తెగతాగించేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

తెగతాగించేస్తున్నారు!

Apr 1 2025 11:57 AM | Updated on Apr 1 2025 2:12 PM

తెగతాగించేస్తున్నారు!

తెగతాగించేస్తున్నారు!

ఫుల్లుగా తాగించడమే ‘టార్గెట్‌’
● మద్యం అమ్మకాలు పెంచుకునే పనిలో ప్రభుత్వం ● గతేడాది సేల్స్‌పై 20 శాతం పెంచాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి ● లక్ష్యాన్ని చేరేందుకు నిబంధనలు గాలికొదిలేస్తున్న ఎకై ్సజ్‌ శాఖ ● నైట్‌ పాయింట్ల పేరిట తెల్లవార్లూ అమ్మకాలు ● శాంతిభద్రతలకు విఘాతం ● గత రెండు నెలల్లో ఆరు నుంచి వంద శాతానికి పైగా అమ్మకాలు

సాక్షి, భీమవరం: జిల్లాలో 175 మద్యం షాపులకు గాను ఇటీవల గీత కార్మికులకు 18 షాపులు మంజూరు చేయడంతో ప్రస్తుతం వాటి సంఖ్య 193కు పెరిగింది. జిల్లాలో రోజుకు దాదాపు రూ.4 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యంపై మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రభుత్వం ఎకై ్సజ్‌ అధికారులకు నెలవారీ టార్గెట్లు విధిస్తోంది. గతేడాది అదే నెలలో సేల్స్‌పై 20 శాతం అదనంగా అమ్మకాలు పెంచేలా సరుకును లిఫ్టింగ్‌ చేయాలని ఒత్తిడి తెస్తోంది. ఏదోవిధంగా అమ్మకాలు పెంచు కుని సరుకు లిఫ్టింగ్‌ చేయాలనడంతో నిబంధనల అ మలులో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా ఎంఆర్‌పీ ధరలు, బెల్టు షాపుల ఏర్పాట్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా అంతటా మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ ధరకు మించి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు నిర్వహిస్తున్నారు.

గణనీయంగా అమ్మకాలు

గతేడాదిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుత ప్రైవేట్‌ దుకాణాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో లిక్కర్‌ అమ్మకాలు 4 నుంచి 11 శాతం పెరగ్గా, బీర్ల అమ్మకాలు 41 నుంచి 79 శా తం వరకు పెరగడం గమనార్హం. ఫిబ్రవరిలో 14 శా తం వరకు లిక్కర్‌ అమ్మకాలు పెరిగితే బీర్లు అమ్మకాలు ఏకంగా 116 శాతం పెరిగాయి. ఉదాహ రణకు ఆకివీడు ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో గతేడాది ఫిబ్రవరిలో 4,022 కేసుల బీర్లు అమ్ముడుపోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 8,700 కేసులు అమ్ముడ య్యాయి. అమ్మకాలు పెంచుకునేందుకు ప్రభుత్వం నిబంధనలకు గాలికొదిలేస్తుండటంతో జిల్లా అంతటా మద్యం మత్తులో జరుగుతున్న తగాదాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మద్యం దుకాణాల వద్ద నిబంధనల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

గత ప్రభుత్వంలో.. నిర్ణీత వేళల్లో..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణా లు ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో కచ్చితంగా నిబంధనలు అమలయ్యేవి. నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు జరిగేవి. షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకుపోవడమే తప్ప అక్కడ తాగేందుకు వీలుండేది కాదు. బెల్టుషాపులకు ఆస్కారమే లేదు. జనావాసాల్లో కాకుండా ఊరికి దూరంగా దుకాణాలు ఉండేవి. నాటి పరిస్థితికి పూర్తి భిన్నంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలు సాగిస్తోంది. మద్యం దుకాణాలను జనావాసాల్లోకి తెచ్చింది. గ్రామాల్లో అనధికార బెల్టుషాపులు ఏర్పాటుచేసి రాత్రీపగలూ తేడాలేకుండా విక్రయాలు చేస్తోంది.

గతేడాది, ఇప్పటి మద్యం అమ్మకాలు

2024 2025

జనవరి జనవరి

లిక్కర్‌ కేసులు 1,58,638 1,66,756

బీర్లు కేసులు 53,141 81,877

2024 2025

ఫిబ్రవరి ఫిబ్రవరి

లిక్కర్‌ కేసులు 1,28,686 1,35,881

బీర్లు కేసులు 37,510 61,006

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement