
అయ్యో.. రొయ్య
ప్లాంటేషన్ సంరక్షణపై దృష్టి
టేకు ప్లాంటేషన్ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీఎఫ్ చలపతిరావు రేంజ్ అధికారులను ఆదేశించారు. రామనర్సాపురంలో ప్లాంట్ను పరిశీలించారు. 8లో u
శురకవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
భీమవరం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.53 లక్షల ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. 60 శాతం వనామీ, మిగిలిన విస్తీర్ణంలో చేపలను పెంచుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వలన రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో పెద్ద మొత్తంలో రొయ్యలు మార్కెట్లోకి వస్తుంటాయి. ప్రస్తుతం అధికంగా 80 కౌంట్ నుంచి 100 కౌంట్ వరకు పట్టుబడులు చేస్తున్నారు. ఈ తరుణంలో దేశీయ ఉత్పత్తులపై అమెరికా పన్నులు పెంచిందంటూ గురువారం ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు ధరలను తగ్గించేశారు. 100 కౌంట్ ప్రస్తుత ధర రూ.235లు ఉండగా రూ.210లకు కొనుగోలు చేస్తున్నట్టు ఆక్వా రైతులు చెబుతున్నారు.
50 కౌంట్లోపు అమెరికాకు..
జిల్లా నుంచి అమెరికా, చైనా, యూరప్ దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి. కిలోకు 50 కౌంట్ వచ్చే రొయ్యలు మాత్రమే అమెరికాకు వెళుతుండగా, 60 నుంచి 140 కౌంట్ వరకు ఇతర దేశాలకు వెళుతున్నాయి. కాగా అమెరికా సుంకాలు పెంచనున్నట్టు చేసిన ప్రకటనను సాకుగా చూపించి చైనా, ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే రొయ్య ధరలను తగ్గించేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు కుమ్మకై ్క తమ కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా పన్నులు పెరిగితే ఆ భారం వినియోగదారులపై పడాల్సి ఉండగా అందుకు భిన్నంగా రైతులనే దోచుకోవడం దారుణమంటున్నారు.
సుంకాల మోతతో..
తాజాగా అమెరికా సుంకాల మోత పరోక్షంగా ఆక్వా రంగంపై పడటం రైతులను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోంది. రొయ్యల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సాయం అందకపోగా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే సాగుకు స్వస్తి చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని వాపోతున్నారు.
న్యూస్రీల్
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
రొయ్యల ఫీడ్ తయారీ మెటీరియల్ ధరలు తగ్గినా ఆ మేరకు మేత ధరలు తగ్గడం లేదు. అలాగే నాణ్యమైన సీడ్ లభించకపోవడంతో చెరువుల్లో రొయ్య పిల్లలు వేసిన నెల రోజుల్లోనే వైరస్ కారణంగా చనిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫీడ్ ధరలపై ప్రభుత్వం అజమాయిషీ లేకపోవడం, నాణ్యమైన సీడ్ అందించకపోవడంతో ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల క్రితం 100 కౌంట్ రూ.260 ఉన్న ధర ఒక్కసారిగా రూ.230లకు పడిపోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆక్వా రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతిదారులు సిండికేట్ అయ్యి ధరలు తగ్గించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెంపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. రైతుల ఆందోళనలు నేపథ్యంలో పదిరోజుల క్రితం 100 కౌంట్ రూ.240లు పెంచగా కొద్దిరోజుల తర్వాత దానిని రూ.235లకు తగ్గించారు. గత నాలుగు రోజులుగా ఈ ధరే కొనసాగుతోంది. మేతలు, మందుల ధరలు, చెరువుల నిర్వహణ పెరిగిపోవడంతో 100 కౌంట్కు రూ.260లు ఉంటేనే కానీ గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు.
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు’ ఉంది రొయ్యల రైతుల పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై
26 శాతం పన్నులు విధిస్తామనడం ఆక్వా రైతులపై ప్రభావం చూపుతోంది.
దీనిని సాకుగా చూపించి ఎగుమతిదారులు రొయ్య రేట్లను అమాంతం
తగ్గించేశారు. కౌంట్ను బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించి కొనుగోళ్లు
చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
ట్రంప్ టారిఫ్ బాంబ్
రొయ్యల ధరలపై ప్రభావం
అమెరికా పన్నుల పెంపును సాకుగా చూపించి ధరలు తగ్గించిన ఎక్స్పోర్టర్స్
100 కౌంట్ ధర రూ.235 నుంచి రూ.210కి తగ్గింపు
దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతులు
50లోపు కౌంట్ అమెరికాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి

అయ్యో.. రొయ్య

అయ్యో.. రొయ్య