ట్రైనీ డాక్టర్‌ అంజలికి న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ట్రైనీ డాక్టర్‌ అంజలికి న్యాయం చేయాలి

Apr 1 2025 11:57 AM | Updated on Apr 1 2025 2:09 PM

ట్రైన

ట్రైనీ డాక్టర్‌ అంజలికి న్యాయం చేయాలి

బుట్టాయగూడెం : రాజమండ్రి బొల్లినేని ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న ట్రైనీ డాక్టర్‌ అంజలికి న్యాయం చేయాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జీలుగుమిల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ నా యకురాలు ఎ.శ్యామలారాణి మాట్లాడుతూ అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామన్నారు. అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల నాయకులు ముత్యాలమ్మ, సుధారాణి, వెంకటలక్ష్మి, బుల్లెమ్మ, సీతారామయ్య, బి.రాంబాబు, సీహెచ్‌ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఈనెల 5న ఏ లూరు నుంచి ప్ర త్యేక బస్సు సర్వీసులు ఏర్పాటుచేసినట్టు ఏ లూరు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్‌వీఆర్‌ వరప్రసాద్‌ తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 7 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. సీట్లకు రిజర్వేషన్లు ప్రారంభించామని, ఆన్‌లైన్‌లో కూడా బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఒకే ఊరు నుంచి 40 లేదా 50 మంది భక్తులు ఉంటే ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తామన్నారు.

ట్రైనీ డాక్టర్‌ అంజలికి న్యాయం చేయాలి 1
1/1

ట్రైనీ డాక్టర్‌ అంజలికి న్యాయం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement