులలో (ముఖ్యంగా లోతు ఎక్కువున్న చెరువులలో) నీటి లెవల్స్ 3 అంతస్తులుగా వేరుపడుతుంది. దీనివల్ల చెరువు పైపొరలలో డీవో ఎక్కువగా, అడుగు పొరలలో డీవో తక్కువగా వుంటూ చేపలు, రొయ్యలకు ఇబ్బంది కలిగిస్తోంది. చెరువు నీటిలో అనవసరమైన, హానికారక శైవలాలు కూడా ఏర్పడతాయి. అధిక శైవలాల వల్ల నీటి పీహెచ్ పెరిగిపోతుంది. నీటి ఉష్ణోగ్రత, పీహెచ్ అధికంగా ఉన్నప్పుడు అమ్మోనియా స్థాయి పెరిగి రొయ్యలు, చేపలకు ఒత్తిడి కలిగించి వ్యాధులకు దారి తీస్తోంది. చిరు చేపలు, రొయ్యలు అధిక నీటి గుణాల తారతమ్యాలు తట్టుకోలేవు. మేత యాజమాన్యం వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు రొయ్యలు, చేపలు ఎక్కువ మేత తింటాయి. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద(33 డిగ్రీలు దాటితే), ఎక్కువ మేతను తీసుకున్నా రొయ్యలలో పెరుగుదల పెద్దగా కనబడదు. రైతులు మేత యాజమాన్యం సరిగా చేయాలి. చేపలకు ఒక్కసారే మేత ఇస్తారు. అది ఉదయం 8 గంటల తర్వాత ఇవ్వడం మంచిది. రొయ్యలకు 4–5 సార్లు ఇచ్చే ఆహారం చెక్ ట్రేని బట్టి ఇవ్వాలి. వ్యాధుల నివారణ ఇలా వేసవిలో చేపలకు, రొయ్యలకు వివిధ రకాల వ్యాధులు వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలలో శంకు జలగ, రెడ్ డిసీజ్, ఇతర బ్యాక్టీరియా వ్యాధులు, పేను వంటి పరాన్న జీవుల వ్యాధులు వ్యాపిస్తాయి. రొయ్యలలో శరీరం వంపు తిరగడం (బోడి క్రాంప్స్) వైట్ గట్, వైట్ ఫీసెస్, వైట్ మజిల్, రన్నింగ్ మోర్టాలిటీ, విబ్రియో వంటి బాక్టీరియా విజృంభిస్తుంది. చెరువులో పెంచే చేప, రొయ్యలకు ఏవిధమైన ఒత్తిడి కలిగించకుండా చర్యలు చేపట్టాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రైతుల ఆందోళన చుట్టుముడుతున్న వ్యాధులు ముందస్తు జాగ్రత్తలు మేలంటున్న మత్స్య విభాగ నిపుణులు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెరువు నీటి లోతు కనీసం 1.5 మీటర్లు ఉండాలి నీటిలో ఏరియేటర్లను క్రమపద్ధతిలో అమర్చి తిప్పుకోవాలి. నీటిలో డీవో స్థాయి తగ్గితే సర్దుబాటు కోసం హైడ్రోజన్ పెరాకై ్సడ్, కాల్షియం పెరాకై ్సడ్ వంటి రసాయనాలు అందుబాటులో ఉంచుకోవాలి. వారం వారం రొయ్యల మేతను చెక్ ట్రే ఆధారంగా లెక్కించి అవసరమైతేనే పెంచాలి. అనవసరంగా చెరువులో ఎరువులు వాడకూడదు. వ్యాధులకు అనుగుణంగా రసాయనాలు, ప్రోబయోటిక్స్ అందుబాటులో ఉంచుకోవాలి. కొత్తగా చెరువులో రొయ్య సీడ్ వేసే వారు, ముందుగా సీడ్(రొయ్య పిల్ల)ని చెరువు వాతావరణానికి అలవాటు చేసి వదలండి. దీని వల్ల నెంబరు తగ్గకుండా నిలబడుతుంది. -
కాపు అంతంతమాత్రం
ఈ ఏడాది కాపు అంతంత మాత్రంగా ఉంది. మూడేళ్ల నుంచి కాపు సరిగా లేక, తెగుళ్లతో ఇబ్బంది పడుతున్నాం. సరైన ఆదాయం లేదు. ఈ ఏడాదీ ఆదాయం పెరిగే సూచనలు లేవు. రెండు, మూడు రోజుల నుంచి కాయల దిగుబడి వస్తోంది. మరో వారంలో పూర్తిస్థాయిలో మార్కె ట్లోకి కాయలు వస్తాయి. – అడ్డాల శ్రీరంగం, రైతు, మొగల్తూరు తోటలు తగ్గిపోతున్నాయి ఏటేటా తోటలు తగ్గిపోతున్నాయి. తోటలు నరికేసి లేఅవుట్స్ వేస్తున్నారు. ఆలస్యంగా కాపు కాయడంతో మిగిలిన చోట్ల సీజన్ అయిపోతుందనగా ఇక్కడ ప్రారంభమవుతుంది. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా దేశ, విదేశాల్లోని బంధువులకు, స్నేహితులకు వీటిని పంపిస్తారు. – కొప్పినీడి శ్రీనివాస్, రైతు, పేరుపాలెం ● -
విద్యార్థులభవిష్యత్తుతో చెలగాటం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శాఖలుగా విస్తరించిన ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఏలూరు పరిసర ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోంది. కొన్నేళ్ళుగా నగరంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులను పాఠశాలలో చేర్చుకుని, తల్లిదండ్రుల నమ్మకం సంపాదించి ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలను మూసివేశారని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పాఠశాల మూసివేత సమయానికి సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. పాఠశాల మూసివేసే ఆలోచన ఉంటే ఒక ఏడాది ముందుగా విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిలో పెట్టాలని, పాఠశాల యాజమాన్యం అలా చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా మూసివేసి తమ బిడ్డలకు మరో పాఠశాలలో ప్రవేశాలు పొందే అవకాశం కూడా లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదంతా మూసివేత విషయం చెప్పకుండా వారం క్రితం మాత్రమే సమావేశం పెట్టి ఈ విషయం చెప్పారని మండిపడుతున్నారు. పాఠశాల మూసివేత విషయాన్ని గోప్యంగా ఉంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసుకున్నారని, ఫీజుల చెల్లింపునకు కొంత సమయం కావాలని వేడుకున్నా ప్రిన్సిపాల్ ససేమిరా అంటూ పిల్లలను ఇబ్బందులకు గురిచేశారని వాపోతున్నారు. ఉచిత సీట్లు పొందిన వారి నుంచి సైతం ఫీజులు వసూలు చేశారని, ఫీజులు చెల్లించకపోతే ఇబ్బందులకు గురి చేశారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాలకు వెళ్ళి తమ బిడ్డల టీసీలు ఇవ్వాలని కోరగా విజయవాడ వెళ్ళి తీసుకోవాలని, ప్రిన్సిపాల్, డీన్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల అక్రమంగా మూసివేసి తమ బిడ్డల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసిన ఆ విద్యా సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. తన కుమార్తెకు ఉచిత సీట్ల కోటాలో సీటు వచ్చినా ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పగా.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని లంకపేటకు చెందిన ఎన్.దుర్గా నాగేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఈ ఏడాది 10లోకి వచ్చాడని, కొన్ని రోజులు తరగతులు నిర్వహించి పుస్తకాలు కొనుగోలు చేయాలని రూ.13 వేలు వసూలు చేసి ఇప్పుడు స్కూలు మూసేయడం అన్యాయమని ఏలూరుకు చెందిన వి.నాగలక్ష్మి తప్పుపట్టారు. ఏలూరులో అర్ధాంతరంగా పాఠశాల మూసివేత ఫీజులు వసూలు చేసి, పుస్తకాలు అమ్ముకున్న వైనం -
7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు మైలవరంలోని ఆయన చాంబర్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి 14 వరకు జరిగే ఉత్సవాల విశేషాలను ఆయన వెల్లడించారు. 7న ఉదయం శ్రీవారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేయడం, 8న అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణ, 9న సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలపై తిరువీధి సేవలు, 10న రాత్రి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుందన్నారు. 11న రాత్రి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, 12న రాత్రి రథోత్సవం, 13న చక్రవారి–అపభృధోత్సవం, వేద సభ, ధ్వజావరోహణ వేడుకలు నిర్వహిస్తామన్నారు. 14న చూర్ణోత్సవం, వసంతోత్సవం, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగం–పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 7 నుంచి 14 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, డీఈఓ బాబూరావు, ఏఈఓ పి.నటరాజారావు పాల్గొన్నారు. -
కొల్లేరు అందాలు కనుమరుగు
●లాంచీలతో ఆదాయం బాగుండేది నాకు 6 లాంచీలు ఉండేవి. సర్కారు కాల్వ నుంచి పెద్దింట్లమ్మ దేవస్థానానికి భక్తులను తీసుకెళ్లేవాడిని. లాంచీలపై వచ్చే ఆదాయంతో జీవించేవాళ్ళం. నేడు కొల్లేరు సరస్సులో నీరు లేదు. పైగా గుర్రపుడెక్క పేరుకు పోయింది. దీంతో లాంచీలు వెళ్ళలేని పరిస్థితి. – వై.త్రిమూర్తులు, లాంచీల యజమాని, గోకర్ణపురం తాటి దోనెలు నడపడం కళ కొల్లేరులో తాటిదోనెలు నడపడం పెద్ద కళ. ఇతర ప్రాంతాల ప్రజలు వీటిని నడపలేరు. కొన్ని సంవత్సరాల క్రితం అటవీశాఖ చిత్తడి నేలల దినోత్సవం రోజున సర్కారు కాల్వ వద్ద తాటిదోనెల పోటీలు నిర్వహించారు. కేరళ తరహా పడవల పోటీల మాదిరిగా కొల్లేరులో దోనెల పోటీలు నిర్వహిస్తే సంప్రదాయ దోనెల వేట తిరిగి జీవం పోసుకుంటుంది. బలే సముద్రుడు, గ్రామపెద్ద, పందిరిపల్లిగూడెంకై కలూరు : కొల్లేరు పేరు చెప్పగానే పక్షుల కిలకిలరావాలతో పాటు కొల్లేరులో ప్రయాణం మదిలో మెదులుతుంది. ఒకప్పటి కొల్లేరును, ఇప్పుడున్న పరిస్థితిని పరిశీలిస్తే.. ఆకులు రాలి ఎండిన మోడులా కనిపిస్తుంది. ముందు రోజు పట్టి నీటిలో ఉంచిన చేపలను తెల్లవారుజామునే మార్కెట్లో విక్రయించి జీవించేవారు. నేడు ఇలాంటి దృశ్యాలు కొల్లేరులో కానరావడం లేదు. కొల్లేరు జీవనానికి అద్దం పట్టే తిప్పతీగలతో మావులు(చేపలు పట్టడానికి వాడే బుట్టలు) అల్లే కార్మికుల జాడే లేదు. ఎంతో స్వచ్ఛంగా ఉండే కొల్లేరు నీరు నేడు కాలకూట విషంగా మారింది. కొల్లేరు పూర్వపు అందాలు భవిష్యత్తు తరాలకు పూర్తిగా కనుమరుగయ్యాయి. లాంచీల ధ్వనులు మాయం రాష్ట్రంలో కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలో సమక్మ, సారక్క జాతరకు అడవులు దాటి వెళ్ళాలి. పెద్దింట్లమ్మ జాతరకు పూర్వం కొల్లేరు నీటిలో లాంచీలు, పడవలపై ప్రయాణించాలి. సూర్యుడు ఉదయిస్తున్న వేళ అప్పుడే విచ్చుకుంటున్న కొల్లేరు కలువ పువ్వల మధ్య ప్రయాణం మధురానుభూతి కలిగిస్తోంది. ఏటా జాతకు సర్కారు కాల్వ నుంచి అమ్మవారి దేవస్థానం వరకు 70 లాంచీలు తిరిగేవి. వీటికి పడవలు అదనం. ఇదే కాకుండా కొల్లేటికోట నుంచి ఆకివీడు, పెద ఎడ్లగాడి, చిన ఎడ్లగాడి, నందిగామలంక వరకు లాంచీలు తిరిగేవి. ఒక్కో లాంచీలో 100 మంది ప్రయాణించేవారు. జాతరకు రాజమండ్రి, విజయవాడ, యానాం, ధవళేశ్వరం నుంచి కాల్వల ద్వారా లాంచీలు కొల్లేరుకు వచ్చేవి. నేడు నీటి కొరత కారణంగా ఒక్క లాంచీ కనిపించడం లేదు. కొల్లేరు సరస్సులో వేట సాగించే ప్రజలకు పేదోడి రాకెట్గా తాటిదోనెకు పేరుంది. బలమైన తాటిచెట్టును ఎంపిక చేసి మొదలతో సహా తీసుకొచ్చి 15 రోజులు బరిసెలతో చెక్కేవారు. నీరు చేరకుండా తారును అద్దెవారు. దీనిలో ఇద్దరు కూర్చుని ప్రయాణించేవారు. తాటిదోనెలను నడపడం ఎంతో కష్టం. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన బోర్లా పడతారు. తాటిదోనె తయారీ రూ.350 నుంచి రూ.15,000కు చేరింది. తర్వాత ఇనుముతో చేసిన డొంగ్రీలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో డొంగ్రీ రూ.35,000 నుంచి రూ.40,000 పలుకుతోంది. తాటిదోనెల్లో వేటాడే సమయంలో సరస్సులో సహజసిద్ధ చేపలకు తాకినా వాటికి ప్రమాదం ఉండేది కాదు. ఇనుప డొంగ్రీల వల్ల చేపలు గాయపడుతున్నాయి. దోనెల తయారీదారులు తగ్గిపోయారు. తాటిచెట్ల కొరత ఏర్పడింది. మావన తప్పిదాలతో ప్రమాదం సరస్సుకి సమీప పట్టణాల నుంచి 19 ఫ్యాక్టరీల వ్యర్థజలాలు కొల్లేరులో చేరుతున్నాయని అంచనా. దీని కారణంగా సరస్సులో నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. డ్రెయిన్లు, వాగుల ద్వారా కొల్లేరుకు చేరే నీటి వనరులు తగ్గాయి. ప్రధానంగా ఎగువ నుంచి కొల్లేరుకు చేరుతున్న నీటిని సరస్సు మధ్యలో అక్రమ చేపల సాగుదారులు చెరువులకు తోడుతున్నారు. దీంతో కొల్లేరులో నీరు కనిపించడం లేదు. ఈ కారణంతో ప్రజలకు చేపల వేట కరువవుతోంది. రెగ్యులేటర్లు నిర్మిస్తే కొల్లేరుకు తిరిగి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు. నెర్రలిచ్చి ఎడారిలా మారిన సరస్సు కలగా మిగిలిన తాటి దోనెలపై వేట.. లాంచీలపై ప్రయాణంఒకనాటి కొల్లేరు అందాలు నేడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మానవ తప్పిదం కారణంగా కొల్లేరు ఎడారిగా మారింది. జలసిరులతో కళకళలాడిన కొల్లేరు నెర్రలిచ్చి వెక్కిరిస్తోంది. తాటి దోనెల స్థానాన్ని ఇనుప డొంగ్రీలు ఆక్రమించాయి. లాంచీల ప్రయాణం చరిత్రలో కలిసిపోయింది. -
సీహెచ్ఓల ధర్నాకు మద్దతు
భీమవరం(ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్ వద్ద ఐదు రోజులుగా ధర్నా చేస్తున్న విలేజ్ క్లినిక్ల సీహెచ్ఓలకు ఎమ్మెల్సీ గోపిమూర్తి శుక్రవారం మద్దతు తెలిపారు. సమస్యను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు. అనంతరం సీహెచ్ఓలతో కలిసి జేసీ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందించారు. మావుళ్లమ్మ సన్నిధిలో కలెక్టర్ భీమవరం(ప్రకాశంచౌక్): భీమవరం మావుళ్లమ్మవారిని శుక్రవారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం అందించారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, ఆలయ సిబ్బంది నల్లం లోకనాథం తదితరులు ఉన్నారు. రమేష్కు ‘అకడమిక్’ అవార్డు పాలకోడేరు: తమ కళాశాల అకడమిక్ అడ్వైజర్, మెంటర్ పి.వెంకట రమేష్ అకడమిక్ అడ్వైజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నట్టు బైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పర్తి సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఏషియా టుడే మీడియా సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన విశ్వ విద్యా సమ్మేళనం– 2025లో కేంద్ర మంత్రి చేతులమీదుగా రమేష్ అవార్డు అందుకున్నారన్నారు. కళాశాల చైర్మన్ అడబాల శ్రీ వెంకటేశ్వరరావు, సెక్రటరీ, కరస్పాండెంట్ అడ్డాల శ్రీహరి, డీన్కురెళ్ల భాస్కరరావు, హెచ్ఓడీలు రమేష్ను అభినందించారు. జిల్లా నుంచి 7,500 మంది తరలింపు భీమవరం(ప్రకాశంచౌక్): అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ సభకు పశ్చిమగోదావరి జిల్లా నుంచి బయలుదేరి వెళ్లే బస్సులను కలెక్టర్ సీహెచ్ నాగరాణి శుక్రవారం భీమవరం పాత బస్టాండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం సీఎం చంద్రబాబు ఆదేశాలతో 150 బస్సుల్లో 7,500 మంది ప్రజలు జిల్లా నుంచి బయలుదేరి వెళ్లారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు ఏలూరు (ఆర్ఆర్పేట): వైద్య విద్యలో ప్రవేశానికి ఏటా ఆన్లైన్లో నిర్వహించే నీట్ (యూ జీ) పరీక్షను ఈ ఏడాది పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహిస్తున్నారని, జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేశామని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రీయ విద్యాల యం (గోపన్న పాలెం), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గోపన్నపాలెం), సుబ్బమ్మదేవి మున్సిపల్ ఉన్నత పాఠశాల (ఏలూరు), కస్తూరిబా మున్సిపల్ బాలికా ఉన్నత పాఠశాల (ఏలూరు), ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఏలూరు)లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నా రు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించరన్నారు. విద్యార్థులు నిబంధనలు పాటించాలని డీఈఓ వెంకటలక్ష్మమ్మ, నీట్ కో–ఆర్డినేటర్ భూర్ సింగ్ మీనా తెలిపారు. -
సమయపాలన అలవాటైంది
సమయపాలన పాటించడం బాగా నేర్పించారు. ఇండియన్ రైల్వే పోలీస్ ఆఫీసర్గా పనిచేయాలని కోరుకుంటున్నాను. – పి జోషిత, బీకాం ఫైనల్ ఇయర్, సెయింట్ థెరిస్సా ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ అవుతా ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని అవ్వాలని ఉంది. విభిన్న రకాల వ్యక్తులతో ఎలా మెలగాలో నేర్పారు. దేశం పట్ల ప్రేమ చాలా పెరిగింది. – డీ అభిలాష్, సీబీఎస్ఈ ప్లస్వన్, సర్ సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్ నా తండ్రి ప్రోత్సహించారు ఈ క్యాంప్లో ఐకమత్యం, క్రమశిక్షణలను బాగా నేర్పించారు. నా తండ్రి ప్రోత్సా హంతో క్యాంప్కు వచ్చాను. ఇండియన్ ఎయిర్వింగ్ నా లక్ష్యం. – యు శ్రావ్యమౌనిక, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్, భీమవరం సద్వియోగం చేసుకోవాలి డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ క్రైమ్, తదితర విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు. అమ్మాయిలు ధైర్యంగా ఇలాంటి క్యాంప్లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలి. – డీ దీప, 9వ తరగతి, ఏకేఆర్జీ, నల్లజర్ల ఇండియన్ రైల్వే ఆఫీసర్ అవ్వాలి ఇండియన్ రైల్వే ఆఫీసర్ అవ్వాలని కోరిక. మిలటరీ జీవన విధానం, క్రమశిక్షణ నేర్చుకున్నాను. – జి పవన్కుమార్, 9వ తరగతి, టీబీఆర్ సైనిక్ స్కూల్, అలంపురం -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని జెడ్పీ హైస్కూళ్లలో పదో తరగతి చదవి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఆరుగురు విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం స్థానిక జెడ్పీ మినీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు రూ.10 వేలు (ప్రథమ), రూ.5 వేలు (ద్వితీయ) చొప్పున పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మశ్రీ వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కె.భీమేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎం.వెంకట లక్ష్మమ్మ, ఇ.నారాయణ, డీసీఈబీ కార్యదర్శి ఎ.సర్వేశ్వరరావు, డీవైఈవో ఎన్.రవీంద్ర భారతి, ఎంఈవోలు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. కోకో గింజల చోరీపై కేసు నమోదు ద్వారకాతిరుమల: కోకో గింజల చోరీపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం తిమ్మాపురం గ్రామానికి చెందిన గంటా అజయ్కుమార్ తన 6 ఎకరాల తోటలో పండే కోకో గింజలను నిత్యం తన ఇంటి వద్ద ఆరబెట్టి, విక్రయిస్తాడు. ఈ క్రమంలోనే 350 కేజీల కోకో గింజలను గత నెల 30న రైతు తన ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో ఆరబెట్టాడు. సాయంత్రం వర్షపు చినుకులు పడుతున్నాయని కోకో గింజలను గుట్టగా చేసి, తడవకుండా బరకం కప్పాడు. గురువారం ఉదయం నిద్రలేచి చూసేసరికి కోకో గింజలు కనిపించలేదు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని దొంగిలించినట్టు గుర్తించి, స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీటి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. అలంపురంలో హత్యాయత్నం నిందితుల అరెస్ట్ పెంటపాడు: అలంపురంలో బుధవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. పెంటపాడు ఎస్సై కె. స్వామి తెలిపిన వివరాల ప్రకారం ప్రత్తిపాడు గ్రామానికి చెందిన పెనుమాక రాజుకు, అదే గ్రామానికి చెందిన పేకేటి సుమన్కు మధ్య పాతగొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అలంపురం రజకచెరువు గట్టున వెళుతున్న రాజుతో సుమన్, తనతో పాటు ఉన్న మరో ఇద్దరితో కలిసి ఘర్షణకు దిగాడు. వారి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ చోటుచేసుకొంది. దీంతో సుమన్ తన వద్ద ఉన్న చాకుతో రాజును పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి చెప్పారు. నిందితుడు సుమన్తో పాటు, అతనికి సహకరించిన బాదంపూడి జయప్రకాష్, గనిసాల మణిరత్నంలను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం
ఏలూరు రూరల్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 50 శిక్షణా శిబిరాల్లో ఈనెల 31 వరకూ బాలబాలికలకు వివిధ ఆటలపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి శిబిరంలో సుమారు 30 నుంచి 50 పిల్లలు సాధన చేయనున్నారు. 8 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందించి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన పిల్లలకు ఈనెల 31వ తేదీన పోటీలు నిర్వహించి బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందిస్తామని డీఎస్డీఓ బి.శ్రీనివాసరావు తెలిపారు. క్రీడా శిక్షణా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏ క్రీడా శిబిరం ఎక్కడంటే.. ● అథ్లెటిక్స్: ఏలూరులో ఏఎస్ఆర్ స్టేడియం, సీఆర్ఆర్ కళాశాల, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతలపూడి జడ్పీ పాఠశాల, చేగొండపల్లి టైబల్ వెల్ఫేర్ స్కూల్, కూచింపూడి ఎంపీయూపీ స్కూల్, కై కరం, గోకవరం జడ్పీ పాఠశాలలు. ● ఆర్చరీ: రావికంపాడు జెడ్పీ పాఠశాల ● బాస్కెట్బాల్ : నూజివీడులో వీటిహెచ్ గ్రౌండ్, డీఏఆర్ కళాశాల, ఏలూరు ఇండోర్స్టేడియం ● బాల్ బ్యాడ్మింటన్ : నూజివీడు వీటీహెచ్ గ్రౌండ్ ● చెస్ : ఏలూరు స్వర్ణభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ● ఫుట్బాల్ : పంగిడిగూడెం, నూజివీడు జీఎంహెచ్ హాస్పటల్ గ్రౌండ్, కొయ్యలగూడెం, ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం ● హేండ్బాల్ : ఏలూరులో సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఏలూరు ఇండోర్ స్టేడియం, శనివారపుపేట రాయన్ ఇంగ్లీషు మీడియం స్కూల్, ఏలూరు కస్తూరిభా బాలికల పాఠశాల, జోగన్నపాలెం ఎస్వీఎన్ హైస్కూల్, ఏలూరు కేపీడీటీ హైస్కూల్, నూజివీడు డీఏఆర్ కళాశాల ● హాకీ : ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం ● జూడో : ఏలూరు సిద్ధార్ధ క్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ● కబడ్డీ : ఈస్ట్ యడవల్లి, జడ్పీ పాఠశాల ● ఖోఖో: ఏలూరు సీఆర్ఆర్ పభ్లిక్ స్కూల్, ఏలూరు సిద్ధార్ధ క్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ● రోయింగ్ : ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ రిజర్వాయర్ ● టేబుల్ టెన్నిస్ : ఏలూరులో సిద్ధార్ధ క్వెస్ట్ పభ్లిక్ స్కూల్, సీఆర్ఆర్ పభ్లిక్స్కూల్ ● టెన్నిస్ : ఏలూరు సీఆర్ఆర్ డిగ్రీ కళాశాల, నూజివీడు జేబీకే క్లబ్, వీటీహెచ్ గ్రౌండ్స్ ● వాలీబాల్ : ఏలూరు సిద్ధార్ధ క్వెస్ట్ పబ్లిక్ స్కూల్, వట్లూరు జడ్పీ పాఠశాల, కొల్లేటికోట కమ్యూనిటీ హాల్ ఎదురుగా ● వెయిట్లిఫ్టింగ్ : చాటపర్రు వెయిట్లిఫ్టింగ్ హాల్, ఏలూరు ఇండోర్స్టేడియం, ఏఎస్ఆర్ స్టేడియం ● యోగా : ఏలూరు ఎంఆర్ఎఫ్ షోరూం ఆప్స్టైర్ హాల్ ● కయాకింగ్ : జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ రిజర్వాయర్ ● స్కేటింగ్ : ఏలూరు ఇండోర్స్టేడియం రోయింగ్ సమ్మర్ కోచింగ్ ప్రారంభం ద్వారకాతిరుమల: స్థానిక వసంత్నగర్ కాలనీలో జిల్లా స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఏలూరు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఇండోర్ రోయింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ను గురువారం క్యాంప్ ఇన్చార్జి, కోచ్ ఊదర్ల విజయ్ ప్రారంభించారు. స్కల్లింగ్, రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని, కార్యదర్శి ఎన్ పవన్ కుమార్, కోచ్ విజయ్ మాట్లాడుతూ ఈ ఉచిత క్యాంపును నెలరోజుల పాటు నిర్వహిస్తామన్నారు. పిల్లలకు ఈ కోచింగ్ క్యాంప్ ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పారు. పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్కుమార్, పడవల మోహన్బాబు పాల్గొన్నారు. -
ఎన్సీసీ శిక్షణ.. ఉన్నతికి నిచ్చెన
రైఫిల్ షూటింగ్లో పాల్గొన్న కేడెట్లు పరేడ్ నిర్వహిస్తున్న విద్యార్థులు ● పెదవేగి మండలం పినకడిమిలో ఎన్సీసీ క్యాంప్ ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 602 మంది కేడెట్ల హజరు ● షూటింగ్లో అదరగొట్టిన కేడెట్లు ● వృత్తి నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్న ఆర్మీ అధికారులు పెదవేగి : పెదవేగి మండలం పినకడిమి గ్రామంలోని విన్సెంట్ డీపాల్ కళాశాలల్లో ఇండియన్ ఆర్మీ 19వ ఆంధ్రా బెటాలియన్ కల్నల్ అమిత్ పాండే ఆధ్వర్యంలో ఎన్సీపీ శిక్షణ ఉత్సాహంగా సాగుతోంది. మొత్తం 5 కళాశాలలు, 12 పాఠశాలల నుంచి 602 మంది కేడెట్లు ఈ క్యాంప్లో పాల్గొని వృత్తి నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకుంటున్నారు. గత నెల 24 నుంచి ఈ శిక్షణ ప్రారంభం కాగా ఈనెల 3వ తేదీతో ముగుస్తుంది. శిక్షణలో భాగంగా రైఫిల్ షూటింగ్, డ్రిల్, దేశ సరిహద్దుల్లో ఆర్మీ శిబిరాలు ఏ విధంగా ఉంటాయో కేడెట్లకు అవగాహన కల్పించారు. ఎన్సీసీలో శిక్షణ ద్వారా దేశభక్తి, నైతిక విలువలు పెంపొందింపజేయడం, క్రమశిక్షణ, సాయం చేసే తత్వం అలవడతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడంతోపాటు వివిధ రకాల ఉద్యోగాలు, కళాశాలల అడ్మిషన్లలో ప్రాధాన్యత కల్పిస్తారు. సుబేదార్ మేజర్ జె ఆదినారాయణ, ఎన్సీసీ అధికారులు ఎం సోమశేఖర్, కె భీమేశ్వరరావు, ఎన్ అనంత రాజ్యలక్ష్మి, లాజరస్, వలీ, ధనరాజు, చీలి తంబి, వీ రమ, సూపరింటెండెంట్ కొండయ్య, ఆర్మీ, సివిల్ సిబ్బంది ఈ ఎన్సీపీ క్యాంప్ను నిర్వహిస్తున్నారు. డైమండ్ షూటింగ్ను నేర్పుతున్న ఆర్మీ అధికారి అన్ని రకాల స్ట్రక్చర్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ క్యాంప్లో మిలటరీ క్రమశిక్షణను విద్యార్థులు నేర్చుకున్నారు. మ్యాప్ రీడింగ్, షూటింగ్, నేషనల్ ఇంటిగ్రేటర్ సిమిలేటర్ ఫైరింగ్, వెపన్ హ్యాండ్లింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చాం. చాలెంజ్లు స్వీకరించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంపై నైపుణ్యం కలిగిన వ్యక్తులతో అవగాహన కల్పించాం. రోడ్డు భద్రతా చర్యలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అన్ని రకాల స్ట్రక్చర్ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు దేహదారుడ్యం, ప్రాథమిక యుద్ధ తంత్రాలపై శిక్షణ ఇచ్చాం. ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు డ్రగ్స్ చెడు పరిణామాలపై అవగాహన కల్పించారు. – కల్నల్ అమిత్పాండే, క్యాంప్ కమాండింగ్ అథికారి, 19 ఆంధ్రా బెటాలియన్ -
వ్యవసాయ పరిశోధనా ఫలితాలు రైతులకు చేరువ చేయాలి
పెనుమంట్ర: వ్యవసాయ పరిశోధనా ఫలితాలు కేవలం పరిశోధనా స్థానానికే పరిమితం కాకుండా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఫలితాలు రైతులకు చేరువ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో రెండు రోజుల పాటు జరిగే గోదావరి మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని గురువారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మార్టేరు పరిశోధన స్థానంలో విడుదల చేసిన వరి రకాలు ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం, భారతదేశంలో 33 శాతం విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వర్ణ రకం ఈ పరిశోధనా స్థానం నుంచి విడుదల కావడం గర్వించదగ్గ విషయమన్నారు. పీఆర్ 126 రకానికి ప్రత్నామ్నాయ రకాలైన ఎంటీయూ 1290, ఎంటీయూ 1293, ఎంటీయూ 1273 రకాలను ప్రదర్శన క్షేత్రాల్లో సాగు చేసి రైతులు అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గుర్రపుడెక్క నుంచి కంపోస్టు తయారు చేసే ప్రక్రియను డ్వాక్రా సంఘాల ద్వారా నిర్వహిస్తున్నామని, డి కంపోజర్ల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. మరో ముఖ్య అతిథిగా వ్యవసాయ రంగ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు అవకాశం ఉన్న ప్రాంతాల్లో అనువైన సాంబ మసూరి(బీపీటీ 5204) మార్టేరు సాంబ(ఎంటీయూ 1224) మసూరి (ఎంటీయూ 1262) వంటి సన్నగింజ రకాలను సాగుచేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథి ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివన్నారాయణ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ వ్యవసాయ పరిస్థితులు, నెలకొన్న సమస్యలను గుర్తించి వాటికి తగ్గట్టుగా విస్తరణ ప్రణాళికలను రూపొందించాల్సి అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో గత సమావేశంలో రైతులు లేవనెత్తిన సమస్యలపై తీసుకున్న కార్యాచరణ, 2024–25 సంవత్సరపు పరిశోధన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభికులకు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు, ఎస్కే బాషా, మాధవరావు, శ్రీహరి, వివిథ జిల్లాలనుంచి వచ్చిన వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి -
శీతల పానీయాలతో జాగ్రత్త!
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి జిల్లాలో గత కొన్ని రోజులుగా 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ప్రజలు దాహం తీర్చుకునేందుకు తహతహ లాడుతున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో చల్లదనం కోసం ప్రజలు ఎక్కువగా కూల్డ్రింక్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా కూల్డ్రింక్స్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. అయితే రుచితో పాటు ఆరోగ్యమూ ప్రధానమని కూల్డ్రింక్స్ కంటే సంప్రదాయ ద్రవాలే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్క ఏలూరు నగరంలోనే వివిధ కంపెనీల కూల్డ్రింక్స్ వ్యాపారం రోజుకు సుమారు 60 నుంచి 70 వేల బాటిల్స్ అమ్మకాలు జరుగుతున్నాయని, వాటి ద్వారా సుమారు రూ.20 లక్షల వరకూ వ్యాపారం జరుగుతోందని అంచనా. కూల్డ్రింక్స్తో అనారోగ్యం ప్రస్తుతం అన్ని దుకాణాల్లో శీతల పానీయాలు లభిస్తున్నాయి. ఫుట్పాత్పై వెలసిన దుకాణాల నుంచి కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, కూల్డ్రింక్ షాపులు, ప్రత్యేకంగా వెలసిన ఫ్రూట్జ్యూస్ దుకాణాల్లో సైతం కూల్డ్రింక్స్ లభిస్తున్నాయి. రెడీమేడ్గా తయారు చేసిన ద్రవంతో అప్పటికప్పుడు కొన్ని రకాల కూల్డ్రింక్స్ తయారు చేసి అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో మాక్ టైల్స్ పేరుతో వివిధ రంగుల్లో ద్రావకాలను కలిపి ఇస్తున్నారు. వీటితోపాటు కొన్ని చెరకు, బత్తాయి రసాలు, మజ్జిగ దుకాణాల్లో అపరిశుభ్రమైన నీటితో తయారైన ఐస్ ముక్కలను వాడుతున్నారు. ప్రతి దుకాణంలో రోజుకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వ్యాపారం సాగుతోంది. ఇలాంటి పానీయాలు ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రంగులు, రసాయనాలతో పలు జబ్బులు శీతల పానీయాల్లో వాడే కార్బన్ డై ఆకై ్సడ్, ఫాస్పరస్ ఆమ్లాలు శరీరంలోకి చేరి కణాల్లోని ఆక్సిజన్ నిల్వలను తగ్గించి కేన్సర్కు దారి తీస్తాయని చెబుతున్నారు. దీనితో పాటు సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ రసాయనం శరీరంలో కణాల్లోని డీఎన్ఏపై ప్రభావం చూపుతాయంటున్నారు. వాటిలోని అదనపు కేలరీలు ఊబకాయానికి దారి తీస్తాయని, పానీయంలో ఉండే ఫ్రక్టోజ్ వల్ల రక్తపోటు పెరుగుతుందని వివరిస్తున్నారు. వాటిని అధికంగా సేవిస్తే దంతాల పై పొర దెబ్బతింటుందని, కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని, దీర్ఘకాలంగా శీతల పానీయాలు తాగితే మెటబాలిక్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సంప్రదాయ పానీయాలే మేలు రసాయనాలు, నిషేధిత రంగులు, అపరిశుభ్రమైన ఐస్ ముక్కలను కలిపిన కూల్డ్రింక్స్ తాగడం కంటే సహజసిద్ధమైన సంప్రదాయ పానీయాలను తాగడం ఆరోగ్యకరమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగ, లస్సీ, నిమ్మరసం, తాజా పండ్ల జ్యూస్లు, కొబ్బరి నీళ్లు, రాగిమాల్ట్, నన్నారి షర్బత్ మొదలైనవి శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే గాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. కూల్డ్రింక్స్తో అనారోగ్యం తప్పదంటున్న నిపుణులు సంప్రదాయ పానీయాలే మేలని సూచన కూల్డ్రింక్స్ హాని చేస్తాయి చాలా మంది వేసవి వచ్చిందంటే కూల్డ్రింక్స్ తాగేందుకే మక్కువ చూపుతారు. వాస్తవంగా అందులో పొటాషియం ఉన్న ఉప్పు ఉంటుంది. ఇది శరీరానికి హాని చేస్తుంది. దానికి బదులు మజ్జిగ, నిమ్మకాయ సోడాలో ఉప్పు వేసుకుని తాగాలి. మనం వేసుకొని తాగే ఉప్పులో సోడియం ఉంటుంది. దీంతో పాటు కూరల్లోనూ ఉప్పును వాడాలి. ప్రతిఒక్కరూ రోజుకు నాలుగు లీటర్ల మంచినీటిని తాగాలి. ఎండవేడిమి కారణంగా మూత్రం పచ్చగా వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మాంసాహారం మితంగా తీసుకోవాలి. నిమ్మజాతి పండ్లను బాగా తినాలి. – డాక్టర్ ఎంఎల్వీ ప్రసాద్, ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్ -
ఆర్మీ ఆఫీసర్ లక్ష్యం
ఎన్సీసీలో చేరడంతో నాలో చాలా మార్పు వచ్చింది. జీవితంలో ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఏర్పడింది. భవిష్యత్లో ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నాను. – కె సంపత్సాయి, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్, భీమవరం దేశానికి సేవ చేయాలి ఎరోనాటికల్ ఇంజనీర్ అయ్యి దేశానికి సేవలు అందించాలని ఆశపడుతున్నాను. తల్లిదండ్రులు, మా ఎన్సీసీ అధికారులు చాలా ప్రోత్సహిస్తున్నారు. – ఎం ప్రభాకర్, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్, భీమవరం గన్ ఫైరింగ్ బాగా నచ్చింది నా ధ్యేయం ఐపీఎస్ ఆఫీసర్. ఎన్సీసీలో నాకు ఫైరింగ్ బాగా నచ్చింది. దేశానికి సేవ చేయాలని ఆశగా ఉంది. ఎన్సీసీ కుటుంబం అన్ని రకాలుగా నాకు అండగా ఉంది. – బి నాగనిఖిల, బీబీఏ ద్వితీయ సంవత్సరం, సెయింట్ ఽథెరిస్సా, ఏలూరు ధైర్యంగా జీవించేలా శిక్షణ ఈ ఎన్సీసీలో ఒక అమ్మాయి ధైర్యంగా సమాజంలో ఎలా రాణించాలో నేర్చుకున్నాను. ఆర్మీలో డిఫెన్స్ సర్వీస్లో సేవలు అందించాలని అనుకుంటున్నాను. ఆర్మీ మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందని గ్రహించాను. – బి సమృద్ధి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, సర్ సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్ ● -
క్లినిక్ల అద్దెలు కడుతున్నాం
జీతం నుంచే క్లినిక్లకు అద్దెలు కడుతున్నాం. మందులకు రవాణా ఖర్చులు, విద్యుత్ బిల్లులు కూడా భరిస్తున్నాం. మాకు పనికి తగిన వేతనం, ప్రమాదవశాత్తూ చనిపోతే కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎక్స్గ్రేషియా, అలాగే మిగిలిన న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు చేపట్టాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – పి.శిరీష, సంఘ జిల్లా అధ్యక్షురాలు ఉద్యోగ భద్రత కల్పించాలి ఆరేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం కోతలు లేకుండా జీతం ఫిక్స్డ్గా ఇవ్వాలి. క్లినిక్ల వద్ద రక్షణ చర్యలు కల్పించాలి. ఆగస్టు 2022న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తమ పోస్టు రెగ్యులర్ అని పేర్కొన్నారు. ఈ మేరకు సర్వీసులు క్రమబద్ధీకరించాలి. – ఆర్.మాధూరి, సీహెచ్ఓ ● -
బలవంతపు సమీకరణ
ధాన్యం రైతుల గగ్గోలు శురకవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ ఉమ్మడి జిల్లా నుంచి 220 ఆర్టీసీ బస్సులను గురువారం సాయంత్రం 5 గంటలకే అమరావతి సభ పేరుతో తరలించారు. ఇక జిల్లా రవాణా శాఖ ద్వారా ప్రైవేట్, స్కూల్ బస్సులు, ట్రావెల్ బస్సులు కూడా పూర్తిగా రప్పించి గ్రామాలవారీగా రూట్లు నిర్ణయించి పంపారు. దీంతో గురువారం సాయంత్రం నుంచే ఏలూరులో ఆర్టీసీ బస్టాండ్ తీవ్ర ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఒక్క బస్సు కూడా లేకుండా బస్టాండ్ ఖాళీగా ఉండటంతో కొంత గందరగోళం రేగింది. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖల్లో 90 శాతం మందికిపైగా ఉద్యోగులకు ప్రధాని సభకు సంబంధించిన విధులు కేటాయించారు. అలాగే 80 శాతం మంది పోలీసులను బుధవారం నుంచే బందోబస్తుకు కేటాయించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి పనులు కావాలంటే అమరావతి రావాల్సిందే.. డ్వాక్రా గ్రూపులు సజావుగా సాగాలంటే ప్రధాని సభకు వచ్చి తీరాల్సిందే.. రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే తప్పనిసరిగా రావాలి.. ఇలా గ్రామానికి 200 మందిని తీసుకువెళ్లాలని టార్గెట్ పెట్టారు.. మీరెవ్వరూ రాకపోతే మీ ఎమ్మెల్యేలు కోప్పడతారు.. తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి.. అంటూ ఊళ్లల్లో హెచ్చరికలు చేసి మరీ జన సమీకరణకు సర్కారు నానా తంటాలు పడుతోంది. శుక్రవారం అమరావతిలో జరిగే ప్రధాన మోదీ బహిరంగ సభకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి లక్ష మందిని సమీకరించాలని ప్రభుత్వం టార్గెట్ నిర్దేశించడంతో గ్రామస్థాయి కార్యదర్శి మొదలు కలెక్టర్ వరకూ అందరూ సమీకరణ హడావుడిలో నిమగ్నమయ్యారు. మండుటెండలో అంత దూరం వచ్చి ఇబ్బందులు పడలేమంటూ ప్రజలు తిరస్కరించినా వచ్చి తీరాల్సిందేనని హుకుం జారీ చేసి మరీ తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు 220, ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సులు 500 ఏర్పాటు చేశారు. వీటితో పాటు జిల్లావ్యాప్తంగా 600 కార్లను తరలింపునకు సిద్ధం చేశారు. కలెక్టర్ల పర్యవేక్షణలో.. అమరావతిలో శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఈ క్రమంలో భారీ జనసమీకరణతో హడావుడి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి పొరుగు జిల్లా కావడంతో ఉమ్మడి పశ్చిమ నుంచి భారీగా జనాలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించడం, నియోజకవర్గాల వారీగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి భారీగా తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. అధికారిక కార్యక్రమం కావడంతో పూర్తి బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. జనసమీకరణ మొ దలు వాహనాల ఏర్పాట్ల వరకు అన్ని పనులను కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. బస్సుకో ఇన్చార్జి జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, రైతులు, వివిధ రకాల చేతివృత్తులు చేసుకుంటున్న వారిని ప్రధానంగా గ్రామాల వారీగా ఎంపిక చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 30 వేలకు మందికి తగ్గకుండా వీరినే తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీఓలు ప్రతి గ్రామంలో 45 మందిని తరలించడానికి వీలుగా ప్రతి బస్సుకు ఇన్చార్జిని ఏర్పాటుచేశారు. ఏలూరు జిల్లాలో ఏలూరు, కై కలూరు, దెందులూరు, చింతలపూడి నుంచి మండలానికి 20 నుంచి 25 బస్సులు, దూరం ఉన్న నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 బస్సులు ఏర్పాటు చేసి ఉదయం 8 గంటకల్లా అందరినీ సమీకరించుకుని బయలుదేరి గన్నవరంలోని సిద్థార్ధ మెడికల్ కళాశాల వద్ద 11 గంటలకు భోజనాలు పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా సభలో కూర్చొపెట్టి ప్రతిచోటా ఫొటోలు తీసి కలెక్టర్ పేషీకి పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక మనిషికి రూ.90లు బడ్జెట్ కేటాయించి దానిలో రెండు అరటిపండ్లు (రూ.12), రెండు వాటర్ బాటిళ్లు (రూ.18), ఉదయం పెట్టే పులిహోర ప్యాకెట్ (రూ.60) చొప్పున ఖర్చు పెట్టాలని అధికారులు ఆదేశించారు. బస్టాండ్లో బిడ్డతో ఓ తల్లి అవస్థలు ధాన్యం కొనడం లేదంటూ రైతుల ధర్నా ● ధాన్యం కొనడం లేదని ఆందోళన ● రైతు సేవా కేంద్రాల వద్ద నిరసనలు న్యూస్రీల్బస్సులు లేక.. ప్రయాణాలు సాగక.. ప్రధాని సభకు భారీగా జన సమీకరణ కూలీలు, మహిళలు, రైతులే లక్ష్యం రాకుంటే తీవ్ర పరిణామాలంటూ అధికారుల హెచ్చరికలు ఉమ్మడి జిల్లా నుంచి 720కి పైగా బస్సుల ఏర్పాటు గురువారం సాయంత్రం నుంచే బస్టాండ్లు ఖాళీ బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు -
ఆన్లైన్ చేయట్లేదు
ధాన్యం కేంద్రంలో టార్గెట్ అయిపోయిందని చెప్పి ఆన్లైన్ చేయట్లేదు. అలాగని రైస్ మిల్లులు వద్దకు వెళితే కొనమని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యాన్ని రోడ్లపై ఉంచాం. సంచులు లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనక, మిల్లర్లు కూడా కొనమంటే మా పరిస్థితి ఏంటి. అలాగే పాలగూడెం, దెందులూరు కేంద్రాల్లో ధాన్యం బస్తాకు 600 గ్రాములు తీస్తుంటే.. కొవ్వలిలో మాత్రం రెండు కిలోలు తీస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలి. –నాగరాజు, రైతు, కొవ్వలి ● -
పోషకాహారం అందించాలి
భీమవరం అర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల శాఖ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి ఎ.సూర్య కుమారి అన్నారు. మండలంలోని చినఅమిరం–3 అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించారు. కేంద్రాన్ని పరిశీలించి పిల్లలతో ముచ్చటించారు. పిల్లలందరినీ తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రానికి పంపేలా తల్లులను ప్రోత్స హించాలన్నారు. కేంద్రం ఆవరణలోని ఖాళీ స్థలంలో ఆకుకూరలు పండించి పిల్లలకు వండి పెట్టాలని సూచించారు. సీడీపీఓ టీకేవీ సూర్య కాంతం, సూపర్వైజర్ డి.అనిల్కుమార్ ఉన్నారు. ఆక్వా చెరువు తవ్వకం ఆపాలి కాళ్ల: ఏలూరుపాడులో మంచినీటి చెరువుకు సమీపంలో ఆక్వా చెరువు తవ్వకాన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ గురువారం గ్రామ స్తులు ఆందోళన చేశారు. పంచాయతీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం సర్పంచ్ భూపతిరాజు వెంకట జగ్గరాజు ఇంటికి వెళ్లి చెరువు తవ్వకంపై గళమెత్తారు. తమ ఆరోగ్యాలు కాపాడాలంటూ నినదించారు. చెరువు తవ్వకానికి సిద్ధమవుతున్న రైతుతో సర్పంచ్ జగ్గరాజు ఫోన్లో మాట్లాడారు. రెండురోజుల పాటు తవ్వకం పనులు నిలిపివేయాలని సూచించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలి అత్తిలి: స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు యూనిట్ల స్థాపనకు ముందుకు రావాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం మండలంలోని అత్తిలి, మంచిలి గ్రామాల్లో మహిళా సమాఖ్య సభ్యులు నిర్వహిస్తున్న ఉపాధి యూనిట్లను ఆమె పరిశీలించారు. మంచిలిలో పూతరేకుల యూనిట్లను నిర్వహిస్తున్న మహిళలతో ఆమె మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా నిలిచేందుకు ప్రభుత్వం రుణాలు అందిస్తోందన్నారు. అనంతరం అత్తిలిలో శరవణ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్, పేపర్ ప్లేట్స్, స్వీట్స్ బాక్స్ తయారీ యూనిట్లను ఆమె సందర్శించారు. కామధేను త్రెడ్స్ (దారపు బంతుల తయారీ యూనిట్), అనూష బొటిక్ అండ్ మగ్గం వర్క్స్, టైలరింగ్ యూనిట్ను పరిశీలించి మహిళలకు సూచనలు ఇచ్చారు. డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎన్ వేణుగోపాల్, లైవ్లీ హుడ్స్ డీపీఎం ఎస్ కుసుమ కుమారి, మండల సమాఖ్య అధ్యక్షురాలు పి.సుభద్ర, ఎంపీడీఓ పి.శామ్యూల్ ఉన్నారు. ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా సుధాకర్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాల్లా ప్రజా రవాణా (ఆర్టీసీ) అధికారిగా ఎ.జాన్ సుధాకర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో అదన పు బాధ్యతలతో పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ను రిలీవ్ చేశారు. జాన్ ప్రభాకర్ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రెండు, మూడు రో జుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలి అత్తిలి: సామాజిక పింఛన్లను లబ్ధిదారులు స ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి సూచించారు. అత్తిలి యానాదుల పుంతలో గురువారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎ.రాధాకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. మే నెలకు సంబంధించి జిల్లాలో 2,25,231 మంది లబ్ధిదారులకు రూ.96.66 కోట్లు విడుదల చేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వా సులకు ప్లాస్టిక్ వినియోగంపై అనర్థాలను తెలియజేస్తూ జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సీహెచ్ఓల నిరసన గళం
భీమవరం(ప్రకాశం చౌక్): గ్రామీణ ప్రాంతాల్లోని విలేజ్ క్లినిక్లలో సేవలందిస్తున్న సీహెచ్ఓలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్) (ఎన్హెచ్ఎం) తమ సమస్యలు పరిష్కరించాలంటూ విధులు బహిష్కరించారు. నాలుగు రోజులుగా భీమవరంలోని కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలుపుతున్నారు. జిల్లాలోని 364 మంది సీహెచ్ఓలు సమ్మెలో ఉండటంతో విలేజ్ క్లినిక్లలో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి. క్లినిక్లకు అద్దెల భారం : జిల్లాలో 364 విలేజ్ క్లినిక్లకు 145 క్లినిక్లు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఏ శాఖలో ఏ ఉద్యోగులు కూడా చేయని విధంగా అద్దె భవనాలకు సీహెచ్ఓలు అద్దెలు భరిస్తున్నారు. ఏడాదిగా సీహెచ్ఓలు ఇలా తమ జీతాల నుంచి అద్దె చెల్లిస్తున్నారు. క్లినిక్కు సగటును రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు మొత్తంగా రూ.36 వేల నుంచి రూ.40 వేల వరకు ఇప్పటివరకూ అద్దెలు చెల్లించారు. అలాగే విద్యుత్ బిల్లులు అదనంగా చెల్లిస్తున్నారు. ముందు వీరి అద్దెలు చెల్లిస్తే తర్వాత ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల చేస్తుంటారు. అయితే ఏడాదిగా అద్దె బకాయిలు రావాల్సి ఉందని సీహెచ్ఓలు అంటున్నారు. ఎన్క్యూఎస్ సర్టిఫికెట్ కోసం.. నేషనల్ క్యాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ కమిటీ (ఎన్క్యూఎస్) సర్టిఫికెట్ పొందేందుకు విలేజ్ క్లినిక్లో పరికరాలు, నిర్వహణ కోసం ఒక్కో క్లినిక్లో సీహెచ్ఓలు రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. వీటికి కూ డా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగలేదు. ఇలా జిల్లాలో సుమారు రూ.1.90 కోట్ల వరకు సీహెచ్ ఓలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. అలాగే సీహెచ్ఓల జీతాలకు సంబంధించి పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం ఈపీఎఫ్ఓకు చెల్లించడం లేదు. ఇలా ఆరు నెలలుగా పీఎఫ్ సొమ్ము జమ కావడం లేదు. సూపర్వైజర్లపై భారం : ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లతో విలేజ్ క్లినిక్లను నడిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసి విధు లు అప్పగిస్తున్నారు. జిల్లాలో 34 సీహెచ్సీలు, 136 మంది సూపర్వైజర్లు ఉన్నారు. విలేజ్ క్లినిక్ల బాధ్యతలు తమకు మరింత భారమని సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ఆవేదన చెందుతున్నారు. విలేజ్ క్లినిక్లు మూతపడటంతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి. చిన్నపాటి వైద్యానికి పెద్దాసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. కూటమిపై తిరుగుబాటు నాలుగు రోజులుగా విధుల బహిష్కరణ కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శనలు ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారమే లక్ష్యం జిల్లాలో 364 మంది సమ్మెలో.. విలేజ్ క్లినిక్లలో నిలిచిన సేవలు సీహెచ్ఓల డిమాండ్లు 6 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి. పని ఆధారిత ప్రోత్సాహకాలు క్రమబద్ధీకరించాలి. ఈపీఎఫ్ను పునరుద్ధరించాలి క్లినిక్ అద్దె బకాయిలు చెల్లించాలి. నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలి. ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలి. ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు అమలు చేయాలి. -
గూడెం కూటమిలో మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘మా కూటమి నేతలు కొంతమంది నేను తొందరగా చనిపోతే బాగుండును... ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిపోవాలని కోరు కుంటున్నారు.. నేనేమి వాళ్ల త్యాగాలతో గెలవలేదు.. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు.. ఎన్డీఏ ఎమ్మెల్యేను. నా చావును కోరు కోవడం అన్యాయం.. నేను చనిపోయాక ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్న వాళ్ళ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను’ అంటూ టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జిని ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. తాజాగా తాడేపల్లిగూడెంలో మొదలైన రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది. పొత్తుల్లో భాగంగా జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్కు సీటు కేటాయించడంతో గెలుపొందారు. ఇదే స్థానం టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి ఆశించి భంగపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో వివాదాలు కొనసాగుతున్నాయి. అక్రమ గ్రావెల్, మైనింగ్, పేకాట శిబిరాలు, బెల్టుషాపులు, వైన్ షాపుల వసూళ్ల వ్యవహారంలో మొదలైన విబేధాలు తాజాగా రచ్చకెక్కాయి. ఇద్దరు నేతల మధ్య అధికారులు పూర్తిగా నలిగిపోతున్నారు. అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా?: టీడీపీ నేతలు రెండురోజుల క్రితం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ పరిశీలకుడు నక్కా చిట్టిబాబు నేతృత్వంలో జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి తీరుపై విమర్శలు గుప్పించారు. మేము అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా అన్న విషయం తెలియడం లేదని.. చిన్న పని కూడా కార్యకర్తలకు జరగడం లేదని.. పార్టీ నేతలకు ఎక్కడా ఆహ్వానాలు గాని, ప్రొటోకాల్ గాని లేదని, చిన్న పోస్టులు కూడా నియోజకవర్గ ఇన్చార్జి వేయించే పరిస్థితి లేదని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణిలో ఎస్సై మొదలుకొని మున్సిపల్ కమిషనర్ వరకు తన మాటే వినాలని, టీడీపీ వాళ్ళకు పనిచేస్తే సహించేది లేదని హుకుం జారీ చేశారని ఆరోపణలు గుప్పించారు. టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి ఎన్ఆర్జీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు, అతని వార్డులో రెండు సీసీ రోడ్లు వేయాలని అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించడం లేదని సమావేశంలో ఆరోపించారు. ఈ పరిణామాల క్రమంలో బుధవారం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో బొలిశెట్టి టీడీపీ నేతల ఆరోపణలపై పరోక్షంగా ఘాటుగా స్పందించారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల గెలవలేదు తాను ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల గెలవలేదని, మరో పిఠాపురం చేస్తానంటే నేను గాజులు తొడుక్కుని కూర్చొలేదని, కొందరి నాయకుల్లాగా స్థలాలు, పొలాలు పూడ్చుకోలేదని ఎవరి త్యాగం వల్ల తనకు సీటు రాలేదని ఎమ్మెల్యే బొలిశెట్టి బుధవారం వ్యాఖ్యానించారు. అధికారులను ఇబ్బంది పెట్టినా, బెదిరించినా సహించనని ఎలాంటి హోదా లేకుండా అధికారులను ఇంటికి పిలిచి నాకు తెలియకుండా టీడీపీ నేతలు సమీక్షా సమావేశాలు ఎలా పెడతారంటూ ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి మధ్య మాటల యుద్ధం కూటమి నేతలు కొందరు నా చావును కోరుకుంటున్నారన్న జనసేన ఎమ్మెల్యే టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతల ఆరోపణ మీ త్యాగాలతో ఎమ్మెల్యే కాలేదంటూ బొలిశెట్టి వ్యాఖ్యలు చిచ్చు రేపిన అరకమ తవ్వకాలు నియోజకవర్గంలో ఎర్రకాల్వతో సహా అక్రమ గ్రావెల్ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతలే రింగ్ లీడర్లుగా మారి భారీగా తవ్వకాలు చేసి ఎమ్మెల్యే సొంత స్థలంలో, టీడీపీ ఇన్చార్జి సొంత లేఅవుట్లలో మట్టిని నింపుతున్నారు. ఈ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. వైన్ షాపులు, అధికారుల పోస్టింగులు, పనుల కేటాయింపులు ఇలా అన్నింటిలోనూ ఈ విభేదాలు పెరిగి వివాదానికి దారితీశాయి. తాడేపల్లిగూడెం కమిషనర్, కొందరు ఎస్సైలు, తహసీల్దార్లను టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యే జనసేన అయినా పైన ప్రభుత్వం మాదని నియోజకవర్గంలో లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని జనసేన ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపించారు. అధికారుల జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించనని.. ప్రజలు ఓట్లు వేసి అవకాశం ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచానని, చిల్లర వ్యవహారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ పరోక్షంగా హెచ్చరించారు. -
మైన్స్ కార్యాలయం ఖాళీ
సాక్షి, భీమవరం: జిల్లాలోని గనులు, భూగర్భ శాఖ కార్యాలయం సిబ్బంది లేక అలంకారప్రాయంగా మిగిలింది. నెలల తరబడి పోస్టులు భర్తీకాకపోవడం, ఉన్న వారు సెలవు, డిప్యుటేషన్పై వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలతో వెలవెలబోతోంది. ఇన్చార్జి అధికారులు అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారు. పట్టించుకునే వారు లేక జిల్లాలో ఇసుక, గ్రావెల్, మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. జిల్లాల పునర్విభజన అనంతరం ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో గత ప్రభుత్వం జిల్లా గనులు, భూగర్భశాఖ కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. గతంలో ఏలూరులో ఉండే కార్యాలయం చేరువగా రావడంతో ప్రజలకు సేవలు మెరుగయ్యాయి. ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లోని వశిష్ట గోదావరి తీరం, నరసాపురం నియోజకవర్గంలోని సముద్ర తీరం వెంట ఇసుక, తాడేపల్లిగూడెం ప్రాంతంలో గ్రావెల్, ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో ఆక్వా చెరువుల పేరిట మట్టి అక్రమ తవ్వకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే వెంటనే వెళ్లి వాటిని అడ్డుకునే వీలుండేది. అక్రమ తవ్వకాలు చేసిన వారికి జరిమానాలు విధించేవారు. లీజులు లేక పోస్టులు ఖాళీ : వశిష్ట గోదావరి తీరం వెంట జిల్లాలోని సిద్ధాంతం 1, 2, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడి 1, 2 ర్యాంపులు, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, యలమంచిలి లంక, చించినాడ, మాధవాయిపాలెంలోని డీసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు చేసేవారు. గత ఏడాది గోదావరి వరదల తర్వాత నవంబరులో ర్యాంపులు తెరుచుకుంటాయని భావించారు. జిల్లాలోని గోదావరి తీరం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్)లోకి వెళ్లడంతో ర్యాంపులు, డీసిల్టేషన్ పాయింట్లన్నీ మూతపడ్డాయి. మైనింగ్ శాఖకు జిల్లాలో లీజులు లేక భీమవరంలోని కార్యాలయం కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కార్యాలయ సూపరింటెండెంట్ లాంగ్ లీవ్పై వెళ్లిపోగా, సర్వేయర్ డిప్యుటేషన్పై ఏలూరులో పనిచేస్తున్నారు. ఒక అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఏజీ), ఒక రాయల్టీ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్(టీఏ)లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఏఓ), ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు, చైన్మెన్, డ్రైవర్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరు నెలల క్రితం జరిగిన సాధారణ బదిలీల్లో ఖాళీలను భర్తీ చేయలేదు. ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. పూర్వపు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన విజిలెన్స్ ఏడీ ఇక్కడ ఇన్చార్జి ఏడీగా, ఆయా ఖాళీల్లో ఏలూరుకు చెందిన అధికారులు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు పని ఉన్నప్పుడు వచ్చి వెళుతున్నారు. ఆయా పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారు అధికారులు అందుబాటులో లేక ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. ఫిర్యాదు చేసినా ఫలితం లేదు పాలకొల్లు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయమై ఇటీవల మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఏలూరులో ఉన్నామని, ఉమ్మడి జిల్లా అంతా తామే చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. కార్యాలయానికి వెళ్తే ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. – కలవల వెంకట సురేష్కుమార్, మేడపాడు భర్తీకి నోచుకోని ఏజీ, ఆర్ఐ, టీఏ, డీఏఓ పోస్టులు లాంగ్ లీవ్లో మిగతా అధికారులు జూనియర్ అసిస్టెంట్, అటెండర్ మాత్రమే విధుల్లో పట్టించుకునే వారు లేక జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా రెచ్చిపోతున్న మట్టి, ఇసుక మాఫియా జిల్లాలో మైనింగ్ లీజులు లేనప్పటికీ పట్టించుకునే వారు లేక నిబంధనలకు విరుద్ధంగా ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లోని గోదావరి తీరంలో బొండు ఇసుక, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీరం వెంట ఇసుక, తాడేపల్లిగూడెం రూరల్లోని ఆరుగొలనులో గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేస్తే వెళ్లి పరిశీలించే పరిస్థితి ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో పోస్టులు నియామకం చేయడం ద్వారా జిల్లాలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. -
అకాల వర్షం.. రైతన్నకు నష్టం
అకాల వర్షం రైతన్నకు నష్టాన్ని మిగిల్చింది. ఆచంట నియోజకవర్గంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు. 8లో uప్రశాంతంగా పాలిసెట్ పరీక్ష భీమవరం: పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం బీవీ రాజు విద్యాసంస్థల్లోని సీతా పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం సెంటర్కు ఎంతమందిని కేటాయించారు, ఎంతమంది హాజరయ్యారనే వివరాలను చీఫ్ కోఆర్డినేటర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లాలో భీమవరంలో 4, తాడేపల్లిగూడెంలో 2, తణుకులో 8, నరసాపురంలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 7,254 మంది ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 6,489 మంది హాజరయ్యారని చెప్పారు. నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా వ్యాప్తంగా మే 4న నిర్వహించే నీట్ యూజీ– పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేశామని, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నీట్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై నీట్ యూజీ అధికారులు, సూపరింటెండెంట్లు, విద్యాశాఖాధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని తాడేపల్లిగూగెంలోని నిట్, శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు మొత్తం 2,100 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఆఫ్లైన్ విధానంలో నిర్వహించే పరీక్షకు ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో వీల్ చైర్స్, సహాయకులను ఏర్పాటు చేయాలన్నారు. గూగుల్ మీట్లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డీఈఓ ఈ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల మృతి కూటమి ప్రభుత్వ వైఫల్యమే
తాడేపల్లిగూడెం అర్బన్: కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే సింహాచలంలో భక్తులు ప్రాణాలు కోల్పోయారని మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే హిందూ ఆలయాల్లో వరుసగా ఘోరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో లడ్డూ కల్తీ అయ్యిందంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రచారం చేసి.. చివరకు సుప్రీంకోర్టుతో మొట్టికాయలు తిన్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. తిరుపతిలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా కళ్ల ముందే కదులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన వాదినని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ ఆనాడు కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. శ్రీ కూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోతే వాటికి పోస్టుమార్టం చేయకుండా ఈవో ఆఫీసు వెనుకే దహనం చేయడం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. తిరుమలలో వందలాది గోవులు మరణిస్తే.. నిర్లక్ష్య ధోరణితో మాట్లాడటం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. టెండర్లను రద్దు చేసి.. దోపిడీకి పాల్పడ్డారు రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం అవినీతిని వీడటం లేదని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ నిధులతో పలు ఆలయాలను అభివృద్ధి చేశామని చెప్పారు. రూ.50 కోట్లతో సింహాచలం ఆలయాన్ని అభివృద్ధి చేశామని.. ఇప్పటికీ కొనసాగించాల్సిన అభివృద్ధి పనుల టెండర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. వారికి కావల్సిన వ్యక్తులకు వాటిని కట్టబెట్టిందని దుయ్యబట్టారు. అభివృద్ధి పనుల అంచనాలను పెంచి దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు పచ్చ మీడియా రక్షణ కవచంలా పనిచేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవన్కల్యాణ్.. ఇప్పుడు ఆలయాల్లో ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. దేవదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు ఆగ్రహం -
సరైన ఏర్పాట్లు లేకే భక్తుల మృతి
వీరవాసరం: సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఏడుగురు భక్తులు చనిపోవడం అత్యంత దురదృష్టకరమని మండలి సభ్యుడు కౌరు శ్రీనివాస్ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక బందోబస్తు, సరైన వసతి ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి అపచారం ఎప్పుడు చోటు చేసుకోలేదన్నారు. పదవీ విరమణ చేసిన పోలీసులకు సత్కారం భీమవరం: పోలీసు శాఖలో అంకిత భావంతో చేసిన సేవలు ప్రసంశనీయమని జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు అన్నారు. పోలీసు శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం సన్మానించారు. తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై కె.కొండలరావు, భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.భాస్కరరావు, నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ విశ్వేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలి తాడేపల్లిగూడెం రూరల్: బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలని బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల ఆదిశేషు అన్నారు. బుధవారం మండలంలోని నీలాద్రిపురంలో సర్పంచ్ రాజమహేంద్రవరపు లక్ష్మణరావు నివాసంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆదిశేషు మాట్లాడుతూ బీసీలకు అందాల్సిన ఫలాల కోసం కష్టించి పనిచేయాలన్నారు. బీసీలకు సేవ చేయడానికే బీసీ వెల్ఫేర్ జేఏసీ పనిచేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడిగా రాజమహేంద్రవరపు లక్ష్మణరావును నియమిస్తున్నట్లు వెల్లడించారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చప్చిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు సేవ చేసే వారిని జేఏసీలో చేర్చాలని సూచించారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి రఘు తదితరులు మాట్లాడరాఉ. బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా కమిటీలో నియమిస్తూ పలువురికి నియామకపు పత్రాలను అందజేశారు. ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రవేశాల కన్వీనర్, ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పీ. రజిత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 804, 14 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఆయా కోర్సుల్లో 1672 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దరఖాస్తు కాపీ ప్రింట్ను తన ఒరిజినల్స్తో విద్యార్థి ఏదైనా ప్రభుత్వ ఐటీఐలలో మే 26వ తేదీ సాయంత్రం 5గంటల లోపు వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. వివరాలకు 08812–230269 నెంబరులో సంప్రదించవచ్చన్నారు. సీహెచ్ఓల ఆందోళనకు మద్దతు ఏలూరు (టూటౌన్): ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గత మూడు రోజులుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సీహెచ్ఓలకు బుధవారం ఎన్జీవో నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, కార్యదర్శి ఎన్వి రామారావులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. న్యాయ మైన కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. -
అమాయక భక్తులు బలి కావాల్సిందేనా..?
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: చంద్రబాబు పాలనలో అమాయక భక్తులు బలికావాల్సిందేనని మరోసారి రుజువు చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భగవత్ స్వరూపాన్ని తనివితీరా చూడాలనే ఉద్దేశంతో ఆలయాలకు వస్తున్న భక్తుల ప్రాణాలను కూటమి ప్రభుత్వం హరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవాన్ని తిలకించేందుకు వెళ్లిన భక్తులు భద్రతా లోపం వల్ల అసువులు బాసారని దుయ్యబట్టారు. సనాతన ధర్మం అంటూ హంగామా చేసేవారు ఇప్పుడు ఏం చెబుతారని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే హడావుడి చేయాల్సిన అవసరం లేదని, మీకు సనాతన ధర్మం అనే అర్హత లేదని విమర్శించారు. అప్పన్న స్వామి దర్శనానికి రూ.300 టికెట్ తీసుకుని వచ్చిన భక్తుల ప్రాణాలను నిర్లక్ష్యంగా వ్యవహరించి బలిగొన్నారన్నారు. గత పాలనలో చంద్రబాబు ప్రచార పిచ్చితో పుష్కరాల్లో 29 మందిని బలితీసుకోగా ఇటీవల తిరుపతిలో తొక్కిసలాటలో అమాయక భక్తులు మరణించారని గుర్తు చేశారు. ఆలయ ఈవోతో పాటు కాంట్రాక్టర్, ఇతర బాధ్యులందరిపై హత్యాయత్నం కేసులు నమోదుచేయాలని, మృతుల కుటుంబ సభ్యులకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.25 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశువధ కర్మాగారం మీ పాపమే కదా టీటీడీలో గోవుల ప్రాణాలు కూడా తీసేస్తున్నారని, ఇదంతా కూటమి ప్రభుత్వ చేతకానితనమేనని మాజీమంత్రి కారుమూరి విమర్శించారు. తణుకులో రక్తపాతం సృష్టిస్తున్న పశువధ శాల స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన, ఆర్ఎస్ఎస్ నాయకుల ప్రోత్సాహంతోనే నడుస్తుందని విమర్శించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పేదలకందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు. పొగాకు, కోకో, మిర్చి, టమోటా, ఆయిల్పాంకు గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడుతున్నారని.. కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. -
రాష్ట్రంలో అధ్వానంగా శాంతిభద్రతలు
చింతలపూడి: రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయని పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిడపర్తి ముత్తారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం చింతలపూడిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియాపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రాణాలకు తెగించి వార్తలు సేకరించే జర్నలిస్టులపై భౌతిక దాడులు చేస్తుండడం దారుణమని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి వెళ్లి ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయం ముందు హల్చల్ చేయడమే కాక ఆయన అనుచరులు అక్కడి కంప్యూటర్లను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించిన చింతమనేనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు. అదే విధంగా శ్రీకాళహస్తిలో వార్త సేకరణకు వెళ్లిన సాక్షి విలేకరిపై జరిగిన దాడి కూడా మీడియాపై దాడులకు ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. ఈ దాడులు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. నిత్యం మీడియాపై, మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను దేశంలోని మేధావులు ఖండించాలని పిలుపునిచ్చారు. -
హైస్కూల్ గ్రౌండ్లో మద్యం సేవించిన ఇద్దరిపై కేసు
ద్వారకాతిరుమల: స్థానిక శ్రీవారి దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల గ్రౌండ్లో ఈనెల 28న మద్యం సేవించి, వివాదానికి కారణమైన ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై స్థానిక పోలీస్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులకు వినియోగించే ట్రాక్టర్ను నడిపే డ్రైవర్ కందికొండ భూషణం, స్కావెంజర్ కొండాబత్తుల సూరిబాబు ఈనెల 28న మధ్యాహ్నం హైస్కూల్ గ్రౌండ్లోని స్టేజీపై కూర్చుని మద్యం సేవించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా వివాదంగా మారింది. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. దేవస్థానం సెక్యూరిటీ సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ మంగళవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన భూషణం, సూరిబాబు లపై పోలీసులు పెట్టీ కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి నూజివీడు: మండలంలోని బత్తులవారిగూడెం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు మండలం పాతముప్పర్రుకు చెందిన రంజుల ఏసుబాబు (34) మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మైలవరం వెళ్తుండగా బత్తులవారిగూడెం శివారులో వెనక నుంచి బొలేరో వాహనం వచ్చి ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన ఏసుబాబును పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో మృతిచెందాడు. రూరల్ ఎస్సై జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు. నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏలూరు రూరల్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నట్లు డీఎస్డీఓ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరాల్లో ఈనెల 31వ తేదీ వరకూ 8 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 50 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అథ్లెటిక్స్, అర్చరీ, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, ఫుట్బాల్, హేండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, రోయింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, కయాకింగ్, స్కేటింగ్ వంటి విభాగాల్లో జిల్లాలో ఎంపిక చేసిన శిబిరాల్లో తర్ఫీదు ఇస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐసీఎస్ఈ ఫలితాల్లో సెంట్ ఆన్స్ ప్రభంజనం తాడేపల్లిగూడెం : పదో తరగతి ఐసీఎస్ఈ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించినట్టు పట్టణంలోని సెంట్ ఆన్స్ విద్యాసంస్థల అధినేత అద్దంకి విజయకుమార్ తెలిపారు. తమ విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత శాతం సాధించారన్నారు. బీవీ సూరజ్ 97 శాతం, జి.నేహశ్రీ 95 శాతం, సీహెచ్.కిరణ్ సాయి భాస్కర్ 94 శాతం, టి.మోహన సౌమ్య 93 శాతం, పి.రేవతి లక్ష్మి నరసింహ 93 శాతం, ఎం.హేమ సరిత 92 శాతం, బి.సాహితి 91 శాతం సాధించారన్నారు. 90 శాతం పైగా మార్కులు సాధించిన వారు ఏడుగురు, 80 శాతం పైన మార్కులు సాధించిన వారు 35 మంది, 70 శాతం పైగా మార్కులు సాధించిన వారు 58 మంది, 60 శాతం మార్కులు పైగా 70 మంది సాధించారని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐసీఎస్ఈ కరిక్యులం అవలంభించడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
చేపలు పడుతూ.. ఎర్రకాలువలో పడి వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం: ప్రమాదవశాత్తు లక్కవరం సమీపంలోని ఎర్రకాలువలో పడి వ్యక్తి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలివి. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన దల్లి రామాంజనేయులు (49) అలియాస్ రామాంజి కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఖాళీ సమయంలో గేలం వేసుకుని చేపలు పడుతుంటాడు. మంగళవారం లక్కవరం పరిధిలో ఉన్న ఎర్ర కాలువలో గట్టుమీద కూర్చొని చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయి రామాంజనేయులు మృతి చెందాడు. లక్కవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
కార్మిక లోకం.. మీకు సలాం
రక్తాన్ని చెమటగా మార్చి ఎండనక... వాననక కష్టపడి తమ కుటుంబాలను పోషించడానికి రోజువారీ వేతనాల కోసం పనిచేస్తూ శ్రమిస్తున్న కార్మికులు ఎంతో మంది ఉన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో సంస్థలు, సంఘాలు పనిచేస్తున్నా.. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పటికీ మిఽథ్యగానే కనిపిస్తోంది. కార్మికుల వేతనాల కోసం ఎన్నో చట్టాలు వచ్చినా అవి ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ కార్మిక దినాన్ని అధికారికంగా, సంఘాలపరంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నా వారికి మాత్రం న్యాయం జరగడం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితిలో కూలి పనులే దిక్కుగా నిత్యం శ్రమిస్తున్న కార్మికులకు మేడే సందర్భంగా ‘సాక్షి’ సలాం.. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
పచ్చిరొట్ట సాగుతో భూసారం మెండు
చింతలపూడి: రసాయన ఎరువుల వాడకం నానాటికీ పెరుగుతుండడంతో భూసారం తీవ్రంగా దెబ్బతింటోంది. దీంతో పోషకాల లోపం ఏర్పడి పంటలు చీడపీడల బారిన పడి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంట భూములను సారవంతంగా మార్చుకుని అధిక దిగుబడులు సాధించాలంటే పచ్చిరొట్ట సాగు ఒక్కటే మార్గం. రైతులు తమ పొలాల్లో పంటలు సాగులో లేనప్పుడు పచ్చిరొట్ట సాగు చేసుకోవాలి. తొలకరికి ముందు వివిధ రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు రాయితీపై అందిస్తున్నారు. ప్రతి ఏటా వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు వాటి నివేదికలను వ్యవసాయశాఖ అందచేస్తుంది. భూసారాన్ని పెంచడానికి రైతులు కనీసం రెండు పంటలు వేసిన తరువాత పచ్చిరొట్ట పైర్లు సాగుచేయాలని వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి నాగకుమార్ తెలిపారు. ● పచ్చిరొట్ట సాగు వల్ల భూసారం పెరగడమే కాక చీడ, పీడల బెడద తగ్గుతుంది. దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. భూసారం పెంచే పచ్చిరొట్ట పైరులైన జనుము, జీలుగ, పిల్లి పెసర సాగు చేసి ప్రయోజనం పొందవచ్చు. ● సేంద్రియ పదార్థాలను నేలకు అందించడం, కలుపు మొక్కలను నివారించడం, నేలలో జీవ రాశులకు ఆహారంగా, మొక్కలకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలను అందించే సాధనాలుగా పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయి. ● ప్రస్తుతం పొలాలకు కృత్రిమంగా ఉపయోగిస్తున్న నత్రజని వాడకాన్ని 20 నుంచి 30 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. పచ్చిరొట్ట పైర్లు సాగు చేసిన భూముల్లో పంటలు ఆరోగ్యంగా పెరిగి, చీడ, పీడలను తట్టుకోవడమే కాకుండా నేలలో నీరు, రసాయన ఎరువులు భూమి కింది పొరలకు జారిపోకుండా పచ్చిరొట్ట అడ్డుకుంటుంది. ● నేలలో చౌడును తగ్గించి శీతాకాలంలో కూడా నేలలోని ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండటానికి పచ్చిరొట్ట సాగు ఉపకరిస్తుంది. చౌడు భూముల్లో జీలుగ, నీరు నిల్వ ఉండే భూముల్లో జనుము వేసుకోవడం ఉత్తమం. ● జీలుగ హెక్టారుకు 20 టన్నులు, జనుము 21 టన్నులు, పిల్లి పెసర 18 టన్నుల దిగుబడి వస్తుంది. ఇటు పశుగ్రాసం కొరతను తీర్చడమే కాక భూమిని సారవంతం చేస్తాయి. ఎరువు కోసమైతే పచ్చిరొట్ట పైర్లను పూత సమయంలో నేలలో కలియదున్నుకోవాలి. ● పైరు వయసు 50 రోజుల నుంచి 60 రోజులు మించకుండా కలియదున్ని ఒకటి రెండు వారాల తరువాత నాట్లు వేసుకోవాలి. జీలుగ, పిల్లి పెసర విత్తనాలు ఎకరానికి 16 కిలోలు, జనుము 20 కిలోల చొప్పున వేసుకోవాలి. రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అందిస్తుంది. సబ్డివిజన్లో ఈ ఏడాది 3,152 క్వింటాళ్లు పచ్చి రొట్ట విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. చింతలపూడి మండలంలో 1,475 క్వింటాళ్లు, కామవరపుకోట మండలంలో 525 క్వింటాళ్లు, లింగపాలెం మండలంలో 332 క్వింటాళ్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 820 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. బి నాగకుమార్ వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాడి – పంట రసాయన ఎరువుల వినియోగంతో అనర్థాలు మెట్ట భూముల్లో లోపిస్తున్న పోషకాలు భూసారం, అధిక దిగుబడుల కోసం పచ్చిరొట్ట సాగు మేలంటున్న నిపుణులు -
అకాల వర్షం.. రైతన్నకు నష్టం
పెనుగొండ: అకాల వర్షం రైతన్నకు నష్టాన్ని మిగిల్చింది. ఆచంట నియోజకవర్గంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వేసవి కాలం కావడంతో రైతులు కళ్లాల్లోని ధాన్యానికి పూర్తి స్థాయి రక్షణ ఏర్పాటు చేయలేదు. అరగంట పాటు భారీ వర్షం కురవడంతో రైతులు ఉరుకులు, పరుగులు పెట్టినా పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కాపాడుకోలేకపోయారు. ప్లాస్టిక్ బరకాలు కప్పినా కొంతమేర ధాన్యం వర్షార్ఫణం అయింది. ఆచంట నియోజకవర్గంలో పెనుగొండ మండలంలో 11,782 ఎకరాల్లోనూ, పెనుమంట్ర మండలంలో 12,103, ఆచంట మండలంలో 10,600, పోడూరు మండలంలో 12,800 ఎకరాల్లో వరి సాగు చేశారు. దీనిలో ఎంటీయూ 1121 వరి రకం అధికంగా సాగు చేయగా, పీఆర్ 126, ఎంటీయూ 1153 రకాలు కూడా సాగు చేశారు. వీటిలో పెనుగొండ మండలంలో ఎంటీయూ 1121, ఎంటీయూ 1153 రకాలు ముందుగా కోతకు వచ్చాయి. 50 శాతంకు పైగా కోతలు పూర్తిచేసిఽ ధాన్యాన్ని తేమ శాతం తగ్గించుకోవడానికి ఆరబెట్టుకొనే స్థాయిలో మాసూళ్లు ఉన్నాయి. మంగళవారం కురిసిన వర్షంతో చాలా మంది రైతులు నష్టపోయారు. ఇదిలా ఉండగా, కోతకు కోయకుండా ఉన్న వరిచేలు భారీ ఈదురు గాలులకు నేలనంటాయి. వరి కోత యంత్రాలతో కోత కోసే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వలన కోత ఖర్చులు పెరిగిపోతున్నాయన్నారు. యంత్రాలు కోయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో సమయం పెరగడం వలన యంత్రాలకు అధికంగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. పంట చేతికందే సమయంలో కురిసిన వర్షం నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇటుకలు మీదపడి కార్మికుడి దుర్మరణం
తణుకు అర్బన్ : తణుకు జాతీయ రహదారిపై ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టరు ట్రక్కు బోల్తా పడిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఘటనలో ట్రాక్టరు ట్రక్కుపై ప్రయాణిస్తున్న కార్మికుడు నక్కా ఏసు (42)పై ఇటుకలు పడడంతో మృతిచెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు నుంచి తాడేపల్లిగూడెం ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టరు తణుకు జాతీయరహదారి పాత టోల్గేట్ ప్రాంతానికి వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇటుకలోడు దింపే కార్మికులు పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన నక్కా ఏసు, సీహెచ్ నాగబాబు, తొంట దుర్గాప్రసాద్, మద్దే ఏసు ఇటుకలోడుతో ఉన్న ట్రాక్టరుపై ప్రయాణం చేస్తున్నారు. ట్రక్కు తిరగబడిన వెంటనే కింద పడిన ఏసుపై ఇటుకలు పడిపోయాయి. స్థానికులు, తోటి కార్మికులు బలవంతంగా ఇటుకల్లోంచి అతడిని బయటకు లాగినా అప్పటికే మృతి చెందాడు. ఏసు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించగా, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వడలి.. కన్నీటి కడలి వడలి గ్రామానికి చెందిన నక్కా ఏసు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిందని కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుడికి భార్య భవానితోపాటు 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. ఒక రోజు క్రితమే నేను లేకపోతే మీరు ఎలా బతుకుతారని ఏసు తనను నిలదీశాడని భార్య భవాని రోదిస్తూ చెబుతున్న తీరు స్థానికులను కలచివేసింది. ఇలా అర్థంతరంగా వెళ్లిపోయావు.. మాకెవరు దిక్కంటూ ఆస్పత్రి ఆవరణలో ఆమె రోదనలు మిన్నంటాయి. తణుకు ఏఎస్సై రంగారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు జాతీయ రహదారిపై అదుపు తప్పి ఇటుక ట్రాక్టర్ బోల్తా ఒకరి మృతి.. మరో ముగ్గురికి గాయాలు -
జూలై నుంచి ఆక్వా పంట విరామం
పెనుమంట్ర: ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణతో పాటు ప్రాసెసింగ్ యూనిట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే జూలై నుంచి ఆక్వా సాగు విరామం ప్రకటిస్తామని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అన్నారు. మంగళవారం రాత్రి పెనుమంట్రలోని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాస్ రాజు నివాసంలో ఆక్వా రైతుల అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న భగవాన్ రాజు మాట్లాడుతూ కూలీ ధరలతో పాటు ఫీడ్ ధరలు గణనీయంగా పెరగడం, రొయ్యల ధరలను సిండికేట్లు భారీగా తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సిండికేట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే క్రాప్ హాలిడే ఒకటే సరైన పరిష్కారం అన్నారు. జూలై నుంచి ఆక్వా సాగును నిలిపివేయాలని ప్రకటించారు. -
కోళ్ల వ్యర్థాలతో ఆక్వా సాగుపై ఆగ్రహం
స్పందన కై కలూరు: కోళ్ల వ్యర్థాలతో ఫంగసిస్ చేపల సాగు చేస్తున్న చటాకాయి గ్రామానికి చెందిన రైతు ఘంటసాల సుబ్బరాజుకు మత్స్యశాఖ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ‘చేపల సాగులో కోడి వ్యర్థాలు’ అనే శీర్షికతో సాక్షిలో మంగళవారం వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. కై కలూరు మత్స్యశాఖ అధికారి చెలపురి గణపతి వెంటనే స్పందించారు. వ్యర్థాలతో సాగు చేస్తున్న 6.5 ఎకరాల చెరువును సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఫ్డీవో మాట్లాడుతూ కోళ్ళ వ్యర్థాలతో సాగు చేయడం నేరమన్నారు. సదరు రైతుకు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా సాగు అనుమతి పత్రాన్ని రద్దు చేస్తున్నామన్నారు. సాగును వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. -
వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుల నియామకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులను మంగళవారం నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు అనుసంధానంగా పరిశీలకులు పనిచేసేలా నియమించారు. ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడిగా కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన పార్టీ నేత ముదునూరి మురళీకృష్ణంరాజును నియమించారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావును మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులుగా నియమించారు. ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి కాళ్ల: ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించేలా అవసరమైన అభివృద్ధి పనులే చేపట్టేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరంలో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. ఏఏ ప్రాంతాల్లో ఎంతెంత విస్తీర్ణం ఖాళీ స్థలాలు ఉన్నాయో జిల్లా కలెక్టర్కు సర్వేయర్ వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం పట్టణ వాసుల ఆహ్లాదానికి, ఆరోగ్యానికి దోహదపడే పలు ప్రాజెక్టులను దాతల సహకారంతో చేపట్టామని, పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ పనులు పూర్తయితే పార్కులు, వాకింగ్ ట్రాక్స్, జిమ్ ఏరియా, గ్రీనరీ అభివృద్ధి, ఫౌంటెన్లు, పాత బస్టాండ్ పునర్నిర్మాణం, బస్టాప్ అందుబాటులో వస్తాయని, తద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం, సౌకర్యవంతమైన జీవన శైలి సమకూరుతుందన్నారు. కార్యక్రమంలో కాళ్ల తహసీల్దార్ జి.సుందర్సింగ్, ఎంపీడీవో డాక్టర్ బి.స్వాతి, ఈఓపీఆర్డీ ఎంవీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. మానసిక వైద్యశాలల పరిశీలన భీమవరం : భీమవరం పట్టణంలోని శాంతి నర్సింగ్ హోం, ప్రశాంతి నర్సింగ్ హోమ్, వర్మ హాస్పిటల్ను మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్బంగా వైద్యులను మానసిక రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న సౌకర్యాలు, వారి మానసిక స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాంతి మానసిక వైద్యశాల డాక్టర్ జీవీ రమణరావు, ప్రశాంతి వైద్యశాల డాక్టర్ మాదిరెడ్డి వెంకటరమణ, వర్మ హాస్పిటల్స్ మానసిక వైద్యురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి భీమవరం (ప్రకాశంచౌక్): వేసవి దృష్ట్యా జిల్లాలో ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వడగాల్పులు, వర్క్ ఫ్రం హోం, ఈకేవైసీ తదితర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వడగాల్పుల బారిన పడకుండా ఉపాధి హామీ కార్మికులు ఉదయమే పనులు చేయాలన్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాలను గుర్తించి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. -
దర్జాగా విద్యా వ్యాపారం
భీమవరం: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే జిల్లా వ్యాప్తంగా విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. కనీస నిబంధనలు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే నాథుడు లేదు. అధికారుల అండదండలతో వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో సుమారు 495 ప్రైవేటు విద్యాసంస్థలుండగా వాటిలో 96 ప్రైమరీ, 190 అప్పర్ ప్రైమరీ, 209 హైస్కూళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్ధల్లో ఇంటర్, డిగ్రీ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం గాకుండా స్కూళ్లలో జాయిన్ చేసుకోకూడదనే నిబంధనలున్నా వాటిని పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఒక్కో స్కూల్ వద్ద రెండు, మూడు కౌంటర్లు పెట్టి ప్రవేశ పరీక్షలు నిర్వహించి ముందుగానే ఫీజులు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం వంటివి నిషేధమైనా స్కూళ్లు, కళాశాలల్లో ప్రవేశ ఫీజుతోపాటు, డిపాజిట్, ట్రావెలింగ్, స్కూల్, కళాశాల ఫీజు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. యూనిఫాం, పుస్తకాలు, స్టేషనరీకి అదనం.. హాస్టల్ వసతి అవరమైతే మరింత ఫీజులు చెల్లించాలి. జూనియర్ ఇంటర్ విద్యార్థుల నుంచి ఏడాదికి ఫీజు, ట్రావెలింగ్ రూపంలో దాదాపు రూ.1.40 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాసంస్థల్లో కనీసం ఆట స్థలాలు లేకపోగా మరికొన్ని స్కూళ్లు, కళాశాలలు ప్రధాన రహదారి పక్కనే నిర్వహిస్తున్నారు. రహదారిపై వెళ్లే ఇతర వాహనాల రణగణ ధ్వనులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలను అతిక్రమించి పుస్తకాలు అమ్మడం, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం వంటి ఘటనలపై విద్యార్థి సంఘాల నాయకులు పోరాటాలు చేసినా అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుక్స్, స్టేషనరీ నిల్వ ఉంచిన రూంలను తాత్కాలికంగా సీజ్ చేయడం మినహా ఆయా విద్యాసంస్ధలపై కఠిన చర్యలు తీసుకున్న దాఖాలాలు కన్పించడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయా? అనేది ప్రశ్నార్థకమే.. విద్యార్థులతో బట్టీపట్టించడమే గాక సెక్షన్ల వారీగా విభజించి తీవ్ర ఒత్తిడితో మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. సెలవు రోజులు, పాఠశాలల సమయం ముగిసిన తరువాత కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనకబడిన, సకాలంలో ఫీజులు చెల్లించని విద్యార్థులను స్కూల్ బయట నిలబెట్టడం, సహచర విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడడం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు ముందుగానే యూనిఫాం, పుస్తకాలకు సొమ్ములు వసూలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు ప్రైవేటు విద్యా సంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యా సంవత్సరం ప్రారంభంగాకుండా ప్రవేశాలు చేస్తే నోటీసు ఇచ్చేలా మండల విద్యాశాఖాధికారులను ఆదేశిస్తాం. పుస్తకాలు, యూనిఫామ్ విక్రయిస్తే చర్యలు తప్పవు. – ఈ.నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
వితంతు పింఛన్లకు మెలిక
●అర్హులందరికీ ఇవ్వాలి ఏడాదికాలంలో కొత్త పింఛన్ల మంజూరు లేదు. వితంతువులకు పింఛన్ ద్వారా భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం కొందరికి మాత్రమే సాయం అందించడం సరికాదు. స్పౌజ్ కోటాతో పాటు అర్హులైన వితంతువులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి. – మెహర్ అన్సారీ, గృహిణి, తణుకుఉన్నవాటిని తొలగిస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగిస్తున్నారు. వితంతువులకు పింఛన్లు వెంటనే మంజూరు చేసే వెసులుబాటు సరళంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చే వరకు పెన్షన్లు మంజూరు చేయకపోవడం సరికాదు. – పి.పూర్ణ, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శిసాక్షి, భీమవరం : రఇంటికి జీవనాధారమైన భర్త మరణిస్తే భార్యకు బతుకు భారం కాకుండా వితంతు పింఛన్తో ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భర్త పింఛన్ పొందుతూ మరణిస్తేనే భార్యకు వితంతు పింఛన్ వర్తిస్తుందంటూ కొత్త భాష్యం చెబుతోంది. ఈ మేరకు జిల్లాలో పింఛన్ పొందుతూ 3242 మంది చనిపోగా వారి భార్యలకు మాత్రమే పింఛన్ల జారీకి ఆదేశాలిచ్చింది. మిగిలిన వేలాది మంది నిరుపేద వితంతువులకు మొండిచేయి చూపింది. 25 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ ఏప్రిల్ నాటికి జిల్లాలో వివిధ సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 2,25,718 మంది ఉన్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు సుమారు 1,26,061 మంది ఉండగా, వితంతువులు 49,564, దివ్యాంగులు 28,025, మత్య్సకారులు, డప్పు కళాకారులు, అభయహస్తం తదితర లబ్ధిదారులు 22,068 మంది ఉన్నారు. 2024 జనవరిలో చివరిగా జిల్లాలోని 4,274 మందికి కొత్త పింఛన్లు ఇచ్చారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మంజూరును నిలిపేసింది. వితంతు, వృద్ధాప్య, తదితర పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు అంచనా. గత ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు అందజేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల కాలంలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు. నవంబరు నుంచి మాత్రం పింఛన్ లబ్ధిదారుడు మృతిచెందితే స్పౌజ్ కోటాలో అతని భార్యకు పింఛన్ ఇస్తోంది. అంతకు ముందు చనిపోయిన వారి భార్యలకు స్పౌజ్ కోటాను వర్తింపచేయలేదు. స్పౌజ్ కోటాలో పింఛన్ సాయం 2023 నవంబరు తర్వాత చనిపోయిన పింఛన్ లబ్ధిదారులు భార్యలకు మాత్రమే స్పౌజ్ కోటాలో పింఛన్ సాయం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ లబ్ధి పొందేందుకు జిల్లాలో 3,242 మంది ఉన్నట్లు గుర్తించింది. భీమవరంలో 386 మంది ఉండగా, నరసాపురంలో 391, ఉండిలో 490, పాలకొల్లులో 383, ఆచంటలో 521, తణుకులో 498, తాడేపల్లిగూడెంలో 441 మంది ఉండగా గణపవరం మండలంలో 132 మంది ఉన్నారు. వీరిలో 1,929 మంది దరఖాస్తులు రాగా మిగిలిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మిగిలిన 1,313 మందిలో పది శాతం వరకు మృతులు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా వితంతు పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు 8 వేలకు పైగా ఉంటాయని అంచనా. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద వితంతువులకు ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంలా తయారైంది. తమ భర్తకు పింఛన్ లేదన్న కారణంతో అర్హత ఉన్నా తమకు పింఛన్ మంజూరు చేయకపోవడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి అర్హులైన వారందరికి పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. భర్త పింఛన్ పొందుతూ మరణిస్తేనే భార్యకు వితంతు పింఛన్ లేదంటే ఆ వితంతువుకు మొండిచెయ్యే జిల్లాలో వితంతు, ఓఏపీ పింఛన్ల కోసం 25 వేలకు పైగా దరఖాస్తులు 3,242 మందికి మాత్రమే స్పౌజ్ కోటాలో సాయం పంపిణీకి నిర్ణయం పెనుగొండలో నిరుపేద కుటుంబానికి చెందిన ఎన్.సరస్వతి భర్త అనారోగ్యంతో కాలం చేసి ఏడాది కావస్తోంది. వితంతు పింఛన్ కోసం అప్పట్లోనే దరఖాస్తు చేసుకున్నా పింఛన్ రాలేదు. రెండు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు మృతి చెందగా ఆయన భార్యకు పింఛన్ మంజూరైంది. సచివాలయ ఉద్యోగులను అడిగితే ఆమె భర్త పింఛన్ పొందుతూ చనిపోవడంతో స్పౌజ్ కోటాలో ఆమెకు పింఛన్ ఇచ్చారని, తన భర్తకు పింఛన్ లేకపోవడంతో తనకు రాలేదని చెప్పారని తెలిపింది. పింఛన్ సాయం అందక బతుకు భారమవుతోందని ఆమె వాపోయింది. -
పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి
కై కలూరు: తాగునీటి అవసరాలకు విడుదల చేసిన పంట కాల్వల నీటిని ఆటపాక పక్షుల కేంద్రం చెరువుకు మళ్లించాలని పర్యావరణ ప్రేమికుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ఎస్.భాస్కరరావు డిమాండ్ చేశారు. నీరు లేక అడుగంటిన ఆటపాక పక్షుల కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటి కొరత కారణంగా పక్షులకు ఆహారపు కొరత ఏర్పడుతోందన్నారు. నెల రోజులుగా కేంద్రంలో బోటు షికారు నిలిచిపోడడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నా పర్యాటకులు నిరాశగా వెనుతిరుగుతున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు చెరువులో నీటిని నింపే ప్రయత్నం చేయాలని కోరారు. చెల్లని చెక్కు కేసులో జైలు, జరిమానా నూజివీడు: బాకీ తీర్మానం నిమిత్తం ఇచ్చిన చెక్కు బ్యాంకులో చెల్లని నేరానికి టి.నరసాపురం మండలం వెలగపూడికి చెందిన చింతపల్లి చక్రిసాయి రాంబాబుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2018 నవంబరు 18న కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మడిచర్లకు చెందిన తలకొండ గోపాలకృష్ణ, చక్రిసాయి రాంబాబుకు రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత ఆ బాకీ తీర్చమని గోపాలకృష్ణ కోరగా, సాయి రాంబాబు రూ.1.50 లక్షలకు చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును బ్యాంకులో వేయగా సాయి రాంబాబు ఎక్కౌంట్లో నగుదు లేదని వెనక్కు తిరిగి వచ్చింది. దీంతో గోపాలకృష్ణ కోర్టులో కేసు వేయగా విచారించిన మీదట జరిమానా, జైలుశిక్ష విధిస్తూ స్పెషల్ మేజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు నూజివీడు: కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. 15వ వార్డులోని కృష్ణవిలాస్ కాలనీలో నివాసముంటున్న కౌన్సిలర్ హరికోటి రమాదేవిని చూసేందుకు ఆమె తల్లి విస్సన్నపేట మండలం తాతకుంట్ల మిట్టగూడెంకు చెందిన మేడా కుమారి (55) వచ్చింది. రమాదేవి ఇంటి ఆవరణలో ఉన్న కుమారిపై మంగళవారం సాయంత్రం కోతులు దాడి చేసి గాయపరిచాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పితో ఉపాధి కూలీ మృతి కుక్కునూరు: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన కుక్కునూరు పంచాయతీ పరిఽధిలో జరిగింది. గ్రామంలోని సంజయ్నగర్ కాలనీకి చెందిన పెంకె వెంకయ్య (55) రోజులానే మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనిముగించుకోని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి కూలీలు ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు. -
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి
నూజివీడు: నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని మూడో జోన్లోని 2.36 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేయాలని ఎన్నెస్పీ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. నూజివీడులోని ఎన్నెస్పీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ప్రాజెక్ట్ కమిటీ సమావేశాన్ని చైర్మన్ కోట వీరబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం.ఆర్. మొహిద్దీన్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ కమిటీ గత తీర్మానం ప్రకారం కృష్ణానది యాజమాన్యం బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే ఎడమ కాలువ పరిధిలో 2వ, 3వ జోన్లలో ఉన్న కాలువల నిర్వహణకు ఎస్టిమేట్లు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు మాట్లాడుతూ ఎడమ కాలువ పరిధిలో వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రతిపాదించిన 3.75 టీఎంసీల నీటిని తెలంగాణ ఎన్నెస్పీ అధికారులతో విడుదల చేయించాలన్నారు. అలాగే వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాన్ని త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైస్ చైర్మన్, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ మాట్లాడుతూ 3వ జోన్ పరిధిలో ఎడమ కాలువల ఆధునికీకరణకు 16వ ఆర్థిక సంఘం నుంచి ప్రతిపాదించిన రూ.199 కోట్ల నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన 15 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నూజివీడు డివిజన్ ఈఈ ఆర్ సంతోష్, జగ్గయ్యపేట డివిజన్ ఈఈ కే.కిషోర్ డీఈలు కే సీతారావమ్మ, వీఎస్ఆర్ ప్రభు, కే రామదాసు, శశికుమారి, రాంబాబు, విజయలక్ష్మి, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. కాలువల ఆధునికీకరణకు 16వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ సర్వసభ్య సమావేశం తీర్మానం -
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తాడేపల్లిగూడెం అర్బన్: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకొంది. రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత చింతలపూడికి చెందిన కొండమురుగు తేజశ్వి (23) తాడేపల్లిగూడెంలోని మదర్ వన్నినీ నర్సింగ్ స్కూల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తోంది. తాడేపల్లిగూడెంలోని గొల్లగూడెం ప్రాంతంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో నివాసం ఉంటుంది. మంగళవారం ఉదయం 11 గంటల వరకు హాస్టల్లోని తోటి విద్యార్థులతో కలసి మాట్లాడింది. తరువాత 12.30 గంటల సమయంలో తేజస్వీని కనబడకపోవడంతో హాస్టల్ వార్డెన్ సుజాత ఆరా తీయగా హాస్టల్లోని ఎవరూ లేని ఒక గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని కనపించింది. వార్డెన్ సుజాత పెద్దగా కేకలు వేయడంతో తోటి విద్యార్థులు అక్కడకు చేరుకొని తేజశ్విని కిందకు దింపే ప్రయత్నం చేశారు. తేజశ్విని 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తేజశ్వి మృతికి ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి, అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. రూరల్ ఎస్సై జీవీఎన్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
కుక్కునూరు: గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని వింజరం రేవులో జరిగింది. కుక్కునూరు ఎస్సై రామక్రిష్ణ చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామానికి చెందిన ఉప్పల సాయిరాం (27) ఆటోమొబైల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు, తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్లు వినకుండా పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మంగళవారం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి పొలిపాకలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు వింజరం రేవుకు చేరుకున్న సాయిరాం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఇంట్లో గొడవ పడి వచ్చిన విషయం తెలుసుకున్న బంధువులు గోదావరి నది ఒడ్డున సాయిరాం బైక్ ఉండడాన్ని చూసి గోదావరిలో వెతకగా మృతదేహం లభించినట్టు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై రామక్రిష్ణ చెప్పారు. -
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ
వేసవిలో పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మే 1వ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం పలువురు పీఈటీ, పీడీ, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాము. నెలరోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాల్లో పిల్లలు ఆటలు నేర్చుకునేందుకు బాల్స్, హాకీ స్టిక్స్, నెట్స్ తదితర క్రీడాపరికరాలు అందిస్తాం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ ఇస్తాం. శిక్షణ తర్వాత పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. – బి శ్రీనివాసరావు, డీఎస్డీఓ -
చిన్నారి చికిత్సకు రూ.1,05,600 సాయం
కొయ్యలగూడెం: చిన్నారి చికిత్స నిమిత్తం దాతలు స్పందించి సాయం అందజేశారు. కొయ్యలగూడెంకు చెందిన కంచర్ల జ్యోత్స్న (7) అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు కాకినాడలో చికిత్స చేయిస్తుండగా ప్లాస్మా థెరపీ అవసరమని, రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతోందని వైద్యులు తెలపడంతో చిన్నారి కుటుంబ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీనిపై ఈనెల 29న ‘ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన కొల్లూరు సత్తిబాబు ఫ్రెండ్స్ సర్కిల్ రూ. రూ.1,05,600 జోత్స్న బంధువులకు అందజేశారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ చిన్నారి మెరుగైన వైద్యానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు ఇప్పించాలని కోరారు. -
గంధకంతో ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు
చింతలపూడి: ఉద్యాన పంటల్లో మొక్కల పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థాల్లో గంధకం ఒకటి. ఉద్యాన పంటల్లో గంధకం వాడకం వల్ల 25 శాతం దిగుబడి పెరుగుతుందని ఉద్యానాధికారి ఎండీ షాఫియ ఫర్హీన్ తెలిపారు. మెట్ట ప్రాంతంలో రైతులు ఉద్యాన పంటలను ఎక్కువగా పండిస్తుంటారని, ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల్లో వాడే పోషకాలను గురించి ఆమె వివరించారు. సాధారణంగా మెట్టప్రాంత రైతులు స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాస్, మెగ్నీషియం, బోరాన్లను వాడుతుంటారన్నారు. వీటితో పాటు అదనంగా గంధకం వాడితే ఆయిల్పాం, కొబ్బరి, నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి తోటల్లో దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గంధకం ఉపయోగాలు గంధకం క్లోరోఫిల్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేయడానికి అవసరం. కొన్ని విటమిన్ల ఉత్పత్తికి గంధకం చాలా అవసరం. పండ్ల రుచి, వాసన, రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, ఉల్లిపాయ, వెల్లుల్లిలో వాటి ప్రత్యేకమైన వాసన గంధకం వల్లనే వస్తుంది. కొన్ని సందర్భాల్లో, గంధకం శిలీంద్ర నాశినిగా, కొన్ని రకాల తెగుళ్లను నివారించడానికి కూడా ఉపయోగించబడుతుంది. వేటిలో లభిస్తుందంటే.. గంధకం మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అమ్మోనియ సల్ఫేట్, జిప్సం, సల్ఫేట్ ఆఫ్ పొటాష్, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, మాంగనీస్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. గంధకం నేలలో వాడినప్పుడు దాని ఆమ్ల స్వభావం నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 వరకు వచ్చే సరికి నేలలోని అన్నిరకాల పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. చౌడు భూములను బాగు చేసుకోవడానికి నేలలోని ఉదజని సూచికను బట్టి ఎకరానికి 500 కేజీల జిప్సంను వాడినట్లయితే దిగుబడి బాగా పెరుగుతుంది. గంధకం వాడకంతో పంట నాణ్యత, పరిమాణము, గింజల్లో నూనె శాతం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది ఉద్యాన పంటల్లో తక్కువ ధరలో అందుబాటులో ఉండే జిప్సం, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 50 శాతం, సల్ఫర్ గుళికలు 90 శాతం వాడినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. కాపుకాసే తోటలైతే 500 గ్రాములు, వయస్సును బట్టి 5 నుంచి 10 కేజీల జిప్సం సంవత్సరానికి రెండు సార్లు వేసుకున్నట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ఇతర పండ్ల తోటలకు, కూరగాయల తోటలకు అయితే దుక్కిలో ఎకరానికి నేల స్వభావాన్ని బట్టి 300 నుంచి 500 కేజీల జిప్సంను వాడుకోవచ్చు. -
టైర్ పంక్చర్.. అరటి గెలల వ్యాన్ బోల్తా
ద్వారకాతిరుమల: టైర్ పంక్చరై అరటి గెలల లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడిన ఘటన ద్వారకాతిరుమల మండలంలోని గుణ్ణంపల్లి జాతీయ రహదారిపై, పోలవరం కుడి కాలువ వంతెన వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంనకు చెందిన పులుమంచుల ఆనందం (ఆనందరావు) అరటి గెలల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని తోటల్లో అరటి గెలలను కొనుగోలు చేశాడు. వాటిని నరికేందుకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం, లింగంపర్తికి చెందిన బొలేరో డ్రైవర్ కాకర లోవరాజు, భద్రవరంనకు చెందిన పులుమంచుల ఈశ్వరరావు, లింగంపర్తికి చెందిన కోనా సత్యన్నారాయణ, అనుబోలు రామకృష్ణ (55), గుంప సూర్యనారాయణ(శివ) వ్యాపారి ఆనందంతో కలసి బొలేరో వ్యాన్లో వెళ్లారు. గెలలు నరికి, వ్యాన్లో లోడు చేసుకుని, ఏలేశ్వరం మండలం ఎర్రవరంలోని మార్కెట్కు వెళుతున్నారు. ద్వారకాతిరుమల మండలంలోని గుణ్ణంపల్లి జాతీయ రహదారిపై, పోలవరం కుడి కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి వ్యాన్ వెనుక టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా వ్యాన్లో ఉన్న ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను భీమడోలు, నల్లజర్ల 108 ఆంబులెన్స్లలో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనుబోలు రామకృష్ణ మృతి చెందాడు. మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు అందరూ కాకినాడ జిల్లా వాసులే ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి వద్ద ఘటన -
ప్రభుత్వాసుపత్రి మార్చురీలో కొత్త దందా
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో మృతదేహాలతో అక్రమ వ్యాపారం సాగించిన సిబ్బంది.. తాజాగా మరో వ్యాపారానికి తెరదీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్చు రీలోని ఫ్రీజర్ బాక్సులు పనిచేయటం లేదు. రెండ్రోజుల క్రితం దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన లింగాల పరశురాం విద్యుత్ షాక్తో మృతిచెందాడు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్లో మార్చురీకి తరలించగా ఫ్రీజర్ బాక్సులో పెట్టారు. సాయంత్రానికి మృతదేహం దుర్వాసన రావడంతో బంధువులు నిలదీశారు. మార్చురీ సిబ్బంది వారిపై ఎదురుదాడికి దిగారు. మీకు అవసరమైతే వెళ్ళి ఫ్రీజర్ బాక్సు తెచ్చుకుని పెట్టుకోండి? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇంత జరుగుతున్నా స్పందించని అధికారులు ఏలూరు జీజీహెచ్లో మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ బాక్సులు పనిచేయకపోవటంతో సిబ్బంది కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారంటున్నారు. వారే ప్రైవేటు ఫ్రీజర్ బాక్సులు పురమాయిస్తారు. రోజుకి రూ.3 వేల నుంచి రూ.3,500 చెల్లిస్తే ఫ్రీజర్ బాక్సు తీసుకొచ్చి దానిలో మృతదేహాన్ని భద్రపరుస్తారు. ఇంత జరుగుతున్నా మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందో అర్థం కావడం లేదని పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది ఈ తరహాలో వ్యాపారం చేస్తుంటే అధికారులకు తెలియదా? లేక వారికీ దీనిలో వాటాలు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా అక్రమ వ్యాపారం సాగిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా? అని మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పనిచేయని ఫ్రీజర్ బాక్సులు రూ. 3 వేలు ఇస్తే ఫ్రీజర్ బాక్సు పురమాయింపు -
అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించాలి
ఆన్లైన్లో చాటింగ్.. ఆపై మోసం భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళకు ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి నమ్మించి బాధితురాలి నుంచి దఫాదఫాలుగా రూ.1,60,900లు స్వాహా చేశాడు. 8లో uకలెక్టర్ సి. నాగరాణి భీమవరం(ప్రకాశం చౌక్): అర్జీదారుల సమస్యలను క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి 246 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు క్షుణ్నంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం కాకపోతే మండల స్థాయి అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, కెఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ, వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కె.సి.హెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ పెంపు కోసం కలెక్టరేట్కు వచ్చిన దివ్యాంగుల వద్దకు జాయింట్ కలెక్టర్ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
3.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
భీమవరం: జిల్లాలో 263 రైతు సేవ కేంద్రాల ద్వారా 1.14 కోట్ల గోనె సంచులు రైతులకు పంపిణీ చేశామని జాయింట్ కలెక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి రబీ ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 263 రైతు సేవ కేంద్రాల ద్వారా 3,01,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, నగదు రైతుల ఖాతాలలో 48 గంటల లోగా జమ చేస్తున్నామన్నారు. 1.14 కోట్ల గోనె సంచులు పంపిణీ చేశామన్నారు. రైతుల తమ ఫిర్యాదులపై 81216 76653 నెంబరులో సంప్రదించి పరిష్కరించుకోవచ్చన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం
భీమవరం(ప్రకాశం చౌక్): భూ సమస్య పరిష్కరం కావడం లేదని ఒక వ్యక్తి ఆత్మ హత్యాయత్నం చేసిన ఘటన భీమరం కలెక్టరేట్లో జరిగింది. మొగల్తూరు దయాల్ దాస్ పేటకు చెందిన పాలా వీర వెంకట సత్యనారాయణ (64) కొంతకాలంగా భీమవరంలోని కిషోర్ థియేటర్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. పాలకొల్లు సమీపంలోని కొంతేరులో సత్యనారాయణకు 16 సెంట్ల స్థలం ఉండగా దానిపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో పలుసార్లు కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం కావడం లేదని సోమవారం ఉదయం భీమవరం కలెక్టరేట్ స్పందనకు విషం తాగి వచ్చిన సత్యనారాయణ స్పందన హాల్లో పడిపోయాడు. సత్యనారాయణను పోలీసులు అంబులెన్న్స్లో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సెక్టోరల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం భీమవరం: సమగ్ర శిక్ష భీమవరం జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మే 2 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 79890 02168 నెంబరులో సంప్రదించాలని తెలిపారు. పంపిణీకి సిద్ధంగా పుస్తకాలు భీమవరం: జిల్లాలో నూతన విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, బ్యాగ్, బెల్ట్, షూ, డిక్షనరీలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్, ఎస్ఎస్ఏ సీఎంఓ యండమూరి చంద్రశేఖర్ చెప్పారు. పుస్తకాల పంపిణీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి మండలంలో స్టాక్ పాయింట్కు చేర్చేలా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 8 మండలాలకు పాఠ్యపుస్తకాలు 65 శాతం చేరాయన్నారు. ఒక్కో విద్యార్ధికి మూడు జతల యూనిఫాం, ఒక జత షూ, రెండు జతల సాక్స్లు, బ్యాగ్, బెల్ట్ అందించనున్నట్లు చెప్పారు. గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించాలి భీమవరం: పోలీసుస్టేషన్ల నుంచి వచ్చే ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించి అనంతరం ఆయా పోలీసుస్టేషన్ల అధికారులతో మాట్లాడారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారానికి కృషిచేయనున్నట్లు భరోసా ఇచ్చారు. ద్వారకాతిరుమలలో గణేష్ శర్మకు శిక్షణ ద్వారకాతిరుమల: కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్వారకాతిరుమలలో రుగ్వేదాన్ని అభ్యసించారు. 2009లో వేసవి సెలవుల్లో తిరుపతిలోని మేనమావ ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను ఆదే సమయంలో తిరుపతి వచ్చిన కంచికామకోటి పీఠం శంకరాచార్యస్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు. ద్వారకాతిరుమల దేవస్థానం రుగ్వేద సలక్షణ ఘనాపాటి, సకల జ్ఞాన సంపన్నుడైన రత్నాకర్ శర్మ వద్ద చేర్పించాలని ఆదేశించారు. దాంతో ఆయన రత్నాకర శర్మ ఇంటి వద్ద ఉండి 2009 నుంచి దాదాపు 12 ఏళ్లపాటు వేద విద్యను పట్టుదలతో నేర్చుకున్నారు. ఆయన వద్ద రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణ అరణ్యకం, ఉపనిషత్తులు వంటి వాటిలో నిష్ణాతులయ్యారు. సప్తమంజరి, ధాతురూపావళి, సమస కుసుమావళి వంటి ఎన్నో పుస్తకాలను అవపోసన పట్టారు. 12 ఏళ్ల పాటు ద్వారకాతిరుమలలో శిక్షణ పొందిన గణేష శర్మ కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులవడం పట్ల ఇక్కడ వేద పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చేపల సాగులో కోడి వ్యర్థాలు
కై కలూరు: కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, చనిపోయిన కోడి పిల్లలు, పాడైన కోడిగుడ్లు ఇవి కొల్లేరు ప్రాంతమైన చటాకాయి గ్రామంలో ఫంగస్ చేపలకు వేస్తున్న ఆహారం. వీటిని తిన్న చేపలను మనం తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం. అయినా కొందరు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపల సాగు, 1.10 ఎకరాల్లో రొయ్యల సాగు వెరసి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో 84,852.4 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 30,972 మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో ఫంగసీస్ సాగు సుమారు 8 వేల ఎకరాల్లో జరుగుతుందని అంచనా. ఫంగసిస్ చేపలు వ్యాధులను తట్టుకుని, ఎలాంటి మేతనైన జీర్ణం చేసుకునే గుణం కలిగి ఉంటాయి. దీంతో వీటికి కోడి వ్యర్థాలు ఆహారంగా వేస్తున్నారు. కేరాఫ్గా చటాకాయి: కై కలూరు మండలం చటాకాయి గ్రామం వ్యర్థాల సాగునకు కేరాఫ్గా మారుతోంది. గతంలో నిషేధిత క్యాట్ ఫిష్ సాగుకు అడ్డాగా గ్రామం ఉండేది. అనేక సందర్భాల్లో కోడి వ్యర్థాల వ్యాన్లు పట్టుబడ్డాయి. తాజాగా ఆదివారం రాత్రి గ్రామ పెద్దగా చాలామణి అవుతున్న వ్యక్తి చెరువులో కోడి వ్యర్థాలు విడిచిపెట్టారు. పోలీసులు ఆలస్యంగా రావడంతో అప్పటికే చెరువులో కోడి వ్యర్థాలు చల్లాడు. ఇదే గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో ఫంగసీస్ సాగులో కోడి వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు సమాచారం. మచిలీపట్నం, విజయవాడ నుంచి ఈ వ్యర్థాలు వస్తున్నాయి. హైదరాబాదు, విజయవాడ నుంచి కుళ్ళిన కోడిగుడ్లను ఆమ్లెట్ రూపంలో ట్రేలలో తీసు కొచ్చి వినియోగిస్తున్నారు. కోడి వ్యర్థాలు కేజీ రూ. 15కి విక్రయిస్తోండగా, కోడి గుడ్ల ఆమ్లెట్ కేజీ రూ. 20కి కొనుగోలు చేస్తున్నారు. చేపల మేత ఫిల్లెట్ ధరలు కేజీ రూ.40కి చేరడంతో మేత ధరలను తగ్గించుకోడానికి వ్యర్థాల వైపు మళ్ళుతున్నారు. జీవో 56 అమలులో విఫలం : కోడి వ్యర్థాలు, ఇతర వ్యర్థాలతో చేపల సాగు చేసి పర్యావరణానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో 56ను తీసుకొచ్చింది. వీటిని నియంత్రించడానికి చైర్పర్సన్గా తహసీల్దారు, సభ్యులుగా వీఆర్వో, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్సై, మెంబరు కన్వీనర్గా ఫిషరీస్ డెవలప్మెంటు ఆఫీసర్ను నియమించారు. చటాకాయిలో వ్యర్థాల సాగుపై కై కలూరు రూరల్ ఎస్సైను వివరణ కోరగా వాహనాన్ని సీజ్ చేశామని, లక్ష పూచికత్తుతో తహసీల్దారుకు బైండోవర్ చేశామన్నారు. ఆరోగ్యానికి ముప్పు వ్యర్థాలతో సాగు చేసిన చేపలు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రధానంగా ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తుతాయి. నరాల బలహీనతలు, కడుపునొప్పి, వాంతులతో పాటు ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి. – డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు, సూపరింటెండెంటు, ఏరియా ఆస్పత్రి, కై కలూరు. ఆక్వా రంగానికి చెడ్డ పేరు కొందరు చేసే తప్పు వల్ల మొత్తం ఆక్వా రంగానికి చెడ్డ పేరు వస్తుంది. పలు సమావేశాల్లో వ్యర్థాలతో సాగు చేయవద్దని హెచ్చరిస్తున్నాం. కొందరు పెడచెవిన పెడుతున్నారు. కలెక్టరు, ఎస్పీలకు వ్యర్థాల సాగుపై ఫిర్యాదు చేస్తాం. – నంబూరి వెంకటరామరాజు, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు, తాడినాడ ఆరోగ్యానికి ప్రమాదమంటున్న వైద్యులు చటాకాయి గ్రామంలో ఫంగస్ చేపలకు మేతగా కోడి వ్యర్థాలు జీవో 56 అమలులో అధికారుల విఫలం -
వృద్ధుడిని అనాథగా వదిలేసిన కొడుకు
తణుకు అర్బన్: వృద్ధుడిని అతని కుటుంబ సభ్యులు తణుకు రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లిన ఘటన సోమ వారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన్లో మూలుగుతూ ఇబ్బందిపడుతున్న వృద్ధుడిని ప్రయాణికులు ప్రశ్నించగా.. తన పేరు ముత్యాల పల్లపరాజు అని తణుకు ముత్యాలవారి వీధిలో ఉంటున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధుడిని రైల్వే స్టేషన్లో వదలివెళ్లినట్లుగా రైల్వే పోలీసులు చెప్పారు. వృద్ధుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడని, కాలుపై పుండు పడి దుర్వాసన వస్తుండడంతోపాటు రాత్రి నుంచి ఆహారం కూడా తీసుకోకపోవడంతో బాగా నీరసించిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కుటుంబసభ్యులు వదిలించుకోవాలని చూడడం బాధాకరమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వృద్ధుడి వ్యవహారం వైరల్ కావడంతో చివరకు మధ్యా హ్నం 2 గంటల సమయంలో అతని కుమారుడు వచ్చి తీసుకువెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. -
సీహెచ్ఓల నిరసన గళం
భీమవరం(ప్రకాశం చౌక్): గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న విలేజ్ క్లినిక్ సీహెచ్ఓలు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలోని 364 మంది సీహెచ్ఓలు కలెక్టరేట్ ముందు టెంట్ వేసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారి సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గత 6 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతాలు పెంచడం లేదని, ఉద్యోగ భద్రత లేదని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీహెచ్ఓలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్గ్రేషియా కూడా చెల్లించడం ఆవేదన వెలిబుచ్చారు. ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాకహాలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పుననుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. క్లినిక్ అద్దె బకాయిలు చెల్లించాలని, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు అమలు చేయాలని కోరుతున్నారు. -
కేసులు పెట్టినా.. తగ్గేదేలే
సాక్షి, భీమవరం: మద్యం బెల్టు షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. షరామామూలే అన్నట్టు నిర్వాహకుల తీరుంది. గత ఐదు నెలల్లో బెల్టు విక్రయాలుపై జిల్లాలో 356 కేసులు నమోదు చేసిన ఎకై ్సజ్శాఖ 715 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. అయినా తగ్గేదే లేదన్నట్టుగా జిల్లాలోని సిండికేట్ వర్గాలు గుట్టుచప్పుడు కాకుండా బెల్టు అమ్మకాలు సాగిస్తున్నాయి. జిల్లాలో 193 మద్యం దుకాణాలకు సుమారు 71 షాపులు పట్టణ ప్రాంతాల్లో, పంచాయతీల పరిధిలో మిగిలిన 122 షాపులు ఏర్పాటుచేశారు. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్ సిండికేట్లు బెల్టులు పెట్టి అమ్మకాలు చేయిస్తున్నారు. ఒక్కో లైసెన్స్డ్ షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు ఉన్నట్టు సమాచారం. తీరప్రాంతం, మెట్ట గ్రామాల్లో కొన్ని చోట్ల వేలం పాటల ద్వారా బెల్టులు అప్పగించారు. మొగల్తూరు మండలానికి చెందిన కూటమి నాయకుడు బెల్టు షాపు కోసం బేరసారాలు సాగించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. కొన్ని చోట్ల రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్లు చెల్లించిన వారికి, కూటమి కార్యకర్తలకు బెల్టులు అప్పగించారు. చిన్న చిన్న దుకాణాలు, కిళ్లీ బడ్డీల్లో బాటిళ్లు ఉంచి క్వార్టర్, బీర్ బాటిల్పై అదనంగా రూ.30 నుంచి రూ.40 వరకు అమ్మకాలు చేస్తున్నారు. కొందరు నిర్వాహకులు వాహనాల్లో మద్యం బాటిల్స్ పెట్టుకుని మందుబాబుల చెంతకు చేరవేస్తూ మొబైల్ సర్వీస్ అందిస్తున్నారు. 358 మందిపై కేసులు కూటమి ప్రభుత్వం మద్యాన్ని ప్రైవేట్ పరం చేసిన నాటి నుంచి ఆరు నెలల్లో బెల్టు అమ్మకాలపై జిల్లాలో 356 కేసులు నమోదుచేసిన ఎకై ్సజ్ అధికారులు 358 మందిని అరెస్టు చేసి 715 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా తాడేపల్లిగూడెం స్టేషన్ పరిధిలో 85 కేసులు నమోదు కాగా నరసాపురం పరిధిలో 70 నమోదయ్యాయి. తక్కువగా ఆకివీడు పరిధిలో 40 కేసులు నమోదయ్యాయి. పదికి పైగా బాటిళ్లతో దొరికితే కోర్టులో హాజరుపర్చాలి. పది బాటిల్స్ లోపు ఉంటే సెక్షన్ 34 (ఏ) కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయవచ్చని న్యాయవాది ఒకరు తెలిపారు. ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా పడే అవకాశముందని, అయితే నేరం రుజువై శిక్ష పడిన ఘటనలు చాలా అరుదని చెబుతున్నారు. బెల్టులు లేకుండా చేస్తున్నామని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎకై ్సజ్ అధికారులతో తూతూమంత్రంగా సెక్షన్ 34 (ఏ) కేసులతో తంతు నడిపిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెల్టు అమ్మకాలు చేస్తే ఉపేక్షించేది లేదని, నిబంధనల మేరకు దాడులు నిర్వహించి బెల్టు అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. బెల్టు షాపులపై నమోదైన కేసుల వివరాలు ఎకై ్సజ్ స్టేషన్ కేసులు పట్టుబడిన స్వాధీనం వారు చేసుకున్న మద్యం (లీటర్లలో) ఆకివీడు 40 40 59.94 భీమవరం 55 56 246.24 నర్సాపురం 70 70 102.42 పాలకొల్లు 43 43 53.64 తాడేపల్లిగూడెం 85 85 160.06 తణుకు 63 64 93.10 బెల్టు షాపులపై 358 కేసులు 715 లీటర్ల మద్యం స్వాధీనం అయినా షరామామూలుగానే బెల్టు అమ్మకాలు స్టేషన్ బెయిలిచ్చి పంపేస్తున్న అధికారులు మాటలకే పరిమితం ఎమ్మార్పీకి మించి అమ్మకాలు చేసినా, బెల్టులు ఏర్పాటు చేసినా మొదటిసారి రూ. 5 లక్షల జరిమానా విధించాలని, రెండోసారి తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దుచేయాలని ఇటీవల ఒక సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ హెచ్చరికలను సిండికేట్ వర్గాలు సీరియస్గా తీసుకున్నట్టు లేదు. జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం తదితర చోట్ల పలు దుకాణాల్లో బాటిల్పై రూ.10 అదనంగా విక్రయిస్తున్నారు. పర్మిట్ రూంల మాదిరి సదుపాయాలతో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నా సీఎం ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. -
రెడ్క్రాస్కు గోల్డ్ మెడల్
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో త్వరలో తలసేమియా పిల్లలకు సెంటర్ ఏర్పాటు చేసి చికిత్స ప్రారంభించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ అందించిన మెరుగైన సేవలకు గుర్తింపుగా 2024–25 సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్కు ఎంపికై ందన్నారు. దీనికి కృషి చేసిన జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది అభినందనీయులన్నారు. మే 8న రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. మే 28న భీమవరం రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో తలసేమియా పిల్లలకు సెంటర్ ఏర్పాటును గవర్నర్ ప్రకటించనున్నట్లు తెలిపారు. -
ఆన్లైన్లో చాటింగ్.. ఆపై మోసం
ఏలూరు (టూటౌన్): భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆన్లైన్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. భీమడోలు మండలం, ఆగడాలలంక గ్రామానికి చెందిన బలే శైలజ (26)కు ఈలో–ఈలో ఆన్లైన్ యాప్ ద్వారా రాజు యాదవ్ అనే పేరుతో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నని చెప్పి నమ్మించాడు. బాధితురాలి సమస్యలను తెలుసుకొని ప్రైవేట్ బ్యాంక్లలో లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు. లోన్ ప్రొసెసింగ్ ఫీజ్ చెల్లించాలని చెప్పి దఫాదఫాలుగా సుమారు రూ.1,60,900 ఫోన్ పే ద్వారా వసూలు చేశాడు. ఎన్ని రోజులైనా లోన్ రాకపోవడంతో ఆమె నాగరాజును నిలదీయగా నీ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె భీమడోలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు కడప జిల్లా వేములకు చెందిన నారుబోయిన రాజశేఖర్ అలియాస్ రాజుయాదవ్ను గుండుగొలను గ్రామ శివారు పోతునూరు రోడ్డులోని వాటర్ కల్వర్ట్ వద్ద అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు లాప్టాప్లను సీజ్ చేశారు. కేసును ఛేదించిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్, హెచ్సీలు ఎస్కేఎస్ బాజీ, ఎస్.శ్రీనివాస్, పీసీ ఎం.వెంకటేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు. కేసును ఛేదించిన భీమడోలు పోలీసులు -
బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరి
నూజివీడు: ట్రిపుల్ఐటీ.. ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే విద్యాసంస్థ. అయితే ఇందులో పనిచేసే బోధనా సిబ్బందికి బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరిపోతోంది. ట్రిపుల్ ఐటీలో పర్మినెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు, ఐటీ మెంటార్లు పీయూసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. వీరిలో కొందరికి పలు అదనపు బాధ్యతలను అప్పగించారు. తెలుగు డిపార్ట్మెంట్కు చెందిన ఏకంగా ముగ్గురికి అదనపు బాధ్యతలను అప్పగించడంతో వారు నిత్యం అదనపు బాధ్యతల్లోనే మునిగి తేలుతున్నారు. క్యాంపస్ మెయింట్నెన్స్ ఇన్చార్జిగా తెలుగు మెంటార్ ఓ శ్రీహరికి అప్పగించారు. ఈయన సెక్యూరిటీ, హౌస్కీపింగ్, గార్డెనింగ్, గెస్ట్హౌస్ల మెయింట్నెన్స్ను చూసుకుంటున్నారు. మూడు షిఫ్టులలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది విషయాలతో పాటు హౌస్కీపింగ్, గార్డెనింగ్ సిబ్బంది వ్యవహారాలు చూసుకోవడంతోనే ఉన్న సమయం కాస్తా సరిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే తెలుగు సబ్జెక్టు బోధించే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో జడ సీతాపతికి డీన్ స్టూడెంట్ వెల్ఫేర్(బాలుర) బాధ్యతలను, పీ లక్ష్మణరావుకు బాలుర చీఫ్ వార్డెన్ బాధ్యతలను అప్పగించారు. ఇలా ఒకే సబ్జెక్టుకు చెందిన ముగ్గురు బోధన సిబ్బందిని అదనపు బాధ్యతల్లో నియమిస్తే ఆ సబ్జెక్టులో విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫైనాన్స్ ఆఫీసర్గా ఏడాదికో ఫ్యాకల్టీ ట్రిపుల్ఈ విద్యార్థులకు పాఠాలు బోధించే శ్రీనాథ్కు ఫైనాన్స్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పగించారు. ఫైనాన్స్ ఆఫీసర్గా ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఏడీ స్థాయి అధికారిని డిప్యూటేషన్పై నియమించుకోవాలని ట్రిపుల్ ఐటీకి సంబంధించిన యాక్ట్–18లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అదేమీ పాటించకుండా ఏడాదికొక ఫ్యాకల్టీని ఫైనాన్స్ ఆఫీసర్గా నియమిస్తున్నారు. సెంట్రల్ డీన్, సెంట్రల్ ఏఓ, ఏఓ, ప్లేస్మెంట్ ఆఫీసర్ అంటూ కొందరిని నియమించారు. మరికొందరికి మెస్ల ఇన్చార్జిలుగాను బాలికల హాస్టళ్లకు చీఫ్ వార్డెన్గా బాధ్యతలు అప్పగించారు. ఇలా అత్యధిక మంది నిరంతరం అదనపు బాధ్యతల్లోనే మునిగి తేలుతుండటంతో బోధన కొంతమేరకు కుంటుపడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదనపు బాధ్యతలు ఉన్న కొందరు వీటిని సాకుగా చూపించి పరీక్షల సమయంలో ఇన్విజిలేషన్ను సైతం తప్పించుకుంటున్నారు. మరికొందరైతే డబ్బులు వచ్చే సెమిస్టర్ పరీక్షలకు ఇన్విజిలేషన్ వేయించుకుంటూ డబ్బులు రాని మిడ్ పరీక్షల ఇన్విజిలేషన్కు దూరంగా ఉంటున్నారు. కొన్ని బ్రాంచిలకు ఫ్యాకల్టీ తక్కువ మెకానికల్ బ్రాంచికి సంబంధించి నాలుగు సంవత్సరాలకు సంబంధంచి 240 మంది విద్యార్థులకు 11 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచిలకు 1,440 మంది చొప్పున విద్యార్థులండగా సీఎస్ఈకి 20 మంది, ఈసీఈకి 15 మంది మాత్రమే ఫ్యాకల్టీ ఉన్నారు. కెమికల్కు 240 మందికి ఏడుగురు, ట్రిపుల్ ఈ కి 480 మందికి 14 మంది, సివిల్కు 240 మందికి 13 మంది, మెటలర్జీకి 240 మందికి ఐదుగురు ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు. దీంతో కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా పనిభారం ఉండటం జరుగుతోంది. వీటన్నింటిని సరిదిద్ది విద్యార్థులకు మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం ట్రిపుల్ ఐటీ వర్గాల్లోనే వినిపిస్తోంది. తెలుగు డిపార్ట్మెంట్లోనే ముగ్గురికి అదనపు బాధ్యతలు ఫ్యాకల్టీల్లో కొందరికి ఎక్కువ పనిభారం ట్రిపుల్ ఐటీలో కుంటుపడుతున్న బోధన -
ముక్తికి మార్గం.. నత్తా రామేశ్వరుడి దర్శనం
పెనుమంట్ర: నత్తారామేశ్వరం గ్రామంలోని గోస్తనీ నదిలో వేంచేసియున్న పరశురామ ప్రతిష్ఠ శ్రీసప్త రామ కోటిలింగేశ్వరుడు సోమవారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన నత్తారామేశ్వరం గ్రామంలో శ్రీఉమా రామలింగేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడు, సప్త రామ కోటి లింగేశ్వరులను ఒకే సమయంలో దర్శించుకునే అవకాశం ఒక్క వైశాఖమాసంలోనే భక్తులకు దక్కుతుంది. రామేశ్వర క్షేత్రంలో సీతారాములు, లక్ష్మణుడు, పరశురాముడు, స్వయంగా శివలింగాలను ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఏడాదిలో 365 రోజులు ఉమా రామలింగేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడులను దర్శించుకునే అవకాశం ఉన్నా.. నీటిలో ఉండే పరశురామ ప్రతిష్ఠ రామలింగేశ్వరుని దర్శించుకునే అవకాశం కేవలం 30 రోజులు మాత్రమే ఉంటుంది. వైశాఖ మాసం ప్రారంభకావడంతో సోమవారం దేవాదాయశాఖ కోనేరులోని నీటిని పూర్తిగా తొలగించి స్వామిని భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో సోమవారం జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సప్తరామ కోటేశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తులకు దాతలు అన్నసమారాధనతోపాటు చక్రపొంగలి, పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈసందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి బారులు తీరి త్రిలింగాలను దర్శించుకున్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన సప్తకోటి రామలింగేశ్వరుడి దర్శనం ఏడాదిలో వైశాఖ మాసంలోనే స్వామివారి దివ్య దర్శనం బారులు దీరి త్రిలింగాలను దర్శించుకున్న భక్తులు -
‘(అ) సత్యం’ నాటికకు మొదటి బహుమతి
భీమవరం: చైతన్య భారతి సంగీత, నృత నాటక పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో నిర్వహించిన 18వ జాతీయస్థాయి నాటికల పోటీల్లో చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారి ‘(అ) సత్యం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ప్రథమ బహుమతిని గెల్చుకుంది. విజేతల వివరాలను సోమవారం నాటిక న్యాయనిర్ణేతలు మానాపురం సత్యనారాయణ, ఎల్ రుద్రమూర్తి, సుసుము నాగ భూషణం వెల్లడించారు. సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ‘జనరల్ భోగీలు’ ద్వితీయ బహుమతి, యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి ‘నా శత్రువు’ తృతీయ బహుమతిని గెల్చుకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి ‘చిగురు మేఘం’, ఉత్తమ రచనగా ‘నా శత్రువు’, ఉత్తమ దర్శకత్వం బాలాజీ నాయక్ ((అ) సత్యం), ఉత్తమ నటుడు కావూరి సత్యనారాయణ (చెన్నయ్య పాత్రధారి – చిగురు మేఘం), ఉత్తమ నటి సురభి ప్రభావతి (సావిత్రమ్మ పాత్రధారిణి – జనరల్ భోగీలు), ఉత్తమ విలన్గా గోపరాజు విజయ్ (సీఐ పాత్రధారి – జనరల్ భోగీలు), ఉత్తమ హాస్యనటుడు పి కోటేశ్వరరావు (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ బాల నటుడు యశ్విత (నా శత్రువు), ద్వితీయ ఉత్తమ నటుడు చెరుకూరి సాంబశివరావు (కిడ్నాప్), ద్వితీయ ఉత్తమ నటి జ్యోతిరాణి (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గంగోత్రి సాయి (విడాకులు కావాలి) ఎం రత్నకుమారి (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ రంగాలంకరణ పీవీ కుమార్ (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ సంగీతం లీలమోహన్ (అ సత్యం), ఉత్తమ మేకప్ థామస్ (ఉక్కు సంకెళ్ళు), జ్యూరీ బహుమతి చిగురు మేఘం, ఇది రహదారి కాదు నాటికలు గెల్చుకున్నాయి. విజేతలకు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్కుమార్రాజు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నాడ శ్రీనివాస్, కృత్తివెంటి సత్యకుమార్ తదితరులు బహుమతులు అందజేశారు. -
శ్రీవారి దేవస్థానం కాంట్రాక్ట్ సిబ్బంది నిర్వాకం
దేవస్థానం హైస్కూల్ గ్రౌండ్లో మద్యం సేవించిన ట్రాక్టర్ డ్రైవర్, స్కావెంజర్ ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం హైస్కూల్ గ్రౌండ్లో ఇద్దరు ఆలయ కాంట్రాక్ట్ ఉద్యోగులు సోమవారం మద్యం సేవించడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తోంది. కాంట్రాక్ట్ తరుఫున పనిచేస్తున్న ఒక ట్రాక్టర్ డ్రైవర్, మరో స్కావెంజర్ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్థానిక హైస్కూల్ గ్రౌండ్లోని స్టేజీపై కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పారిశుద్ధ్య పనులకు వినియోగించే ట్రాక్టర్ను సైతం గ్రౌండ్లో వారి వద్దే పెట్టుకున్నారు. మధాహ్నం 3 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉండగా, ఇప్పుడు మద్యం సేవిస్తున్నారేమిటని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు, వేసవికాలం కావడంతో సాయంత్రం 4 గంటలకు విధులకు వెళ్తామని ట్రాక్టర్ డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. అయినా పాఠశాల గ్రౌండ్లో తాగడం ఏమిటని అడిగితే గ్రౌండ్లో ఉన్న ఖాళీ మద్యం బాటిళ్లను చూపించి, ఇవన్నీ అవే కదా అని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బెల్లం అమ్మిన కేసులో రూ.25 వేల జరిమానా కామవరపుకోట: నాటు సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మిన కేసులో ఒక వ్యక్తికి రూ. 25 వేల జరిమానా విధించినట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈస్ట్ యడవల్లికి చెందిన శ్రీ సాయి రంగ ప్రకాష్ గ్రామంలో నాటు సారాయి తయారు చేసే వారికి బెల్లం సరఫరా చేసిన కేసులో తహసీల్దార్ జి.ఎలిసా జరిమానా విధించినట్లు తెలిపారు. -
దాడి కేసులో ఆరుగురిపై కేసు నమోదు
భీమవరం: రెస్టారెంట్లోని ఆహారం బాగాలేదని వంటమనిషిపై దాడిచేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఏఎస్సై నర్సింహస్వామి సోమవారం చెప్పారు. పట్టణంలోని అజయ్ బార్ అండ్ రెస్టారెంట్కు పట్టణానికే చెందిన సుధీర్, మరో అయిదుగురు వెళ్లారు. అక్కడ ఆహారం బాగాలేదని వంట మనిషి ప్రకాష్పై బీరుబాటిల్ పగులగొట్టి దాడిచేశారు. దీనిపై బార్ అండ్ రెస్టారెంట్ సూపర్వైజర్ దారపురెడ్డి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై నర్సింహస్వామి చెప్పారు. ట్రిపుల్ ఐటీలో మెస్లనిర్వహణపై అభిప్రాయ సేకరణ నూజివీడు: ట్రిపుల్ఐ టీలోని మెస్ల నిర్వహణపై సోమవారం అధికారులు విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. తహసీల్దార్ బీవీ సుబ్బారావు తన సిబ్బందితో వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. మెస్లలో భోజనం ఎలా ఉంది, డైనింగ్ హాల్, కిచెన్లలో శుభ్రత తదితర విషయాలపై అభిప్రాయాన్ని తెలపమని విద్యార్థులకు ప్రింటెండ్ పత్రాలు అందించారు. వాటిల్లో విద్యార్థులు వారి అభిప్రాయాన్ని తెలిపారు. అభిప్రాయ సేకరణను సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ పరిశీలించారు. భోజనం ఎలా ఉందంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పెట్టే భోజనం శుచిగా, రుచిగా ఉండాలన్నారు. ట్రిపుల్ ఐటీ అధికారులు నిరంతరం మెస్లను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు ముదినేపల్లి రూరల్: మండలంలోని పేరూరులో స్థానిక సమస్యలపై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దళితులను కులం పేరుతో దూషించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సేవా నాగజగన్బాబురావు స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన మురళీ, అతని తల్లి ఆ గ్రామంలోని సమస్యలకు సంబంధించి దళితులకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ పెద్దల సమక్షంలో దళితులను కులం పేరుతో దూషించి కించపరిచారంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో దళిత నాయకులు గరికిముక్కుల రాజేష్, భూపతి సునీత, తదితరులున్నారు. మ్యాజిక్ ఫెస్టివల్లో మెరిసిన లేడీ మెజీషియన్ లక్ష్మీప్రసన్న తణుకు అర్బన్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈనెల 27వ తేదీన నిర్వహించిన పల్నాడు మ్యాజిక్ ఫెస్టివల్లో తణుకుకు చెందిన లేడీ మెజీషియన్ దండా లక్ష్మీప్రసన్న తృతీయ స్థానంలో నిలిచారు. దేశం నలుమూలల నుంచి 250 మందికిపైగా హాజరైన ఈ ఫెస్టివల్లో తృతీయ స్థానంలో నిలవడం చాలా సంతృప్తినిచ్చిందని ప్రసన్న తెలిపారు. ఈ ఫెస్టివల్తో వరుసగా మూడేళ్లపాటు మెజీషియన్ ఫెస్టివల్స్లో విజయం సాధించి హాట్రిక్గా నిలిచినట్లు వివరించారు. 2023లో అమరావతి జరిగిన మ్యాజిక్ ఫెస్టివల్లో స్టేట్ ఫస్ట్గాను, 2024లో ఉత్తరప్రదేశ్లో ఆగ్రా తాజ్ మ్యాజిక్ ఫెస్టివల్లో జాతీయస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఫెస్టివల్ నిర్వాహకులు జీవీఆర్, పల్నాడు ఫెస్టివల్ అధ్యక్షుడు బాబునాయుడు, కార్యదర్శి నాగరాజు, గురువు దండా రాములకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఉత్తమ ప్రదర్శనగా ‘స్వేచ్ఛ’ నాటిక
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని శ్రీ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ప్రదర్శితమైన 43వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల్లో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక ఉత్తమ ప్రదర్శనగా మొదటి బహుమతి గెలుచుకుంది. విజేతలకు యూత్ కమిటీ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పాలకొల్లు చాంబర్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ చేగొండి సత్యనారాయణమూర్తి బహుమతులు అందజేశారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్–కొలకులూరు వారి జనరల్ భోగీలు నిలువగా, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నటీ నట సమాక్య–పాలకొల్లు వారి అనూహ్యం నాటిక నిలిచింది. జ్యూరీ విభాగంలో కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారి ద్వారబంధాల చంద్రయ్యనాయుడు నాటిక నిలిచింది. ఈ పోటీలకు కొంతేటి సర్వేశలింగం, గంటా రామమోహనరావు, కొడమంచిలి సత్యప్రసాద్ గుణ నిర్ణేతలుగా వ్యవహరించారు. నిద్రమత్తులో డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి పాలకోడేరు: నిద్ర మత్తులో డాబాపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మోగల్లులో జరిగింది. పాలకోడేరు ఎస్సై ఎం.రవి వర్మ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు నాగేశ్వరరావు (45) ఆదివారం రాత్రి ఎప్పటిలాగానే డాబాపై నిద్రించాడు. మూత్ర విసర్జన నిమిత్తం వేకువజామున కిందికి దిగే క్రమంలో పైనుంచి జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవివర్మ చెప్పారు. -
అటవీ శాఖ నిర్లక్ష్యం.. అన్నదాత ఆక్రోశం
నిడమర్రు: అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కోత కు సిద్ధంగా ఉన్న ఏడెకరాల వరి పంట నీటి పాలైన సంఘటన పెదనిండ్రకొలనులో చోటుచేసుకుంది. రైతులు, అధికారుల వివరాల ప్రకారం.. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అన్సర్వే భూముల్లో అనధికారంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారంటూ అటవీ శాఖ అధికారులు శనివారం 17 ఎకరాల చేప ల చెరువుకు గండి కొట్టారు. దీంతో చెరువు నీరు పంట కాలువలు, బోదెల్లో నీరు ఎగదన్నడంతో సరి హద్దుల్లోని వరి చేలు ఆదివారం ముంపు బారిన ప డ్డాయి. కౌలు రైతు చెన్నుబోయిన వెంకన్నకు చెందిన ఏడెకరాల వరి చేను పూర్తిగా నీటమునిగి సు మారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేశామని బాధిత రైతు వాపోయాడు. సమాచారం ఇవ్వకుండా.. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమ చేపల సా గు చేస్తున్న వారికి, అటవీ శాఖ సిబ్బందికి మధ్య ఇటీవల వ్యవహారం చెడింది. దీంతో పట్టుబడికి వచ్చిన చెరువులను గండి కొడతామని క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బందులు పెడుతూ సొమ్ములు వసూ లు చేస్తున్నారని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నిడమర్రు కొల్లేరు పాయలో అన్సర్వే, జిరాయి తీ భూముల లెక్కలు తేల్చాలని రైతులు సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 29న సర్వేకు సిద్ధమవుతున్నట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేష్, వ్యవసాయ శాఖ సి బ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అటవీ శాఖ అధికారులు ఓ చెరువుకు గండి కొట్టారు. దీ నిపై అటవీ శాఖ డీఎఫ్ఓ డి.విజయను వివరణ కో రగా పూర్తి వివరాలు తెలియదని, తమ సిబ్బందిని విచారణకు ఆదేశించానని, నివేదిక అనంతరం ఉ న్నతాధికారులకు తెలుపుతామని సమాధానమిచ్చారు. పరిహారంపై సందిగ్ధం గండి విషయంలో తమకు సమాచారం లేదని, ఉంటే పంటను ఒబ్బిడి చేసుకోవాలని రైతును అప్రమ త్తం చేసేవారమని మండల వ్యవసాయ అధికారి పి.గీతాదేవి అన్నారు. ఈ–క్రాప్లో పంట నమోదు చేశామని, నష్టం విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ముంపు చేనును ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు. కొల్లేరులో అక్రమ చెరువుకు గండి నీరు ఎగదన్ని సమీపంలోనిఏడు ఎకరాల వరి పంట మునక లబోదిబోమంటున్న రైతు మా గోడు వినలేదు ఒక్క రోజు సమయం ఇవ్వండి కోత యంత్రంతో పంటను ఒబ్బిడి చేసుకుంటామని చెప్పి నా అధికారులు వినలేదు. చెరువుకు గండి కొట్టారు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 60 బస్తాల వరకూ పండింది. ఆదివారం కోతకు సిద్ధ మయ్యాం. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో మా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. –బోరున విలపిస్తున్న చెన్నుబోని వెంకన్న, సుబ్బాయమ్మ దంపతులుఅధికారులను వేడుకున్నా.. మా భూముల లెక్కల తేల్చాలని సర్వేకు నెల రోజుల క్రితమే ఆయ కట్టు జిరాయితీ రైతులంతా దరఖాస్తు చేసుకున్నాం. గండి కొట్టడానికి వచ్చిన అధికారులకు సర్వే అనంతరం అన్సర్వే, జిరాయితీ విడదీసిన తర్వాత గండి కొట్టాలని వేడుకున్నా అటవీ శాఖ సిబ్బంది వినలేదు. – వగ్వాల సుబ్బారావు, జిరాయితీ భూమి రైతు, నిడమర్రుమరోసారి కూటమి మోసం కొల్లేరును 3వ కాంటూరుకి కుదిస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు అభయా రణ్యం పరిధిలో జిరాయితీ పట్టా భూములన్న వారిపైకి అధికారులను పంపి వేధిస్తున్నారు. ఇలా మరోమారు చంద్రబాబు సర్కారు కొల్లేరు రైతులను మోసం చేసింది. కౌలు రైతు వెంకన్నకు నష్టపరిహారం ఇవ్వాలి. –కోడే కాశి, జెడ్పీటీసీ, నిడమర్రు -
ఇళ్ల కూల్చివేతపై నిరసన సెగలు
పాలకోడేరు: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీలు నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆరు నెలల నుంచి పేదల ఇళ్ల కూల్చివేత సాగుతోందన్నారు. కాలుష్యం పేరు చెప్పి పేదలపై విధ్వంసం సష్టించడం సబబు కాదన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు కూల్చివేయడం అన్యాయమన్నారు. జిల్లాలో నీటి కాలుష్యానికి గల కారణాలను ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు పరిశీలించాలన్నారు. నిపుణులతో అధ్యయన కమిటీ వేసి నాలుగు మండలాల్లో అధ్యయనం చేయాలన్నారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమనడం అన్యాయమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రఘురామ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఉండి: పేదల ఇళ్లు జల కాలుష్యానికి కారణం అవుతున్నాయని ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఉండి సెంటర్లో గోపాలన్ మాట్లాడుతూ కాలుష్యంపై నిర్ధారణ జరగకుండా సొంత నిర్ణయాలు తీసుకుని బడాబాబులకు మే లు జరిగేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెద్దల బాగు కోసం పేదలపై పగ సాధించడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పుడు పనికిరావని చెప్పడం దా రుణంగా ఉందని మండిపడ్డారు. ధనికొండ శ్రీనివాస్, చీర్ల శేషు తదితరులు పాల్గొన్నారు. -
సొంత భవనం సమకూరేదెప్పుడో?
భీమవరం (ప్రకాశం చౌక్) : నూతన పశ్చిమగోదా వరి జిల్లా కలెక్టరేట్కు సొంత భవనం సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. జిల్లా ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా అద్దె భవనంలోనే కలెక్టరేట్ సాగుతోంది. సొంత భవనం ఏర్పాటుకు మార్కెట్ యార్డ్ ప్రాంతం అనుకూలంగా ఉ న్నా అడుగు ముందుకు వేయడం లేదు. ఇటీవల తణుకు, పెనుగొండలో పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టరేట్ భవనం మాటెత్తలేదు. అలాగే ఉన్నతాధికారులతో కనీసం సమీక్ష కూడా జరపలేదు. గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాల పునర్విభజనలో భా గంగా పశ్చిమగోదావరి జిల్లాను పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలుగా ఏర్పాటుచేశారు. భీమవరంలో కలెక్టరేట్ను అద్దె భవనంలో ఏర్పాటుచేసినా సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. భీమవరం మార్కెట్ యార్డ్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం జీఓ కూడా జారీ చేశారు. దీంతో అప్పటి కలెక్టర్ ప్రశాంతి ఈ దిశగా చర్యలు కూడా తీసుకున్నారు. ప్రభుత్వం మారడంతో.. మార్కెట్ యార్డ్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో సా ర్వత్రిక ఎన్నికలు వచ్చాయి. తర్వాత కూటమి ప్ర భుత్వం అధికారం చేపట్టడంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అంశం అటకెక్కింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ అమలును పట్టించుకోలేదు. సొంత భవన నిర్మాణంపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్కెట్ యార్డ్ అనుకూలం భీమవరం మార్కెట్ యార్డ్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏర్పాటు చేయడం అనుకూలంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. దీనిద్వారా పట్టణంలో ట్రా ఫిక్ సమస్య తగ్గుతుందని, ఉండి, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు ప్రాంత ప్రజల రాకపోకలకు వీ లుందని చెబుతున్నారు. ధర్నాలు, నిరసనల సమయంలోనూ పట్టణంలో ఇబ్బందులు తలెత్తవని అంటున్నారు. అలాగే ఎక్కువగా రోడ్ల నిర్మాణం అవసరం ఉండదని చెబుతున్నారు. కలెక్టరేట్ ఏర్పడి మూడేళ్లు అద్దె భవనంలోనే నిర్వహణ సొంత భవన నిర్మాణంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు చర్యలు మార్కెట్ యార్డ్లో మేలు భీమవరం మార్కెట్ యార్డ్ లో కలెక్టరేట్ ఏర్పాటు చే యడం అన్నింటికీ అనుకూలం. ఇప్పటికే అక్కడ స్థలం ఉండటం వల్ల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తవుతాయి. ప్రజలకు రోడ్డు, రైలు మార్గాలు కూడా ఉండటంతో రాకపోకలు సులభం. – చిగురుపాటి సందీప్, భీమవరం ప్రయాణ ఇక్కట్లు లేకుండా.. మార్కెట్ యార్డ్లో కలెక్టరేట్ కు సొంత భవనం ఏర్పాటు తో ప్రయాణ ఇక్కట్లు ఉండ వు. ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు నుంచి బస్సులు, ఆటోల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్కు వెళ్లేందుకు మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. – వి.శ్రీను, వీరవాసరం -
ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్షలు
ఏలూరు (టూటౌన్) : మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి (2025–26) ఆదివారం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వీ నాగరాణి తెలిపారు. ఏలూరు బాలికల గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏలూరులో పాఠశాలలో 80 సీట్లకు 147 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేయగా 116 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లా సమన్వ యకర్త, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్ లక్ష్మి ఉన్నారు. పాలిసెట్కు పటిష్ట ఏర్పాట్లు పెంటపాడు: జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ఈనెల 30న జరిగే పాలిసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి.ఫణీంద్రప్రసాద్ ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిగూడెం, తణు కు, భీమవరం, నరసాపురంలో కేంద్రాలు ఏ ర్పాటుచేశామని, 7,254 మంది పరీక్షలకు హా జరుకానున్నారన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పరీక్షకు గంట ముందు హాజరుకావాలన్నారు. హాల్టికెట్ రాని వారు పరీక్షా కేంద్రానికి వెళ్లి పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 9121602009, 9490104336 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆప్కాస్ రద్దు యోచన తగదు ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని, ఆప్కాస్ రద్దు ఆ లోచన విరమించుకుని, ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డి మాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఏ లూరులో జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు కోరుతూ మే 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు బి.బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఎ.జానుబాబు, జంగారెడ్డిగూడెం నగర అధ్యక్షుడు ఆర్.నాగరాజు, నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జయలక్ష్మి ఉంగుటూరు: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉంగుటూరుకి చెందిన మంద జయలక్ష్మి నియమితులయ్యారు. ఆమె మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా, జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర పదవి వరించింది. మండల నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తనకు రాష్ట్ర పదవి కేటాయించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సహకరించిన మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబా బుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి నిరంతం కృషి చేస్తానని, మహిళల్లో చైత న్యం తీసుకువస్తానని జయలక్ష్మి అన్నారు. ఏలూరు రైల్వేస్టేషన్లో తనిఖీలు ఏలూరు టౌన్ : అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు, ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు, పవర్పేట స్టేషన్లలో రైల్వే ఎస్సై పి.సైమన్ ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఏలూరు స్టేషన్లోని ప్లాట్ ఫామ్స్, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్ కేంద్రాల్లో ముమ్మరంగా సోదాలు చేశారు. ఆర్పీఎఫ్, రైల్వే పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రైల్వేస్ డీఎస్పీ జి.రత్నరాజు, సీఐ ఎంవీ దుర్గారావు సిబ్బందికి సూచించారు. అనుమానిత వ్యక్తులపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఆదేశించారు. -
పేదల ఇళ్లు కూల్చడమే అభివృద్ధా?
కాళ్ల: పేదల ఇళ్లు కూల్చడమే కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధా అని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నర్సింహరాజు ప్రశ్నించా రు. మండలంలోని పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏర్పడేది ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకే కానీ ఇబ్బందులకు గురిచేసేందుకు కాదన్నారు. ఉండి నియోజకవర్గంలో కొంతకాలంగా ఇళ్లను తొలగిస్తున్నారని, దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఆక్రమణలో ఉన్న ఇళ్లు ఇబ్బందికరంగా ఉంటే నివాసితులకు సమయం ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించి తొలగించాలి తప్ప దుర్మార్గంగా ఇళ్లను కూలగొట్టడం సరికాదన్నారు. ఇళ్ల తొలగింపుతో రోడ్డున పడి ఇబ్బందులు పడుతున్న బాధితులను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధితులు నానా కష్టాలు పడుతున్నా గ్రామ, మండల స్థాయి, కనీసం జిల్లా అధికారులు కూడా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో గ్రామాలు ఏర్పడ్డాయని, గృహ నిర్మాణాలకు సాయం కూడా చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ సుఖసంతోషాలతో ఉండేవారని గుర్తుచేశారు. అయితే కూటమి పాలనలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పులపాలవుతున్నారని పీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త పీవీఎల్ -
ఆశల పల్లకీలో కొల్లేరు
●● హద్దులను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశం ● ప్రభుత్వమే అఫిడవిట్ వేయాలని కొల్లేరు ప్రజల డిమాండ్ ● కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేనా? ● అత్యున్నత న్యాయస్థానం సూచనలను అనుకూలంగా మార్చుకుంటున్న నేతలు ● రెగ్యులేటర్ల నిర్మాణం మాటెత్తని కూటమి ప్రభుత్వం రాజకీయం చేయొద్దు కొల్లేరు కాంటూరు కుదింపు చేస్తామని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ముందుగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఏళ్లు గడిచిపోయాయి. అమాయకులైన కొల్లేరు ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పాలి. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అమలు చేయడానికి కూటమి నేతలు కృషి చేయాలి. –బలే గణేష్, శృంగవరప్పాడు, కై కలూరు మండలం రెగ్యులేటర్లు నిర్మించాలి కొల్లేరు అభయారణ్యంలో ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో 10వ కాంటూరు వరకు నిబంధనలు విస్తరించాలని చూస్తున్నారు. మరోవైపు కాంటూరు 5 నుంచి 3నకు కుదిస్తానని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు. కొల్లేరులో నీరు లేక ఎడారిగా మారింది. ప్రజల వలసలు తగ్గాలంటే ప్రభుత్వం ముందుగా రెగ్యులేటర్లు నిర్మించాలి. – ఎల్ఎస్ భాస్కరరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండవల్లి మండలం సాక్షి టాస్క్ఫోర్స్: కొల్లేరు అనే ఈ మూడక్షరాల పదం రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు చెబుతున్న సూచనలతో రా జకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. తాజాగా మరోసారి కొల్లేరు సరిహద్దులను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీని ఆదేశించింది. కొల్లేరు ఆపరేషన్ ద్వారా అక్రమ చెరువులను ధ్వంసం చేసి 19 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అభయారణ్యం ఆక్రమణల చెరలోనే చిక్కుకుంది. కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యం కాదని అధ్యయన కమిటీలు గతంలోనే నివేదిక ఇచ్చాయి. కొల్లేరుకు శాశ్వత పరి ష్కారం చూపుతామంటున్న నేతల వాగ్దానాలు నెరవేరేనా అనే అనుమానాలు కొల్లేరు ప్రజల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోమారు తెరపైకి.. కొల్లేరు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతర్జాతీయ రామ్సర్ ఒడంబడిక ప్రకారం 1999 అక్టోబరు 4న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 120ను తీసుకొచ్చింది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లో + 5 కాంటూరు పరిధి వరకు 77,138 ఎకరాలను అభయారణ్యంగా నిర్ణయించారు. అక్రమ చేపల చెరువుల సంఖ్య అభయారణ్యంలో పెరగడంతో 2006లో కొల్లేరు ఆపరేషన్ ద్వారా వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. కొల్లేరు సంరక్షణకు 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు అమలు చేయలేదని ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కాకినాడకు చెందిన కె.మృత్యుంజయరావు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ప్రధాని హామీ అమలు చేయాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014లో భీమవరం వచ్చిన ప్రధాని మోదీ కొల్లేరు కాంటూరును కుదిస్తానని హామీ ఇచ్చారు. ఆ సభలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. 2015 జూలైలో అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొల్లేరుపై సమావేశం నిర్వహించారు. అనంతరం కాంటూరు కుదింపుపై త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్, రివ్యూ పిటీషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించాలని కొల్లేరు ప్రజలు కోరుతున్నారు. కాంటూరు కుదింపు జరగాలంటే జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు (ఎన్టీడబ్ల్యూఎల్) ఆమోదం కోసం రాష్ట్ర బోర్డు తీర్మానం చేయాల్సి ఉంది. అలాగే కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం జరగాలి. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని పలువురు కోరుతున్నారు. కాంటూరు కుదింపు సాధ్యమయ్యేనా..? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. 10వ కాంటూరు పై వరకు కొల్లేరు విస్తరించి ఉన్నప్పటికీ 5వ కాంటూరు వరకు మాత్రమే 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదిస్తే 48,777 ఎకరాలు మిగులుతుంది. అభయారణ్యంలో పట్టా భూములు 14,932 ఎకరాలు, సొసైటీ భూములు 5,510 ఎకరాలు ఉన్నాయి. గతంలో నష్టపరిహారం చెల్లించకుండా ధ్వంసం చేశారని కొల్లేరు ప్రజలు వాదన వినిపిస్తున్నారు. కొల్లేరుపై అధ్యయనం చేసిన పలు కమిటీలు కాంటూరు కుదింపు సాధ్యం కాదని నివేదికలు అందించాయి. కూటమి నేతలు మాత్రం కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేసినట్లుగానే ప్రచారం చేస్తున్నారు. -
పాదయాత్ర భక్తులను ఢీకొట్టిన లారీ
ద్వారకాతిరుమల: మొక్కుబడులు తీర్చుకునేందుకు ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి కాలినడకన వెళుతున్న ముగ్గురు యువకులను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు యువకుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం, పుల్లలపాడులోని పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రకారం.. దేవరపల్లి గ్రామానికి చెందిన దాసు దుర్గాప్రసాద్, బిరదా అంజి(20), జాజుమొగ్గల సాయిచరణ్ తేజ ద్వారకాతిరుమల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్నారు. మార్గమధ్యంలో పుల్లలపాడు వద్దకు వచ్చేసరికి రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు వెళ్తున్న కర్నాటకకు చెందిన లారీ వీరిని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలై రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బిరదా అంజి మృతి చెందినట్టు అతని మేనమామ శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు -
కళారంగానికి చేయూతనిస్తాం
భీమవరం: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు పుంజుకున్న తరువాత కళారంగానికి చేయూతనిస్తామని సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న చైతన్య భారతి సంగీత, నృత్య నాటక పరిషత్ 18వ జాతీయస్థాయి నాటికల పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నాటకాలపై ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదని ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేయడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. కళా పరిషత్ల ద్వారా నాటకరంగం నిరంతరం కొనసాగడానికి పరిషత్ నిర్వహణ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి సమావేశం నిర్వహణకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం చవాకుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు బాలాజీ నాయక్కు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారంతో సత్కరించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పెన్మెత్స కృష్ణంరాజును ఆత్మీయ చైతన్య పురస్కారంతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులపర్తి అంజిబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్, తదితరులు పాల్గొన్నారు. -
కొబ్బరి బొండాలకు గిరాకీ
ఉంగుటూరు: ఏప్రిల్లోనే ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం సహజమైన కొబ్బరి నీరు తాగే ఎండ తీవ్రత పెరగడంతో కొబ్బరి బొండాలకు గిరాకీ పెరిగింది. బాటిల్ కొబ్బరి నీరు ధర రూ.120 నుంచి రూ.150 పలుకుతోంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. శక్తి నివ్వడంతో పాటు డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. శరీరంలో నీటి శాతం పెంచి శక్తిని ఇస్తుంది. బొండంలో సుమారు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. మూత్ర, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఇది చక్కగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు ఒంటిలో వేడిని తగ్గిస్తాయి. అలాగే మంచి ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది. ఎండ దెబ్బకు పెరిగిన అమ్మకాలు ఎండలు పెరగడంతో ఉమ్మడి ఏలూరు జిల్లా నుంచి కొబరి బొండాల అమ్మకాలు బాగా పెరిగాయి. దాంతో కొబ్బరి రైతులకు గిట్టుబాటు అవుతోంది. వ్యాపారులు ఆటోలు, మిని లారీలు, లారీల మీద బొండాల తీసుకెళ్లి చిల్లర వ్యాపారులకు అమ్ముతున్నారు. అలాగే లారీల మీద ఏలూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయి. పలు చోట్ల జాతీయ రహదారి మీద చిరు వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి ఏలూరు జిల్లాలో 35,000 ఎకరాలలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. పెదవేగి, పెదపాడు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల, కామవరపుకోట, టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో కొబ్బరి తోటలు విస్తారంగా ఉన్నాయి. అక్కడనుంచి కొబ్బరి బొండాలు ఎగుమతులు సాగుతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతంలో చేపలు చెరువుల గట్ల మీద పెంచిన కొబ్బరి చెట్ల నుంచి బొండాలు దింపుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం ధర పెరగడంతో రైతులకు గిట్టుబాటు గిరాకీ పెరగడంతో రైతులకు లాభం కొబ్బరి బొండాలకు గిరాకీ పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర వస్తోంది. ఇటీవల కొబ్బరి బొండాలు అమ్మకాలు భారీగా పెరిగాయి. వైద్యులు కూడా బొండాలు తాగమని సూచించడంతో ఎక్కువ మంది తాగుతున్నారు. ఎకరాకు రూ.60 వేలకు తక్కువ కాకుండా ఆదాయం వస్తోంది. –దేవదానం, హార్టీకల్చర్ ఏఓ, ఉంగుటూరు -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంచాయతీ పరిధిలో వెంకటరామానుజపురం గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం ఎడమ చేతిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు దీనిని గుర్తించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వైఎస్సార్ విగ్రహం చేతిని ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇర్ల విజయశాంతి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, దోరేపల్లి సుబ్బారావు, మర్రెడ్డి పెద రామాజంనేయులు, డి.సుబ్బారావు, జె.కమలాకరరెడ్డి, కఠారి నారాయణరావు, కఠారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన బాస్కెట్బాల్ జట్టు ఎంపిక ఏలూరు రూరల్: ఆదివారం ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు ఎంపిక పోటీలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలకు నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కలిగిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీను, కోశాధికారి కె.మురళీకృష్ణ వెల్లడించారు. మే 15 నుంచి 18 వరకూ చిత్తూరులో అంతర జిల్లాల అండర్–14 సబ్ జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జట్టు పాల్గొంటుందన్నారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. -
వేరుశెనగ కోత తర్వాత జాగ్రత్తలు
చింతలపూడి: దేశంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశెనగ అతి ముఖ్యమైంది. వేరుశెనగ కోతలు పూర్తయ్యాక సరైన జాగ్రత్తలు పాటిస్తే విత్తనాలు రాబోయే కాలంలో పనికొస్తాయి. లేదంటే పుచ్చుపట్టి పనికి రాకుండా పోతాయి. వేరుశనగలో కోసిన పంటను తగిన తేమ (9 శాతం) వచ్చే వరకు మొక్కనుంచి కాయలను వేరు చేయడానికి ముందు ఎండ బెట్టాలి. విత్తనాలను భద్రపరుచుకుని వచ్చే పంటకు ఉపయోగించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వేసవిలో అవలంభించాల్సిన పద్ధతుల గురించి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు బి.నాగకుమార్ రైతులకు సూచించారు. ఎండబెట్టే విధానం వేరుశెనగ కాయలు పై భాగానికి వచ్చేటట్లు చెట్లను చిన్న, చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలను పక్కలకు వచ్చేలా చేసి ఎండబెట్టుకోవచ్చు. తేమశాతం తగ్గించడం ఇలా కాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7, 8 శాతానికి తీసుకురావాలి. వేడి గాలులను వదిలే పరికరాలను ఇందుకు ఉపయోగించవచ్చు. వేరుశెనగ పంటను నిల్వ చేయడానికి ఒకసారి వాడిన సంచులను మళ్లీ వాడకూడదు. పాలిథీన్ పేపర్ ఉన్న గోనె సంచులు బాగా ఎండిన వేరుశెనగ కాయలను నిల్వ చేయడానికి ఉపయోగం. ఎండలో ఆరబెట్టకూడదు రబీలో పీకేటప్పుడు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి. ఎండ తీవ్రత ఉదయం 11 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల తరువాత తక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో ఆరబెట్టుకోవాలి. ఎండబెట్టే సమయంలో వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. నిల్వ చేసుకునే విధానం విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ చేసుకోవాలి. కాయలను కదిలిస్తే ఘల్లుమని శబ్దం రావాలి. అప్పుడే బాగా ఎండినట్లు అర్ధం. కాయలను నిల్వ చేసుకోవడానికి శుభ్రమైన పాలిధిన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5 శాతం మలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టుకోవాలి. దీని వల్ల కాయల్లోని గింజలకు శిలీంధ్రాల బెడద ఉండదు. బి నాగకుమార్ –సహాయ వ్యవసాయ సంచాలకులు -
దళారుల నిలువు దోపిడీ
ఏలూరు (మెట్రో): జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. మద్దతు ధర లభించకపోవడంతో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రకృతి కరుణించడంతో దిగుబడులు బాగానే వచ్చినా.. కూటమి సర్కారు రైతులపై కక్ష కట్టింది. జిల్లాలో ఎక్కువగా మెట్టప్రాంతం ఉండటంతో ప్రస్తుత సీజన్లో రెండో పంటగా రైతులు 48,878 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందపడ్డారు. ప్రకృతి కనికరించడంతో ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది.అయితే మద్దతు ధర లేకపోవడం, దళారులు దోపిడీతో ఆ ఆనందం కాస్తా ఆవిరైంది. క్వింటాల్కు రూ.400 తగ్గింపు గత వైఎస్సార్సీపీ సర్కారు క్వింటాల్కు రు.2600 కనీస మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కంటే ఈ ఏడాది కనీస మద్దతు ధర పెరుగుతుందని రైతులు భావించారు. ప్రస్తుతం రూ.2,225కు ధర తగ్గించడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. క్వింటాల్కు సుమారు రూ.400 తగ్గించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎకరం సాగు చేసేందుకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఖర్చవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.20 వేల వరకే మిగులుతుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఇచ్చిన మద్దతు ధర ఇచ్చినా లాభాలు వచ్చేవని రైతులు అంటున్నారు. గతంలో రైతు భరోసాతో ప్రభుత్వం ఆదుకునేది. రైతులకు కనీస మద్దతు ధర అందించి రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేది. నేరుగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా సాయాన్ని అందిస్తూ రైతులను గత ప్రభుత్వం ఆదుకునేది. ప్రస్తుతం మద్దతు ధర లేదు, రైతులకు సాయం లేదు. బర్డ్ఫ్లూ దెబ్బకు తగ్గిన డిమాండ్ జిల్లాలో మొక్కజొన్నను 80 శాతం పైగా కోళ్ల ఫారాలకు సరఫరా చేసి మేతగా వినియోగించేవారు. ఇటీవల కోళ్లకు బర్డ్ఫ్లూ వ్యాపించడంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది. దీంతో కోళ్ల ఫాంలు మూతపడ్డాయి. దీంతో మొక్కజొన్నకు డిమాండ్ తగ్గడంతో రైతుల పండించిన పంటను దళారులు తమ ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారు. ఒక వైపు రైతులను ప్రభుత్వం ఆదుకోకపోగా మరో వైపు మద్దతు ధర తగ్గించడం వంటి పరిణామాలతో మొక్కజొన్న రైతు లబోదిబోమంటున్నాడు. మొక్కజొన్న రైతు గగ్గోలు మద్దతు ధర తగ్గింపు.. దోచుకుంటున్న దళారులు జిల్లా వ్యాప్తంగా 48,878 ఎకరాల్లో సాగు జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలు జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు: 18,345 మంది జిల్లాలో సాగు: 48,878 ఎకరాలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర: రూ.2,225 దళారులు కొనుగోలు చేస్తున్న ధర: రూ.2 వేల నుంచి 2,200 -
ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపాలి
ఆకివీడు: ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని వారి అంతానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని వైఎస్సార్సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఉగ్రదాడులకు నిరసనగా స్థానిక వైఎస్సార్ సెంటర్లో శనివారం కొవ్వొతుల ప్రదర్శన, శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, మండల, పట్టణ కమిటీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, ఏఎంసీ మాజీ చైర్మన్లు మోటుపల్లి గంగాధరరావు, ఎండీ.మస్తాన్ వలీ మాట్లాడుతూ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని కూడా మట్టుబెట్టాలన్నారు. అమరులైన వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎండీ.జహంగీర్, ఎస్కే. ఆరీఫ్, ఎండీ.జక్కీ, ఎండీ.సిద్ధిక్, ఎస్కే.హుస్సేన్, గుండా సుందరరామనాయుడు, జీ.ధనరాజు, మోరా జ్యోతిరెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, నిమ్మల నాగు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన -
గణాంకాలు సకాలంలో నమోదు చేయాలి
భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయాలని డీఎంఅండ్హెఓ జి.గీతాబాయి అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నూరు శాతం గణాంకాల నమోదుకు, లక్ష్య సాధనకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు భానునాయక్, డి.సుధాలక్ష్మి, వి.ప్రసాదరావు, జి.ధనలక్ష్మి పాల్గొన్నారు. పీజీ సెంటర్లో ఎంసీఏ కోర్సు నూజివీడు: పట్టణంలోని పీజీ కేంద్రంలో రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఎంసీఏ కోర్సు ఏర్పాటు చేస్తున్నామని కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కూన రాంజీ పేర్కొన్నారు. కృష్ణా యూనివర్శిటీకి చెందిన పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు పీజీ కేంద్రం ప్రధాన గేటు నిర్మాణానికి వైస్ చాన్సలర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన అకడమిక్ భవనాన్ని జులైలోగా పారంభిస్తామన్నారు. పీజీ కేంద్రానికి సోలార్ విద్యుత్ సదుపాయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పీజీ కేంద్రం ప్రధాన భవనానికి హంగులు దిద్దేందుకు తగిన సూచనలు ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులను కోరామన్నారు. రాబోయే రోజుల్లో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పీజీ సెంటర్లో ల్యాబ్లు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీజీ కేంద్రం ప్రిన్సిపాల్ జే నవీన లావణ్యలత, అధ్యాపకులు పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) నారాయణ పేర్కొన్నారు. మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్పెషల్ క్లాస్ల నిర్వహణను శనివారం డీఈఓ పరిశీలించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలపై సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం ఆహ్వానం, ప్రభుత్వ పథకాలు, పాఠశాలలో సౌకర్యాలు తదితర విషయాలపై చర్చించారు. విద్యా శాఖ కరపత్రాలను డీఈఓ ఆవిష్కరించారు. డీవైఈఓ ఎన్.శ్రీనివాసరావు, ఎంఈఓ హనుమ, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు తనిఖీలు భీమవరం: కశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడి దృష్ట్యా.. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబు గుర్తింపు బృందం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నేతృత్వంలో జిల్లాలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. హోటళ్లు, లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు తనిఖీ చేశారు. విస్తృత తనిఖీలకు జిల్లా ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనిస్తే తక్షణమే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. -
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
ద్వారకాతిరుమల మండలంలో పోలవరం కాలువ గట్టుపై భారీ చెట్లను అడ్డగోలుగా నరికేశారు. చెట్ల కలప సంగతిని అధికారులు ఇంతవరకూ తేల్చలేదు. 11లో uఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై సమీక్ష భీమవరం (ప్రకాశంచౌక్): ఉజ్వల యోజన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పొంది వినియోగించని లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ చాంబర్లో పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉజ్వల 2.0 పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొంది రెండు సంవత్సరాలుగా రీఫిల్ చేసుకోని లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు మొదటి నోటీసు జారీ చేసిన 15 రోజులలోపు వారికి సంబంధించిన గ్యాస్ పంపిణీదారుల కంపెనీకి వెళ్ళి, వారి ఈకేవైసీ ఫార్మాలిటీలు, బయోమెట్రిక్ మళ్ళీ పూర్తి చేసుకోవాలని చెప్పాలన్నారు. ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి చివరి అవకాశాన్ని ఇచ్చేందుకు తుది నోటీసు జారీచేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల అధికారి ఎన్.సరోజ తదితరులు పాల్గొన్నారు. -
సమాజంలో నాటికలది కీలక పాత్ర
యలమంచిలి: సమాజంలోని రుగ్మతల్ని వేలెత్తి చూపడంలో నేటికీ నాటికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి చెప్పారు. కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరంలో 43వ జాతీయ స్థాయి నాటిక పోటీల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. సినిమాలు, టీవీ, ఓటీటీ వంటి మీడియా ప్రభంజనం సృష్టిస్తున్న నేటి రోజుల్లో కూడా నాటికలకు ఆదరణ లభించడం మంచి పరిణామం అన్నారు. కళలకు కాణాచి వంటి గోదావరి జిల్లాలో జన్మించడం తన అదృష్టమన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) మాట్లాడుతూ కొంతేరు ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఈ నాటిక పోటీలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయిని డాక్టర్ బాబ్జీ, కమిటి సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, కొంతేరు యూత్ క్లబ్ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ, కొంతేటి సర్వేశలింగం, గుండా రామకృష్ణ, ఉన్నమట్ల కబర్ది, బుద్దాల రామారావు, పులపర్తి రాజగోపాలరావు, వంగా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు అలరించిన నాటికలు టెక్నాలజీ అవసరానికి వాడితే మిత్రుడు, అవసరానికి మించి వాడితే శత్రువు అని ‘నా శత్రువు’ నాటిక.. సమాజం బాగు కోసం కళాకారుల్లో ఉండే తపన రాజకీయ నాయకుల్లో ఉంటే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ‘ఆంగికం భువనం యస్య’ నాటికలోను.. జనరల్ బోగీలో ప్రయాణికుల కష్టాలు ఏ విధంగా ఉంటాయో ‘జనరల్ బోగీలు’ నాటికలోను వివరించారు. మూడు నాటికలు అలరించాయి. రెండవ రోజు నాటిక ప్రాంగణానికి బొండాడ వెంకట రాధా రమణ గుప్తా పేరిట నామకరణం చేశారు. ఆకట్టుకున్న నాటికలు భీమవరం: పట్టణంలోని గన్నాబత్తుల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీల్లో శనివారం మూడు నాటికలు రసవత్తరంగా సాగాయి. హైదరాబాద్ శ్రీమహతి క్రియేషన్స్ వారి సింహ ప్రసాద్ రచించగా.. ఉప్పలూరి సుబ్బరాయశర్మ దర్శకత్వంలో ప్రదర్శించిన ‘ఉక్కు సంకెళ్లు’ నాటిక ఈస్టిండియా కంపెనీ దురాగతాలను ఎత్తి చూపింది. ఫిలిప్స్ దొర అడిగిన వెంటనే హిల్సా చేప ఇవ్వలేదనే కోపంతో హుగ్లీ నదిలో చేపల వేట నిషేధిస్తే దానికి ఆనాటి జమిందారిణి రాణీ రాస్మణీదేవి ఏ విధంగా అడ్డుకున్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. రెండో ప్రదర్శనగా విశాఖ ఉక్కు నగరం శ్రీచైతన్య కళాస్రవంతి వారి ‘(అ)సత్యం’ నాటిక పి.బాలాజీ నాయక్ దర్శకత్వంలో ప్రదర్శించారు. కంటికి కనిపించేదంతా సత్యం కాదు, కనిపించనిదంతా అసత్యం కాదనే సందేశంతో ప్రదర్శించిన నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. మూడో ప్రదర్శనగా హైదరాబాద్ మిత్రా క్రియేషన్స్ ‘ఇది రహదారి కాదు’ నాటిక ఎస్ఎం బాషా దర్శకత్వంలో ప్రదర్శించారు. సంపాదనే ముద్దు పిల్లలు వద్దు అనే రీతిలో నేటి యువత తీసుకుంటున్న నిర్ణయాలను, దారితప్పిన యువ జంటను చక్కదిద్దిన దృశ్యరూపమే ఈ నాటిక ఇతివృత్తం. కార్యక్రమంలో చైతన్య భారతి అధ్యక్ష, కార్యదర్శులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్కుమార్రాజు తదితరులు పాల్గొన్నారు. -
దేవదాయ శాఖ భూమి స్వాధీనం
నరసాపురం రూరల్: మండలంలోని చిట్టవరం గ్రామంలో ఆక్రమణలకు గురైన మదన గోపాల స్వామి దేవస్థానం భూమిని శనివారం దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ నెం 158–18లో భూమి ఆక్రమణకు గురయినట్లు గుర్తించిన అధికారులు దేవదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, నరసాపురం రూరల్ ఎస్సై సురేష్, దేవదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని గోడను నిర్మించి స్థలాన్ని దేవాలయ కార్యనిర్వహణాధికారికి స్వాధీనం చేశారు. దేవాలయ భూములు ఆక్రమించినా, స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
నర్సింగ్ విద్యార్థినులకువసతి వెతలు
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం), బీఎస్సీ నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న పేద వర్గాల బాలికలకు వసతి, ఇతర అవసరాలకు అన్ని విధాల ఆర్థిక సాయం చేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గత పదేళ్ళుగా ప్రభుత్వం జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కాలేజీల్లో విద్యార్థినులకు నర్సింగ్ విద్య ఉచితమంటూనే.. అరకొర స్టైఫండ్తో గడిపేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే కొద్ది మొత్తంతో నెట్టుకురావాల్సి ఉండడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా గాలికి వదిలేస్తోందని, పేద పిల్లలకు కనీసం నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవటం దారుణమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చదువుతున్న 550 మందికి పైగా నర్సింగ్ విద్యార్థినులకు రూ.19 లక్షల స్టైఫండ్ బకాయిలు ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 3, 4 నెలకోసారి స్టైఫండ్ : ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలో జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. జీఎన్ఎం కోర్సులో సుమారుగా 150 మంది విద్యార్థినులు ఉండగా, బీఎస్సీ నర్సింగ్ కోర్సులో 400 మంది ఉన్నారు. వీరిలో మొదటి సంవత్సరం జీఎన్ఎం కోర్సు చదివే విద్యార్థినికి రూ.3 వేలు, రెండు, మూడో ఏడాదిలో రూ.3500 స్టైఫండ్ ఇస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులకు రూ.4 వేల నుంచి రూ. 4500 వరకు ఇస్తారు. ప్రభుత్వం స్టైఫండ్ నెల నెలా ఇస్తే తప్ప గడవని పరిస్థితి. అలాంటిది మూడు, నాలుగు నెలకోసారి స్టైఫండ్ ఇవ్వడంతో ఖర్చులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రతి నెలా స్టైఫండ్ ఇవ్వకపోవడంతో వారి కష్టాలు వర్ణణాతీతం. వసతి, భోజనం ఖర్చులు భరించాల్సిందే.. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, మచిలీపట్నంలో జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. బీఎస్సీ నర్సింగ్కు నీట్ ద్వారా ఎంపికలు చేస్తుండగా, జీఎన్ఎం కోర్సుకు డీఎంఈ నోటిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నర్సింగ్ కాలేజీల నిర్వహణకు, భోజనం, వసతి కోసం నిధులు కేటాయించకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎస్సీ నర్సింగ్లో మెంటల్ హెల్త్ సబ్జెక్టుకు సంబంధించి శిక్షణ కేవలం విశాఖపట్నంలోనే ఉంది. ఈ సబ్జెక్టులో శిక్షణకు విశాఖపట్నం వెళ్లాలి. అక్కడ వసతి, భోజనం ఖర్చులు భరించాల్సి రావటంతో వారిపై పెనుభారం మోపినట్లేనని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలు, శిక్షణల కోసం అదనపు ఆర్థిక భారం వేస్తున్నాయంటున్నారు. నెలకు రూ.3 వేలతోనే నెట్టుకొస్తున్న వైనం 550 మందికి రూ.19 లక్షల స్టైఫండ్ బకాయిలు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇక్కట్లు ప్రభుత్వానికి నివేదించాం ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని జీఎన్ఎం నర్సింగ్ కాలేజీకి సంబంధించి నిర్వహణ, భోజనం నిమిత్తం ప్రత్యేకంగా నిధులు ఏమీ మంజూరు చేయడం లేదు. విద్యార్థినులకు అందిస్తున్న స్టైఫండ్తోనే నిర్వహణ ఖర్చులు, భోజనం ఖర్చులు భరించాలి. ఇప్పటికే చాలా సార్లు నిధులు కేటాయించాలంటూ నివేదికలు పంపించాం. – వరలక్ష్మి, ప్రిన్సిపల్, జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ -
ఉప్పుటేరు ఆక్రమణల తొలగింపునకు సహకరించండి
కై కలూరు : వరదల సమయంలో కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించడానికి ప్రధాన భూమిక వహించే ఉప్పుటేరు ఆక్రమణల తొలగింపునకు అందరూ సహకరించాలని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే, ఉప సభాపతి కనుమూరి మురళీకృష్ణంరాజు అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొల్లేరు అంశంపై కమిటీ నివేదిక కోరిన నేపథ్యంలో వారు కొట్టాడ గ్రామం వద్ద ఉప్పుటేరు ఆక్రమణలను డ్రోన్ సాయంతో శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉప్పుటేరులో ఆక్రమణల కారణంగా 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ఉప్పుటేరు 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందన్నారు. ఇలానే కొనసాగితే కొల్లేరు ముంపు మరొకసారి తప్పదన్నారు. వర్షాకాలం వచ్చే నాటికీ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. ఇందుకు ఆక్రమణదారులు డ్రెయినేజీ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు సహకరించాలన్నారు. లేనిపక్షంలో చట్టం తన పని చేసుకుంటుందని ఆక్రమణదారులను పరోక్షంగా హెచ్ఛరించారు. త్వరలో సుప్రీంకోర్టు సాధికారత కమిటీ పర్యటనకు వస్తోందని కొల్లేరు ప్రజలు సమస్యలను విన్నవించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, వడ్డీ సాధికారిత రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు, కూటమి నేతలు పెన్మత్స త్రినాథరాజు, పూలా రాజీ, కొల్లి బాబీ, సర్పంచులు, కొల్లేరు పెద్దలు పాల్గొన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.6 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.6 లక్షలను విరాళంగా అందజేశారు. అందులో భాగంగా తణుకు మండలం కానూరుకు చెందిన వీరమల్లు వెంకట్రావు రూ.5 లక్షలు, కాజా పడమరకు చెందిన గుబ్బల రామారావు రూ.లక్ష ఆలయ కార్యాలయంలో జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు విరాళం బాండ్ పత్రాలను అందించారు. అనంతరం వారికి స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించారు. విద్యుత్ షాక్తో యువకుడి మృతి యలమంచిలి: విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం పోడూరు మండలం వద్దిపర్రు పంచాయతీ చింతలగరువుకు చెందిన గుడాల శ్రీసూర్యతేజ ప్రైవేట్ ఎలక్ట్రీషీయన్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్ పని ఉందని యలమంచిలికి చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నుంచి కబురు రావడంతో సూర్యతేజ పనికి వచ్చాడు. శిరగాలపల్లి వద్ద శనివారం పని చేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కగా 11 కేవీ తీగలు తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతునికి వివాహం కాలేదు. తల్లీదండ్రులు లక్ష్మీకుమారి, వెంకట సత్యనారాయణ, సోదరుడు ఉన్నారు. -
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చేడె జనార్దన్ కుమార్తె యశస్విని (24) మూడేళ్లుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తోంది. తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలనుకుని యశస్విని బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి తన సహ ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్కుమార్తో కలిసి అదే బుల్లెట్పై తమ స్వగ్రామమైన తుందుర్రుకు బయలుదేరింది. బుల్లెట్ బైక్ను అచ్యుత్కుమార్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టారు. దీంతో యశస్విని బుల్లెట్పై నుంచి ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే లారీ అతివేగంతో వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది. దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. అచ్యుత్కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యశస్విని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు మునగాలకు చేరుకున్నారు. మృతురాలి బాబాయ్ చేడె సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యశస్విని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం రోడ్డుపై ఉన్న గేదె కళేబరాన్ని ఢీకొన్న బుల్లెట్ బైక్ ఎగిరి రోడ్డుపై పడిన యువతి.. వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఆమైపె నుంచి వెళ్లిన లారీ -
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
భీమవరం: పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం వన్టౌన్ సీఐ ఎం నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం పట్టణానికి చెందిన మైనర్ బాలికకు ప్రస్తుతం గునుపూడిలో నివాసముంటున్న భీమవరం మండలం కొత్తపూసలమర్రు గ్రామానికి చెందిన ఎం లక్ష్మీవరప్రసాద్ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. బాలిక గర్భవతి కావడంతో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు లక్ష్మీవరప్రసాద్ను శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ నాగరాజు చెప్పారు. మూడు మట్టి లారీల సీజ్ జంగారెడ్డిగూడెం : కేతవరంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను సీజ్చేశారు. కేతవరం చెరువు నుంచి రాత్రి సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా, వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. తహసీల్దార్ కె.స్లీవజోజి చర్యలు తీసుకుంటారని స్టేషన్ రైటర్ సత్యనారాయణ తెలిపారు. కరెంట్ షాక్తో పెయింటర్ మృతిఏలూరు టౌన్: కరెంట్ షాక్తో పెయింటర్ మృతి చెందాడు. దెందులూరు మండలం పోతునూరు కు చెందిన లింగాల పరుశురాం (31) పెయింటర్గా పనిచేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఏలూరు సుబ్రహ్మణ్యం కాలనీలో ఒక భవనానికి మొదటి అంతస్తులో ఐరన్పైపునకు రోలర్ బిగించి గోడకు పెయింటింగ్ వేస్తుండగా సమీపంలో 11కేవీ విద్యుత్ వైర్ల ద్వారా విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఏలూరు వన్టౌన్ ఎస్సై నాగబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి కొండపై షార్ట్కట్ మార్గం మూసివేత ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న షార్ట్కట్ మార్గాన్ని ఆలయ అధికారులు పూర్తిగా మూసివేశారు. స్వామివారి దర్శనానంతరం పలువురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలోని మార్గం గుండా కొండపైన నిత్యాన్నదాన భవనం, శివాలయం వద్దకు కాలినడకన వెళుతున్నారు. ఆ ప్రాంతంలో జేసీబీతో పూడిక పనులు జరుగుతున్నాయి. దీనిపై సాక్షి దినపత్రికలో ఈనెల 25న ‘శ్రీవారి కొండపై షార్ట్కట్ మార్గం వద్దు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆలయ అధికారులు ఆ మార్గాన్ని ఇనుప బారిగేట్తో పూర్తిగా మూసివేశారు. -
మట్టి మాఫియా ఆగడాలపై నిరసన
పెనుగొండ : మట్టి మాఫియా ఆగడాలపై శనివారం సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ఆచంట నియోజకవర్గంలో ఆచంట వేమవరం, ఆంచట శివారు నక్కల కాలువ, గుమ్ములూరు రాయగొప్ప నక్కల కాలువలో మట్టి తవ్వకాలు జరిపిన ప్రాంతాలను సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ మాట్లాడుతూ మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెచ్చు పెరిగిపోతున్నాయన్నారు. మట్టి తరలింపు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణలు వెనుక మామూళ్లు కథ ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు, బోదే గట్టు, కాలువ గట్టు మట్టి తీసుకుపోతున్నా అధికారులు కన్నేత్తి చూడలేదన్నారు. జిల్లా మంత్రి అండదండలతోనే మట్టి తవ్వకాలు జరిగాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా 15 అడుగుల లోతు తవ్వేశారన్నారు. పశువులు దిగితే జాడ కనిపించే పరిస్థితి లేకుండా ఉందన్నారు. పూర్తిగా తవ్వేయడం వలన గట్టుకు ప్రాంతంలో ఉన్న అయిదు గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని, వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు పిల్లి ప్రసాద్, మూడే మోజేస్, పి మోహనరావు, ఎస్వీఎన్ శర్మ, తలుపూరి బుల్లాబ్బాయి, సిర్రా నరసింహమూర్తి, కొండేటి సత్యనారాయణ, తోటపల్లి సత్యనారాయణ, గెద్దాడ త్రిమూర్తులు పాల్గొన్నారు. -
శ్రీవారి చెంత సేద తీరి
●అలసట మాయం ఆలయానికి వచ్చేటప్పుడు ఎండ వేడిమికి భయపడ్డాను. బయట వాతావరణం చూసి దర్శనం క్యూలైన్లలో ఉండగలమా అనిపించింది. కానీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనూ, క్యూలైన్ల వద్ద ఎయిర్ కూలర్ల నుంచి వస్తున్న చల్లదనం అలసటను మాయం చేసింది. క్యూ కాంప్లెక్స్లో ఇంకాసేపు ఉంటే బాగుండేదని అనిపించింది. – కామిశెట్టి దుర్గా లక్ష్మి, భక్తురాలు, పోలవరం మండలం, రేపల్లెవాడ గ్రామం ఏ ఆలయంలోనూ ఇలా లేదు క్యూ కాంప్లెక్స్లో సౌకర్యాలు బాగున్నాయి. ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. అలాగే క్యూ కాంప్లెక్స్లోని స్క్రీన్పై క్షేత్ర చరిత్ర, వేంకటేశ్వర స్వామికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడం బాగుంది. భక్తులందరికీ మజ్జిగను కూడా అందిస్తున్నారు. వేసవిని పురస్కరించుకుని ఆలయ అధికారులు చేపట్టిన చర్యలు అద్భుతంగా ఉన్నాయి. – పరసా రాఘవేంద్ర, మచిలీపట్నం, భక్తుడు ద్వారకాతిరుమల: రాష్ట్రంలో ఏ దేవాలయంలోనూ లేని విధంగా ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కూలర్లు భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం క్షేత్రానికి వస్తున్న భక్తులు ఎండ వేడిమి కారణంగా అలసిపోతున్నారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లలోకి అడుగుపెట్టగానే ఎయిర్ కూలర్ల నుంచి వస్తున్న చల్లదనాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. హమ్మయ్య.. అనుకుంటూ ఉపశమనాన్ని పొందుతున్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే సమయంలో కొందరు భక్తులు, చిన్నారులు అక్కడే విశ్రాంతి పొందుతున్నారు. పిల్లలను వారి తల్లిదండ్రులు కూలర్ల వద్ద ఆడిస్తున్నారు. ఒక్కో కంపార్ట్మెంట్లో నాలుగు కూలర్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మొత్తం ఐదు కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కో కంపార్ట్మెంట్కు నాలుగు కూలర్లు (నాలుగు మూలల) చొప్పున మొత్తం 20 కూలర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలోని క్యూలైన్ల వద్ద మరో 5 కూలర్లను ఏర్పాటు చేశారు. సిబ్బంది నిరంతరాయంగా ఆ కూలర్లను నీటితో తడుపుతున్నారు. భక్తుల పట్ల వారు చూపుతున్న శ్రద్ధను పలువురు కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో కూలర్ ధర రూ. 18 వేలు అని, దాతల సహకారంతో మరికొన్ని కూలర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మరిన్ని సౌకర్యాలు క్యూ కాంప్లెక్స్లో దేవస్థానం సిబ్బంది భక్తులకు మజ్జిగను, మంచి నీటిని అందిస్తున్నారు. అలాగే అందులో ఉన్న స్క్రీన్పై క్షేత్ర చరిత్ర, అన్నమయ్య, దేవతామూర్తుల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. దాంతో చల్లని వాతావరణంలో వాటిని తిలకిస్తూ, దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని భక్తులు మరచిపోతున్నారు. క్షేత్రంలో సౌకర్యాల కల్పనకు అధికారులు చేపడుతున్న చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఎయిర్ కూలర్ల ఏర్పాటు క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలో ఎండ వేడమి నుంచి భక్తులకు ఉపశమనం దాతల సహకారంతో ఇప్పటికే 25 కూలర్ల ఏర్పాటు మరికొన్ని కూలర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్న అధికారులు -
రాత్రివేళల్లో జోరుగా మట్టి తవ్వకాలు
బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి పరిసర ప్రాంతాల్లో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు,, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో కొందరు కూటమి నాయకులు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుడు ఒక ట్రక్కు మట్టి కావాలంటే కనీసం అనుమతి కోసం సరైన సమాధానం చెప్పని అధికారులు, యథేచ్ఛగా మట్టి రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం పట్ల పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు హేమ వర్షిణి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట భవిత కేంద్రానికి చెందిన ఒమ్మి హేమ వర్షిణి జాతీయ స్థాయి స్పెషల్ ఒలంపిక్స్ పోటీలకు ఎంపికై ంది. ఇటీవల కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి బోసీ బాల్ విభాగంలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయుడు కే.బాల ఈశ్వరయ్య వివరించారు. ఈ పోటీలు చత్తీస్ఘడ్లో జరగనున్నట్లు వెల్లడించారు. బాలిక హేమవర్షిణి ఇటీవల పదవ తరగతి ఉత్తీర్ణురాలైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉపాధ్యాయుడు బాల ఈశ్వరయ్య, ఉపాధ్యాయులు విద్యార్థిని హేమ వర్షిణిని అభినందించారు. బీచ్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం ద్వారకాతిరుమల: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో శుక్రవారం గల్లంతైన ద్వారకాతిరుమలకు చెందిన యువకుడు లాలూ నాయక్ (17) మృతదేహం శనివారం లభ్యమైంది. మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది స్నేహితులతో కలసి లాలూ నాయక్ పేరుపాలెం బీచ్కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. అర్ధరాత్రి సమయం నుంచి అతడి ఆచూకీ కోసం స్నేహితులు వెదకడం మొదలు పెట్టారు. అయితే నీటి మునిగిన ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలో, బీచ్ ఒడ్డున లాలూ నాయక్ మృత దేహం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అతడి అన్నయ్య చిన్నాకు కనిపించింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు కొవ్వూరు ఘాట్లో ఖననం చేశారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి పెదవేగి : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన దిబ్బగూడెంలో చోటుచేసుకుంది. పెదవేగి ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన తేటకాల పావని మొదటి కుమార్తె మీనాక్షికి పెదవేగి మండలం దిబ్బగూడెం గ్రామానికి చెందిన బాల సురేష్తో ఐదేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి 19 నెలల ఆడబిడ్డ సంతానం ఉంది. వివాహ సమయంలో రూ.3 లక్షలు కట్నం ఇవ్వగా మిగిలిన రూ.2 లక్షలు గురించి భర్త, అత్త మామలు వేధిస్తున్నారని ఈనెల 25వ తేదీ రాత్రి మీనాక్షి తల్లి పావనికి ఫోన్ చేసి చెప్పింది. శనివారం మీనాక్షి చనిపోయిందని చెప్పారని, కానీ ఆమె ఒంటిమీద దెబ్బలు ఉన్నాయని మృతురాలు తల్లి పావని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె రామకృష్ణ తెలిపారు. మీనాక్షి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు చెప్పారు. -
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు కావడంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఎటు చూసినా భక్త జనమే కనిపించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పురాజగోపుర ప్రాంతంలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, స్వామివారి ఉచిత ప్రసాదం పంపిణీ ప్రాంతం, దర్శనం క్యూలైన్లు భక్తులతో పోటెత్తాయి. అలాగే ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
ఆలోచింపజేసిన నాటికలు
భీమవరం: భీమవరం పట్టణంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీల్లో రెండో రోజు శుక్రవారం ప్రదర్శించిన నాటికలు ఆలోచింప చేశాయి. హైదరాబాద్ యువభేరి ఆర్గనైజేషన్ వారి ‘నా శత్రువు’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసేలా సాగింది. అక్కల తామేశ్వరయ్య రచన, వడ్డాది సత్యనారాయణ దర్శకత్వం వహించారు. రెండో ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి ‘చిగురు మేఘం’ నాటిక కార్పోరేట్ ఆసుపత్రుల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా విలువలు కోల్పోయిన తీరును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. కావూరి సత్యనారాయణ రచన, యేపూరి హరిబాబు దర్శకత్వంలో ఈ నాటిక ప్రదర్శించారు. మూడవ ప్రదర్శనగా చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్ క్రియేషన్స్ ‘మా ఇంటో మహాభారతం’ నాటిక ప్రదర్శించారు. -
ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు ప్రోత్సహించాలి
భీమవరం: ప్రభుత్వ పాఠశాలలో చేరికలపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు విద్యాబోధనపై ఇంటింటి ప్రచారం ద్వారా తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో టెన్త్ పరీక్ష ఫలితాలు, ప్రభుత్వ పాఠశాలలో చేరికలు, అల్పాదాయ వర్గాల పిల్లలకు 25 శాతం సీట్ల కేటాయింపు, బడి బయట పిల్లలు చేరికలు, ఆపార్ ఐడీ నమోదు అంశాలపై అధికారులతో సమీక్షించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగాలన్నారు. టెన్త్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగు సమాచారంతో రూపొందించిన కరపత్రం, వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అధికారులు మరింత కృషి చేయాలి భీమవరం (ప్రకాశంచౌక్): నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు మరింత కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, ఆధార్ నమోదు, మిస్సింగ్ సిటిజనన్స్, మనమిత్ర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. లక్ష్య సాధనకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి పన్ను వసూళ్ల వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆధార్ నమోదు కాని పిల్లలకు సత్వరమే ఆధార్ నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, వారి హక్కులపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016 అనుబంధం మార్గదర్శకాలు అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టం అమలుపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 15 రోజుల్లో జిల్లా అధికారులకు వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. -
రఘురామకృష్ణరాజు నోరు అదుపులో పెట్టుకోవాలి
ిసీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు బలరాం భీమవరం: ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిపై చేసిన వ్యాఖ్యలు అవమానకరం, అసభ్యకరంగా ఉన్నా యని, ఆయన నోటిని అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని ిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం అన్నారు. శుక్రవారం భీమవరం సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశంలో పార్టీ కార్యదర్శి జెఎన్వీ గోపాలన్, కార్యదర్శి వర్గ సభ్యుడు బి.వాసుదేవరావుతో కలిసి మాట్లాడారు. నిత్యం అసభ్య పదజాలాన్ని ఉపయోగించే వ్యక్తి కాబట్టే డిప్యూటీ స్పీకర్ పదవికి అనర్హుడని మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారన్నారు. ఆయన దూషణలు, తాటాకు చప్పుళ్లకు కమ్యూనిస్టులు బెదిరిపోరని స్పష్టం చేశారు. నాలుక ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. మా పార్టీ నాయకుడు మీలా పార్టీలు మారి పదవి కోసం గడపల దగ్గర దేకలేదని, ఆర్థిక నేరగాడు కాదని, ప్రజా ధననాన్ని లూటీ చేసిన మనిషి కాదని విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే ఏం చేయకుండా అధికారాన్ని, ప్రజా ధనాన్ని అలవెన్సులుగా తీసు కుని ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారన్నారని ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు భూస్వాములకు అమ్ముడైపోయాడని, అందుకే వారి చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములు ఆయనకు కనబడడం లేదన్నారు. కాలుష్యమంటూ గొంతు చించుకుంటున్న ఆయనకు యనమదుర్రు డ్రెయిన్, వెంకయ్య వయ్యేరు, బొండాడ డ్రెయిన్, గొంతేరు నదిలో ఉన్న కాలుష్యం కనబడదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో శిధిలావస్థల్లో ఉన్న గరగపర్రు, జక్కరం వంతెనలు కనబడవా? అని ఎద్దేవా చేశారు. ఉండి నియోజకవర్గంలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు బడాబాబుల చేతుల్లో ఉన్నాయని దమ్ముంటే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సవాల్ విసిరారు. జిల్లాలోని పోలీసులు, ఇతర శాఖల అధికారులు తప్పు చేస్తున్నారని ఎవరో చెబితే నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే ఆ తర్వాత పర్యవసానం వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గంలో 800 పేదల ఇళ్లు, 200 షాపులు కూల్చి వేయించి సుమారు రూ.40 కోట్ల ఆస్తిని ధ్వంసం చేయించారని గోపాలన్ చెప్పారు. -
గట్లకు తూట్లు
డ్రెయిన్ గట్లకు తూట్లు పొడుస్తూ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. గోదావరి గట్టును పటిష్టం చేసే పేరిట కొందరు, అనధికారికంగా మరికొందరు మేజర్ డ్రెయిన్ల గట్లను కొల్లగొట్టి మట్టిని తరలించుకుపోతున్నారు. పలుచోట్ల గట్లు కృంగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, భీమవరం: యలమంచిలి మండలం కంచుస్తంభంపాలెం పంచాయతీ వాకలగరువు, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడుపాలెం, లక్ష్మీపాలెం గ్రామాల పరిధిలో దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర సుమారు రూ.6.71 కోట్ల వ్యయంతో వశిష్ట గోదావరి ఏటిగట్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాలుగు నుంచి ఐదు మీటర్లు మేర గట్టును ఎత్తు చేస్తున్నారు. ఆచంట మండలంలోని ఆచంట వేమవరంలోని నక్కల డ్రెయిన్ గట్టుపై కన్నేసిన కూటమి నేతలు ఇక్కడి నుంచి ఏటిగట్టు పనులకు మట్టి తరలించే పేరిట తవ్వకాలు చేపట్టారు. డ్రెయిన్ గట్టును ఆనుకుని డ్రైనేజీ శాఖకు చెందిన సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో నాలుగు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల లోతు వరకు తవ్వకాలు చేసేశారు. ఏటిగట్టు పనుల ముసుగులో మట్టిని పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలకొల్లు, పరిసరాల్లో కొత్తగా వెలుస్తున్న లే అవుట్లు, మెరక పనుల కోసం మట్టిని తరలించేసినట్టు తెలుస్తోంది. నెలరోజుల్లో దాదాపు రూ.కోటికి పైగా విలువైన మట్టిని తరలించుకుపోయినట్టు అంచనా. పరిమితులు పాటించకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు. రోజుకు వందకు పైగా లారీల్లో, నెలరోజులకు పైగా తవ్వకాలు చేసినట్టు తెలిపారు. భారీ లోడుతో లారీలు తిరగడం వలన ఎక్కడికక్కడ గట్టు కృంగి పోయింది. తవ్వకాలు చేసిన చోట ట్రాక్టర్ వెళ్లే దారి లేకుండా గట్టు కాలువలోకి జారిపోయి ప్రమాదభరితంగా తయారైంది. ఇప్పటికే ఆచంట వేమవరం పరిధిలోని ఒక చోట డ్రెయిన్ గట్టు బలహీన పడటంతో ఇక్కడి నుంచి మట్టి తీసుకువెళ్లి గట్టు పటిష్టం చేయాలని భావించామని, ఇంతలో మొత్తం మట్టిని మొత్తం ఊడ్చుకుని ఎత్తుకెళ్లిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయ్యేరులో అక్రమ తవ్వకాలు తణుకు నియోజకవర్గంలో ప్రధానమైన వయ్యేరు అక్రమ తవ్వకాలతో గట్లు బలహీన పడుతున్నాయి. గత ఏడాది భారీ వర్షాలతో ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం ప్రాంతంలో గండిపడి రెండు వేల ఎకరాల్లోని వరి పంట నీటమునిగింది. వయ్యేరు ప్రవాహ ఉధృతికి తణుకు మండలంలోని దువ్వ, తేతలి తదితర గ్రామాల్లో వరి పంట మునిగిపోయింది. దువ్వ రెగ్యులేటరీ వద్ద నివాసాలు నీట మునిగాయి. డ్రెయిన్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రెయినేజీ శాఖకు చెందిన అధికారిపై అప్పట్లో ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు సైతం తీసుకున్నారు. అయినా సంబంధిత అధికారులు పాఠాలు నేర్వకపోవడం గమనార్హం. దువ్వ సమీపంలో వయ్యేరు డ్రెయిన్లో రాత్రి వేళల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పొక్లెయిన్లతో గట్టును తొలిచి ట్రాక్టర్లలో మట్టిని తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్లు డ్రెయిన్లోకి దిగేందుకు వీలుగా ఇసుక ర్యాంపుల్లో మాదిరి బాటను కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ట్రాక్టర్ మట్టి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో గట్లు బలహీన పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు, వరదల సమయంలో గండి పడి ముంపునకు గురయ్యే ప్రమాదముందని వారంటున్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, గట్లను పటిష్టం చేయాలని కోరుతున్నారు. ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్ గట్టు తవ్వకాలు గూర్చి ఆచంట తహసీల్దార్ కనకరాజును సంప్రదించగా తమ పరిధిలోకి రాదని తెలిపారు. నక్కల డ్రెయిన్, వయ్యేరు డ్రెయిన్లో తవ్వకాలుపై డ్రెయినేజీ ఈఈ సత్యనారాయణను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా కలవలేదు. న్యూస్రీల్ నక్కల డ్రెయిన్లో పరిమితికి మించి తవ్వకాలు రూ.కోటికి పైగా విలువైన మట్టిని తరలించేసిన కూటమి నేతలు ఆచంట వేమవరం వద్ద జారిపోయిన గట్టు దువ్వలో వయ్యేరు డ్రెయిన్ గట్టు గుల్ల చోద్యం చూస్తున్న అధికారులు -
దళితుల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఏలూరు (టూటౌన్): చింతలపూడి మండలం బట్టువారిగూడెం గ్రామం విష్ణు సాగర్రోడ్డులో దళిత మహిళ పాము రాణిసాగు చేసుకునే భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి అదనపు విశ్వేశ్వరరావు ని కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ సర్వే నంబర్ 1373/1 కి చెందిన మెట్ట భూమి 2.55 ఎకరాల భూమిని అగ్రవర్ణానికి చెందిన కంభం మెట్టు ఉషశ్రీ తన భర్త శ్యామసుందర్, ఆమె బంధువులు ఆమె తీసుకొచ్చిన కొంతమంది దళారులు కూలీలతో దౌర్జన్యంగా భూమిలోకి చొరబడి నారు పాము రాణిపై ఆమె భర్తపై కులం పేరుతో దూషణకు పాల్పడి వారిని కింద పడేసి కొట్టారన్నారు. దళిత మహిళ నారపాము రాణి జీవనాధారమైన మెట్ట సాగు భూమినే సుమారు 70 సంవత్సరాల నుండి ఆమె పూర్వికులు నుండి ఇప్పటివరకు సాగు చేసుకుని జీవిస్తున్నారు. సదరు భూమిలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ బావి, బోరు ఏర్పాటు చేశారు. ఈ ఆక్రమణపై స్పందించిన డీఆర్ఓ విచారణ నిమిత్తం నూజివీడు ఆర్డీఓకు ఎండార్స్ చేసినట్లు రవిప్రకాష్ తెలిపారు. -
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో దోపిడీ?
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) కోర్సుకు కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. పూర్తి ఉచితంగా భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. జీఎన్ఎం కాలేజీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పేద పిల్లల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాయి. జీజీహెచ్ భవనంలోని నర్సింగ్ కాలేజీలో అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ జీఎన్ఎం కోర్సుకు అడ్మిషన్లు జరిగాయి. ప్రభుత్వం ఏటా 60 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల బాలికలకు జీఎన్ఎం కోర్సు చదివేందుకు అడ్మిషన్లు ఇస్తోంది. అడ్మిషన్ల సమయంలో సదరు నర్సింగ్ కాలేజీ యాజమాన్యం కొత్తగా కోర్సులో చేరుతున్న పిల్లల తల్లిదండ్రుల నుంచి వివిధ రకాల ఫీజుల పేరుతో సుమారుగా రూ.16 వేల వరకూ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్మిషన్ చార్జీ పేరుతో రూ.2 వేలు, పుస్తకాల పేరుతో కొంత వసూలు చేస్తున్నారు. యూనిఫాంలు బయట కుట్టించుకోవటానికి వీల్లేదని.. నర్సింగ్ కాలేజీ చెప్పిన చోట డబ్బులు కట్టి యూనిఫాం తీసుకోవాలని నిబంధన పెడుతున్నారు. ముందుగా భోజనం పెట్టటం సాధ్యం కాదని.. స్టైఫండ్ వచ్చే సరికి 3 నెలలు పడుతుందని ఈ లోగా ఆ సొమ్ములు మీరే చెల్లించాలని చెబుతున్నారు. ప్రశ్నిస్తే.. వేధింపులే ? అసలే పేదవర్గాల పిల్లలు.. ఏదైనా సమస్య వస్తే ఇదేంటని ప్రశ్నిస్తే... వారికి ఇక వేధింపులే. పాస్ కావాలంటే మా చేతుల్లోనే ఉంటుందని, నోరెత్తితే సర్టిఫికెట్ రాదంటూ బెదిరిస్తున్నారు. విద్యార్థినిలు తమ బాధను మౌనంగానే భరిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. బాత్రూంలు సరిపడా ఉండవు. వాటిని క్లీన్ చేయటానికి సిబ్బందిని డబ్బులు ఇచ్చి మరీ ఏర్పాటు చేస్తారు. అయితే విద్యార్థినులే బాత్రూం క్లీన్ చేసుకోవాలంటున్నారు. శిక్షణకు రవాణా చార్జీలు చెల్లించాల్సిందే కోర్సులో భాగంగా సర్వేలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రూరల్ ప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు రవాణా చార్జీలు వారే చెల్లించాల్సి రావటం భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల పాటు సర్వే, ఇతర శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, రోజుకు సుమారుగా రూ.70 నుంచి రూ.100 ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు .నెలకు సుమారుగా రూ.2 వేలకు పైగా వెచ్చించాల్సి రావటం వారి కుటుంబాలపై ఆర్థికంగా భారం పడుతుందని వాపోతున్నారు. ఒక్కో విద్యార్థిని నుంచి రూ.16 వేల వరకూ వసూలు పేద విద్యార్థినులపై ఆర్థిక భారం -
చెరువుల లీజు పేరుతో బ్యాంకుకు టోపీ
మట్టిని తోడేస్తున్న మాఫియా నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన టీడీపీ నాయకుడు పాలెం చెరువులో మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు చేపట్టి మట్టిని తవ్వేస్తున్నాడు. 10లో uముదినేపల్లి రూరల్: చేపల చెరువులు లీజుకు తీసుకున్నట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి రూ.కోట్లలో రుణం పొంది ఎగ్గొట్టిన వైనంపై సీబీఐ అధికారులు మండలంలోని పలు గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో విచారణ నిర్వహించారు. గురజ, చేవూరు, దేవరం, కాకరవాడ, అల్లూరు గ్రామాల పరిధిలోని రైతుల పేరుతో పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఒక బడాబాబు భీమవరంలోని ఒక జాతీయ బ్యాంకులో 10 ఏళ్ళ క్రితం రూ.కోట్లలో రుణం పొందాడు. 188 మంది రైతుల పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారుచేసి చేపల చెరువులు లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించి బ్యాంకులో రుణం పొందాడు. ఈ రుణాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించగా.. బోగస్ డాక్యుమెంట్లతో రుణాన్ని పొందినట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ అధికారులకు గత అక్టోబరులో ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు గురు, శుక్రవారాల్లో మండలంలో విచారణ జరిపారు. తమ పేరున ఉన్న వరి సాగు చేసుకున్న పొలాలను 2020లో చెరువులు తవ్వించగా 2015 లోనే చెరువులు లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు ఎలా సృష్టించారని ప్రశ్నించారు. స్థానిక వీఆర్వోల నుంచి వివరాలు సేకరించారు. తమ పేరున రూ.కోట్లలో రుణాలు పొందడం సాధారణంగా సాధ్యమయ్యే పని కాదని ఇందుకు స్థానికులు కొందరు సహకరించి ఉంటారనే అనుమానాన్ని బాధిత రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగ రుణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. -
సాక్షి కార్యాలయంపై దాడికి నిరసన
యలమంచిలి: ఏలూరు సాక్షి కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అను చరుల దాడిని ఖండిస్తూ పాలకొల్లు ప్రెస్క్లబ్ నాయకులు శుక్రవారం పాలకొల్లు తహసీల్దార్ వై.దుర్గా కిషోర్కు వినతిపత్రం ఇచ్చారు. పత్రికా సేచ్ఛకు విఘాతం కలిగిస్తున్న వారిని అరెస్ట్ చేయాలని కోరారు. ఇలంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. నిరసన తెలిపిన వారిలో పాలకొల్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విన్నకోట వెంకటరమణ, కార్యదర్శి ఎం.వి.సాంబశివరావు, ఏపీడబ్ల్యూజే జిల్లా కోశాధికారి ముత్యాల శ్రీనివాస్, ఏపీడబ్ల్యూఈ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జక్కంశెట్టి శ్రీనివాసరావు, పీటీ వెంకటేశ్వరరావు, మద్దా విజయ లాజరస్, మండెల అప్పలరాజు, కర్రా నాయుడు, బుడ్డిగ గోపి, బండి శ్రీనుబాబు, కాపిశెట్టి గోపాలరావు, కారుమంచి రాజగోపాల్, టి.రాఘవ, గుడాల బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పన్ను వసూళ్లలో ప్రథమ స్థానం తాడేపల్లిగూడెం (టీఓసీ): రాజమండ్రి రీజియన్ లో ఆరు పురపాలక సంఘాల పరిధిలో 2024– 25 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నులు వసూలులో రాష్ట్రంలోనే రీజియన్ ప్రథమ స్థానం సాధించింది. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో రీజినల్ డైరక్టర్(రాజమండ్రి) సీహెచ్ నాగ నరసింహరావుకు సత్కారం చేశారు. పాత పశ్చిమ గోదావరి జిల్లా పురపాలక సంఘాల కమిషనర్లు హాజరయ్యారు. పన్ను వసూలులో తాడేపల్లిగూడెం మూడో స్థానం సాధించడంతో కమిషనర్ యేసుబాబును సత్కరించారు. జాతీయ లోక్ అదాలత్ వాయిదా ఏలూరు (టూటౌన్): మే 10న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ జూలై 5కి వాయిదా వేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. కక్షిదారులు ఈ మార్పును గమనించాలన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర కమిటీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ఇంటలెక్చువల్స్ ఫోరం అధికార ప్రతినిధిగా ఈదా యహోషువా, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ జాయింట్ సెక్రటరీగా ఇనపర్తి రాహుల్, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా గూడూరి ఉమాబాల, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీలుగా వీరమల్లు లక్ష్మి నారాయణ, ఇంజేటి జాన్ కెన్నడీ, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా కరిమెరక రామచంద్రరావు నియమితులయ్యారు. పన్ను వసూళ్లు, చెత్త సేకరణలో అవార్డులు భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర స్థాయిలో పన్ను వసూళ్లు, ఇంటింటా చెత్త సేకరణలో పశ్చిమగోదావరి జిల్లా రెండు అవార్డులను సొంతం చేసుకోవడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులను, సిబ్బందిని కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. శుక్రవారం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ను డీపీఓ బి.అరుణ శ్రీ కలుసుకుని అవార్డుల విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. -
చెల్లి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్య
పెనుగొండ: తోడబుట్టిన చెల్లెలు మరణాన్ని తట్టుకోలేక అమ్మా నేనూ వచ్చేస్తున్నానంటూ అన్న ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సిద్ధాంతం ప్రజలను కలచి వేసింది. సిద్ధాంతానికి చెందిన ఈదుపల్లి లక్ష్మీ నరసింహ(21) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి మృత్యువుతో పోరాడి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచాడు. వివరాల్లోకి వెళితే సిద్ధాంతంకు చెందిన ఈదుపల్లి నాగలక్ష్మీ అనారోగ్యంతో ఈ నెల 10న ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఏసీ మెకానిక్గా జీవనం సాగిస్తున్న అన్న లక్ష్మీ నరసింహ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చెల్లె మరణం జీర్ణించుకోలేక ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లిదండ్రులు వెంటనే గమనించి తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. దీంతో తండ్రి ఈదుబిల్లి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పెనుగొండ ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలూ మృత్యువాత పడడంతో ఈదుబిల్లి సూర్యనారాయణ దంపతులు తల్లడిల్లిపోతున్నారు. పెనుగొండలో చదువుకుంటున్న కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే చేతికందివచ్చి, కుటుంబానికి అండగా నిలుస్తాడునుకున్న కొడుకూ మృతి చెందడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. -
ఉగ్ర దాడికి నిరసనగా..
భీమవరం: కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ భీమవరంలో శుక్రవారం ఇండియన్ ఫోరం ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ ఆధ్వర్యంలో మతాలకతీతంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశంచౌక్ సెంటర్లో ర్యాలీనుద్దేశించి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముహమ్మద్ సిద్ధిక్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి మానవతపై జరిగిన దాడిగా అభివర్ణించారు. సీపీఎం సెక్రెటరియేట్ సభ్యుడు బి.బలరామ్, దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు గంటా సుందరకుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వి గోపాలన్, జమాతే ఇస్లామీ హింద్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజెషన్, క్రైస్తవ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. తణుకులో.. తణుకు అర్బన్: ఉగ్రవాదుల మారణకాండకు నిరసనగా తణుకులో ముస్లిం మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. ఉగ్రవాదం నశించాలి.. హంతకులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ముస్లిం మహిళలతోపాటు ఐద్వా మహిళలు పాల్గొన్నారు. -
చెరువుల్లో మట్టిని తోడేస్తున్న మాఫియా
నూజివీడు: అధికార పార్టీ మట్టి మాఫియా చెరువుల్లోని మట్టిని తోడేస్తోంది. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తు న్నా అధికార వర్గాలు కళ్లుమూసుకుని కూర్చుంటున్నారే గానీ వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన టీడీపీ నాయకుడు గ్రామంలో ఉన్న పాలెం చెరువులో మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు చేపట్టి మట్టిని బయటకు తరలిస్తున్నారు. ట్రాక్టరు ట్రక్కు మట్టిని రూ.500ల నుంచి రూ.600లకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇందులో ప్రొక్లెయిన్తో తవ్వి ట్రాక్టర్ నింపడానికి రూ.100లు చెల్లిస్తున్నారు. ఈ చెరువు మట్టి ఓగిరాల తండా, హటియాతండా, హరిశ్చంద్ర తండాలకు వెళ్తోంది. ఆయా గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఎవరైనా తమకు మట్టి కావాలంటే వారికి తోలకుండా కేవలం టీడీపీ వారికే మట్టిని అమ్ముతున్నారని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. చెరువు అనేది గ్రామ ప్రజలందరదీ అయినప్పుడు కొంతమందికి తోలడం, కొంతమందికి తోలకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా మైనింగ్ చేసి మట్టిని అమ్ముకుంటున్నా ఇటు రెవెన్యూ అధికారులు గానీ, అటు ఇరిగేషన్ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ ఏమీ పట్టనట్లు ఉండటం గమనార్హం. అయితే శుక్రవారం మధ్యాహ్నానికి గ్రామస్తుల నుంచి రెవెన్యూ అధికారులకు అక్రమ తవ్వకాలపై పదేపదే ఫోన్లు రావడంతో మట్టి తవ్వకాలను ఆపారు. ఇటీవల ఆగిరిపల్లి మండలం నర్సింగపాలెంలో సీఎం ఇంటి మెరక పనులకు అంటూ కొండ నుంచి గ్రావెల్ను అక్రమంగా తవ్వి టిప్పర్లలో తరలించి అమ్ముకున్నారు. ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతున్న తవ్వకాల గురించి అధికారులు పట్టించుకోకపోయినా గ్రామస్తులే అడ్డుకున్నారు. ఇదే మండలంలోని ఈదరలోని పంగిడమ్మ చెరువులోని మట్టిని సైతం కొల్లగొడుతున్నారు. ఈ చెరువు నుంచి మట్టి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలకు మట్టిమాఫియా సరఫరా చేస్తోంది. నూజివీడు మండలంలో కొన్నంగుంట, పోతురెడ్డిపల్లి, మొర్సపూడి, చాట్రాయి మండలం పోలవరం తదితర గ్రామాల్లో కూడా చెరువుల్లోని మట్టిని అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. -
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
ద్వారకాతిరుమల: పేరుపాలెం బీచ్లో స్నేహితులతో కలసి సరదాగా స్నానం చేస్తుండగా ద్వారకాతిరుమలకు చెందిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. వివరాల ప్రకారం మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది యువకులు శుక్రవారం ఉదయం ఒక ఆటోలో పేరుపాలెం బీచ్కు వెళ్లారు. బీచ్లో స్నానం చేస్తుండగా ద్వారకాతిరుమలకు చెందిన లాలూ నాయక్(17), సత్తెన్నగూడెం గ్రామానికి చెందిన మధు బీచ్ లోపలికంటూ వెళ్లారు. లాలూ నాయక్ గల్లంతు కాగా, మధు ప్రాణాలతో బయటపడ్డాడు. సహాయక సిబ్బంది నాయక్ కోసం గాలిస్తున్నారు. తొమ్మిది మంది యువకులు ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నారు. చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు జంగారెడ్డిగూడెం: తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి పట్టపగలు తాళాలు పగులగొట్టి ఇళ్లల్లోకి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టి.నరసాపురం మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఒంటెద్దు క్రాంతికుమార్రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 200 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
వారెవ్వా.. షవర్ బాత్
శ్రీవారి కొండపై జల్లు స్నానంతో సేదతీరుతున్న మూగజీవాలు భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. అయితే ద్వారకాతిరుమల క్షేత్రంలోని దేవస్థానం గో సంరక్షణశాలలో మూగజీవాలు షవర్ బాత్లు చేస్తూ ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఎక్కడాలేని విధంగా దేవస్థానం అధికారులు ఈ మూగజీవాల కోసం రూ. 2 లక్షలు పైగా వెచ్చించి గో, గజ శాలల్లో గతంలోనే షవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఆవులు, గిత్తలకు, అలాగే అశ్వానికి షవర్ల కిందే సిబ్బంది జల్లు స్నానం చేయిస్తున్నారు. అదేవిధంగా గజలక్ష్మి సైతం జల్లు స్నానంతో ఉపసమనాన్ని పొందుతోంది. కజానా బాతులైతే ఎక్కువ సమయం గోసంరక్షణశాలలోని కొలనులోనే ఉంటున్నాయి. ఇవి చూపరులను ఆకర్షిస్తున్నాయి. – ద్వారకాతిరుమల -
యథేచ్ఛగా చెట్ల నరికివేత
నిబంధనలను మీరి మరీ.. ఏలూరు డివిజన్(4, 5 ప్యాకేజీలు) పరిధిలోని పోలవరం కుడి కాలువ వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులు నిర్వహించేందుకు భీమవరానికి చెందిన పంచగర్ల సత్యనారాయణ కాంట్రాక్టుకు తీసుకున్నాడు. నారాయణపురం పరిధిలోని కాలువ వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులను తామే చేసి, అప్పగిస్తామని పార్టీ గ్రామ కమిటీ అద్యక్షుడు కేఎన్ఆర్ కాంట్రాక్టర్తో మాట్లాడుకుని, అక్కడ తుమ్మచెట్లు నరకకుండా మొత్తం వేప చెట్లను నరికేశారు. దీనిపై నాకు శుక్రవారం కొందరు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత వ్యక్తులను ఏలూరు కార్యాలయానికి వచ్చి ఫైన్ కట్టమని హెచ్చరించాను. అలాగే దగ్గరుండి పనులు చేయించాలని కాంట్రాక్టరుకు సూచించాను. – బాపూజీ, ఇరిగేషన్ ఏఈ ●ద్వారకాతిరుమల : ఓ పచ్చనేత పోలవరం కుడి కాలువ గట్టుపై ఉన్న చెట్లపై కన్నేశాడు. ఇంకేముంది పట్టపగలే వాటిని నరికించే పనిలో పడ్డాడు. ఇప్పటికే వేప తదితర జాతులకు చెందిన దశాబ్దాల కాలం నాటి ఎన్నో చెట్లను నరికించేశాడు. ఇప్పటికే కొంత కలపను విక్రయించగా, మరి కొంత కలపను విక్రయించేందుకు సిద్ధం చేశాడు. చెట్లు నరికివేతపై ఆ నాయకుడిని ఎవరైనా ప్రశ్నిస్తే, నేనెవరో తెలుసా..? టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని అంటున్నాడు. దాంతో సంబంధిత అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడడానికి భయపడుతున్నారు. వివరాల ప్రకారం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం–గుణ్ణంపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై గత పది రోజులుగా చెట్లు నరికివేత పనులు జరుగుతున్నాయి. పట్టపగలే ఈ పనులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. దాంతో ఎంతో విలువైన వేప, తదితర జాతులకు చెందిన భారీ వృక్షాలను నరికి వేస్తున్నారు. ఇప్పటికే కొంత కలపను విక్రయించగా, మరి కొంత కలపను అమ్మేందుకు సిద్ధం చేశారు. కాలువ గట్టుపై అక్కడక్కడా ఆ కలపను గుట్టలుగా ఉంచారు. అసలు నేనెవరో తెలుసా..? ఎం.నాగులపల్లి–గుణ్ణంపల్లి మధ్యలో శుక్రవారం చెట్లు నరికే సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్పై అటుగా వెళ్లారు. నరికిన చెట్లను ట్రాక్టర్తో బయటకు లాగడాన్ని చూసి, అక్కడున్న వారిని నిలదీశారు. ఎంతో విలువైన వేప చెట్లను ఎవరి అనుమతులతో నరుకుతున్నారని ప్రశ్నించారు. దాంతో కోపోద్రిక్తుడైన ఒక నాయకుడు అసలు నేనెవరో తెలుసా.. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని, నేను చూసుకుంటాను అంటూ ఊగిపోయాడు. ఫోన్లో వీడియో ఎందుకు తీస్తున్నారని బైక్పై ఉన్న వారితో సదరు నాయకుడు, అతనితో ఉన్నవారు వాగ్వివాదానికి దిగారు. దాంతో ఏం చేస్తారోనన్న భయంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ అక్రమాలను ఆపేదెవరూ? కళ్లముందే పచ్చని చెట్లను నరికేస్తుంటే సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమని స్థానికులు అంటున్నారు. ఎంత అధికార పార్టీ నాయకులైతే మాత్రం అక్రమంగా చెట్లు నరికి, అమ్మేస్తుంటే పట్టించుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. కాలువ గట్టుపై జంతుజాలాలు, పక్షు జాతులకు ఆవాసంగా ఉన్న చెట్లను అక్రమంగా నరికివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, చెట్లను నరికి, అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలవరం కాలువ గట్టుపై ఉన్న చెట్లపై టీడీపీ నేత కన్ను కొంత కలప విక్రయం, మరికొంత అమ్మేందుకు సిద్ధం -
కొంతేరులో నాటిక పోటీలు ప్రారంభం
యలమంచిలి: యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి కళామందిరంలో నిర్వహించిన అఖిల భారత స్థాయి నాటిక పోటీలలో తొలి రోజు రెండు నాటికలు ప్రదర్శించారు. మొదటగా గుడివాడకు చెందిన కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసి యేషన్ వారు ప్రదర్శించిన ద్వారబంధాల చంద్రయ్యనాయుడు నాటిక ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పీవీ సత్యనారాయణ రచించిన ఈ నాటకానికి పి.కృష్ణ హితేష్ దర్శకత్వం వహించారు. రెండవ నాటికగా హైదరాబాద్ విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక అలరించింది. ఈ నాటికను పరమాత్ముని శివరాం రచించారు.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టుపాలకొల్లు (సెంట్రల్): కూటమి నాయకులను ఎక్స్ ఖాతాలో దూషించారంటూ అందిన ఫిర్యాదు మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిగురువాడ గ్రామానికి చెందిన అమితి హరి ప్రసాద్అనే వ్యక్తిని అదుపు తీసుకున్నామని పాలకొల్లు టౌన్ పోలీసులు శుక్రవారం తెలి పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కు టుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం, బూతులు తిడుతూ వారి వ్యక్తిత్వహన నానికి పాల్పడ్డాడని పాలకొల్లుకు చెందిన టీడీపీ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ధనాని సూర్యప్రకాష్ ఫిర్యాదు చేశారన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, లోకేష్లపై కూడా తిడుతూ పోస్టులు పెట్టారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె.రజిని కుమార్ తెలిపారు. ఎంపీడీఓను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం ఉంగుటూరు: ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంజి రాజ్మనోజ్కు శుక్రవారం ఓ వింత అనుభవం ఎదురైంది. శుక్రవారం ఎంపీడీఓకు ఓ నంబర్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. లైన్లో ఉండండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారని ఎంపీడీఓకు ఫోను కలిపారు. నేను పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ త్రివేదిని అంటూ మాట్లాడుతూ మా మేనల్లుడు ఆశ్రం ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు . డబ్బు సర్దండి అంటూ ఒక ఫోను నెంబరు చెప్పారు. పైగా ఈ విషయం ఎవరికి చెప్పకండంటూ చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఎంపీడీఓ ముందు తడబడినా ఆ తర్వాత పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సత్యభూషణ కుమార్ కదా? అని గుర్తు వచ్చి మిన్నకుండిపోయారు. దొంగ అరెస్టు భీమవరం: నడిచి వెళ్తున్న మహిళ మెడలో బంగారుచైన్ లాక్కుని పారిపోతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భీమవరం వన్టౌన్ ఎస్సై కృష్ణాజీ శుక్రవారం చెప్పారు. మెంటేవారితోటకు చెందిన జి.వాసవి బుధవారం మార్కెట్కు రైల్వే అండర్ టన్నెల్ నుంచి నడుచుకుంటూ వస్తుండగా పాలకొల్లుకు చెందిన కొప్పర్తి అలెగ్జాండర్ పౌల్ ఆమె మెడలోని చైన్ లాక్కుని పారిపోతుండగా వాసవి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కలవారు పౌల్ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై కృష్ణాజీ చెప్పారు. లారీ తిరగబడి డ్రైవర్ మృతి జంగారెడ్డిగూడెం: మండలంలోని పుట్లగట్లగూడెం నుంచి పంగిడిగూడెం వైపు వెళ్ళే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రీన్ ఫీల్డ్ హైవే లారీ డ్రైవర్ ధనుంజయ్ సింగ్ (44) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. లక్కవరం ఎస్సై శశాంక తెలిపిన వివరాల ప్రకారం ఝార్ఖండ్ రాష్ట్రం పిప్రా గ్రామానికి చెందిన ధనుంజయ్ సింగ్ కొంత కాలంగా గ్రీన్ ఫీల్డ్ హైవే స్టాక్ పాయింట్లో కాంక్రీట్ మిక్చర్ లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం లారీలో కాంక్రీట్ తీసుకుని పంగిడిగూడెం వైపునకు వెళ్తున్నాడు. రహదారి మధ్యలో లారీ నిలిచిపోవడంతో పదేప దే లారీను స్టార్ట్ చేయగానే లారీ వెనక్కి వెళ్లి డివైడర్ను ఢీకొట్టి తిరగబడింది. ఈ ప్రమాదంలో ధనుంజయ్ సింగ్ తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలం వద్దనే మృతి చెందాడు. ఈ ఘటనపై గ్రీన్ ఫీల్డ్ హైవే సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులతో ఉద్యోగావకాశాలు
భీమవరం: పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. టెన్త్లో మంచి మార్కులు సాధించి పాలిటెక్నిక్లో చేరాలనుకోవడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కాళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యనభ్యసించిన నిమ్మల యశస్విని పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 586 మార్కులను సాధించిన సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏం చదవాలి? అనుకుంటున్నావని కలెక్టర్ ప్రశ్నించగా పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి పాలిటెక్నిక్ చదవాలనుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేయడంతో మంచి నిర్ణయమంటూ యశస్వినిని కలెక్టర్ నాగరాణి అభినందించారు. టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు కోర్సుల ఎంపికలో యశస్వినిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మంచి ఫలితాల సాధనకు విద్యార్థులను ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయుడు జేఎల్ఎం శాస్త్రి శాలువాతో కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ, ఎంఈఓ ఎ.రవీంద్ర, విద్యార్థిని తల్లిదండ్రులు నిమ్మల శ్రీనివాసరావు, భారతి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు గేలం
శురకవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025విస్తృతంగా తనిఖీలు పట్టణంలోని హోటళ్లు, లాడ్జీలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఆయా వ్యక్తులతోపాటు లాడ్జి యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే లాడ్జీల్లో రూమ్లు తీసుకుంటున్న వారి వివరాలు ఆధార్ కార్డుతో సహా నమోదు చేసి ప్రతిరోజూ పోలీస్స్టేషన్కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశాం. – జి.కాళీచరణ్, టూటౌన్ సీఐ, భీమవరం యువత పెడతోవ ● భీమవరంలోని లాడ్జిల్లో పేకాట, బెట్టింగ్, వ్యభిచార కార్యకలాపాలు ● పట్టణంలో 35 వరకు లాడ్జీలు, హోటళ్లు ● గుట్టుగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ● విద్యార్థులే లక్ష్యంగా నిర్వాహకుల గేలం ● గంటల లెక్కన అద్దె వసూళ్లు సాక్షి, భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరం విద్య, వైద్యం, ఆక్వా హబ్గా పేరొందింది. వ్యాపార లావాదేవీలు, ఇతర పనుల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం పట్టణంలో వన్టౌన్, టూటౌన్ పరిధిలో 35 వరకు హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. వీటిలోని పలు లాడ్జీలు పేకాట, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. అడపాదడపా పోలీసుల తనిఖీల్లో ఒకటి అరా సంఘటనలు వెలుగు చూస్తుండగా గుట్టుగా సాగిపోతున్న వ్యవహారాలు ఎన్నో. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో భీమవరం, పరిసరాలకు చెందిన బుకీలు పట్టణంలోని లాడ్జీలు కేంద్రంగానే బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని పలు లాడ్జీలు పేకాటకు కేరాఫ్గా మారాయని సమాచారం. అదనంగా వసూలు చేస్తూ.. సాధారణంగా ఎవరైనా లాడ్జిలోని రూం తీసుకునే సమయంలో వారి ఆధార్ కార్డు, సెల్ఫోన్ నంబర్, ఎన్ని రోజులు ఉంటారు? తదితర వివరాలను లాడ్జి నిర్వాహకులు రిజిస్టర్లో నమోదు చేయాలి. ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే ఏ పని నిమిత్తం వారు పట్టణానికి వచ్చారు? ఎన్ని రోజులు ఉంటారనే వివరాలను కూడా రిజిస్టర్లో నమోదుచేయాలి. ప్రతిరోజూ ఆ వివరాలను పోలీస్స్టేషన్లో అందజేయాలి. కాగా చాలాచోట్ల ఇవేమీ అమలుకావడం లేదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ముందుగానే లాడ్జి నిర్వాహకులు, సిబ్బందితో మాట్లాడుకోవడం ద్వారా వ్యక్తిగత వివరాలేమి ఇవ్వకుండానే రూముల్లో దిగి తమ పని కానిస్తున్నారు. సాధారణంగా రూమ్ అద్దెలతో పోలిస్తే వీరి నుంచి నిర్వాహకులు రెండు మూడింతలు ఎక్కువగా వసూలు చేస్తూ వారికి సహకరిస్తున్నారు. కొంతమంది పోలీసు సిబ్బందికి నెలవారీగా మామూళ్లు ముట్టచెప్పుతూ ఎప్పుడైనా పోలీసులు తనిఖీలకు వచ్చే సమయంలో వారి ద్వారా ముందుగానే సమాచారం తెలుసుకుని జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. న్యూస్రీల్విద్యాపరంగా పట్టణం పేరొందింది. దూర ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ప్రేమ కార్యకలాపాలు సాగించేందుకు ఏకాంతం కోరుకునే యువ జంటలు లాడ్జిలను ఆశ్రయిస్తున్నారు. ఫలానా లాడ్జి అయితే సేఫ్ అని, స్టూడెంట్స్కు గంటల లెక్కన మాత్రమే అమౌంట్ తీసుకుంటారని లోపాయికారీగా పబ్లిసిటీ చేయించుకోవడం ద్వారా కొన్ని లాడ్జ్జీలు యువతకు గేలం వేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఒక లాడ్జిలో పోలీసులు సోదాలు చేయగా తొమ్మిది జంటలు దొరకగా అందరూ విద్యార్థులే కావడం గమనార్హం. లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తరచూ తనిఖీలు చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
సమస్యలతో సీహెచ్ఓల సతమతం
పెంటపాడు: నేషనల్ హెల్త్మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ)లు సమస్యలతో సతమతమవుతున్నారు. గ్రామీణ స్థాయిలో సేవలందిస్తున్న వీరు ఉద్యోగ భద్రత లేక, సకాలంలో జీతాలు అందక, సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 368 సీహెచ్ఓలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 14 రకాల ఆరోగ్య సేవలను వీరు అందిస్తున్నారు. మలేరియా, డెంగీ నివారణకు కృషి చేయడంతో పాటు గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య జాగ్రత్తలు వివరిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా ఆరోగ్య సర్వే, ఫ్యామిలీ హెల్త్ సేవలు, ఇంటింటికీ సేవలు అందిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వీరంతా జిల్లాకేంద్రాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ప్రధానంగా వీరికి మూడు నెలలుగా ఇన్సెంటివ్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సీహెచ్ఓల డిమాండ్లు ● ఆరేళ్లు పూర్తయిన సీహెచ్ఓల సర్వీసులను క్రమబద్ధీకరించాలి. ● ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ● ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి ● జీతాలతో పాటు ఇన్సెంటివ్లు అందించాలి. ● గ్రామాల్లో ప్రభుత్వ క్లినిక్ల అద్దెలను సకాలంలో చెల్లించాలి. ఉద్యోగ భద్రత కరువు మూడు నెలలుగా ఇన్సెంటివ్ బకాయిలు నిరవధిక సమ్మెకు సన్నద్ధం -
ధాన్యం కొనుగోలు వేగిరపర్చాలి
పెంటపాడు: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ టి.శివరామప్రసాద్ ఆదేశించారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. సేవా కేంద్రాల్లో ట్రక్షీ ట్, సంచుల వివరాలు, ట్రక్కుషీట్, ట్రాన్స్ఫర్ ఆ ర్డర్, రైతులు ఆరబోసిన ధాన్యం తేమశాత, మిల్లర్ల వద్ద మిల్లర్లు వద్ద పనితీరు పరిశీలించారు. మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా సంచులను రైతు సేవా కేంద్రాలకు అందజేయాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.479 కోట్ల విలువైన 2,07,721 టన్నుల ధాన్యాన్ని 21,920 మంది రైతుల వద్ద నుంచి సేకరించామన్నారు. ఏడీఏ పి.మురళీకృష్ణ, ఇన్చార్జి తహసీల్దార్ సీతారత్నం, ఏఓ సారథి, కో–ఆపరేటివ్ అధికారి రవికుమార్ ఆయన వెంట ఉన్నారు. -
సినిమాల్లో ఇతర భాషల నటులే ఎక్కువ
భీమవరం: తెలుగు సినీ రంగంలో నిర్మాతలు మినహా ఎక్కువ మంది ఇతర భాషల వారే ఉన్నారని సినీ నటుడు రావు రమేష్ అన్నారు. గురువారం రాత్రి భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ 18వ జాతీయస్థాయి సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాటి సినీ నటులు నాటక రంగం నుంచి వెళితే నేడు నాటక రంగంతో ఎలాంటి పరిచయం లేకున్నా ఇన్స్టా గ్రామ్, సోషల్ మీడియాలో స్క్రిట్స్, రీల్స్ వంటివి చూసి నటులను ఎంపిక చేసుకునే రోజులు నడుస్తున్నాయన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ నాటక రంగానికి ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, సినీ పరిశ్రమకు ఇస్తున్న రాయితీలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కళారంగాన్ని ప్రత్యేకించి నాటక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ డిజిటల్ రంగంలో ప్రజలు మునిగి తేలుతున్న సమయంలో కళాపరిషత్లు నాటక రంగాన్ని రక్షించడం గొప్ప విషమని, నాటక రంగాన్ని బతికించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ మాట్లాడుతూ నాలుగు రోజులపాటు 10 నాటికలు ప్రదర్శిస్తామన్నారు. ముందుగా సినీ నటుడు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు, రచయిత ఎస్కే మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి పి.మణిబాలకు పెనుబోతుల శేషగిరిరావు హార్థిక చైతన్య పురస్కారాలతో సత్కరించారు. అనంతరం ప్రదర్శించిన కళానికేతన్ కాట్రపాడు వారి కిడ్నాప్, మైత్రి కళానిలయం హైదరాబాద్ వారి బ్రహ్మ స్వరూపం నాటికలు ఆకట్టుకున్నాయి. డీఎన్నార్ కళాశాల అధ్యక్షుడు గోకరాజు వెంకట నర్సింహరాజు, చిలుకూరి నర్సింహరాజు, మంతెన రామ్కుమార్ రాజు, పీఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, నడింపల్లి మహేష్కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు రావు రమేష్ -
పారిశుద్ధ్యంపై శ్రద్ధ తప్పనిసరి
భీమవరం (ప్రకాశంచౌక్): పారిశుద్ధ్యం, పింక్ టాయిలెట్స్, ప్లాస్టిక్ నిర్మూలన, చలి వేంద్రాల ఏర్పాటుపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో గురువారం కలెక్టరేట్తో సమీక్షించారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్లాస్టిక్ వినియోగించే షాపులపై ఆకస్మిక తనిఖీలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వేసవి దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాతలు సహకారంతో పార్కులు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆహార తినుబండారాలు, హోటళ్లపై తనిఖీలు చేసి నాణ్యత లోపాలుంటే కేసులు నమోదు చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు రామచంద్రారెడ్డి (భీమవరం), ఎం.ఏసుబాబు (తాడేపల్లిగూడెం), టి.రామకుమార్ (తణుకు), బి.విజయ సారథి (పాలకొల్లు), ఎం.అంజయ్య (నరసాపురం), జి. కృష్ణమోహన్ (ఆకివీడు), కలెక్టరేట్ డీటీ ఎం.సన్యాసిరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు పదవులు యలమంచిలి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన పలువురిని వివిధ హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా జగడ ఉమామహేశ్వరరావు, జనరల్ సెక్రటరీగా ఖండవల్లి వాసు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మైలాబత్తుల మైఖేల్ రాజు, ఓదూరి భాస్కరరావు, సెక్రటరీలుగా కడలి ఏడుకొండలు, సంకరపు శ్రీను, అధికార ప్రతినిధిగా మామిడి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
భీమవరం: పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆశా కార్యకర్తల ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఆశా వర్కర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భీమవరం త్యాగరాజ భవనంలో చింతపల్లి లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సర్వీస్ను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వం యాప్తో పనిభారం పెంచిందని విమర్శించారు. ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ, కనీస వేతనాలు లేవని పీఎఫ్, ఈఎస్ఐ ఊసెత్తకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని గోపీమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తేస్తున్న లేబర్ కోడ్స్ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు బి. వాసుదేవరావు, డి.కల్యాణి, ఎ.అజయ్ కుమారి, యూనియన్ జిల్లా కార్యదర్శి డి.జ్యోతి, ఎల్ఎస్ కుమారి తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’పై దాడి అమానుషం
వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఇన్చార్జి సునీల్ ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేయటం, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంలో కంప్యూటర్లు ధ్వంసం చేయటం సరికాదని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, మంచి చేయండి, ప్రజలకు చేరువ కావటానికి ప్రయత్నం చేయండి, పత్రికా స్వేచ్ఛను ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉంటూ బెదిరింపులు, అనుచరులతో దాడులు చేయటం ఏమాత్రం సమర్థనీయం కాదు అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారం తమకు వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. దౌర్జ న్యాలు, అరాచకాలు, లిక్కర్ మాఫియా, కోడిపందాలు, జూదాలు తప్ప ఏమున్నాయని సునీల్ ప్రశ్నించారు. -
హత్యకు దారితీసిన సరిహద్దు తగాదా
యలమంచిలి : సరిహద్దు తగాదాల నేపథ్యంలో కొంతేరు కట్టా వారి పుంతకు చెందిన కత్తుల పౌలు (58)ను అతని ఎదురింటిలో ఉండే బత్తుల ఏసుదాసు (పెద్దోడు), అతని భార్య భారతి కలసి హత్య చేశారు. మృతుడు పౌలు భార్య జానకమ్మ పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పౌలు, ఏసుదాసు స్నేహితులు. కొంతకాలం క్రితం సరిహద్దు తగాదా రావడంతో శత్రువులయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పౌలు ఇంటి తలుపులు చప్పుడు కావడంతో జానకమ్మ తలుపు తీసింది. ఆమెను తోచుకుని లోపలకు వెళ్లి ఏసుదాసు, అతని భార్య భారతి పౌలుపై దాడి చేసి కత్తితో నరికారు. పౌలు మెడ, ఎడమ భుజం, కుడి చేతికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు జానకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరసాపురం డీఎస్పీ శ్రీవేద, పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. పౌలు మృతదేహానికి శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
నర్సింగ్ కాలేజీలో వసూళ్ల పర్వం!
ఏలూరు టౌన్: ఏలూరు జీజీహెచ్ భవనంలో నిర్వహిస్తున్న జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తోంది. అడ్మిషన్ల నుంచి క్యాపింగ్ సెర్మనీ వరకు విద్యార్థినుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు చెల్లించాలంటూ నర్సింగ్ విద్యార్థినులపై కాలేజీ యాజమాన్యం వత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదవర్గాల పిల్లలకు వృత్తివిద్యా కోర్సులు అందించేందుకు ప్రభుత్వం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) మూడున్నర సంవత్సరాల డిప్లమో కోర్సును అందిస్తోంది. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో భవనంలోనే ఒక విభాగంలో జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు అందిస్తూ పూర్తి ఉచితంగా జీఎన్ఎం కోర్సును పేద వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. మూడున్నరేళ్ల కోర్సుకు సంబంధించి ఒక్కో ఏడాది 60 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద వర్గాల పిల్లలకు ఉచితంగా నర్సింగ్ కోర్సును అందిస్తూ వారి కాళ్లపై వారు నిలబడి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పర్చుకోవటమే ప్రభుత్వ లక్ష్యం. కానీ ఏలూరు జీజీహెచ్లోని జీఎన్ఎం కోర్సు చదివే విద్యార్థినులతో యాజమాన్యం దారుణంగా ఆటలాడుతూ భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారీగా వసూళ్లు? ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలోని జీఎన్ఎం నర్సింగ్ కాలేజీలో రెండు రోజుల్లో క్యాపింగ్ సెర్మనీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 240 మంది విద్యార్థినులకు వారి విద్య పూర్తిచేసి ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో క్యాపింగ్ సెర్మనీ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఒక్కో విద్యార్థిని నుంచి రూ.2 వేలు వసూలు చేసేలా యాజమాన్యం టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థినిల నుంచి రూ.4.80 లక్షల సొమ్ములు వసూలు చేసేలా నిర్ణయించారు. కాలేజీ యాజమాన్యం పేరు చెప్పకుండా కాలేజీలోని సీనియర్ విద్యార్థినిలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నర్సింగ్ కాలేజీలోని అధికారులకు బంగారు ఆభరణాలు చేయించాలనీ, ఇతరత్రా ఖర్చులు ఉంటాయనీ, కచ్చితంగా డబ్బులు కట్టాలంటూ వత్తిడి చేస్తున్నారనీ, తమకు తినటానికే డబ్బులు లేకుంటే ఇక రెండు వేలు ఎక్కడి నుంచి తెస్తామంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పేద విద్యార్థినులను వేధిస్తున్న కాలేజీ యాజమాన్యం అడ్మిషన్ల నుంచి క్యాపింగ్ వరకూ భారీగా వసూళ్లు? ఏలూరు జీజీహెచ్లో జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ దుస్థితి డబ్బులు ఇవ్వకుంటే.. వేధింపులే జీఎన్ఎం కోర్సు పూర్తి చేయాలంటే తమ కనుసన్నల్లోనే ఉండాలనీ, తాము తలచుకుంటే మీరు పాస్ కూడా కారంటూ కాలేజీ యాజమాన్యం నిత్యం విద్యార్థినిలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారని చెబుతున్నారు. క్యాపింగ్ సెర్మనీకి రూ.2వేలు చెల్లించకుంటే మీకు సర్టిఫికెట్లు చేతికి రాకుండా ఎలా చేయాలో తమకు తెలుసంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. వృత్తివిద్యా కోర్సు కావటంతో విద్యార్థినులు సైతం మౌనంగా వేధింపులు భరిస్తూ ఉంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పచ్చళ్లకు మామిడికాయ రెడీ
తణుకు అర్బన్ : వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఆవకాయ తదితర పచ్చళ్లు పట్టే సందడి నెలకొంటుంది. ఇదే నేపథ్యంలో తణుకు సంత మార్కెట్లో ఆవకాయ పచ్చడి కోసం మాడికాయలు సందడి చేస్తున్నాయి. గత 10 రోజులుగా తెల్లవారుజాము నుంచే వివిధ రకాల జాతులకు చెందిన మామిడి కాయలు తణుకు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. మామిడికాయలు రంగు, రూపుతోపాటు దిగుబడులు కూడా అధికంగానే ఉన్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఇంకా ఊపందుకోలేదు. అనుకున్న మేర అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారులు అమ్మకాల కోసం పడిగాపులు పడాల్సివస్తుంది. కాపు ఎక్కువగా ఉండడంతో ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ప్రజల్లో ఆవకాయ, మాగాయి తదితర పచ్చళ్లు పట్టే ఆసక్తి తగ్గిందని, రెడీమేడ్ పచ్చళ్లకు కొన్ని రకాల ప్రజానీకం అలవాటుపడ్డారని, దానికితోడు జనం దగ్గర డబ్బులు కూడా లేకపోవడంతో ఈ ఏడాది మామిడికాయల కొనుగోళ్లు ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. 15 టన్నుల మామిడి కాయలు దిగుమతి తూర్పుగోదావరి జిల్లా నుంచి అధికంగా తణుకు మార్కెట్లోకి రకరకాల జాతులకు చెందిన మామిడికాయలు రోజుకు సుమారుగా 15 టన్నుల వరకు అందుబాటులోకి వస్తున్నాయి. సంత మార్కెట్ను ఆనుకుని జరుగుతున్న మామిడికాయల అమ్మకాలకు సంబంధించి రాజమండ్రి, తుని, కత్తిపూడి, అన్నవరం తదితర ప్రాంతాల నుంచి కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు, పెద్ద రసాలు, చిన్న రసాలు, సువర్ణరేఖ, దేశవాళి వంటి రకాల మామడికాయలు నిత్యం తణుకు మార్కెట్లో అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా అమ్మకాలు లేకుండా పోయాయని ఈ అమావాస్య గడిస్తే కొంతమేర పచ్చళ్లు పట్టే పరిస్థితులు పెరుగుతాయేమోనంటూ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చడి కోసం ఎక్కువగా వినియోగదారులు ఈ కాయల కోసం మక్కువ చూపుతున్నారని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ముక్కలు కొట్టేందుకు పోటాపోటీ మామిడికాయలు కొనుగోలు చేసుకుని మార్కెట్లోనే ఆవకాయ పచ్చడికి కావాల్సిన సైజులో ముక్కలు కొట్టే కార్మికులు కూడా పోటీపడుతున్నారు. ఎవరు మామిడి కాయలు కొంటారా అని వారి చుట్టూ తిరుగుతూ ముక్కలు కొట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి దుకాణం వద్ద ఒకరు ముక్కలు కొడుతూ ఉపాధి పొందుతున్నారు. కాయ సైజును బట్టి రూ. 2 నుంచి రూ.3 తీసుకుంటున్నారు. రోజుకు 15 టన్నుల మామిడికాయలు తణుకు మార్కెట్కు ఇంకా ఊపందుకోని అమ్మకాలు అమావాస్య దాటాక అమ్మకాలపై ఆశలు మామిడి కాయ నాణ్యతను బట్టి ధరలు ఇలా... కొత్తపల్లి కొబ్బరి కాయ రూ. 25 ఐజర్లు రూ. 25 చిన్నరసాలు రూ. 20 పెద్ద రసాలు రూ. 20 సువర్ణరేఖ రూ. 20 దేశవాళి రూ. 15 ఇంకా ఊపందుకోని అమ్మకాలు ఈ వేసవి సీజన్లో మామిడి కాయ దిగుబడి అధికంగానే ఉన్నపటికీ ప్రస్తుతానికి పచ్చడి కోసం మామడి అమ్మకాలు ఇంకా ఊపందుకోలేదు. గతంలో పచ్చడి మామిడికాయలు ఎప్పుడు వస్తాయా అనే విధంగా ఎదురుచూసేవారు. కానీ నేడు ధరలు అందుబాటులోనే ఉన్నా వ్యాపారాలు పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఆదివారం అమావాస్య అనంతరం అమ్మకాలు పెరుగుతాయని అనుకుంటున్నాము. రెడీమేడ్ పచ్చళ్లతోపాటు జనం దగ్గర డబ్బులు లేకపోవడం కూడా అమ్మకాల తగ్గడానికి కారణం అయివుండవచ్చు. – కొఠారు రామాంజనేయులు, మామిడికాయల వ్యాపారి, తణుకు -
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి
ఏలూరు (టూటౌన్): పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్సీ సర్పంచ్లు హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అన్నారు. పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని స్థానిక ఎన్ఆర్పేటలోని ఎస్సీఆర్పీఎస్ అండ్ ఏఐఏవైఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అత్యంత కీలకమైనదని, మేధావులతో కూడిన అనేక కమిటీలు దీన్ని ఏర్పరిచారన్నారు. కానీ పంచాయతీరాజ్ చట్టాలను అమలు చేయటంలో గ్రామ స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు విఫలమయ్యారని చరిత్ర తెలియజేస్తుందన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు పాలనను వారిని చేయనియ్యకుండా ఎమ్మెల్యేలు హైజాక్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నూకపెయ్యి కార్తీక్ పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్ ఏలూరు టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు కత్తేపువీధికి చెందిన షేక్బాజీ గతంలో బావిశెట్టివారిపేటకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువరి మధ్య వివాదం తలెత్తడంతో ఆమెను వదిలివేశాడు. అయితే అత్త జయలక్ష్మిపై బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈనెల 22న రాత్రివేళ జయలక్ష్మిపై బిర్లాభవన్ సెంటర్ వద్ద షేక్బాజీ ఆకస్మికంగా వెనుకవైపు నుంచి దాడి చేశాడు. తీవ్ర గాయాలైన జయలక్ష్మిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏలూరు వన్టౌన్ పోలీసులు షేక్బాజీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతడ్ని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. నారాయణపురంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఉంగుటూరు: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు నారాయణపురం శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి కే విశ్వేశ్వరరావు తెలిపారు. ఈనెల 26వ తేదీలోగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 81251 55788 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
26న జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్
ఏలూరు (టూటౌన్) : ఈనెల 26న ఏలూరు సీపీఐ జిల్లా కార్యాలయం, స్ఫూర్తి భవన్ నందు జిల్లా ఓపెన్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.కృష్ణ్ణమాచార్యులు, జిల్లా నాయకుడు పి కిషోర్ తెలిపారు. సీపీఐ జిల్లా కార్యాలయం నందు చెస్ టోర్నమెంట్ బ్రోచర్ను గురువారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఏఐటీయూసీ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని చెస్ క్రీడాకారులంతా ఈ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు సహాయ కార్యదర్శి కూరెళ్ళ వరప్రసాద్, ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఎస్ అప్పలరాజు, నాయకులు బి జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు. మే 4 నుంచి శంకరమఠంలో వేద పరీక్షలు తాడేపల్లిగూడెం (టీఓసీ): శ్రీ గోదావరీ మండల వేదశాస్త్ర ప్రవర్ధకసభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లా వేద విద్యార్థులకు మే 4, 5, 6 తేదీల్లో తాడేపల్లిగూడెంలోని శంకరమఠంలో వేద పరీక్షలు నిర్వహించనున్నట్లు శంకరమఠం సభ్యులు వెల్లడించారు. సుమారు 450 మంది వేద విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు వేద, శాస్త్ర, శ్రౌత, స్మార్త, ఆగమ, అపర్ణ విద్యలో జరుగుతాయన్నారు. విద్యార్థులందరికీ 3 రోజులు భోజన వసతులు పట్టణంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మే 6 వ తేదీన శంకరమఠంలో పాలకొల్లు వలివేటి శ్రీ హరి శర్మ సన్మానం, వేద సభ జరగనున్నట్లు పేర్కొన్నారు. చోరీ కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష నరసాపురం: పట్టణంలో జరిగిన ఓ దొంగతనం కేసులో నేరం రుజువు కాడడంతో ముద్దాయిలు కొత్తపల్లి రమేష్కు రెండేళ్లు సాధారణ జైలు, రూ 2వేలు జరిమానా, బీర రమేష్, గుబ్బల భాస్కర్కు ఏడాది సాధారణ జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ నరసాపురం జూనియర్ సివిల్ జడ్జి కె.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. నరసాపురం టౌన్ సీఐ బి.యాదగిరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని జోస్యులవారి వీధి కొప్పర్తి వెంకటరత్నం ఇంట్లో జరిగిన దొంగతనం ఘటనలో ముద్దాయిలను 2023 జనవరి 16వ తేదీన అప్పటి ఎస్సై సుధాకరరెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు కోర్టు జైలు శిక్ష విధించినట్టు సీఐ వివరించారు. -
పనిచేస్తూ ఉపాధి కూలీ మృతి
నిడమర్రు: ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేస్తూ ఉపాధి కూలి కొరపాటి నాగమణి (48) మృతి చెందిన ఘటన గురువారం పెదనిండ్రకొలను గ్రామంలో చోటుచేసుకుంది. తోటి కూలీల కథనం ప్రకారం నాగమణి పత్తేపురం– పెదనిండ్రకొలను గ్రామాల మధ్య ఉన్న మురుగు కాలువలో తూడు, గుర్రపుడెక్క తొలగించే పనులకు వెళ్లింది. మరి కొద్ది సేపట్లో పనులు ముగుస్తాయనగా కాలువలో తూడూ, గుర్రపు డెక్క తొలగిస్తూ ఒకేసారి కుప్పకూలి కాలువలో పడిపోయింది. తోటి కూలీలు గమనించి కాలువ గట్టుపైకి తీసుకువచ్చారు. అనంతరం నాగమణిని పెదనిండ్రకొలను పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త మంగయ్య, ఇద్దరు పెళ్లైన కుమార్తెలు ఉన్నారు. నిడమర్రు ఎస్సై వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నాగమణి మృతదేహాన్ని తాడేపల్లిగుడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విలేకరిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి ఏలూరు టౌన్: ఓ చానల్ విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్పారు. వివరాల ప్రకారం ఏలూరు టూటౌన్ గిలకలగేటు ప్రాంతానికి చెందిన ఉల్లింగల చంద్రకాంత్ అలియాస్ చందు ఏలూరులో ఒక చానల్ విలేకరిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 23తేదీ అర్థరాత్రి అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దారికాచి మరీ ఇనుపరాడ్లతో దాడి చేశారు. మోటారు సైకిల్పై ఇంటికి వెళుతున్న సమయంలో ఆకస్మికంగా దుండగులు దాడి చేయగా చేతులు అడ్డుపెట్టుకోవటంతో చందుకి చేతివేళ్లు విరిగాయి. ఆ సమయంలో అతను కేకలు వేయడం, స్థానికులు రావడంతో దుండగులు పారిపోయారు. కుటుంబ సభ్యులు చందును ఏలూరు జీజీహెచ్కు తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనపై ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేకులు మీద పడి వ్యక్తి మృతి ఆగిరిపల్లి: మందులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన వ్యక్తిపై ప్రమాదవశాత్తూ రేకులు పడడంతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తోటపల్లికి చెందిన పామర్తి హనుమంతరావు (60) ఆగిరిపల్లిలోని మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేసి వెళ్తుండగా అతడి తలపై దుకాణం పైన ఉన్న రేకులు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హనుమంతరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి కొండపై షార్ట్కట్ మార్గం వద్దు
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో కొందరు భక్తులు ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. కొండపైకి షార్ట్కట్ మార్గంలో వెళుతున్నామని అనుకుంటున్నారే గాని, ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటనేది ఆలోచించడం లేదు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల చినవెంకన్న కొండపైన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానంతరం కొందరు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలోని మార్గం గుండా కొండపైన నిత్యాన్నదాన భవనం, శివాలయం వద్దకు కాలినడకన వెళుతున్నారు. అయితే అటుగా వెళ్లకూడదని ఆలయ అధికారులు ఆ మార్గంలో ఎన్ని అడ్డం పెట్టినా, వాటిని దాటుకుని మరీ భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జేసీబీతో పూడిక పనులు జరుగుతున్నాయి. భక్తులు షార్ట్కట్ మార్గాల్లో వెళ్లకుండా జంటగోపురాల వద్దకు చేరుకుని, అక్కడి నుంచి దేవస్థానం ఉచిత బస్సుల ద్వారా నిత్యాన్నదాన భవనం, శివాలయం, బస్టాండ్లకు చేరుకోవాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దని కోరుతున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో నుంచి భక్తుల రాకపోకలు షార్ట్కట్ మార్గాలు వినియోగించవద్దంటున్న అధికారులు -
పాలిసెట్కు ఏర్పాట్లు
డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు భీమవరం: పాలీసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో వీఆర్వో పాలిశెట్టి–2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కో ఆర్డినేటర్లు, అసిస్టెంట్ కో ఆర్డినేటర్లు, సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ఏప్రిల్ 30న జరగనున్న పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 18 సెంటర్ల పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయగా వీటిలో భీమవరంలో 4, తాడేపల్లిగూడెంలో 2, తణుకులో 8, నరసాపురంలో 4 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. మొత్తం 7,254 మంది విద్యార్థులు పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30న ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. పరీక్షా కేంద్రాలు దగ్గరలో జిరాక్స్ షాపులు మూసివేయాలని, పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. జిల్లా ఖజానా అధికారి ఏ గణేష్, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సన్యాసిరావు, కోఆర్డినేటర్ డి.ఫణీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పించుకున్నాం
పాలకోడేరు: వారంతా కశ్మీర్లోని పహల్గాంలో కొద్దిలో ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షానికి చెందిన సోము చైతన్య దీపక్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. చైతన్య, అతని సోదరి అరుణ, స్నేహితుడు చిన్నారావులు వారి కుటుంబాలతో కలిసి ఈ నెల 20న పహల్గాం, గుల్మార్గ్ వెళ్ళి ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే గడిపారు. సోమవారం రాత్రి అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్లిపోయారు. సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం వారు గడిపిన ప్రదేశంలోనే టూరిస్ట్లపై ఉగ్రదాడుల ఘటన తెలియడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బంధువులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి శ్రీనగర్లో రూంకే పరిమితమయ్యామని, గురువారం సాయంత్రం ఫ్లైట్కు తిరుగు ప్రయాణమవ్వాలని వారు తెలిపారు. -
ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహ జ్వాలలు
భీమవరం: జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం భీమవరం పట్టణంలో కొవ్వొత్తులతో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ప్రదర్శనలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు మాట్లాడుతూ శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి జీవిస్తున్న భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శనీయమని అలాంటి దేశంలో ఉగ్రవాదుల చర్యలు దారుణమన్నారు. ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇలాంటి ఘటనలు పునరావృతంగాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ఇతర దేశాలు పన్నుతున్న కుట్రలను కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రజలు తీవ్రంగా పరిగణించి ఉగ్రవాదులపై కఠిన చర్యలకు సన్నద్ధం కావాలన్నారు. మరెక్కడా ఇటువంటి ఘటనలు తిరిగి చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఉగ్రదాడిలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పీవీఎల్ నర్సింహరాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, పార్టీ అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, పార్టీ కార్యదర్శి ఏఎస్ రాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కర్రా జయచరిత, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, వైఎస్సార్సేవా దళ్ జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు, పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బంధం పూర్ణచంద్రరావు, భీమవరం పట్టణం, వీరవాసరం, భీమవరం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ, జల్లా కొండయ్య, పార్టీ నాయకులు కోడే యుగంధర్, చిగురుపాటి సందీప్, గంటా సుందరకుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలో.. అత్తిలి: కశ్మీర్లో ఉగ్రదాడి దోషులను కఠినంగా శిక్షించి, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో చనిపోయిన వారికి శాంతి చేకూరాలని వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
కేసులు పెట్టడానికి పదవి ఇవ్వలేదు
పాలకొల్లు సెంట్రల్: ప్రజలకు సేవ చేయమని పదవి ఇచ్చారని, అంతేగానీ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడానికి పదవి ఇవ్వలేదని మంత్రి నిమ్మల రామానాయుడును నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి హితవు పలికారు. బుధవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. గత నెలలో యలమంచిలి మండలంలో జరిగిన ఎంపిపి ఎన్నిక విషయంలో కూటమి ప్రభుత్వం విధ్వంసం సృష్టించి.. తిరిగి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఎంపీటీసీ కంబాల సత్యశ్రీని పోలీసులు తీసుకువెళ్లడంతో వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులను ప్రశ్నించారని.. దాంతో ఎస్సై ఎంపీటీసిని తీసుకువచ్చేస్తామని చెప్పారని.. ఇప్పుడు రెండు రోజుల్లో ఏడుగురిపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే తప్పంటే ఇంక ఈ ప్రజాస్వామ్యం ఎందుకని ప్రశ్నించారు. కేసులు పెడితే భయపడి మీ పంచన చేరతారని ఊహిస్తున్నారేమోనని.. అలాంటి నీచ రాజకీయాలు చేయవద్దని సూచించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ జగనన్నపై ప్రేమతో ఉన్నావారేనని.. పదవుల కోసమో, సంపాదన కోసమో ఉన్నవారు కాదని అన్నారు. అలాంటి అభిమానంతో వచ్చిన కేడర్ను మీరు ఎప్పటికి కొనలేరని.. బెదిరించి పార్టీలు మార్పించుకోలేరన్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం టిడ్కో గృహాల్లో జరిగిన గొడవపై ఇప్పుడు కేసులు పెట్టించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసులను ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడం అన్యాయమని అన్నారు. 41 నోటీసులు ఇచ్చిన తరువాత కూడా రోజూ భీమవరం పోలీస్స్టేషన్కు రమ్మని పిలవడం ఏంటో అర్ధంకావడం లేదన్నారు. వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి -
సాక్షిపై దాడులు సిగ్గుచేటు
దాడికి పాల్పడ్డవారిని శిక్షించాలి : సీపీఎం ఏలూరు (టూటౌన్): సాక్షి పత్రికా కార్యాలయంపై దాడిని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీసి, అందుకు కారణమైనవారిని, దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ ఎవరిౖపైనెనా కొన్ని పత్రికలు అవాస్తవాలు ప్రచురిస్తే వాటిని ఖండించేందుకు అనేక మార్గాలున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు దిగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సమస్య ఉంటే చట్ట ప్రకారం వెళ్ళాలేగాని, రాజ్యాంగాన్ని గౌరవించి, ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని రవి కోరారు. ఏలూరు టౌన్ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ బాధితులకు న్యాయం జరిగేలా పనిచేసే ఫోర్త్ ఎస్టేట్పై దాడులు సిగ్గుచేటని, ఇలాంటి విష సంస్కృతికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేపీకే కిషోర్, టైమ్స్ కిషోర్ అన్నారు. ఏలూరు సాక్షి జిల్లా కార్యాలయం వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం విధ్వంసానికి నిరసనగా.. ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. బుధవారం ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా ఏలూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న జర్నలిస్టులు కొద్దిసేపు దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రిక స్వేచ్ఛను హరిస్తూ పత్రికా కార్యాలయాలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని పేర్కొన్నారు. డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సాక్షి కార్యాలయంలోకి అక్రమ చొరబడి, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం ఘటనపై విచారణ చేయాలని, నిందితులను గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరారు. డీఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ మరోసారి ఏలూరులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో నిందితులపై కేసులు నమోదు చేస్తామన్నారు. మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజలకు నష్టం ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేపీకే కిషోర్, టైమ్స్ కిషోర్ మాట్లాడుతూ ... ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతారణాన్ని చెడగొట్టేలా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవటం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రిక, మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజలు నష్టపోతారని, బాధితులకు న్యాయం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఏదైనా తప్పు జరిగితే దానిపై రాజకీయ నేతలు, ప్రతినిధులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి తప్ప దాడులు చేయటం సరైన విధానం కాదన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజు, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు భరత్ మాట్లాడుతూ పత్రిక స్వేచ్చను పరిరక్షించేందుకు అధికారులు తమవంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ప్రజాప్రతినిధులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, వారే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం ఏమాత్రం సమర్ధనీయం కాదని అభిప్రాయపడ్డారు. ఏపీయూడబ్ల్యూజే పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయిబాబా, మహిళా జర్నలిస్ట్ కొమ్మిన రత్నకుమారి మాట్లాడుతూ ఏలూరులోని సాక్షి కార్యాలయంపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు సంయమనంతో వ్యవహరించాలని, ఇష్టారాజ్యంగా దౌర్జన్యాలకు పాల్పడటం మంచి విధానం కాదన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఉర్ల శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు పోతురాజు, పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, ఏపీపీజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే రియాజ్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కే.వంశీ, శ్యామ్, ఎం.రాజేష్కుమార్, కే.శ్రీనివాస్, కర్రి అప్పలరాజు, బీ.రాము, వైవీ శ్రీనివాస్, టీవీఆర్కే ప్రసాద్, ఆర్.వెంకటనాయుడు, ఏడుకొండలు, కే.వినోద్కుమార్, అమీర్ పాషా, గంజి చంటి, బీ.భరత్కుమార్, కురెళ్ళ కిషోర్, ఇబ్రహీం, ప్రసాద్రెడ్డి, ప్రసాద్, బలరాం, గాంధీ తదితరులు ఉన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా దౌర్జన్యాలు దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏలూరులో నిరసన -
సివిల్స్లో ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థినికి 11వ ర్యాంక్
నూజివీడు : రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఒంగోలు క్యాంపస్లో 2016–22 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థిని సాయి శివాని యూపీఎస్సీ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించింది. గ్రామీణ నేపథ్యాన్ని అధిగమించి దేశంలో అత్యున్నత స్థాయిలో ర్యాంకు సాధించడం ఆమె కృషికి, పట్టుదలకు, అభ్యాసన పట్ల చూపిన నిబద్ధతకు నిదర్శనం. సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో ట్రిపుల్ ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్చార్జి చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి, ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.విజయ్కుమార్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఒంగోలు డైరెక్టర్ భాస్కర్ పటేల్ ఆమెకు అభినందనలు తెలిపారు. నేటి నుంచి నాటిక పోటీలు భీమవరం: భీమవరం పట్టణంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి నాటిక పోటీలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నాటిక పోటీల కోసం గన్నాబత్తుల క్రీడా మైదానంలో ప్రత్యేంగా వేదిక ఏర్పాటుచేశారు. ఈ నాటిక పోటీల ప్రారంభం సందర్భంగా ప్రముఖ సినీనటుడు రావు రమేష్ను ఆత్మీయ చైతన్య పురస్కారంతో సత్కరించనున్నారు. పోటీలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి ప్రారంభిస్తారని పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ చెప్పారు. సినీ నటులు, రచయిత మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, నటీమణి మణిబాలకు పెనుపోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్య పురస్కారం అందించనున్నారు. మాతా శిశు మరణాలపై నిర్లక్ష్యం తగదు భీమవరం (ప్రకాశంచౌక్): తల్లి మరణిస్తే ఆ కుటుంబం ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతతో చికిత్స అందజేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన మాతా శిశు మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో సీ్త్ర పాత్ర కీలకమైందని, తల్లి చనిపోతే పిల్లలు, కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడతారని, ఈ విషయాన్ని ప్రసూతి వైద్యులు గుర్తించుకోవాలన్నారు. 2024 – 25 సంవత్సరంలో జిల్లాలో 8 మంది తల్లులు, 88 శిశు మరణాలు సంభవించాయన్నారు. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రైవేట్ నర్సింగ్ హోంలు వైద్యం అందించడంలో మరింత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జి.గీతా బాయి, కమిటీ సభ్యులు ఐసీడీఎస్ పీడీ బి.సుజాత రాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం.సూర్యనారాయణ, డీఏఓ డాక్టర్ దేవ సుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 25 నుంచి మార్టేరు –పెనుగొండ రహదారి మూసివేత పెనుమంట్ర: పెనుగొండ –మార్టేరు ప్రధాన రహదారిలో మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి జూన్ 10 తేదీ వరకు 45 రోజులపాటు రోడ్డును మూసివేస్తున్నట్లు ఆర్ అండ్ బీ ఏఈ ప్రసాద్ మంగళవారం తెలిపారు. పెనుమంట్ర మండలం నెగ్గెపూడి వద్ద బ్రాంచ్ కాలువకు వంతెన నిర్మాణం పెనుగొండలో పెద్ద వంతెనకు మరమ్మతుల చేపట్టిన నేపథ్యంలో ఈ రూట్ లో వాహనాలు రాకపోకలను మళ్లిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, రాజమండ్రి, రావులపాలెం వెళ్లే వాహనాలను మార్టేరు నుంచి ఆచంట సిద్ధాంతం మీదుగా.. తణుకు, పెరవలి, నిడదవోలు వైపు వెళ్లే వాహనాలను ఆలమూరు కంతేరు మీదుగా మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పార్శిల్ సర్వీస్ సెంటర్ల తనిఖీ
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో విజిలెన్సు, జీఎస్టీ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా పట్టణంలోని పార్శిల్ సర్వీసు కార్యాలయాలు ఎస్ఆర్ఎంటీ, నవత, సింధు పార్శిల్ సర్వీస్లను బుధవారం తనిఖీ చేశారు. జగదీశ్వర్రావుకు చెందిన రూ.1,88,800 విలువ కలిగిన 116 లీటర్లు నిషేధిత గ్లైఫోసైట్, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన డైక్టోరావోస్ పురుగు మందులు ఎటువంటి లైసెన్స్, బిల్లులు లేకుండా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎసై కె.సీతారాము, జీఎస్టీ అధికారి బి.దానేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి ఆర్ఎస్.ప్రసాద్ తెలిపారు. ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్గా రాజ్కుమార్ రాజమహేంద్రవరం సిటీ: ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్గా కత్తుల రాజ్కుమార్ బుధవారం రాజమహేంద్రవరంలోని జోనల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కరీంనగర్ జోన్ నుంచి పదోన్నతిపై ఇక్కడకు బదిలీపై వచ్చారు. రాజమహేంద్రవరం జోన్ పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటి వరకు జోనల్ కార్యాలయం పరిధిలో రూ.10,037 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపారు. తప్పిపోయిన బాలిక అప్పగింత గంటల వ్యవధిలో ఆచూకీ కనుగొన్న పోలీసులు భీమవరం: సాంకేతిక పరిజ్ఞనాన్ని వినియోగించి గంటల వ్యవధిలో మైనర్ బాలిక మిస్సింగ్ కేసును ఛేదించినట్లు భీమవరం టూటౌన్ సీఐ జి కాళీచరణ్ బుధవారం చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన 8వ తరగతి విద్యార్థి బాలిక (14 ఏళ్లు) ఈనెల 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు కన్పించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టపక్కల, సమీప బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆ రోజు రాత్రి 11 గంటలకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సదరు బాలిక ఆచూకీ కోసం ముందుగా జిల్లా వ్యాప్తంగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి డాగ్ స్క్వాడ్, డ్రోన్స్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. అనంతరం చుట్టుప్రక్కల ప్రదేశాల్లోని సీసీ టీవీ కెమేరాల ఫుటేజ్ పరిశీలించి, సదరు బాలిక పూరీ – తిరుపతి ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్నట్లు గ్రహించి తుని, అనకాపల్లి, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలోని జీఆర్పీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. బుధవారం విశాఖపట్టణం రైల్వే స్టేషన్న్లో బాలికను విశాఖ రైల్వే పోలీసులు గుర్తించి భీమవరం టూటౌన్ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికెళ్లి బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ కాళీచరణ్ చెప్పారు. వ్యక్తి ఆత్మహత్య ఉంగుటూరు: యర్రమళ్ల గ్రామంలో ఓ వ్యక్తి ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానుకొండ బాబూరావు (50), అతని భార్య పదేళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి బాబూరావు ఇంటి సమీపంలోని చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. బాబూరావు మృతదేహానికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బుధవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. -
పదును తగ్గిన కొడవలి
గణపవరం: ఒకప్పుడు వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషించిన కొడవలి క్రమంగా తన బాధ్యతలనుంచి దూరమైపోతుంది. గతంలో చేతిలో కొడవలి లేకుండా రైతు కనిపించేవాడు కాదు. ఉదయాన్నే చద్దన్నం తిని భుజాన తుండు వేసుకుని, చేతిలో కొడవలి పట్టుకుని పొలానికి పయనమయ్యేవాడు రైతు. కొడవలికి, రైతులకు అంతటి అనుబంధం ఉండేది. నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కొడవలి దాదాపు రైతుచేతికి దూరమైపోయింది. ఇక వరికోతల సమయంలో కొడవళ్లకు ఎక్కడాలేని గిరాకీ ఉండేది. వ్యవసాయంలో యాంత్రీకరణతో సంప్రదాయ వ్యవసాయ పనిముట్లు కనుమరుగైపోయాయి. వీటి బాటలోనే కొడవలి కూడా చేరింది. దశాబ్దాలుగా వరికోతలకు కొడవళ్లే ఆధారం. వరికోతలు ప్రారంభం అయ్యాయంటే రైతులు, వ్యవసాయ కూలీలు కొత్త కొడవళ్ల కోసం కమ్మరి కొలిమి వద్ద బారులు తీరేవారు. పాత కొడవళ్లకు పదును పెట్టడం, కక్కుళ్లు కోయించడం, చెక్కపిడి వేయించడం, కొత్త కొడవళ్లు కొనుగోలు చేయడంతో కొడవళ్ల తయారీదారులకు ఊపిరి సలపనంతగా చేతినిండా పని ఉండేది. ఇటీవల వరికోతలు కోయడానికి కోత యంత్రాలు రంగప్రవేశం చేయడంతో కొడవళ్లకు పనిలేకుండా పోయింది. దీనితో ఈ వృత్తినే నమ్ముకున్న వారు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారు. కొడవళ్ల తయారీ కేంద్రం ముప్పర్తిపాడు గణపవరం మండలం ముప్పర్తిపాడు గ్రామం కొడవళ్ల తయారీ కేంద్రంగా దశాబ్దాలుగా పేరొందింది. గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, ఉండి, అత్తిలి, పెంటపాడు, తణుకు తదితర మండలాలనుంచి రైతులు, కూలీలు ముప్పర్తిపాడు వచ్చి కొడవళ్లు కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. కణకణలాడే అగ్నికీలల నుంచి ఎగసిపడే అగ్గిరవ్వలు, లయబద్ధమైన సుత్తిదెబ్బల సవ్వడులు, అగ్గిరాయిమీద కొడవళ్లకు పదును పెట్టి కక్కుళ్లుకోసే ధ్వనులు ఆ గ్రామంలో సర్వసాధారణం. ఈ కొడవళ్ల తయారీపై కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉండేవి. ఈ గ్రామంతో పాటు గణపవరం, నిడమర్రు గ్రామాల్లో కూడా కొడవళ్ల తయారు చేసే కమ్మరి కొలుములు ఉండేవి. వరికోతల సీజన్ ఆరంభం అయితే రేయింబవళ్లు కొడవళ్లు తయారు చేస్తూ క్షణం తీరిక లేకుండా కమ్మరి కార్మికులు ఇప్పుడు పనిలేక గోళ్లు గిల్లుకుంటున్నారు. గణపవరం, నిడమర్రు మండలాల్లో సుమారు 150 మంది వరకూ ఈ కమ్మరి కార్ఖానాలలో పనిచేస్తూ జీవనం సాగించేవారు. వేలాదిగా కొడవళ్లు తయారు చేసి స్థానికంగా అమ్మడమే కాక, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేసేవారు. ఒక్కో కొడవలి నాణ్యతను బట్టి రూ.100 నుంచి రూ.150 వరకూ విక్రయించేవారు. పదును పెట్టడానికి, కొడవలికి పళ్లు(కక్కుళ్లు) కోయడానికి రూ.20 తీసుకునేవారు. ఇప్పుడు రోజుకు పదో, పరకో కొడవళ్లు మాత్రమే అమ్ముతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. కొలిమిలో కాలి.. పదునైన కొడవలిగా మారి కొడవలి తయారీకి ప్రత్యేకమైన ముడి ఇనుమును(లారీలకు వాడే కమానుకట్టలు) బద్దలుగా తీసుకువచ్చి కొలిమిలో బాగా కాల్చి కొడవలి ఆకారంలో మలుస్తారు. దానికి సానపట్టి పళ్లు కోసిన తర్వాత చెక్కపిడిని అమరుస్తారు. ఈవిధంగా ఒక్కో కొలిమిలో రోజుకు సుమారు 200 కొడవళ్లను తయారు చేస్తారు. నాణ్యతను బట్టి మూడు రకాలుగా కొడవళ్లు తయారు చేస్తారు. రూ.80, రూ.100, రూ.150 ధరలలో తయారుచేస్తారు. ప్రత్యేక ఇనుముతో పాటు ప్రత్యేకమైన రేకుతో కూడా కొడవళ్లు తయారు చేస్తారు. కోత యంత్రాలతో కనుమరుగవుతున్న కొడవళ్లు వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక, నూతన సాంకేతిక పద్ధతులతో సంప్రదాయ పద్ధతులు కనుమరుగవుతున్నాయి. దీనిలో భాగంగా వరికోతకు యంత్రాల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇటీవలి వరకూ పశువులమేత కోసమైనా కొందరు రైతులు కూలీలతో వరికోతలు కోయించేవారు. రానురాను కూలీలతో కోత కోయించడం మానుకుని రైతులంతా వరికోత యంత్రాలమీదనే ఆధారపడటంతో కొడవళ్లు కొనే నాధుడు కనిపించడంలేదు. ఇతర ప్రాంతాల నుంచి ముడిసరుకు కొడవళ్ల తయారీకి ఉపయోగించే బేల్ బద్దలను చైన్నె, విశాఖ, కాకినాడ, విజయవాడ పట్టణాల నుంచి కిలోల లెక్కన దిగుమతి చేసుకుంటారు. ముడిసరుకు ధరలు కూడా ఏటికేడు పెరగడంతో కొడవళ్ల తయారీ గిట్టుబాటు కావడంలేదని తయారీదారులు వాపోతున్నారు. గత ఏడాది లోడు బేల్బద్దలు రూ.50 వేలు పలుకగా ఈ ఏడాది రూ.65 వేలకు చేరిందని, ఆమేరకు కొడవళ్ల ధర పెంచితే కొనుగోలు దారులు వెనుకంజ వేస్తున్నారని వాపోతున్నారు. అలాగే కొలిమిలోకి వాడే బొగ్గు, ఊక ధరలు కూడా పెరిగిపోయాయని, పనిలోకి వచ్చేవారికి కూలీ ధరకూడా పెరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాంత్రీకరణతో కనుమరుగు ఆదరణ తగ్గుతున్న వైనం కొడవళ్ల తయారీకి ముప్పర్తిపాడు ప్రసిద్ధి ఆదరణ తగ్గుతుంది నేను 50 ఏళ్లుగా కొడవళ్లు తయారు చేస్తున్నాను. తాతలనాటి నుంచి వచ్చిన కమ్మరి వృత్తిలో ఇప్పుడు కుటుంబం గడవడమే గగనంగా ఉంది. గతంలో రోజుకు 100 వరకూ కొడవళ్లు అమ్మేవాళ్లం. దశాబ్ద కాలంగా కొడవళ్ల అమ్మకాలు బాగా పడిపోయాయి. ఇప్పుడు రోజుకు ఐదారు కొడవళ్లు కూడా అమ్ముడుపోవడం లేదు. వీటితో పాటు కత్తులు, పారలు, గునపాలు తయారు చేస్తున్నాం. రానున్న కాలంలో ఈవృత్తి బతికి బట్ట కట్టాలంటే ప్రభుత్వం కమ్మరి వృత్తిదారులకు సబ్సిడీ రుణాలు ఇచ్చి, సబ్సిడీ ధరలకు ముడిసరుకులు అందించాలి. – సత్యనారాయణ, కమ్మరి వృత్తిదారు -
శశి విద్యార్థుల విజయభేరి
తణుకు అర్బన్: పదో తగరతి పరీక్షా ఫలితాల్లో తణుకు శశి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ విద్యార్థులు అత్యున్నత మార్కులతోపాటు నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్లు సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. విద్యార్థుల్లో తోరం సుప్రియ 595 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, పైడి రసజ్ఞ, సత్తి లహరి, గాదిరాజు జోషిత 594, నాయుడు లక్ష్మీ వెంకట సుజిత్ చౌదరి 593, సావిరిగాన జాహ్నవి 592, అల్లాడబోయిన మోనికసాయి 591, మండేలా మాధుర్య రమాసాయి, సైపురెడ్డి సత్యశ్రీ, బొల్లా లక్ష్మీ దీపక్ చౌదరి, కాపకాయల సాయి పవన్ గణేష్, పైడి మణి మాలతి, కంకిపాటి ప్రేస్పాల్, మద్దల మణికంఠ పవన్సాయి, పాటే పద్మశ్రీ, సుంకవల్లి హర్షిత చౌదరి 590 మార్కులు చొప్పున సాధించినట్లు వివరించారు. విద్యార్థులను సంస్థ వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా క్రాంతిసుధ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాదెళ్ల ప్రసాద్, తణుకు శశి క్యాంపస్ ఇన్చార్జ్ నిమ్మగడ్డ రాజేంద్రప్రసాద్ అభినందించారు. -
మెరిసిన కాకతీయ విద్యార్థులు
భీమవరం: భీమవరం పట్టణంలోని కాకతీయ మెరిట్ స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని స్కూల్ కరస్పాండెంట్ అక్కినేని కృష్ణకిషోర్ బుధవారం చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిలో ఎస్ వెంకట హర్షిణి 592, బి జయశ్రీ 589, బి రవి ఆదినారాయణ 587 మార్కులు సాధించారన్నారు. అలాగే 26 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించగా 10 మంది విద్యార్థులు 570 కంటే ఎక్కువ మార్కులు సాఽధించినట్లు చెప్పారు. ఆదిత్య విద్యార్థుల ప్రతిభ భీమవరం: పదవ తరగతి పరీక్షల్లో భీమవరం ఆదిత్య స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని స్కూల్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణంరాజు చెప్పారు. విద్యార్థులు ఎంఎస్ నాగశివాని 587, ఎం శర్వాణి 585, పీఎస్ఎస్వీ రామ్నిహాల్ 585, డి రాఘవశ్రీనిధి 584, ఎస్ దర్శన్బాబు 584, వై దాక్షిణ్య 584, ఎం ఆర్షియ 583, ఎన్ జనని 582, ఎం వర్షిత 580, పి హర్షవర్ధన్రాజు 580 మార్కులు సాధించినట్లు వివరించారు. మొత్తం విద్యార్థుల్లో 80 మంది 540కు పైగా, 124 మంది 500కు పైగా మార్కులు సాధించినట్లు కృష్ణంరాజు చెప్పారు. -
రొయ్యల ఫీడ్ ధరలను తగ్గించాలి
పాలకోడేరు: రొయ్యల ఫీడ్ ధరలు కేవలం రూ.4 తగ్గించడం సబబుకాదని, రూ.20 తగ్గించాలని పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు ఎన్ గజపతిరాజు, కార్యదర్శి జీకేఎఫ్ సుబ్బరాజు, రైతులు డిమాండ్ చేశారు. బుధవారం గొల్లలకోడేరులో నిర్వహించిన జిల్లా సమావేశంలో రైతులు మాట్లాడుతూ రొయ్యల కొనుగోలులో 60–50కి 50–40కి 40–30కి ఇదివరకు ఉన్న శ్లాబులను మళ్లీ పునరుద్ధరించాలని, అలాగే జోన్లు, ఎకరాలతో సంబంధం లేకుండా 1.50కి సబ్సిడీతో కూడిన కరెంటుని తక్షణమే క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని కోరారు. అప్సడా వైస్ చైర్మన్ రమణారెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ధరల స్థిరీకరణ 10 రోజులకీ జరిగినప్పటికీ ఈ మిగతా మూడు అంశాల్లో రైతులకి న్యాయం చేకూరాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించరని యెడల మే 10న జరగనున్న సమాఖ్య సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో వీరవాసరం మండలం తులసి రాంబాబు, ఆకివీడు మండలం బుజ్జి, ఇరగవరం మండలం బుజ్జి, గణపవరం మండలం వినాయక, నిడమర్రు మండలం నాని, ఆక్వా రైతు సోదరులు పాల్గొన్నారు. -
అమ్మోనియా గ్యాస్ లీక్.. ఐదుగురికి అస్వస్థత
పాలకోడేరు: పాలకోడేరు మండలంలోని మోగల్లు గ్రామంలోని వశిష్ట ఆక్వా మైరెన్ పరిశ్రమలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో అమ్మోనియా గ్యాస్ లీకై ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కార్మికుల కథనం ప్రకారం.. ఫీజర్ కూలింగ్ కోసం పైపు లైన్ ద్వారా అమ్మోనియా గ్యాస్ పంపుతుండగా హఠాత్తుగా పైపు పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. దీంతో కొందరు కింద పడి గాయాలపాలుకాగా మరికొందరు గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో బిటిక గీతకు (ఒడిశా రాష్ట్రం రాయగడ), కౌసల్య ఒడిశా (కరిది), శ్యామ్ (రాయగడ)కు గాయాలు కాగా సునమ్ (రాయగడ), బి రాణి అమ్మోనియా గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యం భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇందులో ఇద్దరు కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రశ్నార్థకంగా రక్షణ చర్యలు ఆక్వా పరిశ్రమల్లో రక్షణ చర్యలు ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి బాల కార్మికులు కూడా ఇక్కడ ఆక్వా పరిశ్రమల్లో పనులు చేస్తుండడం ఆందోళన కలిగించే విషయం. దీనిపై కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఏ రాణి స్పందిస్తూ బాధితుల్లో, కార్మికుల్లో మైనర్లు ఉంటే శాఖ పరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా మైరెన్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవివర్మ తెలిపారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: క్షేత్రంలో శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మే 7 నుంచి 14 వరకు జరగనున్న చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా 11న రాత్రి స్వామివారి కల్యాణం, 12న రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఆలయ పరిసరాలను, దర్శనం క్యూలైన్లను రంగులతో ముస్తాబు చేసేందుకు, అలాగే స్వామివారి పాదుకా మండప ప్రాంతంలో, ఆలయ ధ్వజస్తంభం వద్ద తాటాకు పందిళ్లు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం గుడి సెంటర్లోని ప్రధాన కూడలిలో 40 అడుగుల శ్రీవారి భారీ విద్యుత్ కటౌట్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయ గోపురాలకు, పరిసరాలకు విద్యుద్దీప తోరణాలను అమర్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు. మే 7 నుంచి ఉత్సవాలు ప్రారంభం 11న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం, 12న రథోత్సవం -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
ఉంగుటూరు: గోపినాథపట్నం భక్తాంజనేయస్వామి క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో భూదేవి శ్రీదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, సౌధినీ కుమారి దంపతులు, కొట్టు సోదరులు మురళీ, తాతాజీ దంపతులు, కుటుంబసభ్యులు ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. వివిధ నదీ జలాలతో విగ్రహాలకు అభిషేకాలు చేశారు. అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, సంపత్కుమార్, మానుకొండ వేంకటేశ్వరరావు, చెన్నా జనార్దనరావు, గోపినాథపట్నం సర్పంచ్ పుత్సకాయల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. పండితుడు ఆంజనేయ ప్రసాద్కు మాజీ మంత్రి కొట్టు సువర్ణ కంకణం తొడిగి పండిత సత్కారం చేశారు.