సినీ కళాకారుల సంఘం (మా) అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. ఈ పదవికి తాను దూరంగా ఉండనున్నట్లు ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. దాంతో ఆ పదవిని చేపట్టేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించారు. అయితే.. ఈలోపు ఈ పదవికి తాను రంగంలో ఉంటానంటూ సహజనటి జయసుధ ముందుకొచ్చారు. ఆమెకు 'మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ మద్దతు పలికారు. ఆయన మద్దతుతో జయసుధ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక దశలో మంచు విష్ణు కూడా ఈ పదవికి పోటీ పడతారన్న కథనాలు వచ్చాయి గానీ.. ఆయన వాటిని ఖండించారు. తాను పోటీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు 'మా' అధ్యక్ష పదవి బరిలో రాజేంద్రప్రసాద్, జయసుధ నిలవడం దాదాపు ఖాయమైంది.
Published Fri, Mar 20 2015 4:17 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement