డిగ్రీ కాలేజీల్లో పాక్టికల్‌ పరీక్షల బహిష్కరణ | - | Sakshi

డిగ్రీ కాలేజీల్లో పాక్టికల్‌ పరీక్షల బహిష్కరణ

Apr 3 2025 1:50 AM | Updated on Apr 3 2025 1:50 AM

డిగ్రీ కాలేజీల్లో పాక్టికల్‌ పరీక్షల బహిష్కరణ

డిగ్రీ కాలేజీల్లో పాక్టికల్‌ పరీక్షల బహిష్కరణ

భువనగిరి టౌన్‌, రాజాపేట : మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ ప్రాక్టికల్‌ పరీక్షలు నిలిచిపోయాయి. గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనందుకు నిరసనగా జిల్లాలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజ మాన్యాలు, వేతనాలు ఇవ్వడం లేదని అధ్యాపకులు పరీక్షలను బహిష్కరించారు. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ప్రాక్టికల్‌ పరీక్షలు యథావిధిగా జరిగాయి.

కళాశాలలు నడపలేకపోతున్నాం : నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడం వల్ల కళాశాలలు నడపలేకపోతున్నామని భువనగిరి లోని సాయికృప కళాశాల కరస్పాండెంట్‌ ప్రవీణ్‌కుమార్‌, రాజాపేటలోని శ్రీ సరస్వతి కళాశాల ప్రిన్సి పాల్‌ సోమసాని సురేందర్‌ పేర్కొన్నారు. తెలంగాణ అప్లియేటెడ్‌ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ పిలుపు మేరకు డిగ్రీ ప్రాక్టికల్‌ పరీక్షలను బహిష్కరించినట్లు తెలిపారు. రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయయని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని కోరారు.

ఫ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ప్రైవేట్‌ యాజమాన్యాల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement