Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Iran Announced Ceasefire latest Updates1
బిగ్‌ ట్విస్ట్‌.. ముగిసిన ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం

పశ్చిమాసియా యుద్ధవాతావరణానికి ఎట్టకేలకు తెరపడింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసింది!. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్‌ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు.. ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకూ ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు కొనసాగించడం గమనార్హం.ఇరాన్- ఇజ్రాయెల్‌ (Iran- Israel) మధ్య కాల్పుల విరమణ జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్‌ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా ఆయన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. సీజ్‌ ఫైర్‌ అమల్లోకి వచ్చిందని, ఎవరూ ఉల్లంఘించొద్దంటూ ఆయన పోస్ట్‌ చేశారు. తొలుత ఇరాన్‌, ఆపై ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ పాటిస్తాయని, 24 గంటల్లో ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించలేదు. అయితే బంకర్లలో దాక్కున్న తమ దేశ పౌరులను బయటకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యుద్ధం ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. అంతకు ముందు.. ట్రంప్‌ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు.ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాలు ఒకేశారి ‘శాంతి’ అంటూ తన వద్దకు కాళ్లబేరానికి వచ్చాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని తాను గుర్తించానన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నిజమైన విజయం సాధించిందన్నారు. ఇరుదేశాలు భవిష్యత్తులో ప్రేమ, శాంతి శ్రేయస్సును చూస్తాయని తెలిపారు. అలా కాదని వారు నీతిని, సత్య మార్గాన్ని వదులుకుంటే రానున్న రోజుల్లో మరింత కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈలోపు ఇరాన్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదంటూనే.. ఒప్పందానికి సుముఖంగా ఉన్నట్లు, ఇజ్రాయెల్‌ దాడులు ఆపితేనే తామూ దాడులు ఆపుతామంటూ ఇరాన్‌ విదేశాంగ మంత్రి సూచనప్రాయంగా పోస్టులు చేశారు. మరోవైపు.. ‘‘ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్‌ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్‌లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఛానల్‌ కథన ప్రసారం చేసింది.ఆపై కొన్ని గంటల్లోనే టెల్‌అవీవ్‌పై టెహ్రాన్‌ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. దీంతో పశ్చిమాసియలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతాయని భావించేలోపే.. కాసేపటికే ట్విస్ట్‌ ఇస్తూ ఇరాన్‌ కాల్పుల విరమణ మొదలైందంటూ ప్రకటన చేయించడం గమనార్హం. ఇరుదేశాల ఒప్పందం వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి.

Congress MP Shashi Tharoor on BJP Join Reports2
‘ఇక బీజేపీలో చేరికా?’.. కుండబద్ధలు కొట్టేసిన శశిథరూర్‌

న్యూఢిల్లీ: పీయూష్ గోయల్‌తో సెల్ఫీ దిగడం, ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ను ఆకాశానికి ఎత్తడం, భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగడడం, అదే తరుణంలో కాంగ్రెస్‌తో విభేదాలున్నాయని అంగీకరించడం.. ఇవన్నీ వేటికి సంకేతాలుగా భావించొచ్చు!. ఇదే విషయాన్ని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ వద్ద ప్రస్తావించగా.. ఆయన చిరునవ్వుతో అదేం లేదంటున్నారు. తాజాగా .. సోమవారం(జూన్‌ 23న) The Hindu పత్రికలో శశిథరూర్‌ రాసిన ఓ వ్యాసం పబ్లిష్‌ అయ్యింది. ఆపరేషన్ సిందూర్‌.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విదేశాంగ ప్రచారం భారతదేశ ఐక్యతను, సంకల్పాన్ని సూచించిందని ఆ కథనంలో థరూర్‌ రాశారు. ఈ వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా షేర్ చేయగా.. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ ‘‘శశిథరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని లోపాలను.. ఆ పార్టీలోని విభేదాలను బహిర్గతం చేశాయి’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ బీజేపీలో చేరికకు సంకేతాలుగా భావించొచ్చా? అని మంగళవారం ఎదురైన ప్రశ్నకు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ఇవేవీ నేను బీజేపీలో చేరతానన్న సంకేతం కాదని స్పష్టత ఇచ్చారాయన. ‘‘విదేశాంగ మిషన్‌ విజయాన్ని మాత్రమే నేను ఆ వ్యాసంలో ప్రస్తావించా. ఇది అన్ని పార్టీల ఐక్యతను ప్రతిబింబించే విషయం మాత్రమే’’ అని అన్నారాయన. "ప్రధాని మోదీ చొరవతో.. ఇతర దేశాలతో భారత్‌ సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే ఇది బీజేపీనో, కాంగ్రెస్‌ తీసుకొచ్చిన విదేశాంగ విధానం కాదు. ఇది భారతదేశ విదేశాంగ విధానం. సుమారు 11 ఏళ్ల కిందట పార్లమెంట్‌లో విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను. అంత మాత్రాన నేను ప్రధాని మోదీ పార్టీలో చేరతానని కాదు. ఇది జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రకటన మాత్రమే’’ అని కుండబద్ధలు కొట్టారాయన. అంతకుముందు.. కాంగ్రెస్‌ అధిష్టానంతో తనకు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే అవి నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే పరిష్కారం అయ్యే విషయాలేనని, వాటి గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానని థరూర్‌ మీడియా ముఖంగా ప్రకటన చేశారు.‘‘ గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నా విజయంలో కీలక పాత్ర పోషించారు. నేను ఇప్పటికీ కాంగ్రెస్‌కు విదేయుడినే. పార్టీకి అవసరమైతే పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతర పార్టీలో చేరే ఆలోచన ఏమాత్రం లేదు’’ అని ఆ సమయంలో అన్నారయన. అలాగే, తాను ప్రజాస్వామ్యవాదిగా, మతతత్వానికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తినంటూ గతంలోనూ ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబడుతోంది. అయితే ఆ పార్టీ సీనియర్‌ సభ్యులు థరూర్‌ మాత్రం అందుకు భిన్నంగా ఆకాశానికి ఎత్తుతున్నారు. అలాగే.. ట్రంప్‌ మధ్యవర్తిత్వం ప్రకటన విషయంలో కాంగ్రెస్‌ లైన్‌కు భిన్నంగా థరూర్‌ వ్యవహరించడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే థరూర్‌ తాజా వ్యాఖ్యలతో ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లయ్యింది.

Mother Lost Her Life Because Of Her Daughter In Jeedimetla Hyderabad3
జీడిమెట్ల: తల్లిని కడతేర్చిన కూతురు.. వెలుగులోకి సంచలన విషయాలు

సాక్షి, మేడ్చల్‌: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చింది ఓ బాలిక.. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. తల్లి ప్రేమను మరిచిది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశం గా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్‌(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జిడీమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెలల క్రితమే బాలికకు ఇన్‌స్టాలో శివ పరిచయమయ్యాడు. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్‌ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివ.. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్‌ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ బాలిక.. తన పెద్దమ్మకు ఫోన్‌ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని.. గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరుమున్నీరైంది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్‌ చేసి.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది.

Operation Sindhu: No Help From Kutami Prabhutvam Says Iran AP Students4
Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు

సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందులో భాగంగా.. ఇరాన్‌ నుంచి స్వస్థలానికి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ చేరుకున్న విమానంలో ఐదుగురు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్లంతా కెర్మన్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు వాళ్లు. ‘‘నాలుగు రోజుల నుంచి ఇరాన్‌ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. మమ్మల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది. ఢిల్లీ నుంచి స్వయంగా మేమే మా ఖర్చులతో నంద్యాలకు వెళ్తున్నాం. మిగతా వాళ్లకు వాళ్ల వాళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా, ఏపీ ప్రభుత్వం కూడా చేస్తే బాగుండేది.. .. మేము ఉన్న ప్రాంతంలో యుద్ధం ప్రభావం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కాలేజీ యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. యుద్ధం రావడం వల్ల సెమిస్టర్ పరీక్షలు ఆగిపోయాయి. కాలేజీ యాజమాన్యం పిలిస్తే మళ్లీ వెంటనే ఇరాన్ వెళతాం అని నంద్యాలకు చెందిన నరేందర్‌, నారాయణలు తెలిపారు. ఆపరేషన్‌ సిందు గురించి.. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్‌ ఇది. మొదటి దశలో.. జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారు. రెండో దశలో జూన్ 21న మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి తరలించబడ్డారు. ఈ విమానం ఢిల్లీలో సాయంత్రం 4:30కి ల్యాండ్ అయింది. మొత్తం ఇప్పటివరకు: 827 మందిని భారత్‌కు సురక్షితంగా తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.ఆపరేషన్‌ సిందు కోసం.. ఇరాన్ ప్రభుత్వం భారత పౌర విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ ఆపరేషన్‌లో రోడ్డుమార్గం ద్వారా అర్మేనియాకు తరలించి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు తీసుకురావడం వంటి వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకున్నారు.యుద్ధం ఇలా.. జూన్‌ 13వ తేదీన ఇరాన్‌ నుంచి ప్రపంచానికి అణు ముప్పు ఉందని చెబుతూ ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట దాడులకు దిగింది ఇజ్రాయెల్‌. ప్రతిగా ఇరాన్‌ సైతం మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడులు జరిపింది. చివరకు.. ట్రంప్‌ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు మంగళవారం (జూన్‌24న) కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ముగిసింది.

LPU Student Secures Record Breaking Rs 2 5 Crore Placement Offer5
ఐఐటీలకు ధీటుగా ఎల్‌పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)లో ఇటీవలి ఫ్లేస్‌మెంట్‌ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్‌పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్‌పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్‌పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్‌పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్‌పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్‌తో భారీ ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్‌గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్‌పీయూ తాజా ప్లేస్‌మెంట్‌ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్‌పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్‌గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్‌పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్‌కు ప్రపంచ ఖ్యాతిఎల్‌పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్‌ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్‌పీయూ ఎందుకంటే?ఎల్‌పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్‌మెంట్‌ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్‌ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్‌ ప్లేస్‌మెంట్‌ ట్రెయినింగ్‌ పొందుతారు.‘ఎల్‌పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్‌మెంట్‌ ల్యాండ్ స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్‌పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

 Fans Question Team Selection As Shardul Thakur Fails To Impress In First Test6
'అత‌డిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్‌ రెడ్డి వంద రెట్లు బెట‌ర్‌'

ఠాకూర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండ‌ర్ నితీశ్‌కుమార్ రెడ్డి స్ధానంలో తుది జ‌ట్టులోకి వ‌చ్చిన శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూప‌లేక‌పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగు చేసిన ఠాకూర్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి త‌న వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. ఈ ముంబై క్రికెట‌ర్‌ 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. బౌలింగ్‌లోనూ విఫ‌ల‌మ‌య్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 ఓవ‌ర్లు వేసి 38 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.దీంతో భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ మ‌రో స్పెల్ బౌలింగ్ చేసే అవకాశ‌మివ్వ‌లేదు. అయితే ఈ మ్యాచ్‌లో శార్థూల్ ఠాకూర్‌పై టీమిండియా మెనెజ్‌మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. లోయార్డ‌ర్‌లో శార్ధూల్ త‌న అనుభ‌వంతో ప‌రుగులు సాధిస్తాడ‌ని భావించింది. అందుకే ఆసీస్ గ‌డ్డ‌పై దుమ్ములేపిన తెలుగు తేజం తీష్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టి మరీ శార్దూల్‌ను ఆడించారు.కానీ హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ న‌మ్మ‌కాన్ని శార్ధూల్ వ‌మ్ము చేశాడు. ఈ క్ర‌మంలో టీమ్‌మెనెజ్‌మెంట్‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. శార్థూల్‌ను ఎందుకు అవ‌కాశమిచ్చారు.. అత‌డి కంటే నితీశ్ రెడ్డి వంద రెట్లు బెట‌ర్ అని పోస్ట్‌లు పెడుతున్నారు. మ‌రోవైపు శార్దూల్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 6 ఓవ‌ర్ల మాత్ర‌మే బౌలింగ్ ఇవ్వడాన్ని ప‌లువురు మాజీలు త‌ప్ప‌బ‌డుతున్నారు. అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేన‌ప్పుడు జ‌ట్టులోకి ఎందుకు తీసుకున్నార‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక లీడ్స్ టెస్టు ముగింపున‌కు చేరుకుంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇం‍గ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 ప‌రుగులు చేసింది. ఇం‍గ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 ప‌రుగులు కావాలి. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Days After Ahmedabad Plane Incident Air India Staff Dances In Office, Netizens Anger7
అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్‌

భారతదేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన విమానయాన ప్రమాదాల్లో ఒకటి అహ్మదాబాద్‌లో జరిగిన AI171 విమాన ప్రమాదం. అయితే ఘోర విపత్తులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా SATS (AISATS) ఉన్నతాధికారులు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పార్టీలో నృత్యం చేస్తూ ఎంజాయ్‌ చేయడం విమర్శలకు తావిచ్చింది.AISATS అనేది విమానాశ్రయ గ్రౌండ్ సేవలను అందించే సంస్థ. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానాశ్రయ సేవలు , ఫుడ్‌ అందించే SATS అనే రెండు కంపెనీల (50-50) సమ భాగస్వామ్యంలో ఉన్న జాయింట్ వెంచర్‌ ఇది.ఎయిర్ ఇండియా SATS (AISATS) సీనియర్ అధికారులు గురుగ్రామ్ లో ఒక DJ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 20న జరిగిన ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, GM, సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ GM హాజరయ్యారు. విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించిన కొద్ది రోజులకే ఇలాంటి పార్టీ చేసుకోవడం దుమారాన్ని రాజేసింది. వందలాది మంది బాధితులు హృదయవిదారకమైన శోకం ఉంటే, ఆప్తులను కోల్పోయి కంటిమింటికి ధారగా రోదిస్తోంటే... కనీస మానవత్వం లేకుండా ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలింది. ఈ విషాదంలో కేవలం బాధితులు మాత్రమే కాదు, యావద్దేశం దుఃఖిస్తోంది.కానీ కనీస ఇంగితలం లేకుండా అధికారులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. దీనిపై సంబంధింత అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది క్షమించరానిది అంటూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉండటం గమనార్హం. It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD— Squint Neon (@TheSquind) June 22, 2025 "మానవత్వం చచ్చిపోయింది.. నమ్మబుద్ధి కావడం లేదు’’ అని ఒకరు, "సంతోషంగా ఉండండి,కానీ ముందుగా మృతులకు గౌరవ సంతాపం తెలియజేయడం మర్చిపోతే ఎలా? ఇంత మంది చనిపోయిన నెలరోజులలోపే, మీరు ఇలా డాన్స్‌ చేసి ఎయిరిండియా ఇమేజ్‌ను నాశనం చేస్తున్నారు. సిగ్గుచేటు ఇప్పటికే సంస్థ సేవల విషయంలో దిగజారిపోయింది, ఇప్పుడు భద్రతలో కూడా’’ మరొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Shubhanshu Shuklas Axiom Space Mission Likely Tomorrrow8
శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. నాసా కీలక ప్రకటన

న్యూఢిల్లీ, సాక్షి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్రకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈనెల 25న రోదసియాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా తన తాజా ప్రకటనలో తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా జూన్​25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్​ సెంటర్​ నుండి ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో శుభాంశు శుక్లా మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. శుభాంషు శుక్లా రోదసీ యాత్ర ఇప్పటివరకు ఐదు సార్లు వాయిదా పడింది. మొదట ఇది మే 29న జరగాల్సి ఉండగా, ఆ తర్వాత జూన్ 8, జూన్ 10, జూన్ 11, మరియు జూన్ 19 తేదీలకు మారింది. జూన్ 11న జరగాల్సిన ప్రయోగానికి ముందు ఫాల్కన్-9 రాకెట్‌లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజీ కారణంగా మళ్లీ వాయిదా పడింది.ఈ వ్యోమనౌక భూమి నుంచి బయల్దేరిన 28 గంటల అనంతరం ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానుంది. 14 రోజుల పాటు ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఔత్సాహిక విద్యార్థులు, అంతరిక్ష శాస్త​వేత్తలు ఈ నలుగురు వ్యోమగాములతో సంభాషించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే విజయవంతమైతే, శుభాంషు శుక్లా ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోతారు. భారత్‌కు ఏం ప్రయోజనమంటే.. గగన్‌యాన్ ప్రాజెక్టుకు పునాదిఈ మిషన్ ద్వారా శుభాంషు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) 14 రోజుల పాటు అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. ఇవి భారత గగన్‌యాన్ మిషన్‌కు అవసరమైన అనుభవాన్ని ఇస్తాయి. ఇస్రోకు అంతర్జాతీయ అనుభవంనాసా, యాక్సియమ్ స్పేస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఇస్రోకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో అంతర్జాతీయ సహకారానికి దారితీస్తుంది. శాస్త్రీయ ప్రయోగాలుశుభాంషు నిర్వహించే ప్రయోగాలు మైక్రోగ్రావిటీలో కండరాల నష్టం, పంటల సాగు, టార్డిగ్రేడ్స్ (వాటర్ బేర్స్) జీవన విధానం, కంప్యూటర్ స్క్రీన్‌ల ప్రభావం వంటి అంశాలపై దృష్టి పెడతాయి. ఇవి ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం రంగాల్లో కొత్త అవగాహనను తీసుకురాగలవు. భారత యువతకు ప్రేరణ1984లో రాకేశ్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్‌కు బలమైన ప్రోత్సాహం అవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు.. భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయం కూడా.ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్‌? తుది నిర్ణయంపై తర్జనభర్జన

Dilraju Once Again Reacts On Game Changer Failure9
'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గేమ్ ఛేంజర్'.. దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది. తొలిరోజు తొలి ఆటకే ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. అయితే హీరో-నిర్మాత దీని గురించి పెద్దగా స్పందించలేదు కానీ దర్శకుడు, ఎడిటర్ మాత్రం కొన్నిరోజుల తర్వాత మాట్లాడారు. తమది తప్పు కాదన్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే 'తమ్ముడు' సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు 'గేమ్ ఛేంజర్' ఫెయిల్యూర్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ముక్కుసూటిగా సమాధానం చెప్పేశారు.దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో జడ్జిమెంట్, ఫిల్మ్ మేకింగ్‌లో అనుభవం అనే బ్రాండ్ ఉంది. మీరు తీసే సినిమాలో మీకు తెలియకుండా ఏమీ జరగదంటారు. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అలా ఎందుకు జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులతో చేసినప్పుడు 100 శాతం ఆ సమస్య ఉంటుంది. దిల్ రాజుకే కాదు. అందరికీ ఆ ప్రాబ్లమ్ తప్పదు. సినిమాని నాలుగున్నర గంటలు తీశారని ఎడిటర్ చెప్పింది నిజమే. పెద్ద డైరెక్టర్‌తో చేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేం'(ఇదీ చదవండి: థగ్‌ లైఫ్‌ డిజాస్టర్‌.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను: మణిరత్నం)'అయితే రోజూ కిచిడీ ఉంటుంది. రోజూ కావాలా.. మొత్తం అయిపోయాక ఒక్కసారి చూసుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి. తప్పు జరిగినప్పుడు ప్రొడ్యూసర్ ఆపాలి. దానిని ఆపలేకపోయానంటే అది నా వైఫల్యమే. అలాంటి ప్రాజెక్ట్‌ని నేను చేసి ఉండకూడదు. నా కెరీర్‌లో 60 వరకు సినిమాలు తీశాను. కానీ ఎప్పుడూ పెద్ద దర్శకులతో సినిమాలు చేయలేదు. అందువల్ల నా మొదటి తప్పుడు నిర్ణంయం అదే. పెద్ద దర్శకుడితో తీస్తున్నప్పుడు ముందే కాంట్రాక్ట్‌లో క్లియర్‌గా పాయింట్లు పెట్టి సినిమాకు వెళ్లాలి. అలా చేయలేకపోయాను. అది నా తప్పు''ఆ తప్పుని అంగీకరించి దానిని అక్కడితో వదిలేశాను. అది మన స్కూల్ కాదు. అలా కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించడం వేస్ట్' అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలానే చివరి నిమిషం వరకు మీరు సినిమా చూడలేదట కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అది మాత్రం తప్పు, తాను ముందే సినిమా చూశానని చెప్పారు. ఏదేమైనా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ తప్పుని హుందాగా ఒప్పుకోవడం కూడా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

audio electronics industry heat from China restrictions on rare earth metals10
రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బ

రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌ ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడంతో దేశీయంగా ఈ ప్రభావం ఆటోమొబైల్‌సహా పలు రంగాలపై కనిపించనుంది. ఈ ప్రభావంతో ఆడియో ఎల్రక్టానిక్స్‌ పరిశ్రమలో 21,000 ఉద్యోగాలు రిస్క్‌లో పడనున్నట్లు ఎల్రక్టానిక్స్‌ పరిశ్రమల సమాఖ్య ఎల్సినా.. ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్‌లో టెర్బియం, డిస్‌ప్రోజియం తదితర రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలకు తెరతీసింది.వీటిలో అధిక నాణ్యతగల (హైపెర్ఫార్మెన్స్‌) ఎన్‌డీఎఫ్‌ఈబీ(నియోడైమియం–ఐరన్‌–బోరన్‌) మ్యాగ్నెట్లు తదితరాలున్నాయి. ఇవి ప్రధానంగా కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ తయారీలో వినియోగించే కీలక ముడిసరుకులు కావడంతో ఈ ప్రభావం దేశీయంగా కనిపిస్తోంది. వీటి సరఫరాలకు విఘాతం కలగడంతో దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వాచీలు, వినికిడి సంబంధిత(ఇయర్‌ ఫోన్స్, బడ్స్‌) ఎల్రక్టానిక్‌ వస్తువుల తయారీ దెబ్బతింటున్నట్లు ఎల్సినా పేర్కొంది. దీంతో పూర్తిస్థాయిలో తయారైన స్పీకర్‌ మాడ్యూల్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఎలక్ట్రానిక్‌ వస్తు తయారీకి విఘాతం కలగడమేకాకుండా దిగుమతులపై అధికంగా ఆధారపడవలసిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు వివరించింది. ఫలితంగా స్పీకర్, ఆడియో విడిభాగాల పరిశ్రమపై ఆధారపడిన 5,000–6,000 ప్రత్యక్ష ఉద్యోగాలకుతోడు పరోక్షంగా 15,000మంది ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు నోయిడాలో ఉపాధి కల్పన దెబ్బతినే వీలున్నట్లు పేర్కొంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement