Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Press Meet On Pulivendula ZPTC Bypolls Updates1
చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్‌ కావొచ్చు: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు.జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌..మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?వైఎస్‌ జగన్‌: ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్‌ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోరతాం. మీడియా ప్రతినిధి: ఓట్‌ చోరీ పేరిట ఇండియా బ్లాక్‌ చేపట్టిన ర్యాలీకి దూరంగా ఎందుకు ఉన్నారు?ఏపీ 2024 ఎన్నికల నాటికి.. లెక్కింపు నాటికి 12.5 శాతం ఓట్లు పెరిగాయి. అంటే 48 లక్షల ఓట్లు పెరిగాయి.. ఎలా?. ఓట్ల చోరీ అంటూ జాతీయ స్థాయిలో ఉద్యమం లేవనెత్తుతున్న రాహుల్‌ గాంధీ.. ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు?. ఎందుకంటే.. రేవంత్‌ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్‌ హైకమాండ్‌ టచ్‌లో ఉంది. రాహుల్‌ గాంధీ చంద్రబాబుతో హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారు. కాబట్టే ఏపీ గురించి మాట్లాడడం లేదు. కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ చంద్రబాబు గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. కానీ, నా గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి కాంగ్రెస్‌ ఎందుకు మాట్లాడడం లేదు.చంద్రబాబుకి వార్నింగ్‌ఏడాదిన్నర ఇప్పటికే గడిచిపోయిందికళ్లు మూసుకుని తెరిచేలోపు మూడున్నరేళ్లు గడిచిపోతుందికొద్దోగొప్పో ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్లకు నా విన్నపంప్రజాస్వామ్యం కాపాడుకోకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు పుడతాయి.. అది గుర్తించాలితప్పుడు పనులకు పునాదులు వేయొద్దు చంద్రబాబుతప్పులు, దుర్మార్గాలు.. రేపు వృక్షంగా మారతాయిమీరు చేసే ప్రతీ పని, ప్రతీ తప్పు మీకు చుట్టుకుంటుందిచంద్రబాబు జీవితానికి ఇదే ఆఖరికి ఎన్నికలు కావొచ్చుకృష్ణా, రామా అనుకుంటే కాస్త పుణ్యమైనా వస్తుందిఇకనైనా మారితే మంచిదిఇలాగే ఉంటే.. భవిష్యత్తులో టీడీపీకి డిపాజిట్‌ కూడా రాదువైఎస్సార్‌సీపీ వాళ్లే లక్ష్యంగా..టీడీపీ వాళ్లు వందలమంది ఉన్న పోలీసులు పట్టించుకోలేదుఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మూకలు రెచ్చిపోయాయివైఎస్సార్‌సీపీ మహిళా ఏజెంట్లపై దాడి చేశారుఅభ్యర్థి హేమంత్‌ రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానీయలేదుపులివెందుల టౌన్‌లో ఉన్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారుతన ఇంట్లో ఉన్న అవినాష్‌ను ఉదయం 4గం.కే అరెస్ట్‌ చేశారుఎర్రబలిల్లో బూత్‌లోకి ఓటర్లను రానీయలేదురిగ్గింగ్‌ చేయడానికి వెళ్లిన టీడీపీ వాళ్లకు చక్కగా పోలీసులు స్వాగతం పలికారువైఎస్సార్‌సీపీ శ్రేణులను మాత్రం తరిమి తరిమి కొట్టారుతమ ఊరిలో తమను ఓటు వేయనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారుఓటు వేస్తామంటూ.. కొందరు పోలీసుల కాళ్లు పట్టుకున్నారుఓటుకు వెళ్తుంటే బూత్‌ల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ మరికొందరు ధర్నాలు చేశారుప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేశారుపోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!ఏరికోరి పోలీసులను నియమించుకున్నారుడీఐజీ కోయ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయికోయ ప్రవీణ్‌.. టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు సమీప బంధువుపచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ.. ఆయన బలగం ఈ ఎన్నిక నిర్వహించాయిటీడీపీ ప్రభుత్వం మాట వినని ఐపీఎస్‌ అధికారులకు తప్పని వేధింపులుబాబు మాట వినకుంటే డీజీ స్థాయి వాళ్లు కూడా జైలుకే!ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారుమంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే రిగ్గింగ్‌ జరిగిందిమంత్రి సవిత ఆధ్వర్యంలో బయటి నుంచి వచ్చారుజమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డికి తీసుకొచ్చారుఈ కొత్తపల్లిలో పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మకాం వేశారుబీటెక్‌ రవి పులివెందుల రూరల్‌ ఓటర్‌ కాదు.. కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడుపోలీసుల సమక్షంలోనే బయటివాళ్లు వచ్చి పాగా వేశారుపచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది.. బయటి నుంచి టీడీపీ నేతలు, వాళ్ల వర్గీయులు.. దాదాపుగా మొత్తం 7 వేలమంది పులివెందులలో మోహరించారుఒక్కో ఓటర్‌ కోసం బయటి నుంచి వచ్చిన ఒక్కో రౌడీప్రతీ పోలింగ్‌బూత్‌కు 400 మందిని మోహరించారుపోలీసులే దొంగ ఓట్లను ప్రొత్సహించారుకలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారుస్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా?ఆఖరికి ఇవాళ రెండు కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్‌లోనూ దొంగ ఓట్లేఈ సందర్భంగా.. క్యూ లైన్‌లో దర్జాగా నిలబడి దొంగ ఓట్లు వేసిన వాళ్ల ఫొటోలతో సహా వివరాలను వైఎస్‌ జగన్‌ చదివి వినిపించారుపోలింగ్‌ బూత్‌లను మార్చేశారుపోలింగ్‌ బూత్‌లను ఇష్టానుసారంగా మార్చేశారుఒక ఊరివాళ్లు.. మరో ఊరికి వెళ్లి మరీ ఓటేయాలటసొంత గ్రామం కాకుండా ఇతర గ్రామాలకు వెళ్లి ఓటేయాలా?ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా ఎన్నిక నిర్వహించారుపోలింగ్‌బూత్‌ ఆవరణలో సీసీటీవీ ఫుటేజీలు ఇచ్చే ధైర్యముందా?ప్రతిబూత్‌లో వెబ్‌కాస్టింగ్‌ ఇచ్చే దమ్ముందా?అసలు పులివెందులలో జరిగింది ఎన్నికే అంటారా?ఏపీలో ప్రజాస్వామ్యం కనబడడం లేదురాష్ట్ర చరిత్రలో ఏనాడూ ఇంత హింస జరగలేదుబందిపోటు దొంగల తరహాలో చంద్రబాబు ఎన్నిక జరిపించారుచంబల్‌ లోయ బందిపోట్లను మరిపించేలా ఎల్లో బ్యాచ్‌ ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడిందిఈ బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబేచంద్రబాబుది అడ్డగోలు రాజకీయంచంద్రబాబుది రాక్షస పాలనఆయనొక మాబ్‌స్టర్‌, ఫ్రాడ్‌స్టర్‌చంద్రబాబుకి తన పాలనపై నమ్మకం ఉంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా, కేంద్ర బలగాలతో ఎన్నిక జరిపించండిపోలింగ్‌ ఏజెంట్లు లేకుండా జరిగేది ఎన్నికలంటారా?ఓటర్‌ జాబితా పరిశీలన పోలింగ్‌ ఏజెంట్‌ హక్కుఏజెంట్ల నుంచి ఫాం-12ను పోలీసులు లాక్కున్నారువైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల్లో కూర్చోనీయలేదు15 బూత్‌ల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లే లేకుండా చేశారువైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారు?రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఏనాడూ ఎన్నికలు జరగలేదుప్రజాస్వామ్యం ఇంత దిగజారిన పరిస్థితులు బహుశా ఏనాడూ చూసి ఉండరుఏపీలో శాంతిభద్రతలు లేవురాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదునిన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా దాడులే అందుకు నిదర్శనంపోలింగ్‌ బూత్‌ల్లో ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపారు

YS Jagan Questioned By Rahul Gandhi Over Votes Issue In AP2
ఏపీ ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ మాట్లాడరేం?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. ఏపీలో ఓట్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఎందుకంటే చంద్రబాబుతో రాహుల్‌ గాంధీ హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబుతో రేవంత్‌, కాంగ్రెస్‌ హైకమాండ్‌ టచ్‌లో ఉంటారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని రాహుల్‌ గాంధీ.. కర్ణాటక, మహారాష్ట్ర గురించి మాట్లాడతారు. కానీ, ఏపీ గురించి మాత్రం ఆయన ఎందుకు మాట్లాడటం లేదు?. రేవంత్‌ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్‌ అధిష్టానంతో టచ్‌లో ఉంటారు. చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణికం ఠాకూర్‌ ఒక్క కామెంట్‌ కూడా ఎందుకు చేయరు?. అమరావతిలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. దీనిపై కాంగ్రెస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల నాటికి.. ఓట్ల లెక్కింపు నాటికి 12.5శాతం ఓట్లు పెరిగాయి. అంటే 48 లక్షల ఓట్లు పెరిగాయి.. ఇది ఎలా?’ అని ప్రశ్నించారు.

KBC Slammed For Operation Sindoor Independence Day Special Episode3
ఆర్మీ దుస్తుల్లో రియాలిటీ షోకి.. ప్రొటోకాల్‌ ఉల్లంఘనేనా?

కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC).. భారతదేశంలో ప్రసిద్ధమైన హిందీ భాషా టెలివిజన్ క్విజ్ షో. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌లో 17వ సీజన్‌ నడుస్తోంది ఇప్పుడు. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్‌ కాబోతున్న ప్రత్యేక ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా రిలీజ్‌ కాగా.. సోషల్‌ మీడియా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. Kaun Banega Crorepati (KBC) 2025 స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్‌ ఎపిసోడ్‌పై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనరింగ్‌ హీరోస్‌ పేరిట ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌ ప్రొమోను వదిలింది సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణా దియోస్తలీ ఈ షోలో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రొమోలో.. అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారాయ. దానికి కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ.. పాకిస్తాన్ తరచూ ఉగ్రదాడులు చేస్తోంది. స్పందన అవసరం. అందుకే ఆపరేషన్ సిందూర్ జరిగింది అని తెలిపారు. అయితే.. ఆర్మీ అధికారులను పూర్తి యూనిఫారంలో ఓ టీవీ రియాలిటీ షోలో చూపించడం పట్ల సోషల్ మీడియాలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను అలా యూనిఫామ్‌లోనే ఆహ్వానించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇది సైనిక ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. సైన్యం పీఆర్‌ ఏజెన్సీలా మారిపోయిందా?.. లేకుంటే రాజకీయ మైలేజ్‌ కోసం ఇలాంటి పని చేశారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారత సాయుధ దళాలకు ఒక గౌరవం, హుందాతనం ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు.. .. ఏ దేశంలోనైనా కీలకమైన సైనిక ఆపరేషన్ తర్వాత అధికారులు ఇలా టీవీ షోలలో పాల్గొనడం చూశామా? విధి నిర్వహణలో ఉన్నవారికి ఇలా ఎలా అనుమతిస్తారు? ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం మన సైన్యాన్ని సిగ్గు లేకుండా వాడుకుంటోంది.. ఆర్మీ అధికారులు.. అదీ యూనిఫాంలో.. ఆర్మీ ఆపరేషన్‌ గురించి మాట్లాడడం.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?Army officers in uniform going to KBC to talk about Op Sindoor with Amitabh Bachchan.Has something like this ever happened before? pic.twitter.com/hs5X0uJCKp— Arjun* (@mxtaverse) August 13, 2025ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం...ఆర్మీ డ్రెస్‌ రెగ్యులేషన్స్ ప్రకారం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రెస్టారెంట్లు వగైరా.. చివరకు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ధరించడానికి వీల్లేదు. తాజాగా మలయాళ స్టార్‌ నటుడు తన లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాను అగౌరవపరుస్తూ.. కేరళ ప్రభుత్వ ప్రచారంలో యూనిఫాంతో కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఆ ఆరోపణలు ఖండించారు. అయితే.. ఇక్కడ ఓ మినహాయింపు ఉంది. కమాండింగ్‌ ఆఫీసర్‌ చేత రాతపూర్వకంగా అనుమతి తీసుకుని.. అనధికారిక కార్యక్రమాలకు యూనిఫాం ధరించి వెళ్లొచ్చు. బహుశా.. ఇప్పుడు ఈ ముగ్గురు అలాగే హజరై ఉంటారని పలువురు భావిస్తున్నారు. పంద్రాగష్టున సోనీ టీవీలో సోనీలీవ్‌ ఓటీటీలో ఈ ఫుల్‌ ఎపిసోడ్‌ను వీక్షించొచ్చు.పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించింది కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లే. ఇక.. ప్రేరణా ప్రేరణా దియోస్తలీ.. కిందటి ఏడాది భారత నేవీలో వార్‌షిప్‌ తొలి కమాండ్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.

Remember The Name Jayden Seales, New Pace Sensation From West Indies4
జేడన్‌ సీల్స్‌.. బ్యాటింగ్‌ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు

జేడన్‌ సీల్స్‌. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌లో తరుచూ వినిపిస్తున్న పేరు. ఈ విండీస్‌ నయా ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం ఈ ఏడాదిలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తూ బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ట్రినిడాడియన్‌ బౌలర్‌ ఈ ఏడాదే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. సీల్స్‌ ఈ ఏడాది 8 వన్డేల్లో 18 వికెట్లు.. 21 టెస్ట్‌ల్లో 88 వికెట్లు తీశాడు.తాజాగా పాకిస్తాన్‌పై సంచలన ప్రదర్శనతో సీల్స్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాక్‌తో నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సీల్స్‌ 7.2 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఫలితంగా పాక్‌ విండీస్‌ నిర్దేశించిన 295 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 92 పరుగులకే కుప్పకూలింది.ఈ ఇన్నింగ్స్‌లో సీల్స్‌ నిప్పులు చెరిగే బంతులతో పాక్‌ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేశాడు. సీల్స్‌ దెబ్బకు పాక్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో డకౌటైన ఐదుగురు ఆటగాళ్లలో సీల్స్‌ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. సీల్స్‌ బౌలింగ్‌లో పాక్‌ ఆటగాళ్లు బంతి బంతికి గండాన్ని ఎదుర్కొన్నారు. బంతిని వదిలేసినా సమస్యే, ఆడాలని ‍ప్రయత్నించినా సమస్యే.సీల్స్‌ ప్రదర్శనలు ఈ ఏడాదంతా ఇలాగే కొనసాగాయి. పాక్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సీల్స్‌ వేసిన స్పెల్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ స్పెల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో సీల్స్‌ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం​ 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ సంచలన ప్రదర్శనల అనంతరం సీల్స్‌ క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మరో పేసు గుర్రం వచ్చిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. విండీస్‌ జట్టు త్వరలో భారత్‌లో పర్యటంచనుండగా సీల్స్‌పై ఫోకస్‌ మరింత పెరిగింది. వరల్డ్‌ క్లాస్‌ భారత బ్యాటర్లను అతను ఏ మేరకు నిలవరించగలడో అని చర్చలు మొదలయ్యాయి. సీల్స్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ మినీ వేలంలోనూ హాట్‌ పిక్‌ అయ్యే అవకాశం ఉంది. అతడిని కేకేఆర్‌ తన్నుకుపోవచ్చు. ఎందుకంటే అతను కరీబియన్‌ లీగ్‌లో ఇదివరకే వారి సిస్టర్‌ ఫ్రాంచైజీ అయిన ట్రిన్‌బాగో నైట్‌రైడ‍ర్స్‌కు ఆడుతున్నాడు.రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన సీల్స్‌ విండీస్‌ తరఫున ఇప్పటివరకు 21 టెస్ట్‌లు ఆడి మూడు 5 వికెట్ల ప్రదర్శనలతో 88 వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 31 వికెట్లు తీశాడు.

KSR Comments On Chandrababu politics5
అమలు చేశారా బాబూ!.. షరతుల సంగతేంటి?

సత్యం, అసత్యాలతో నిమిత్తం లేదు.. వినేవారు ఏమనుకుంటారో అన్న సందేహం అస్సలు రాదు. తనను తానే పొగిడేసుకుంటారు. చెప్పే దాంట్లో నిజం ఉందన్న భ్రాంతి కలిగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి మచ్చు తునకలివి. మాటల మార్చేందుకు ఏమాత్రం తటపటాయించరు కూడా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చంద్రబాబు ఎక్కడ ఏ ఉపన్యాసం చేసినా చిత్ర, విచిత్రాలు కనిపిస్తాయి.పాడేరులో ఆదివాసి దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఆయన ప్రసంగం చూడండి. ఇక్కడ తనకంటే మేధావి ఎవరైనా ఉన్నారా అని అడగటమూ.. లేరని ఆయనే తేల్చయడం కూడా జరిగిపోయిందట. తనది ముందు చూపని.. సూపర్ సిక్స్ ప్రకటించాం.. సూపర్ హిట్ చేశాం అని కూడా ఆయనంతకు ఆయన ప్రకటించుకున్నారు. ఈ మాటలిప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించి తనకు తోచిన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో రింగ్ రోడ్డుతో సహా పలు కార్యక్రమాలు తనవే అన్నట్లుగా ఆయన మాట్లాడుతుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హెలికాఫ్టర్‌లో పర్యటిస్తుంటే గిరిజన ప్రాంతంలో ఉన్న కొండలు చూసి ఆయన ముగ్దులయ్యారట. వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలని, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్నారు.ఒకప్పుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని వ్యాఖ్యానించి విమర్శలకు గురైన చంద్రబాబు ఇప్పుడు గిరిజనులలో పుట్టాలని అనుకుంటున్నానని చెప్పడం స్వాగతించవలసిన విషయమే. కాకపోతే, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్న మాటలో చిత్తశుద్ది ఉందా అన్న సంశయం రావచ్చు. ఆయనకు నిజంగానే ఈ కోరిక ఉంటే, ఈ జన్మలోనే ఉంటానని చెప్పవచ్చు. తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత గిరిజన ప్రాంతంలోనే ఉంటానని ప్రకటించి ఉంటే ఆయన కోరిక తీరేది కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గిరిజన ప్రాంతాలలో డోలీలు లేకుండా చేసేశామని ఆయన అన్నారట. అందులో వాస్తవం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అసలు సరైన రోడ్లు లేక గిరిజనులు పడేపాట్లు ఇన్నీ అన్నీ కావు. ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా, అవి ముందుకు సాగడం లేదని గిరిజనులు గుర్రాలపై తిరుగుతూ నిరసన తెలిపారు.పీ-4 కోసం బయట నుంచి మార్గదర్శులను తెచ్చి గిరిజనులకు సహాయ పడతామని ఆయన అన్నారు. అంటే దీని అర్ధం ఇంతవరకు ఈ ప్రాంత పేదలను దత్తత తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదని చెప్పకనే చెప్పినట్ల అయ్యింది. కాగా చంద్రబాబుకు పీ-4 పిచ్చి పట్టిందా అంటూ ఆయనకు మద్దతు ఇచ్చే ఒక మీడియా రాసిన వ్యాసం చూసిన తర్వాతైనా అందులో ఉన్న డొల్లతనం అర్థమై ఉండాలి. గిరిజనులకు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలేమిటి? వాటిని ఏ మేరకు అమలు చేశామో చెప్పకుండా, అది తెచ్చా! ఇది తెచ్చా! అని ప్రచారం చేసుకుంటే ఏమి ప్రయోజనం? గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని చెప్పిన హామీ ఎందుకు నెరవేర్చలేకపోయారో వివరించి ఉండాలి కదా! పాడేరు మెడికల్ కాలేజీని త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. బాగానే ఉంది. కానీ, ఏడాది కాలంలో ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేదు?.వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు పూనుకుని భవనాల నిర్మాణాలు కూడా చేపడితే, మెడికల్ సీట్లు అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం ఏ రకంగా రాష్ట్రానికి, గిరిజన ప్రాంతానికి మేలు చేసినట్లు?. గిరిజన ప్రాంతాన్ని తానే అభివృద్ది చేశానని, ఉద్యోగాలు ఇచ్చానని ఆయన చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితి అలా కనిపించదు. గిరిజనుల ఇళ్ల వద్దకే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఇప్పుడు గిరిజనులు రేషన్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.కేంద్ర స్కీములను కూడా తన ఖాతాలో వేసుకుని మాట్లాడారు. ఫలానా పనిలో తన వాటా ఇంత అని చెప్పుకుంటే ఫర్వాలేదు. కానీ, మొత్తం తానే చేశానని చెప్పడం ద్వారా నగుబాటుకు గురవుతున్న విషయాన్ని ఆయన పట్టించుకోరు. ఔటర్‌ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిందన్న విషయం ప్రజలకు తెలియదా?. పోనీ హైదరాబాద్‌లో అన్ని చేశానని చెప్పుకునే చంద్రబాబు విశాఖ, విజయవాడ తదితర ముఖ్యమైన నగరాలకు ఫలానా పని చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలు.. సూపర్ హిట్ అని ప్రచారంలో పెట్టడం ఆయన మేధావితనానికి నిదర్శనం అనుకోవాలి. జనం కూడా అన్ని హామీలు నెరవేర్చేశారని భావించాలన్నమాట. నిజమే! అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఆయనంత మేధావి లేకపోవడం వల్ల ఆ హామీల గురించి ఎవరూ ప్రశ్నించి ఉండకపోవచ్చు. లేదా పోలీసులతో ఎక్కడ కేసులు పెట్టిస్తారో అన్న భయంతో ఆ విషయాలు అడిగి ఉండకపోవచ్చు.చివరికి వైఎ‍స్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును సభ వద్దకు అనుమతించకపోవడంతో ప్రశ్నించే వారే లేకుండాపోయారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరిందా?. నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?. తల్లికి వందనం సహా రైతు భరోసా, తదితర స్కీములు ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది అరకొరగా అమలు చేస్తే అవి సూపర్ హిట్ అయినట్లా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి ఇచ్చిన హామీ ఏమిటి? ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని సంకల్పించినా, అన్ని రకాల బస్సుల్లో ఆ సదుపాయం కల్పించకుండా షరతులు పెట్టడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? కాదా?. ఎన్నికల మేనిఫెస్టోలోని మిగిలిన 145 హామీల సంగతేమిటి?. అవి అమలు చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటున్నారా?. వాటి ఊసే ఎత్తడం లేదే!. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పగలిగిన ధైర్యం అనండి.. నేర్పరితనం అనండి ఆయన సొంతమే అని అనుకోవాలి!.ఇక గిరిజన ప్రాంతంలో సభకు వెళ్లి అక్కడ కూడా వివేకా హత్య కేసు ప్రస్తావన తేవడంలోని దురుద్దేశం అర్దం కావడం లేదా?. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో దాని గురించి ఈ ప్రచారం చేయడం అవసరమా?. పులివెందుల ప్రజలకు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఉంటుందా?. ఒకపక్క టీడీపీకి చెందిన వారు రౌడీయిజం చేస్తుంటే, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై అంత దారుణంగా దాడి చేసినా, అలాంటి ఘోరాలను అరికట్టకపోగా, వైఎస్సార్‌సీపీ వారిని ఉద్దేశించి ఏవేవో మాట్లాడితే నమ్మడానికి జనం పిచ్చివాళ్లని అనుకుంటున్నారా?. రౌడీయిజం, అబద్దాలు రాజకీయాలకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరమే అనుకోవాలి. అబద్దాలు చెప్పడంలో దేశంలోనే ఆయనను మించిన నేత లేరని ప్రత్యర్ధి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. వారు చేసే విమర్శలలో ఒక్కదానికి కూడా ఆయన నేరుగా ఎప్పుడూ జవాబుఇవ్వలేదు. కళ్లార్పకుండా అబద్దాలు ఆడగల సత్తా చంద్రబాబుకు ఉందని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో పలుమార్లు అన్నారు.ఆ సమయంలో చంద్రబాబు లేచి తాను ఆడిన అబద్దమేమిటో చెప్పాలని ఎప్పుడూ సవాల్ చేసినట్లు కనిపించలేదు. రౌడీయిజం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గూండాలు చేస్తున్న రౌడీయిజం గురించి ముందుగా ఆయన బదులు ఇస్తే బాగుంటుంది. ఏమైందో కానీ, టీడీపీకి చెందిన ఒక మీడియానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై, రౌడీయిజంపై విమర్శలు చేసింది. దానికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తం. ఆయనకు ముందుచూపు ఉన్నమాట కొంతవరకు ఒప్పుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలను ఆయన దూషించినంతగా మరెవరూ దూషించి ఉండరు. కానీ, ఆ రెండు పార్టీలతో మళ్లీ జతకట్టగలరు. 2024 ఎన్నికల సమయంలో ఎంత ముందు చూపులేకపోతే బీజేపీని బ్రతిమిలాడి మరీ పొత్తు ఎలా పెట్టుకుంటారు?. దాని ద్వారా టీడీపీ ఎన్నో రకాల మాయోపాయాలను ప్రదర్శించగలిగింది కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Mukesh Ambani educational journey from his childhood6
ముఖేశ్‌ అంబానీ ఏం చదివారో తెలుసా?

ఇండియాలో బిజినెస్‌ ఐకానిక్‌గా ఎదిగి దేశంతోపాటు ‍ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేశ్‌ అంబానీ పుట్టింది భారత్‌లో కాదు. అంబానీ ఏడెన్‌(ప్రస్తుతం యెమెన్‌)లో జన్మించారు. పుట్టిన ఏడాదికే ఇండియా వచ్చి చదువు పూర్తయ్యాక తండ్రితోపాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్థాపించి రూ.కోట్ల రూపాయలు సంపాదించారు.తాజాగా హురున్ ఇండియా 2025లో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. చాలా విభాగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న అంబానీ కుటుంబ వ్యాపార విలువ రూ.28.2 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో పన్నెండో వంతుగా ఉండడం విశేషం. అయితే ఇంతకీ ముఖేశ్‌ అంబానీ ఏం చదివారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ వివరాలు కింద తెలియజేశాం.పుట్టిన ప్రదేశం: 1957 ఏప్రిల్ 19న ఏడెన్ (ప్రస్తుత యెమెన్)లో జన్మించారు. తర్వాత ఆయన 1958లో కుటుంబంతో భారత్‌కు వచ్చారు. 1950ల్లో ఆయన తండ్రి ధీరూబాయ్‌ అంబానీ యెమెన్‌లో పని చేస్తుండేవారు. దాంతో ముఖేశ్‌ అక్కడే జన్మించాల్సి వచ్చింది.ప్రాథమిక విద్య: గ్వాలియర్‌లోని సింధియా పాఠశాలలో చదివారు.హైస్కూల్: ముఖేశ్‌ సోదరుడు అనిల్ అంబానీతో కలిసి ముంబైలోని పెద్దార్ రోడ్‌లోని హిల్ గ్రాంజ్ హైస్కూల్‌లో సెకండరీ విద్య పూర్తి చేశారు.సీనియర్ సెకండరీ: ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదివారు.అండర్ గ్రాడ్యుయేషన్‌: ముంబైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు.పోస్ట్ గ్రాడ్యుయేషన్‌: స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరారు. ఒకప్పటి మైక్రోసాఫ్ట్‌ సీఈఓ స్టీవ్ బామర్‌ స్టాన్‌ఫోర్డ్‌లో ముఖేశ్‌ క్లాస్‌మేట్‌. 1980లో తన తండ్రి ధీరూభాయ్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.ఇదీ చదవండి: తలపై గన్‌ పెట్టి బెదిరిస్తే ఎలా?

Jigris Movie Teaser Released By Sandeep Reddy Vanga7
Jigris Teaser: నవ్వులు పూయిస్తున్న ‘జిగ్రీస్‌’ టీజర్‌

‘కొంతమంది ఉంటారు శుద్ధపూసలు. ఫస్ట్‌ వద్దేవద్దు అని షో చేస్తారు. తర్వాత కూర్చున్నాక నాకంటే ఎక్కువ తాగుతారు’ అనే డైలాగ్‌తో మొదలైంది జిగ్రీస్‌ మూవీ టీజర్‌. కృష్ణ బురుగుల, ధీరజ్‌ అథేర్య, మణి వక్కా, రామ్‌నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హరీష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని స్టార్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశారు. ఫ్రెండ్షిప్‌, అడ్వెంచర్‌, కామెడీ నేపథ్యంలో టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది.టీజర్‌ రిలీజ్‌ అనంతరం సందీప్‌ మాట్లాడుతూ.. ‘ కృష్ణ వోడపల్లి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నాకు చెబితే తిడతానని.. చెప్పకుండానే సినిమా స్టార్ట్‌ చేశాడు. యానిమల్‌ షూటింగ్‌ గ్యాప్‌లో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు కొన్ని విజువల్స్‌ చూపించాడు. చాలా బాగున్నాయి. కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఈ రోజుల్లో కాన్ టెంపరరీ కామెడీ బూతులు లేకుండా చాలా బాగా రాసిండు, తీసిండు డైరెక్టర్ హరీష్. టీజర్‌లో చూసిన కామెడీ చాలా తక్కువే. సినిమాలో అలాంటి సీన్లు చాలా ఉన్నాయి. కంటెంట్‌ బాగుంటే చాలు డైరెక్టర్‌, నిర్మాతలతో సంబంధం లేకుండా సినిమాను హిట్‌ చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. ఈ చిన్న సినిమా కంటెంట్‌ బాగుంది. అందరూ సపోర్ట్‌ చేయండి’ అన్నారు. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

DRDO Manager Arrested Sharing Secrets With Pakistan8
Rajasthan: డీఆర్డీఓలో ఉంటూ పాక్‌కు రహస్యాలు.. గెస్ట్‌హౌస్‌ మేనేజర్‌ అరెస్ట్‌

జైసల్మేర్‌: డీఆర్డీఓ శాస్త్రవేత్తల, భారత ఆర్మీ అధికారుల రహస్య వివరాలను పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఆర్డీఓ ఉద్యోగిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో మహేంద్ర ప్రసాద్‌ను రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది.మహేంద్ర ప్రసాద్‌ భారతదేశానికి సంబంధించిన రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం అతనిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తరువాత తదుపరి విచారణ కోసం రిమాండ్‌కు తీసుకువెళ్లనున్నారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు, రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ రాష్ట్రంలోని భద్రతను చురుకుగా పర్యవేక్షిస్తోందని రాజస్థాన్, జైపూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి (సెక్యూరిటీ), డాక్టర్ విష్ణుకాంత్ మీడియాకు తెలిపారు.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన కాంట్రాక్టు మేనేజర్ మహేంద్ర ప్రసాద్‌ పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా సంభాషిస్తున్నట్లు సీఐడీ నిఘా సమయంలో వెల్లడయ్యింది. క్షిపణి, ఆయుధ పరీక్షల కోసం ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించే డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భారత ఆర్మీ అధికారుల కదలిక గురించి అతను పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లకు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు.జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్‌లో వివిధ నిఘా సంస్థలు నిందితుడిని సంయుక్తంగా విచారించాయి. మహేంద్ర ప్రసాద్‌ మొబైల్ ఫోన్‌ను సాంకేతికంగా పరీక్షించగా, అతను డీఆర్‌డీఓతో పాటు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ నిర్వాహకులతో పంచుకుంటున్నాడని స్పష్టమయ్యింది. ఈ నేపధ్యంలో అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద మహేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు.

Jaya Bachchan selfie incident: Kangana Ranaut slams Most spoilt privileged woman9
అమితాబ్‌ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్‌

సమాజ్‌వాదీ పార్టీ , రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్‌పై హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపి కంగనా రనౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని బచ్చన్ తోసేస్తున్న వీడియో వైరల్‌ అయిన నేపథ్యంలో కంగనా ఆమెపై తీవ్ర విమర్శలు చేసింది.ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో జయాబచ్చన్‌ వీడియోను షేర్ చేస్తూ ఇలా కాబెంట్‌ చేసింది. “అత్యంత చెడిపోయిన, విశేషాధికారం కలిగిన మహిళ” అని అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు భర్త అమితాబ్ బచ్చన్ మర్యాదను మంటగలుపుతోందంటూ వ్యాఖ్యానించింది.“ఆమె అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను/అర్ధంలేని తనాన్ని సహించారు. సమాజ్‌వాదీ పార్టి కోడిపుంజులా పందెంకోడిలా, ప్రవర్తింస్తోందంటూ ఎద్దేవా చేస్తే, ఎంత అవమానం, సిగ్గుచేటు” అని కంగనా మండిపడింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. గతంలో జయాబచ్చన ఇలాంటి విమర్శలొచ్చిన సందర్భంలో కంగనా వెనకేసుకొచ్చింది. నిజం చెప్పాలంటే..ఆమె కోపిష్టిమనిషే కానీ అదే సమయంలో ఆమె గొప్ప వ్యక్తి అంటూ జయాను తెగ పొగిడేసింది. 1970లలో ఆమె సినీరంగంలో రాణించారని, సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఒకరు అంటూ జయపై కంగనా ప్రశంసించింది. (జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే)సెల్ఫీ కోసం ఆశతో వచ్చిన అభిమానిని తోసేసి ఏం చేస్తున్నావ్ (క్యా కర్ రహే హై ఆప్?) అంటూ ఆగ్రహం​ వ్యక్తం చేసి పక్కకు నెట్టేశారు.దీంతో సదరు వ్యక్తి సారీ చేప్పారు. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారంతా హతాశులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్‌ హల్‌చల్‌ చేసింది. సింపుల్‌గా సెల్ఫీ వద్దు అంటే సరిపోయేది.. కానీ అతణ్ణి చేత్తో నెట్టివేయడం దారుణం అంటున్నారు. కొంతమంది యాటిట్యూడ్‌ అంటూ జయాబచ్చన్‌ను విమర్శించగా, మరి కొందరు జయ ప్రవర్తనను సమర్థించారు కూడా.

Chief Justice Reacts On Supreme Court Order On Stray Dogs10
వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్‌?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు యూటర్న్‌ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాలామంది ఈ తీర్పును సమర్థించగా.. కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో.. ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ముందు కొందరు న్యాయవాదులు లేవనెత్తారు. అయితే అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునపరిశీలిస్తానని బుధవారం స్పష్టం చేశారు. దీంతో తీర్పు వెనక్కి తీసే అవకాశాలు ఉండొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.రాజధాని రీజియన్‌లో పసికందులు, వృద్దులుపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్‌ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఈ కథనాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని, వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ ఢిల్లీ సర్కార్‌కు జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం (ఆగస్టు 11వ తేదీ) ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో..ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఇది ప్రజల మేలు కోసం చేస్తున్నది స్పష్టం చేసింది. అయితే వీధి కుక్కల కోసం షెల్టర్లు నిర్మించడం, తరలించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని ఢిల్లీ అధికార యంత్రాంగం అంటోంది. అదే సమయంలో రాజకీయ, సినీ, ఇతర ప్రముఖుల నుంచి సుప్రీం కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement