Movie Artists Association
-
'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్పై మా అసోసియేషన్ రియాక్షన్
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్పై మా అసోసియేషన్ స్పందించింది. మా తరఫున నటుడు కోశాధికారి శివబాలాజీ ఆమె చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆమె నుంచి మాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. మా కంటే ముందుగా కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు.అంతేకాకుండా పూనమ్ కౌర్ కేవలం ట్విటర్లో పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివబాలాజీ వెల్లడించారు. మా అసోసియేషన్ను, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే ఆమెకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆమె పోస్ట్పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.కాగా.. అంతకుముందు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్కు ఫిర్యాదు చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. గతంలోనూ చాలాసార్లు తన బాధను వ్యక్తం చేసిన పూనమ్ కౌర్ మరో ట్వీట్తో చర్చకు దారితీసింది.గతంలోనూ పోస్టులు..టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు, సినీ నటి పూనమ్ కౌర్ వివాదం ఇప్పటిది కాదు. గతంలో త్రివిక్రమ్ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.పూనమ్ కౌర్ సినీ కెరీర్..ఇక పూనమ్ కౌర్ సినిమాల విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. -
త్రివిక్రమ్పై పూనమ్ మరోసారి సంచలన ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు, సినీ నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని,కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు మాత్రం నిజంగానే పూనమ్కి అన్యాయం జరిగిందంటారు. మరికొంత మంది ఏమో ఫేమ్ కోసమే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారని విమర్శిస్తారు. అయితే పూనమ్ మాత్రం తన పోరాటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని డిమాండ్ చేస్తునే ఉంది. కానీ ‘మా’ మాత్రం పట్టించుకోవట్లేదని పూనమ్ ఫైర్ అవోతుంది.తాజాగా మరోసారి ‘మా’పై తన అసంతృప్తిని వెల్లడిస్తూ పూనమ్ సంచలన ట్వీట్ చేసింది.(చదవండి: డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)‘త్రివిక్రమ్(Trivikram Srinivas)పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. ఇప్పటి వరకు ‘మా’ దానిపై స్పందించలేదు. త్రివిక్రమ్ని ప్రశ్నించడం కానీ అతనిపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తుంది’ అని పూనమ్ ట్వీట్ చేసింది. గతంలో కూడా పూనమ్ ఇలాంటి ట్వీట్స్ చాలానే చేసింది. త్రివిక్రమ్పై ‘మా’లో ఫిర్యాదు చేస్తే సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన త్రివిక్రమ్ని ప్రశ్నించాలని పూనమ్ డిమాండ్ చేసింది.పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది: మంచు విష్ణు
కొద్దిరోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సంఘటనలు జరగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడితే... కుటుంబంలో విభేదాలు రావడంతో మంచు ఫ్యామిలీలో కేసుల వరకు గొడవలు వెళ్లాయి. దీంతో పలువురు చిత్ర పరిశ్రమ నుంచి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షునిగా మంచు విష్ణు అధికారిక ప్రకటన చేశారు.'మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం,సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకత పై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన ఇండస్ట్రీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి.ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం గానీ నివారించండి.కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.' అని విష్ణు ఒక ప్రకటన చేశారు. -
దయచేసి 'మా' వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు: మంచు విష్ణు లేఖ
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సినిమా వాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమ పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం నిరాశ కలిగించిందన్నారు. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటామని.. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతమని మా తరఫున మంచు విష్ణు నోట్ విడుదల చేశారు.'సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటివల్ల కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మన పరిశ్రమ కూడా ఇతర రంగాల్లాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. నిజం కాని కథనాలను రాజకీయ లబ్ధి కోసం వాడటం చాలా నిరాశను కలిగించింది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం.. కానీ మా కుటుంబాలు మాత్రం వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం.. వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావాలని ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.'నోట్లో ప్రస్తావించారు.(ఇది చదవండి: నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్)'రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయాల కోసం, ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా సినిమాకు చెందిన వారి పేర్లు, కుటుంబాల పేర్లు వాడకండి. చిత్రపరిశ్రమలో పనిచేసేవారు వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలోకి లాగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా.. మనుషులుగా కూడా మన కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనల బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిద్దాం. సినీ ఇండస్ట్రీ తరపున మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. అవసరమైతే మేమంతా ఏకమై నిలబడతాం' అంటూ లేఖ విడుదల చేశారు. Official Statement from Movie Artists Association (MAA) pic.twitter.com/vc4SWsnCj6— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2024 -
ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్తో హీరోయిన్ పూనమ్ కౌర్ గొడవ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి ఉన్నదే. వీలు చిక్కినప్పుడల్లా గురూజీపై పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.హైదరాబాద్లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్.. తెలుగులో పలు సినిమాలు చేసింది. అయితే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్తో ఈమెకు ఏం గొడవ ఉందో తెలీదు గానీ ఎప్పటికప్పుడు వీళ్లని విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవొద్దు అని ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?)ఇది పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.మరి పూనమ్ కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్.. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్లో ఫిర్యాదు చేసేంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో?(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో కొడుకులు అరెస్ట్)Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
ఆ యూట్యూబర్పై శివ బాలాజీ ఫిర్యాదు
చిత్రపరిశ్రమలోని నటీనటులతో పాటు వారి కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు, 'మా' కోశాధికారి శివ బాలాజీ పోలీసులను ఆశ్రయించారు.సినీ నటీనటులను టార్గెట్ చేస్తూ నిత్యం నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ అనే వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్లో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. చంద్రహాసన్ గత కొంత కాలంగా నటీనటులతో పాటు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి తప్పుగా చూపుతూ.. ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో భాగమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్కు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్ చేశాడని శివ బాలాజీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్కు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. యూట్యూబర్స్లో మార్పు రాకుంటే వారిపై మరింత కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
సినీ నటి హేమపై 'మా' సస్పెన్షన్ ఎత్తివేత
సినీ నటి హేమకు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) శుభవార్త చెప్పింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మా ప్రకటించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే, హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు తాజాగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
‘మా’కు మంచు విష్ణు రూ. 10 లక్షల విరాళం!
మంచు విష్ణు మరోసారి మంచి గొప్ప మనసు చాటుకున్నాడు. తన కూతురు ఐరా విద్యా బర్త్డే సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.గత మూడేళ్లుగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతూ.. అసోసియేషన్ మెంబర్లకు అండగా నిలుస్తున్నాడు. సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు.విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. -
'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?
హీరో మంచు విష్ణుపై ఓ యూట్యూబర్ దారుణంగా విమర్శలు చేశాడు. సదరు హీరోకి చెందిన నిర్మాణ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని చెబుతూ ఫుల్ ఫైర్ అయిపోయాడు. దీనిపై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. అలా వచ్చే మెయిల్స్తో తమకు సంబంధం లేవని, అవన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం ఏంటి? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: హీరో విశాల్ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. ఏమైందంటే?)మంచు విష్ణు ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సెలబ్రిటీలు, వాళ్ల ఫ్యామిలీపై ట్రోల్ వీడియోలు చేస్తున్న చాలా యూట్యూబ్ ఛానెల్స్పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే వందలాది ఛానెల్స్పై స్టైక్స్ వేసి, వాటిని తొలగించారు. ఈ విషయమై తాజాగా ఓ యూట్యూబర్ స్పందించాడు. తనలానే చాలామందికి చెందిన యూట్యూబ్ ఛానెల్స్పై స్ట్రైక్స్ వేసి, తొలగించారని.. వాటిని తీయమని చెబుతుంటే రాబోయే 'కన్నప్ప' మూవీ గురించి పాజిటివ్ వీడియో చేయాలని మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఫ్రూప్ కూడా చూపించాడు.దీనిపై ఇప్పుడు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ స్పందించింది. పలువురు యూట్యూబర్స్కి మెయిల్స్కి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ మెయిల్స్తో తమకు భంగం కలిగిస్తున్నారని, ఈ విషయమై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఓ నోట్ రిలీజ్ చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే మంచు విష్ణుపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ప్రాక్టీస్లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!) View this post on Instagram A post shared by 24 Frames Factory (@24framesfactory) -
డీజీపీని కలిసిన 'మా' ప్రతినిధులు.. ట్రోలర్స్కు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: విమర్శ మంచిదే కానీ అది హద్దు దాటకూడదు. ఈ మధ్య కాలంలో పలువురు నెటిజన్లు, యూట్యూబర్స్.. సెలబ్రిటీలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వారు చేసే పని గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్) నటీనటుల గురించి అసభ్యంగా మాట్లాడిన ఐదు యూట్యూబ్ ఛానల్స్ను తొలగించింది.స్పెషల్ సెల్గురువారం నాడు మా బృందం డీజీపీ జితేందర్ను కలిసింది. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వీడియోలు వదులుతున్న 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపికి సమర్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్ సెక్యూరిటీ వింగ్లోని ఓ స్పెషల్ సెల్ ఇకపై దీనిపైనే ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు. ట్రోలర్స్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఫ్యామిలీని కూడా వదలట్లేదుఅనంతరం రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండొద్దు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్ చేయడం దారుణం. ఇకమీదట నటీనటులను ట్రోల్స్ చేస్తే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. దారుణమైన ట్రోల్స్కు పాల్పడేవారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం. సుమారు 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపీకి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.మహిళా ఆర్టిస్టులే టార్గెట్నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు కోసం ఇలా చేస్తున్నాయి. కానీ దీనివల్ల లేడీ ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చారు.చదవండి: మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే? -
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్కు తరలించారు. -
మరోసారి మా అధ్యక్షునిగా మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. -
తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు మలేషియాలో: మంచు విష్ణు
తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకను మలేషియాలో ఘనంగా నిర్వహిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. సినీ పెద్దలతో చర్చించి త్వరలోనే వేడుకల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా ఉండటం చాలా గర్వంగా ఉంది.జులైలో మలేషియాలో తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తాం. తెలుగు సినీ పరిశ్రమ ఘన కీర్తిని తొడ కొట్టి చెప్పాలనే ఈ వేడుకలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ వేడుకల గురించి ఫిల్మ్ ఛాంబర్తో మాట్లాడాం. జులైలో తెలుగు పరిశ్రమకు రెండు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరాం.అందుకు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారు. దేశంలో ఉన్న ఐదు అసోసియేషన్ లతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒప్పందం చేసుకున్నాం. భారతీయ సినిమాను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృషి చేస్తోంది’ అని అన్నారు. -
‘మా’తో బాలీవుడ్ ఒప్పందం
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), బాలీవుడ్ అసోసియేషన్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలు చేసే బాలీవుడ్ కళాకారులకు ‘మా’ సభ్యత్వం అందుతుంది. అలాగే బాలీవుడ్ చిత్రాల్లో నటించే తెలుగువాళ్లకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం ఉంటుంది’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ని కలిసి, రెండు అసోసియేషన్లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతి΄ాదన ఉంచారు. అందుకు బాలీవుడ్ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ‘మా’, సినేటా (హిందీ చలనచిత్రం మరియు టీవీ అసోసియేషన్) ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి. ‘‘త్వరలో వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబంగా ఉండాలి’’ అన్నారు మంచు విష్ణు. -
మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్బండ్పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్
సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో ఆయన పార్థివదేహం వద్ద నివాశులర్పించారు. శరత్ బాబు గొప్ప నటుడని విష్ణు కొనియాడారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి.. అందరూ గర్వించే విధంగా ఎదిగారని అన్నారు. ఈ సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచు విష్ణు మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్ప నటుడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అందరం అండగా ఉందాం.' అని అన్నారు. శరత్ బాబు పార్థివదేహానికి నటులు మురళీ మోహన్, శివాజీ రాజా, శివ బాలాజీ, ప్రసన్న కుమార్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) -
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్పై చేసిన కామెంట్స్పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్) -
మాట నిలబెట్టుకున్న మంచు విష్ణు.. మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ నిర్వహించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ చెకప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మా ప్రిసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ.. కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మెన్ గురునాథ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, డాక్టర్ మేఘనాథ్ రెడ్డిలకి ధన్యవాదాలు తెలిపాడు. 'జనరల్ గా మాస్టర్ హెల్త్ చెకప్ కి పదివేలు అవుతుంది, కానీ కాంటినెంటల్ హాస్పిటల్స్ మాకు ఉచితంగా సర్వీస్ చేస్తున్నందుకు చాలా సంతోషం' అని విష్ణు పేర్కొన్నారు. మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేస్తున్న మూడవ హెల్త్ చెకప్ ఇది. మా సభ్యులందరికి 3 లక్షల విలువ చేసే హెల్త్ భీమాని ఉచితంగా అందిస్తున్నాం" అని తెలిపారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
అలా చేస్తే వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తా: మంచు విష్ణు
సాక్షి, హైదరాబాద్: మా ఎన్నికల్లో తాను చేసిన వాగ్దానాలు 90 శాతం పూర్తయ్యాయన్నాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు. సంక్రాంతి తర్వాత మా కోసం యాప్ తీసుకొస్తామని, నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్లెట్ తయారుచేశామని చెప్పాడు. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి మోహన్బాబు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. '2021 మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అక్టోబర్ 13న నేను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు సినీపరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది. నేను మా అసోసియేషన్కే కాదు ప్రేక్షకులకు కూడా జవాబుదారీనే! మా అసోసియేషన్లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. మా అసోసియేషన్ సభ్యత్వం కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నాం. నటీనటులు కనీసం రెండు చిత్రాల్లో నటించి, అవి విడుదలైతేనే వారికి మాలో శాశ్వత సభ్యత్వం ఉంటుంది. కనీసం ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగ్ చెప్పిన వాళ్లకు అసోసియేట్ సభ్యత్వం కల్పిస్తాం. అసోసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు. మా అసోసియేషన్కు వ్యతిరేకంగా ఎవరైనా నటీనటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అసోసియేషన్కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు పోటీకి అనర్హులవుతారు. మా అసోసియేషన్ భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించాను. ఫిల్మ్ నగర్కు అరగంట దూరంలో ఓ భవనం నిర్మిస్తున్నాం. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తాను. చాలా మంది సభ్యులు రెండో అంశానికే మద్దతు పలికారు' అని చెప్పాడు. చదవండి: ఆరోహి పోయిందంటే ఇనయను తగులుకున్నాడు సినిమా ఛాన్స్ అని ఇంటికి పిలిచి.. : నటి -
తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు
కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్సీసీ–తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఇటీవల నాలుగు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్లు నిలిపివేసి, సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సెస్టెంబర్ 1 నుంచి చిత్రీకరణ పునః ప్రారంభించుకోవచ్చని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. షూటింగ్లు కూడా ఆరంభం అయ్యాయి. తాజాగా పారితోషికం, ఓటీటీ, థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్, ఫెడరేషన్కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ, టీఎఫ్సీసీ ఓ లేఖను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 10 నుంచి అమలులోకి వస్తాయన్నట్లుగా టీఎఫ్సీపీ పేర్కొంది. కాగా ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు జరిపాకే ఈ కొత్త మార్గదర్శకాలను నిర్ణయించినట్లుగా టీఎఫ్సీసీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో పేర్కొన్న మార్గదర్శకాలు ఈ విధంగా.... ప్రొడక్షన్కు సంబంధించిన గైడ్లైన్స్ ► నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాలు ఉండవు. ► నటీనటులు వారి పారితోషికంలోంచే వ్యక్తిగత సిబ్బంది వేతనాలు చెల్లించుకోవాలి. అలాగే స్థానిక రవాణా, బస, స్పెషల్ ఫుడ్ వంటివి నటీనటులే సమకూర్చుకోవాలి. ఒప్పందాల ప్రకారమే నిర్మాతలు ఆర్టిస్టులకు పారితోషికాలను చెల్లిస్తారు. నటీనటులతో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. ► సినిమా షూటింగ్ ప్రారంభించడా నికి ముందే పారితోషికాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వీటి ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. ► కాల్షీట్స్ టైమింగ్, సెట్స్లో క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు కఠినంగా అమలు చేయబడతాయి. నిర్మాతల సౌకర్యార్థం సినిమాకు సంబంధించిన షూటింగ్ రిపోర్ట్ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఓటీటీ : ► ఓ సినిమా ఏ టీవీ చానెల్లో ప్రసారం కానుంది? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది? అనే అంశాలను టైటిల్స్లో కానీ, సినిమా ప్రదర్శనల్లో కానీ, ప్రమోషన్స్లో కానీ బహిర్గతం చేయకూడదు. ► థియేటర్స్లో రిలీజైన ఓ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్ ► వీపీఎఫ్ (వర్చ్యువల్ ప్రింట్ ఫీ)కి సంబంధించిన చార్జీల విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్తో నేడు జరగాల్సిన సమావేశం 6కి వాయిదా పడింది. ► తెలంగాణలో మల్టీప్లెక్స్లకు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారో ఇకపై ఆంధ్రప్రదేశ్లోనూ అంతే ఇస్తారు. సినీ కార్మికుల సంఘం: ► కార్మికులకు సంబంధించిన సమస్యలపై తుది చర్చలు జరుగుతున్నాయి. రేట్ కార్డ్స్ ఫైనలైజ్ అయ్యాక వీటి వివరాలు అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాల విషయమై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణుతో చర్చలు జరిపారని భోగట్టా. కొత్త మార్గదర్శకాలను ‘మా’కి లేఖ రూపంలో పంపారని సమాచారం. నటీనటుల వ్యక్తిగత సిబ్బంది పారితోషికం, సొంత రవాణా ఖర్చులు వంటివాటిపై ‘మా’ సుముఖత వ్యక్తపరిచిందట. కొత్త మార్గదర్శకాలను నటీనటులందరికీ ‘మా’ త్వరలో అధికారికంగా పంపనుందని సమాచారం. ► కొత్త మార్గదర్శకాల్లో రోజువారీ వేతనాల గురించిన అంశం ఒకటి. మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పెద్ద రేంజ్ ఉన్నవారు రోజువారీ వేతనాలు తీసుకుంటారు. అయితే ఇకపై వారికి కూడా సినిమాకి ఇంత అని పారితోషికం నిర్ణయించాలనుకుంటున్నారు. మరి.. రోజువారీ వేతనాలు తీసుకునేది ఎవరూ అంటే.. అట్మాస్ఫియర్ కోసం సీన్లో నిలబడేవాళ్లు, అటూ ఇటూ కదులుతూ కనిపించేవాళ్లు, డైలాగ్స్ చెప్పే జూనియర్ ఆర్టిస్టులు .. ఇలా చిన్న స్థాయి కళాకారులు రోజువారీ వేతనాల కిందకు వస్తారు. -
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో దిల్ రాజు భేటీ
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుతో నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. గురువారం ఉదయం మా కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్స్ బంద్పై, మా సభ్యులకు సినిమా అవకాశాలపై వీరు ముచ్చటించారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరు ఆయన ట్వీట్ చేశారు. దిల్ రాజును కలిసిన సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, అలాగే కొత్తవారు ‘మా’ సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలని దిల్ రాజును కోరినట్లు విష్ణు తెలిపారు. ఈ మేరకు మా సంక్షేమ కమిటి వినతి పత్రాన్ని దిల్ రాజుకు అందించారు. కాగా ‘మా’ సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించాలని కోరుతూ విష్ణు ఇకపై పలువురు టాలీవుడ్ నిర్మాతలను కలవనున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన దిల్ రాజుతో భేటి అయినట్లు సమాచారం. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు హఠాన్మరణం Started meeting our TFI producers on behalf of MAA, requesting them to hire mostly MAA members and also to encourage newcomers to become a part of the MAA family. pic.twitter.com/1AjvqU436J — Vishnu Manchu (@iVishnuManchu) August 4, 2022 -
ప్రొడ్యూసర్స్ గిల్డ్తో ‘మా’ కీలక భేటీ.. ‘అవసరమైతే స్ట్రయిక్ తప్పదు’
‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం దిశగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) సమస్యల గురించి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్లతో చర్చలు జరిపారు. బుధవారం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక సభ్యులు సమావేశమై పలు సమస్యల గురించి చర్చించారు. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘మా’ జనరల్ సెక్రటరీ రఘుబాబు, కోశాధికారి శివబాలాజీ హాజరయ్యారు. ఇటు నిర్మాతలు ‘దిల్’ రాజు, మైత్రీ నవీన్, నాగవంశీ, శరత్ మరార్, బాపినీడు, వివేక్, నటి-దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నటీనటుల పారితోషికాలు, ‘మా’ సభ్యత్వం వంటి అంశాల గురించి చర్చలు జరిగినట్లుగా తెలిసింది. నూతన నటీనటులను సినిమాల్లోకి తీసుకోవాలంటే వాళ్లు కచ్చితంగా ‘మా’లో అసోసియేట్ లేదా లైఫ్ మెంబర్షిప్ అయినా ఉండాలని, వేరే భాషల నటులను ఇక్కడి సినిమాలకు తీసుకుంటే వాళ్లకు కూడా ‘మా’లో మెంబర్షిప్ ఉండాలనే నిర్ణయాలను ‘మా’ ప్రతిపాదించిందట. ఓటీటీల్లో నటించే ఆర్టిస్టులకూ ‘మా’లో సభ్యత్వం ఉండాలనే అంశాన్ని కూడా చర్చించారట. ‘మా’లో సభ్యత్వం ఉన్నవారిలో దాదాపు వందమంది సీనియర్ నటీనటుల పేర్లు సూచించి, వారికి అవకాశాలు ఇవ్వాలని నిర్మాతలను ‘మా’ కోరినట్లు తెలిసింది. షూటింగ్ బంద్కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యేలోపు ‘మా’లో సభ్యత్వం ఉన్న నటీనటులనే తీసుకోవాలన్నట్లుగా నిర్మాతలు నిర్ణయించుకోవాలని కూడా ‘మా’ కోరిందని భోగట్టా. అలా కాని పక్షంలో ‘మా’నే స్ట్రైక్కు పిలుపునివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. -
'మా'తో ముగిసిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సమావేశం ముగిసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో దిల్ రాజు, జీవిత రాజశేఖర్, రఘుబాబు, మంచు విష్ణు, తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగుల నిలుపుదల, ఆర్టిస్టుల పారితోషికం విషయాలపై చర్చించారు. కాగా పారితోషికం తగ్గింపు విషయంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇదివరకే ప్రత్యేక కమిటీని వేసింది. మరోవైపు ఇదే విషయంపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 33 మందితో ఓ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే! చదవండి: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్కు మెరుగులు ఆ హీరోయిన్తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై, ఏమన్నాడంటే.. -
యాక్సిడెంట్ అయి సింగపూర్కి వెళ్తే అలా అన్నారు: మంచు విష్ణు
'మా' అసోసియేషన్ సభ్యుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంచు విష్ణు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో 'మా' సభ్యుల కోసం ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించారు. దీని ప్రకారం మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్తో పాటు పది రకాల హెల్త్ చెకప్లు ఉచితంగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. 'మా సభ్యులకు ఏఐజీ వారు ఉచితంగా చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్తో మాకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.గతంలో మలేసియాలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మాస్టర్ చెకప్కి సింగపూర్కి వెళ్తే ఇండియాలో ఏఐజీ పెట్టుకొని ఇక్కడిదాకా ఎందుకు వచ్చారు అని అడిగారు. అలాంటి హాస్పిటల్లో ఇకపై మా సభ్యలకు ఉచితంగా హెల్త్ చెకప్ అందిస్తుండం సంతోషం. ఈ క్యాంప్ వల్ల మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు' అని పేర్కొన్నారు. ఇక మంచు విష్ణు అధ్యక్షుడు అయ్యాక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని నటుడు నరేష్ అన్నారు. కరోనా సమయంలో ఆర్టిస్టులు కష్టాలు చూసి విష్ణు ఇప్పుడు మెడికల్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈరోజు జరిగిన క్యాంప్లో సుమారు 300కి పైగా మా సభ్యులు చెకప్లు చేసుకున్నారని తెలిపారు. ఏఐజీ ఇంటర్నేషనల్ లెవల్లో ఉందన్నారు. ఇక ఈ సందర్బంగా ఏఐజీ డైరక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చాలా మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్లు వేసుకొని షూటింగ్ చేయొచ్చా అని అడిగేవారు. వాళ్లు చాలా కష్టపడుతున్నారు. అయితే ఆర్టిస్టులలో లైఫ్స్టైల్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్ వ్యాధి, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అని పేర్కొన్నారు. -
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. ఫిల్మ్నగర్లోని మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) కార్యాలయంలో విలువైన సామాగ్రి కనిపించడం లేదని మంచు విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్పింగ్ సామాగ్రిని దుండగులు దొంగలించినట్లు మేనేజర్ సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దొంగతనం జరిగినప్పటి నుంచి హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండోచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. మరి ఈ సంఘటనపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి. -
మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్.. 'ఆ జీవోపై చర్చ జరగాలి'
Manchu Vishnu Sensational Comments About Maa Association: హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మన్యం రాజు మూవీ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలోనే మా అసోసియేషన్ తరపున మా భవనం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు. మోహన్బాబు నాయకత్వంలో తిరుపతిలో స్టూడియో ఏర్పాటు గురించి త్వరలోనే ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. 'నూతన నటీనటులు , సాంకేతిక సిబ్బందిని ప్రోత్సాహిస్తాం. సినిమా టికెట్స్ ధరలు విషయం లో ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్పడం సరికాదు. లెజెండరీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్బాబు,నాగార్జున, వెంకటేష్ మాకు ఆదర్శం. దాసరి నారాయణరావు వై.ఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి సీఎంగా ఉన్నపుడు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి జీవో తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు నలుగురి కోసం ఆ జీవో మార్చారు. దీనిపై చర్చ జరగాలి' అని విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. -
‘మా ఏపీ’ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్’ (మా ఏపీ) ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ప్రస్తుత కార్యవర్గంలో ప్రెసిడెంట్గా నటి కవిత, ప్రధాన కార్యదర్శిగా నరసింహ రాజు, కార్యదర్శిగా అన్నపూర్ణల పదవీ కాలం ముగిసింది. కరోనా వల్ల ఎన్నికలను సకాలంలో నిర్వహించలేకపోయాం. 24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లు, నటీనటులు ‘మా ఏపీ’లో సభ్యులుగా ఉన్నారు. 24 విభాగాల్లోని ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తును ‘మా ఏపీ’ కార్యాలయానికి పంపవచ్చు. ఎన్నికల తేదీని మార్చి 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారు’’ అని దిలీప్ రాజా పేర్కొన్నారు. -
MAA: రాజీనామాలపై మంచు విష్ణు కీలక నిర్ణయం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ‘మా’ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలుపొందిన 11 మంది రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని మంచువిష్ణు క్లారిటీ ఇచ్చారు. అయితే ‘మా’సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించలేదని తెలిపారు. ‘మా’ బిల్డింగ్పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని మంచు విష్ణు అనఆనరు. కాగా, ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు…ప్రకాశ్ రాజ్పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్లోనూ అక్రమాలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి గెలుపొంది, రాజీనామా చేసిన సభ్యులు వీరే జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్ వైస్ ప్రెసిడెంట్: బెనర్జీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్ ఈసీ మెంబర్స్ బ్రహ్మాజీ శివారెడ్డి సుడిగాలి సుధీర్ ప్రభాకర్ తనీష్ కౌశిక్ సురేశ్ కొండేటి సమీర్ -
‘మా’ సభ్యుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు
MAA Members to Receive Corporate Health Care: MAA President Manchu Vishnu: పోటా పోటీగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నటుడు మంచు విష్ణు విజయం సాధించి ‘మా’ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన ఆనందరం తొలి కర్తవ్యంగా ‘మా’లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించే దిశగా విష్ణు అడుగులు వేస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. చదవండి: షాకింగ్ లుక్లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? ఈ నేపథ్యంలో తమ ప్రధాన ఎజెండాల్లో ఒక్కటైన సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు విష్ణు పెర్కొన్నారు. మంగళవారం మీడియాతో ముచ్చటించిన విష్ణు సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందుకోసం మా సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నగరంలోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషనల్తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. చదవండి: ప్రతీకార కథాంశంతో కొరటాల, ఎన్టీఆర్ చిత్రం అలాగే నిరంతరం సభ్యులు తమ ఆరోగ్యాన్ని ఈ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షించుకోవచ్చని వెల్లడించారు. అంతేకాకుండా వైద్యనిపుణులతో ముఖాముఖీ మాట్లాడటంతో పాటు వీడియో కన్సల్టెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించారు. అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్లో అపోలో, సెప్టెంబర్లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. అలాగే టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్లోనూ మా సభ్యులకు రాయితీపై రోగ నిర్దారణ పరీక్షలు చేయించనున్నట్లు విష్ణు వెల్లడించారు. -
సినిమా ఇండస్ట్రీలో కులం లేదు..అలా చేయడం తప్పు : డైరెక్టర్
Director Samudra Contesting In Directors Association Elections: ‘‘డైరెక్టర్స్ అసోసియేషన్కు డిసిప్లిన్, డిగ్నిటీ, డీసెన్సీ ఉన్నాయి. ఎలక్షన్స్లో భాగంగా కొందరు కులప్రస్తావన తీసుకువస్తున్నారు. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో కులం లేదు. సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, హీరోలు, నిర్మాతలు.. అందరిదీ ఒకటే కులం’’ అన్నారు దర్శకుడు సముద్ర. ఈ నెల 14న (ఆదివారం) హైదరాబాద్లోని ఫిలింనగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో దర్శకుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దర్శకుల సంఘం అధ్యక్ష పదవికి వి.సముద్ర పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన ప్యానల్ను గురించిన వివరాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సముద్ర మాట్లాడుతూ – ‘‘ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుగారి జయంతిని మే 3,4 తేదీల్లో ఓ పండగలా చేస్తాం. డైరెక్టర్స్ డే (ప్రముఖ దివంగత దర్శకులు దాసరినారాయణరావు జయంతిన దర్శకుల సంఘం అసోసియేషన్ బిల్డింగ్కు శంకుస్థాపన చేయాలనుకుంటున్నాం. అన్నపూర్ణ క్యాంటీన్, ‘మా’ అసోసియేషన్లో కథల రిజిస్ట్రేషన్, లెజెండ్ సెంచరీ అవార్డ్స్లను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. హామీలను నేరవేర్చకపోతే మే 5న రాజీనామా చేస్తాను.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సముద్ర ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే..ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్లో సభ్యత్వం ఉన్న కారణంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని, ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న జర్నలిస్టు ప్రభు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ విషయమై ప్రభు హైకోర్టును ఆశ్రయించగా, ఆయన ఎన్నికల్లో పోటీ చేయవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. కొందరు వ్యక్తులు చేస్తున్న అప్రజాస్వామిక వ్యవహారాలకు ఈ తీర్పు చెంపపెట్టు అని ప్రభు అన్నారు. -
యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తన తొలి నిర్ణయంగా ‘మా’ మహిళల భద్రతకు ముందడుగా వేశారు. వారి భద్రత కోసం ప్రత్యేకంగా విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్(WEGC)ను ఏర్పాటు చేస్తున్నామని, మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని విష్ణు తన ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: ట్విటర్లో మంచు మనోజ్, ఆర్జీవీల మధ్య ఆసక్తికర సంభాషణ ఇక ఈ విషయం సోషల్ మీడియాలో ప్రకటించిన అనంతరం మంచు విష్ణు పలు యూట్యూబ్ ఛానళ్లుపై మండిపడ్డారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నటీమణులు, హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపెక్షించేది లేదని హెచ్చిరించారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకర రీతిలో వారిపై రూమర్లు క్రియేట్ చేస్తు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. చదవండి: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం ఇక యూట్యూబ్ ఛానళ్లలో థంబ్నైల్స్ హద్దులు మీరుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీమణులు మన ఆడపడుచులని, వారిని గౌరవించాలని విష్ణు విజ్ఞప్తి చేశారు. అలాగే హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించబోమన్నారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు విష్ణు తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లని నియంత్రించడం తన ఎజెండాలో ఓ అంశమని ఆయన పేర్కొన్నారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి, చిత్ర పరిశ్రమకి సహకారం అందిస్తూనే ఉందని మంచు విష్ణు పేర్కొన్నారు. #MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF — Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021 -
ట్విటర్లో మంచు మనోజ్, ఆర్జీవీల మధ్య ఆసక్తికర సంభాషణ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి రెండు వారాలు గడిచింది. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్పై మంచు విష్ణు విజయం సాధించి ‘మా’ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వివాదాలు, విమర్శలు, ఆరోపణలతో ‘మా’ ఎన్నికలు వాడివేడిగా సాగాయి. ఇరూ ప్యానల్ల సభ్యులు ఒకరిపై ఒకరూ చేసుకున్న విమర్శ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చదవండి: ‘మా’పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్ ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తనదైన శైలిలో స్పందించారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు’ అంటూ వర్మ ట్వీట్ చేయగా.. దానికి మంచు మనోజ్.. ‘మా ఒక సర్కస్ అయితే… మీరు రింగ్ మాస్టర్ సర్’ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే ఇది జరిగిన పది రోజులకు తాజాగా వర్మ.. మనోజ్ కౌంటర్పై స్పందించారు. మనోజ్ కామెంట్కు రీట్వీట్ చేస్తూ.. ‘నేను రింగ్ మాస్టర్ కాదు. సర్కస్లో అందరికి వినోదం పంచే కోతిని మాత్రమే’ అని రిప్లై ఇచ్చాడు. చదవండి: పెళ్లిలో కలిసిన మెగా బ్రదర్స్.. నవ్వుతున్న ఫోటోలు వైరల్ దీనిపై మనోజ్ స్పందిస్తూ.. ‘మనం అందరం ఒకటే సర్, సేమ్ సర్కస్కు చెందిన వాళ్లమే’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి ఆర్జీవీ మరో ట్వీట్ చేస్తూ.. ‘హే మనోజ్ మీ డీపీ స్టేటస్ కంటే ‘మా’ ఇంక గొప్పదని అనుకుంటున్నాను’ అంటూ రిప్లై ఇవ్వగా దీనికి మనోజ్ రిప్లై ఇచ్చాడు. మీరు చెప్పంది కరెక్ట్ సర్’ అంటూ రీట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఆర్జీవీ ‘అవును’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇలా ట్విటర్ వేదికగా వర్మ, మనోజ్ల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వారి ట్వీట్స్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. Regardless we all belong to the same circus sir 🙌🏽🙏🏼🤗 https://t.co/78gwcHn1cp pic.twitter.com/HkBgBhwms0 — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 25, 2021 And @RGVzoomin sir replied me 🤗🤗🤗🤗 yes sir u right 😘❤️ https://t.co/Sa3GC5J74H pic.twitter.com/yLZJX9owNR — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 25, 2021 -
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం
Manchu Vishnu Announced Women Empowerment and Grievance Cell: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మాలో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్(WEGC)ను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని, మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని, త్వరలోనే కమిటీ మెంబర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. #MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF — Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021 -
రేపు గుడ్న్యూస్ చెబుతా : మంచు విష్ణు
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు కార్యచరణ మొదలు పెట్టారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ ఫైల్పై సైన్ చేసిన విష్ణు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల్లో గెలిస్తే మాకు సొంత బిల్డింగ్ కట్టిస్తానని ప్రకటించిన మంచు విష్ణు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. చదవండి : ఘనంగా వైవా హర్ష వివాహం.. ఫోటోలు వైరల్ ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు,మూడు చోట్ల స్థలాలను కూడా చూసినట్లు పేర్కొన్నారు. తాజాగా 'మా'కు సంబంధించి రేపు గుడ్న్యూస్ చెబుతానంటూ హింట్ ఇచ్చాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. మరోవైపు ప్రకాశ్రాజ్ ప్యానల్ రాజీనామాలపై కూడా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న సస్పెన్స్ కూడా నెలకొంది. చదవండి : ఆరోజు జరిగింది ఇదే..వీడియో రిలీజ్ చేసిన మంచు విష్ణు సమంత డబ్బుల కోసం కేసులు వేయలేదు : లాయర్ Have a very good news to share on #MAA front. Will share it tomorrow 💪🏽 — Vishnu Manchu (@iVishnuManchu) October 21, 2021 -
నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు
Kota Srinivasa Rao Comments On Mega Brother Nagababu: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య పలువురు నటీనటులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ యుట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్ అనసూయ డ్రెస్పింగ్పై కోట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతకుముందు ‘మా’ ఎన్నికల నేపథ్యంలో విష్ణుకు మద్దతు ప్రకటించిన కోట అదే సమయంలో ప్రకాశ్ రాజ్పై చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబును ఆయన టార్గెట్ చేశారు. గతంలో తనపై చేసిన కామెంట్స్పై స్పందిస్తూ ఈ ఇంటర్య్వూలో మెగా బ్రదర్కు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ.. ‘చిరంజీవి ఒక పక్క, పవన్ కల్యాణ్ మరో పక్క వీరిద్దరు లేకపోతే ఈ నాగబాబు ఎవరు?. వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కాదు. ఆయనకేందుకు అసలు. గతంలో నాగబాబు ప్రకాశ్ రాజ్ను తిట్టారు. అది అందరికి తెలుసు. నేను ప్రకాశ్ రాజ్ను అన్నానని ఇప్పుడు ఆయన నన్ను విమర్శించారు. అపుడు ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన కామెంట్స్కు అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, చానల్లో డిబెట్లు అంటూ రచ్చ జరిగేది’ అంటూ కోట మండిపడ్డారు. అనంతరం ఇప్పటికి తాను అదే చెబుతానని, చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబుకు గుర్తింపు లేదన్నారు. ఒక్క మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్పా అంటూ కోట సంచలన కామెంట్స్ చేశారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! కాగా ‘మా’ ఎన్నికల నేపథ్యంలో కోట శ్రీనివాసరావు మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రకాశ్ రాజ్ కలిసి 15 సినిమాలకు పైగా నటించానని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్కు సమయానికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడు అంటూ కోట సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోట వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబుశాడు కోట శ్రీనివాసరావు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు.. రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలు కూడా నాగబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రకాశ్రాజ్పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు -
సినిమా వారి రాజకీయాలు
రాజకీయాలకు ప్రజాభిమానమే పెట్టుబడి. దాన్ని నాయకులు ప్రజల్లో ఉండటం ద్వారా సంపాదించుకుంటే, నటీనటులకు అయాచితంగా వస్తుంది. దాంతో ఆ అభిమానాన్ని రాజకీయాల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తారు. కానీ అది చాలాసార్లు విఫలయత్నమే అవుతోంది. తామేదో ప్రత్యేకమైన జీవులుగా చాలామంది ప్రవర్తించడం, వారిని దేవుళ్లలాగా అభిమానులు ఆరాధించడం కొనసాగుతూనే ఉంది. అందుకే రేపు వీరు రాజకీయాల్లోకి వస్తే వెర్రి అభిమానంతో కాకుండా– వారి స్థిరత్వం, సైద్ధాంతిక నిబద్ధత ఆధారంగా అభిమానులు మద్దతివ్వాలి. సినిమావాళ్లు సైతం రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలతో ఉండటం తప్ప మరో మార్గం లేదని తెలుసుకోవాలి. తెలుగు సినిమా కళాకారుల సంఘంలో రాజకీయాలు, అలాగే తెలుగు రాష్ట్రాలలో వారి రాజకీయాలను పరిశీలించడం ఆసక్తికరం. అంతా కలిపి 900 మంది కూడా ఉండని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక లలో జరిగిన గందరగోళాన్ని ఈమధ్య కాలంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పోల్చవచ్చేమో. ‘మా’ ఎన్నికలలో ప్రాంతాలు, భాషలు, కులాలు, పార్టీల ప్రస్తావన రావడం దురదృష్టకరం. భక్తులు గుడులకు వెళ్లి ఎలా తమ ఇష్ట దైవాలకు ప్రార్థన చేస్తారో, దాదాపు అదే స్థాయిలో సినీ హీరోలు, హీరోయిన్లను అభిమానులు ఆరాధిస్తుంటారు. కానీ ఈ సినీ కళాకారుల సంఘ ఎన్నికలు చూసిన తర్వాత అభిమానులకు ఒక విషయం అర్థమై ఉండాలి. వీరు కూడా సామాన్య ప్రజల మాదిరే వ్యవహరిస్తారనీ, గొడవలు పడుతుంటా రనీ స్పష్టమైపోయింది. వీరు రాజకీయాలలోకి వస్తే వారిలో ఉండే స్థిరత్వం, వారి వ్యక్తిగత జీవితాలలో పాటించే నిబద్ధత, సిద్ధాంత వైఖరి మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని అభిమానులు లేదా ప్రజలు మద్దతిస్తే మంచిది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం; మోహన్ బాబు రంగంలోకి దిగడం; ప్రకాశ్ రాజ్ వర్గం ఓడిపోవడం, దాంతో వారు రాజీనామాలు ప్రకటించడం; అలాయ్ బలాయ్ కార్యక్రమంలో విష్ణు పలకరించినా పవన్ కల్యాణ్ మాట్లాడలేదన్న వార్త వంటివి సినిమా రంగానికి కొంత నష్టం చేసినట్లు అనిపిస్తుంది. ప్రాంతీయ వాదం తనను ఓడించిందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మెగా కుటుంబపు మద్దతు ప్రకాశ్ రాజ్కేనని ప్రకటించడం ద్వారా చిరంజీవికి, పవన్ కల్యాణ్కు నాగబాబు ఇబ్బంది తెచ్చి పెట్టారు. పవన్ బీజేపీకి మిత్ర పక్షంగా ఉంటే, ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకిగా ముద్ర పడ్డ ప్రకాశ్ రాజ్కు ఎలా మద్దతు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. దానికి తోడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై కామెంట్ చేసి ప్రకాశ్ రాజ్ ఓటమిని స్వాగతించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన బాల కృష్ణ... మంచు విష్ణుకు మద్దతివ్వడం కూడా గమనించదగిన అంశమే. ఒక వైపు ఏపీలో జనసేనతో కలవాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే, మెగా ఫ్యామిలీ బలపరిచిన ప్యానెల్కు బాలకృష్ణ మద్దతు ఇవ్వకపోవడం ఆసక్తికరం. వీటన్నింటిని ఏపీ రాజకీయాలతో ముడిపెట్టకపోయినా, జరిగిన సంఘటనలన్నీ ఏపీ రాజకీయాలను ఎంతో కొంత ప్రభా వితం చేసేలా ఉన్నాయి. రెండు సామాజిక వర్గాలను, టీడీపీ– జనసేనను కలపాలని ప్రయత్నిస్తున్న టీడీపీకీ మద్దతిచ్చే కొందరు పాత్రికేయ ప్రముఖులకు ఇది ఇబ్బంది కలిగించింది. ఫలితాల గురించి టీడీపీ వారికన్నా, వారికి మద్దతిచ్చే మీడియావారే ఎక్కువ బాధపడ్డట్టుగా ఉంది. ఇదే సమయంలో రాజకీయాలలో ఉండేవారంతా నిబద్ధత కలిగి ఉంటారా అన్న సంశయం రావచ్చు. రాజకీయనేతలకు ఎవరం సర్టిఫి కెట్ ఇవ్వజాలం. కానీ వారు నిత్యం ప్రజలలో ఉంటారు. వారిని ప్రజలు ఓడిస్తారు, గెలిపిస్తారు. ఏ పరిస్థితిలో అయినా ప్రజల మధ్య ఉంటారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత పదేళ్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి జైలుకు పంపించినా ఓపికగా ఉన్నారు. పార్టీ ఓడిపోయినా ప్రజా జీవనంలో గట్టిగా నిలబడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు. తన మామను పదవి నుంచి దించడం కరెక్టా కాదా అన్నది వేరే విషయం. రెండుసార్లు గెలిచారు. మూడుసార్లు ఓటమి చెందారు. కానీ రాజ కీయాలు వదలలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనేక ఢక్కామొక్కీలు తిన్నారు. సినీ నటులు అలా కాదు. తామేదో స్పెషల్ వ్యక్తులుగా ఎక్కువ మంది భావిస్తారు. దానికి కారణం కొంతమంది పిచ్చి అభిమానంతో వారిపై పడిపోతుండటమే. తమపై ఏర్పడిన అభిమానంతో సినీ నటులు రాజకీయాలలోకి కూడా వచ్చి శాసించాలని ప్రయత్నిస్తుం టారు. వీరిలో కొందరు సఫలం అయ్యారు. మరికొంతమంది విఫలం అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలలోనే రాజకీయాలలోకి సినీ నటులు ఎక్కువ మంది వచ్చారు. తమిళనాడులో సినిమా ఆధారంగానే కరుణానిధి, ఎంజీఆర్ మధ్య రాజకీయాలు సాగాయి. ఎంజీఆర్ సొంతంగా అన్నా డీఎంకేను ఏర్పాటు చేసుకుని ఘన విజయం సాధించారు. పాలనలో ప్రజల మన్నన కూడా పొందగలిగారు. అలాగే కరుణానిధి, జయలలిత దశాబ్దాల తరబడి ప్రత్యర్థులుగా ఉంటూ తమిళ రాజకీయాలను శాసించారు. కొన్ని సార్లు సక్సెస్ అయ్యారు, మరికొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. అయినా రాజ కీయాలలో కొనసాగారు. వారి తర్వాత ఆ స్థాయిలో తమిళ నటులు రాణించలేదు. రజనీకాంత్కు రాజకీయాలలోకి రావడానికి ధైర్యం చాలలేదు. కమల్హాసన్, విజయ్కాంత్ వచ్చి విఫలం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్టీ రామారావుకు ముందు కొంగర జగ్గయ్య వంటి కొద్ది మంది రాజకీయాలలోకి వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. జగ్గయ్య ఒకసారి ఎంపీగా గెలిచారు. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ఒక సంచలనం. అయితే అనుభవ రాహిత్యంతో ఒకసారి, నిర్లక్ష్యంతో మరోసారి ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టినా సఫలం కాలేకపోయారు. రాజకీయాలు నడపడం చేతకాక దెబ్బతిన్నారని చెప్పాలి. చివరికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు ఒక రకంగా దూరంగా ఉంటున్నారు. ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి, పార్టీ తరఫున ఎవరినీ పోటీలో దించ కుండా, బీజేపీ, తెలుగుదేశం గెలుపునకు ఉపయోగపడ్డారు. 2019లో జనసేన పోటీచేసినా ఉపయోగం లేకుండా పోయింది. కమ్యూని స్టులు, బీఎస్పీతో కలిసి ఎన్నికలలో పాల్గొన్నారు. ఎన్నికలు అయిపో గానే తిరిగి బీజేపీ పంచన చేరారు. 2009లో చిరంజీవి రెండుచోట్ల పోటీచేసి ఒక చోట ఓడిపోయి, మరోచోట గెలిస్తే, పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. మరికొందరు కూడా రాజకీయాలలోకి వచ్చారు. కృష్ణ కొంత కాలం రాజకీయాలలో ఉండి ఒకసారి ఎంపీ అయి తదుపరి వైదొలి గారు. ఆయన భార్య విజయనిర్మల ఒకసారి పోటీచేసి ఓటమి చెందారు. కోట శ్రీనివాసరావు, జయసుధ, కైకాల సత్యనారాయణ, శారద ఒకసారి గెలిచి ఆ తర్వాత రాజకీయాల్లో తెరమరుగయ్యారు. బాబూమోహన్ రెండుసార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. కాకపోతే మూడు పార్టీలు మారారు. నరేష్ ఒకసారి పోటీచేసి ఓడి పోయారు. జయప్రద ఒకసారి రాజ్యసభకు ఇక్కడ నుంచి గెలిచి, ఆ తర్వాత యూపీ నుంచి లోక్సభకు ఎన్నికవడం విశేషం. మోహన్ బాబు ఒకసారి రాజ్యసభకు ఎన్నికై, ఆ తర్వాత అంతగా రాణించ లేకపోయారు. కృష్ణంరాజు రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికై కేంద్ర మంత్రి పదవి నిర్వహించారు. ఆయన కూడా మూడు పార్టీలు మారవలసి వచ్చింది. సూపర్ స్టార్గా పేరొందిన అమితాబ్ బచ్చన్ సైతం ఒకసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించి, రాజకీయాలు తనవల్ల కాదని వైదొలిగారు. మరికొందరు హిందీ నటులు కూడా రాజకీయాలలో ఉన్నా, వారు మొత్తం రాజకీయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు. పవన్ అయితే నిలకడ లేని, గాలివాటు రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా రాజ కీయాలు వేరు, సినిమాలు వేరు అన్న విషయాన్ని ప్రజలు కొంత వరకు అర్థం చేసుకున్నా, ఇంకా పిచ్చి అభిమానంతో ఉండేవారు లక్షల సంఖ్యలోనే ఉన్నారని చెప్పాలి. వారందరికీ ‘మా’ ఎన్నికలు కనువిప్పు కావాలి. సినిమాను వినోదంగా, నటులను నటులుగానే చూడాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
అల్లు అర్జున్పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
Manchu Vishnu Comments on Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై తాజాగా ‘మా’ నూతన అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్తో విష్ణు ముచ్చటించాడు. ఈ సందర్భంగా ‘మా’ ఎన్నికలు, మెగా కుటుంబంతో ఉన్న రిలేషన్స్పై మాట్లాడాడు. ఈ క్రమంలో బన్నీ తనకు మంచి స్నేహితుడని, తరచూ తామిద్దరం చాట్ చేసుకుంటామని తెలిపాడు. అలాగే అల్లు అర్జున్ అంటే అసూయ కలిగిందని, అదే సమయంలో బన్నీని చూసి గర్వంగా కూడా ఫీల్ అవుతున్నానంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: వీకెండ్ ఇలా అద్భుతంగా గడిచింది: సమంత ఈ మేరకు విష్ణు మాట్లాడుతూ.. ‘‘బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ కూడా విడుదలకు సిద్దమైంది. దీంతో బాలీవుడ్కు చెందిన పలు మ్యాగజైన్స్, వార్త పత్రికలు తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్, ఆమిర్ ఖాన్కు పోటీ ఇవ్వబోతున్నాడని రాశాయి. అది చూసి బన్నీ అంటే అసూయ కలిగింది, అదే సమయంలో ఓ తెలుగు హీరోగా తనని చూసి గర్వపడ్డాను. ఇదే విషయాన్ని బన్నీకి కూడా చెప్పాను. ‘బ్రదర్, నేను నిన్ను చూసి అసూయపడుతున్నాను కానీ మీమ్మల్ని చూసి గర్వపడుతున్నా’ అని మెసెజ్ చేశాను’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: మలయాళంలోకి 'లవ్ స్టోరీ'.. టైటిల్ ఎంటో తెలుసా? అనంతరం పుష్ప మూవీ మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని విష్ణు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బన్నీకి విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాగా పుష్ప పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తోన్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రానుంది. రెండు భాగాలుగా రానున్న పుష్ప ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్కు సిద్ధమవుతుండగా.. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. చదవండి: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు -
ఆర్జీవీ ట్వీట్కి మంచు మనోజ్ దిమ్మతిరిగే పంచ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి పది రోజులు గడుస్తున్నా.. వివాదం మాత్రం తగ్గడం లేదు. మాకు అన్యాయం జరిగింది, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్రాజ్ ఆరోపించడమే కాకుండా సోమవారం ‘మా’ఎన్నికల పోలింగ్ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసుల సమక్షంలో పరిశీలించారు. మరోవైపు తాము ప్రజాస్వామ్య పద్దతిలోనే గెలిచామని, ప్రకాశ్ రాజ్ ఆరోపణలు అన్ని అర్థరహితమని ‘మా’అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు అంటున్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇలా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపై సినీ పెద్దలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ‘మా’వివాదంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. వాళ్లంతా జోకర్లేనట!) ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే.. సోషల్ మీడియా వేదికగా తన అసంతృతప్తిని తనదైన స్టైల్లో వ్యక్తం చేశాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మంచు మనోజ్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. మా ఒక సర్కస్ అయితే… మీరు రింగ్ మాస్టర్ సర్ అంటూ ట్వీట్ చేశాడు. మరి మనోజ్ ట్వీట్ కి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. And you are the Ring Master sir 🙌🏽 https://t.co/gW8VaFhwdb — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 19, 2021 -
‘మా’వివాదంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. వాళ్లంతా జోకర్లేనట!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్లో నిలుస్తుంటాడు ఆర్జీవీ. (చదవండి: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు) తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదంపై తనదైన స్టైల్లో స్పందించాడు. మా అసోసియేషన్ లో సర్కస్ అని.. రెండు రోజుల కింద ట్వీట్ చేసిన ఆర్జీవీ.. తాజాగా మరోసారి మా వివాదంపై కాంట్రవర్శియల్ కామెంట్ చేశాడు. సిని‘మా’ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఆర్జీవీ ట్వీట్కి మంచు మనోజ్ దిమ్మతిరిగే పంచ్) Cine”MAA” is a CIRCUS full of JOKERS — Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021 -
అనుమానాల నివృత్తికే సీసీ ఫుటేజీ పరిశీలన: ప్రకాశ్రాజ్
బంజారాహిల్స్(హైదరాబాద్): మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్రాజ్ ఆరోపించడమే కాకుండా సోమవారం ‘మా’ఎన్నికల పోలింగ్ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసుల సమక్షంలో పరిశీలించారు. ఈ మేరకు తన ప్యానెల్ సభ్యులైన శ్రీకాంత్, బెనర్జీ, తనీష్తో కలిసి ఉదయం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్కు చేరుకొని బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్, ఇన్స్పెక్టర్ రాజ శేఖర్రెడ్డి, సెక్టార్ ఎస్ఐ శివశంకర్తో కలిసి ఫుటేజీని వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసమే పోలింగ్ సెంటర్లో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించామన్నారు. ఎన్నికల అధికారి వద్ద మరో ఏడు కెమెరాలకు సంబంధించిన ఫుటేజీ ఉందని, దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. తమకు కేవలం ఎన్నికల అధికారి కృష్ణమోహన్తోనే ఇబ్బందులున్నాయని ఆరోపించారు. -
ఈ అభిజాత్యం సబబేనా?
‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో... ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ప్రకాష్ రాజ్ని న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు ఉండకూడదు! ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి, ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! కనీసం ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. ప్రకాష్రాజ్ నోట... చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’ తెలుసుకోవాలి. ‘అంటరానితనంబునట్టి భారతజాతి ప్రపంచ సభ్యతనే కోల్పోయింద’ ని భావిం చిన మహాకవి జాషువా. అలా తామె పుట్టరాని చోట పుట్టామన్న అనంతమైన బాధను ఎందుకు గుండె బరువుతో మరింత కొంత ముందుకు సాగి ఇలా వ్యక్తం చేయవలసి వచ్చిందో గమనించండి. ‘ఎంత కోయిలపాట వృ«థయయ్యెనో కదా/ చిక్కు చీకటి వన సీమలందు / ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా/ కటిక కొండల మీద మిటకరించి/ ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా/ మురికి తిన్నెల మీద పరిమళించి/ ఎన్ని ముత్తెపురాలు ఖిన్నమయ్యెనో కదా/ పండిన వెదురు జొంపములలోన / ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను / యెంత రత్నకాంతి యెంత శాంతి/ ప్రకృతి గర్భమందు! భగ్నమై పోయెనో / – పుట్టరాని చోట పుట్టుకతన’’! ఎందుకంతగా జాషువా భగ్నహృదయుడు కావలసి వచ్చింది? మనుషులు ఎదిగారు గానీ మనసులు ఎదగలేదని ‘పొట్టిబావ’ లాంటి ఒక బొటనవేలంత ఎత్తుకు మించని ఒకానొక ‘మా’ సంస్థ తన స్థాయిని మించి యావదాంధ్ర ప్రేక్షక లోకాన్ని కల్లోల పరచడానికి ఎందుకు ప్రయత్నించింది! ఈ కల్లోలంలో భాగంగానే సుప్రసిద్ధ కళాకారుడు, కన్నడ అభ్యుదయ కథా రచయిత, ప్రగతిశీల ఉద్యమా లకు వెన్నుదన్నుగా ఉన్న ప్రకాష్రాజ్ ‘ఓహో నేను తెలుగువాణ్ణి కాను, ఇప్పుడు గుర్తించాల్సి వచ్చింద’న్న బరువైన ప్రకటన ఎందుకు విడుదల చేయవలసివచ్చింది? ‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ఆయనను న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు, మిగతా ‘మా’ సభ్యులకు ఉండకూడదు! పరస్పరం ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి మరుగున పడిన ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! యావత్తు దక్షిణాపధాన్నే తెలుగు (16వ శతాబ్దం దాకా) ఏలుతూ వచ్చిన కాలం మరుగున పడిపోయింది. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, వర్గ, వర్ణ వివక్ష రంగులు పులిమి ఏలుతున్న కాలంలో ఆ వివక్షలకు దూరంగా ఉండి కన్నడ ప్రపంచంలో కళా, సాంస్కృతిక రంగాలలో, భావ విప్లవంలో భాగంగా అత్యంత అభినవ భావాలతో సంస్కృతీ పరులకు, ఉద్యమకారులకు ప్రకటనలలోనే కాదు, ఆచరణలో స్ఫూర్తిగా నిలబడుతున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. ఎప్పుడైతే ‘పొట్టిబావల’ సంస్థగా మారిన ‘మా’లో ఫలానావారు స్థానికులు, మిగతావారు బయటివారనీ, కళాకారుల మధ్య వివక్షకు తావిచ్చారో, ఆ క్షణంలోనే ప్రకాష్రాజ్కు తాను ‘కన్నడవాడినే కానీ, తెలుగువాడిని కాను కాబోలు’ నని అంతవరకూ లేని భావన, బాధ కలుగజొచ్చాయి. ఈ పరిణామమే ప్రకాష్రాజ్ ‘మా’ నుంచి తప్పు కోవడానికి కారణమై ఉండాలి! గత వైభవ చరిత్రతో సంబంధాలు తెగిపోయిన దరిమిలా కనీసం ‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. రాయల తెలుగుదేశమే ప్రకాష్రాజ్దీ. ఆంధ్ర– కన్నడల మధ్య అభేదాన్ని గుర్తు చేస్తూ రెండూ ఒకేదేశం, అదే తెలుగు సువిశాల దేశం అని ప్రకటించాడు రాయలు! 16వ శతాబ్దంలో రాయల యుగం ముగిసేదాకా ఆంధ్ర– కర్ణాటకలు ఒక తల్లి బిడ్డలే. ఏక రక్త సంబంధీకులు. ఆనాటి రాయలకు అమరావతి (కర్ణాటక) నగరంతోపాటు, రాయలసీమలోని పెనుగొండ కూడా రాజధాని, రెండవ రాజధానిగా ఉండేవని మరచిపోరాదు! అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్త రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ఆర్ద్రతతో... ఆంధ్ర– కన్నడ రాజ్యలక్ష్ముల అరతి నీలపుదండ పెనుగొండ కొండ’’ అని చాటవలసి వచ్చింది! పెనుగొండ రెండవ రాజధానిగా ఏలిన రాయలు రాయలసీమ నలుమూలలా అనేక చెరువులు తవ్వించి కరువుసీమను పంటసీమగా రూపొందించినవాడు. ఈ విషయంలో కూడా కాకతీయులు నిర్మించుకున్న చెరువులను రాయలు రాయల సీమకు ఆదర్శంగా తీసుకున్నాడని మరువరాదు. అంతేకాదు, ఆంధ్ర –కన్నడ ప్రాంతాలు ఉమ్మడిగా ఒక గొడుగు నీడనే ఎదిగినంత కాలం రాయలయుగ పరివ్యాప్తి ఉత్తరాన గజపతుల దిశవరకూ వ్యాప్తి చెందింది. బహమనీ సుల్తానుల చెరనుంచి తెలంగాణలోని వరం గల్ను విముక్తి గావించిన చారిత్రక సత్యాన్నీ మరువరాదు! ఇంతటి సంయుక్త ఉమ్మడి వైభవోజ్వల చరిత్రను మరిచినప్పుడు మాత్రమే ఈనాటివారిలో పిదప బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. ప్రాంతీయ తగాదాలు ముదిరిపోతున్నాయి. దారీతెన్నులేక ఎక్కడి కక్కడ ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాలుగా ఏర్పడి మానవతా వైఖరికి చెల్లుచీటి ఇచ్చుకుంటున్నారు. బహుశా అందుకే ఒక సంద ర్భంగా ప్రకాష్రాజ్ ఈ ప్రపంచంలో బతకలేని మనుషులు చాలా మంది ఉన్నారు. కొంచెం ఆలస్యమైనా, మోసపోయినా ఆ లిస్టులో నేనూ, మీరూ, ఎవరైనా చేరుకోవచ్చునని ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాదు, ద్రోహం అనేది ఇతరులకు చేయనక్కర్లేదు, మనకు మనమే చేసుకోవచ్చునని కూడా ప్రకటించాడు! ఇలా అనేక సామాజిక అంశాలపైన పరిణామాలపైన ప్రకాష్ రాజ్ ఒక చేయి తిరిగిన ప్రసిద్ధ రచయితగా అనంతమైన అభ్యుదయ కోణాల్ని ఆవిష్కరించాడు. రైతాంగ సమస్యలు, మహిళా సమస్యలు, పెట్టుబడిదారీ, ఫ్యూడల్ వ్యవస్థను, దోపిడీ సమాజంలోని పెక్కు పరి ణామాల పట్ల, పౌరహక్కుల ఉద్యమాలు, ప్రజాస్వామ్య హక్కులు, వాటిపై ఎక్కుపెట్టిన ప్రజాతంత్ర శక్తుల పోరాటాలపైన, ఆ హక్కుల సాధనలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులపైన పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానే ధైర్యసాహసాలతో ఒక ప్రజాకళాకారునిగా బాహా టంగా నిరసన తెలుపుతూ వచ్చినవాడు ప్రకాష్రాజ్. కర్ణాటక ఉద్యమకారిణి, ప్రసిద్ధ పత్రికా సంపాదకురాలైన గౌరి లంకేష్ హత్యను, ప్రొఫెసర్ కల్బుర్గి, తదితర పౌరహక్కుల నాయకుల హత్యల్ని, రాజ్యహింసను, బాహటంగా నిరసించి, ఉద్యమించిన కళానిధి ప్రకాష్రాజ్ అని గుర్తుకు తెచ్చుకుంటే ఒకనాడు శ్రీశ్రీ... కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నిస్తూ ‘పొట్టిబావ కాంగిరేసు మేజరయ్యేదె ప్పుడు’ అని వేసిన ప్రశ్నే ‘మా’లోని పొట్టిబావ’లకూ ఎదురయింది. అందుకే ప్రకాష్రాజ్ ‘భాష అనేది ఒక అభివ్యాప్తి రూపం. సుఖ దుఃఖాల్ని వ్యక్తపరచుకునే ఒక మాధ్యమం. బసవన్న 12వ శతాబ్దపు గొప్ప వచనకారుడు, దార్శనికుడు. బింద్రే, కువెంపు, తేజస్వి, లంకేష్, కె.ఎస్.ఎన్ వంటి ప్రముఖ కన్నడ కవులూ, రచయితలూ ఇలాంటి ఆలోచనా సరళికి, జీవితాన్ని ధారపోసిన రచయితల్ని తెలుసు కోకుండానే, కేవలం వ్యాపార లావాదేవీలకు మాత్రమే భాషను నేర్చుకొనే మనఃస్థితి ఉన్నందువల్ల, మన అస్తిత్వాన్నే పోగొట్టుకుని అనామకులుగా నిలబడిపోయాం’ అన్నాడు. అంతేకాదు ‘జీవితంలో కొన్నింటిని ఏ కారణం వల్లనూ మార్చలేం. నేను పుట్టిన కులానికీ, నాకూ ఏ సంబంధం లేదు. అది నామీద వృ«థాగా మోపబడింది అని దాన్ని మార్చవచ్చు. నా మతం నాకు నచ్చలేదని మరో మతాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఎవరికీ తన మాతృభాషను మార్చు కోవడానికి కుదరదు’ అన్నది ప్రకాష్రాజ్ భావన! అలాగే ప్రకృతి ఎంత కిలాడిదో వివరిస్తూ మనిషిలోని దురాశను ప్రకృతిపరంగా అందంగా చెప్పిన కళాకారుడు ప్రకాష్రాజ్. పూవు కాయగా మారటం, కాయ పండుగా మారే విధానం ఉందే... దీన్ని మనకు అర్థం చేయించేది ప్రకృతి. ప్రకృతి మీకు ఎంత కావాలో అంతే ఇస్తుంది. మీ ఆశకు మరికొంచెం ఇస్తుంది. కానీ దురాశను మాత్రం ఇవ్వదు. దీన్ని మనం తెలుసుకొని ఉండాల్సింది. నేర్చుకొని ఉండా ల్సింది అన్నాడు. ఇన్ని గుణపాఠాలు, స్వీయానుభవం నుంచి చెప్పిన ప్రకాష్రాజ్ నోట చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’లోని ‘పొట్టి బావ’లు తెలుసుకోవడం అందరికీ శ్రేయస్కరం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
గెలుపును సెలబ్రేట్ చేసుకున్న మంచు విష్ణు
-
చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు
Manchu Vishnu Talks In Press Meet Over MAA Bylaws: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలని అనుకుంటున్నట్లు తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎవరు పడితే వాళ్లు ‘మా’ సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ప్యానల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శ్రీవిద్యానికేతన్లో విష్ణు తన ప్యానల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా విషయాల్లో అసోసియేషన్లోని బైలాస్ను మార్చాలనుకుంటున్నానన్నారు. చదవండి: ఆవేశం తగ్గించుకోండి, మరో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్ బైలాస్ మార్చడమంటే అంత ఈజీ కాదని, దీనిపై సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎవరంటే వాళ్లు ‘మా’ సభ్యులు కాకూడదనేదని తాను భావిస్తున్నానని మంచు విష్ణు పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని, అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు. ఆ రోజు రాత్రి లేట్ అవ్వడంతో మరునాడు కౌంటింగ్ కొనసాగించారని తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కని విష్ణు చెప్పారు. ప్రకాశ్రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారని, అయితే వారి రాజీనామాను ఆమోదించలేదన్నారు. త్వరలోనే దీనిపై ప్రకాశ్ రాజ్కు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తానని మంచు విష్ణు తెలిపారు. చదవండి: 'మా' ఎన్నికల్లో మరో వివాదం.. పోలీసుల ఎంట్రీ -
ఆవేశం తగ్గించుకోండి, మరో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్
‘మా’ ఎన్నికలు ముగిసినప్పటికీ రోజుకో ట్విస్ట్తో ఎన్నికలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గుడుస్తున్నా మా ఎన్నికల్లో రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకో ట్విస్ట్, విమర్శలు, దాడులతో చివరికి పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఎన్నికల రోజున జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ‘మా’ ఎన్నికలు జరిగాయి. చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది: మంచు విష్ణు రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపించి సంగతి తెలిసిందే. ఇక ప్రకాశ్ ఆరోపణలపై నేడు తిరుపతిలో జరిగిన మీడియాలో సమావేశంలో మంచు విష్ణు స్పందిస్తూ.. ప్రకాష్ రాజ్ సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చని.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. చదవండి: ఈవారం ఓటీటీ, థియేటర్లలో అలరించబోయే చిత్రాలివే అలాగే ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన సీనియర్ నటుడు బాబూ మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన.. ‘మా’లోని ప్రతి సభ్యుడికి విష్ణు అధ్యక్షుడే అన్నారు. అంగీకరించకపోతే రెండు రాష్ట్రాల ప్రజలు క్షమించరని, ఇంకో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడిగా గెలుస్తారని పేర్కొన్నారు. అందరు మంచు విష్ణుకు సహకరించాలని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆవేశం తగ్గించుకోవాలని, తెలుగు మాట్లాడటం సరిగ్గా రాదు అన్న వ్యక్తి హైస్కూల్లో చదివారన్నారు. కానీ విష్ణు యూనివర్సిటీ సీఈవో అంటూ వ్యాఖ్యానించారు. -
'మా' ఎన్నికల్లో మరో వివాదం.. పోలీసుల ఎంట్రీ
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. పోలింగ్ రోజున జరిగిన పరిణామాలపై ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్రాజ్ తాజాగా ఆయన ప్యానల్ సభ్యులతో కలిసిజూబ్లీహిల్స్ స్కూల్కు చేరుకున్నారు. సీసీ ఫుటేజీ తమకు అందించాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ను డిమాండ్ చేశారు.అయితే మంచు విష్ణు లేనందున ఇరువురి సమక్షంలో మాత్రమే సీసీ ఫుటేజీ ఇస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రకాశ్రాజ్కు సీసీటీవీ ఫుటేజీని ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో వివాదం నెలకొంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసే క్రమంలో జూబ్లీహిల్స్ స్కూల్కు పోలీసులు సైతం చేరుకున్నారు. ఈ సందర్భంగా సీసీ ఫుటేజీని ప్రిజర్వ్ చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వివాదం నెలకొంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసే క్రమంలో జూబ్లీహిల్స్ స్కూల్కు పోలీసులు సైతం చేరుకున్నారు. కాగా, అలాగే ప్రుకాశ్ రాజ్ ఆరోపణలపై స్పందించిన మంచు విష్ణు.. ‘ప్రకాశ్ రాజ్ సంతోషంగా సీసీ పుటేజ్ను చూడొచ్చు. మేము ప్రజాస్వామ్య బద్ధంగానే గెలిచాం. ఎన్నికల సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఇరువైపుల జరిగి ఉండోచ్చు. దీంతో మా మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయి తప్ప అక్కడ ఏం జరగలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన వారి రాజీనామాలు మేము మీడియా ద్వారానే విన్నాం. ఇప్పటి వరకు నాకు ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది. మిగతా ఆయన ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు’ అని విష్ణు స్పష్టం చేశారు. అలాగే ప్రకాశ్ రాజ్, నాగబాబుల రాజీనామాలు తాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు. కాగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఈనెల 10న జరిగిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది: మంచు విష్ణు పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన మంచు విష్ణు -
ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది: మంచు విష్ణు
గేమ్ ఆడిన వారికంటే చూసిన వారికే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉందని అర్థం అవుతుందని ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. శనివారం ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలో తన ప్యానల్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి తమ గెలుపును సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాబూ మోహన్తో పాటు మొత్తం తమ ప్యానల్ సభ్యుల కలిసి ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తమ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి పేరుపేరున మంచు విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ గెలుపు నా ప్యానల్ది.. మా అందరిది. మా ప్యానల్లో ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే నాకు ఓట్లు పడ్డయి. వారందరికి నా కృతజ్ఞతలు. ప్రతి పోటీలో గెలుపు-ఓటములు సహజం. ఈ సారి మేము గెలిచాం. ఇది మా అందరి కష్టం. ఈ సారి వాళ్లు గెలవలేదు. ఐ విష్ బెటర్ లక్ నెక్ట్టైం’ అని వ్యాఖ్యానించారు. అలాగే ప్రుకాశ్ రాజ్ ఆరోపణలపై స్పందించిన మంచు విష్ణు.. ‘ప్రకాశ్ రాజ్ సంతోషంగా సీసీ పుటేజ్ను చూడొచ్చు. మేము ప్రజాస్వామ్య బద్ధంగానే గెలిచాం. ఎన్నికల సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఇరువైపుల జరిగి ఉండోచ్చు. దీంతో మా మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయి తప్ప అక్కడ ఏం జరగలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన వారి రాజీనామాలు మేము మీడియా ద్వారానే విన్నాం. ఇప్పటి వరకు నాకు ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది. మిగతా ఆయన ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు’ అని విష్ణు స్పష్టం చేశారు. అలాగే ప్రకాశ్ రాజ్, నాగబాబుల రాజీనామాలు తాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు. -
పవన్ కల్యాణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్: మంచు విష్ణు
Manchu Vishnu About Pawan Kalyan: అలయ్-బలయ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, తాను మాట్లాడుకోకపోవడంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం మాట్లాడుకున్నాం అని, అయితే ఉప రాష్రపతి ఉండట వల్ల స్టేజ్పై మాత్రమే మాట్లాడుకోలేదని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం అనంతరం పోస్ట్ చేసిన ట్వీట్పై స్పందిస్తూ..పవన్ ఫ్యాన్స్ కోసమే ఆ వీడియోను షేర్ చేసినట్లు తెలిపారు. తమ మధ్య విభేదాలు లేవని, పవన్కల్యాణ్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. అంతేకాకుండా నిన్న తండ్రి మోహన్బాబు-చిరంజీవి ఫోన్లో మాట్లాడుకున్నట్లు వివరణ ఇచ్చారు. కాగా బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమంలో మంచు విష్ణు- పవన్ కల్యాణ్ ఎదురుపడినా ఇద్దరి మధ్యా మాటల్లేవ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T — Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021 చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్పై మండిపడ్డ మంచు లక్ష్మి శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అండ్ టీం -
ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా లేఖలు అందలేదు: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు తన టీంతో కలిసి నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. తన తండ్రి మోహన్ బాబు, ‘మా’ నూతన కార్యవర్గంతో కలిసి విష్ణు సోమవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని వీఐపీ దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ‘మా’ నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. మంచు విష్ణుతో పాటు శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు ఉన్నారు. చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్పై మండిపడ్డ మంచు లక్ష్మి ఈ సందర్భంగా మోహన్ బాబు మంచు మీడియాతో మాట్లాడుతూ.. విష్ణు ‘మా’కు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా అధ్యక్షుడు అంటే సాధారణ విషయం కాదని, అది ఓ బాధ్యత... గౌరవ ప్రధమైన హోదా అన్నారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల అనంతరం స్వామివారిని దర్శించుకన్నామని, అందరి కృషి వల్లే మేము గెలిచామన్నారు. మెజారిటీ సభ్యులు తమ ప్యానల్ నుంచే గెలిచారని తెలిపారు. ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామాలపై విష్ణు స్పందిస్తూ.. మీడియా ద్వారానే రాజీనామా చేస్తారని విన్నామని, వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజీనామా లేఖలు రాలేదన్నారు. రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తానని చెప్పారు. -
‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్పై మండిపడ్డ మంచు లక్ష్మి
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె నెటిజన్లపై మండిపడుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె తమ్ముడు మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలుపుతూ మంచు లక్ష్మి ఓ ట్వీట్ చేసింది. చదవండి: 'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు.. ట్వీట్ వైరల్ దీంతో ఆమె ట్వీట్పై నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ట్రోల్స్పై స్పందించిన లక్ష్మి నెటిజన్లకు క్లాస్ పీకుతూ మరో ట్వీట్ చేసింది. అసలు ఏం జరిగిందంటే.. మంచు విష్ణు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ.. ‘ఈ రోజు అత్యంత శుభదినం. ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా నా తమ్ముడు మంచు విష్ణు ప్రమాణ స్వీకారం. ప్రపంచాన్ని మార్చేందుకు ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించే ఈ కొత్త ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు తీసుకొస్తావో చూస్తుంటాను’ అంటూ రాసుకొచ్చింది. Big Day Today! ❤️🤞🏼 @iVishnuManchu's swearing in ceremony as the President of the Movie Artist Association. All the very best and all my blessings as you commence your new journey to change the world. I'm so proud of you and cannot wait to see what's about to unfold! — Lakshmi Manchu (@LakshmiManchu) October 16, 2021 చదవండి: వివాదంలో పెళ్లి సందD హీరోయిన్.. ఆమె నా కూతురు కాదంటూ.. దీంతో ఆమె ట్వీట్పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేయడం ప్రారంభించారు. ‘ఓ ‘మా’ అధ్యక్షుడు ప్రపంచాన్ని ఎలా మార్చగలడు’ అంటూ కామెంట్స్ చేశారు. తన ట్వీట్పై వస్తున్న కామెంట్స్కు మంచు లక్ష్మి స్పందిస్తూ నెటిజన్లపై అసహనం వ్యక్తం చేసింది. ‘ఇక చాలు ఆపండి. ఎప్పుడు చాన్స్ వస్తుందా.. ఎవరిని ఎప్పుడు, ఎలా కామెంట్ చేద్దామా? అని చూస్తుంటారు. నటీ నటులకు సినిమానే ప్రపంచం. విషయాన్ని అర్థం చేసుకోండి. నా ఉద్దేశం మీరనుకునే ప్రపంచం కాదు. ‘మా’ అసోసియేషన్ అనే ప్రపంచాన్ని మార్చడం’’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. Calm down people! Shooot... always ready to jump. Maybe I should have said change the world of our Association — Lakshmi Manchu (@LakshmiManchu) October 16, 2021 -
‘మా’లో వివాదంలో మరో ట్విస్ట్.. రంగంలోకి పోలీసులు
MAA Elections 2021: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసి వారం రోజులు గడుస్తున్నా... వివాదం మాత్రం తగ్గడం లేదు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్ మధ్య హోరా హోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాశ్ రాజ్. అంతేకాదు ఎన్నికల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు కూడా చేశారు. ఓట్ల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని, ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. కానీ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని వెల్లడించారు. తాజాగా ఈ వివాదం కొత్త కోణం చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తూందో చూడాలి. -
'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు.. ట్వీట్ వైరల్
RGV Satirical Comments On MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈసారి సినీ ఇండస్ట్రీనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ అంటూనే ప్రత్యక్ష ఆరోపణలకు తెరదీశారు. ఎన్నికలు పూర్తయినా ఇంకా మాటల దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. చదవండి: వైరల్: షో మధ్యలో బాలయ్యకు ఫోన్ చేసిన రోజా సినీ ప్రముఖులు సైతం మా ఎన్నికలు జరిగిన తీరుపై బహిరంగంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మా ఎన్నికలపై తనదైన స్టైల్లో స్పందించారు. మా మొత్తం ఎపిసోడ్ సర్కస్లా ఉందని, సిని'మా' వాళ్లు సర్కస్ లాంటి వాళ్లని ప్రజలకి నిరూపించారంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS 😳😳😳😳 — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2021 చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ చిరు చెల్లెలి బర్త్డే : స్పెషల్ విషెస్ తెలిపిన 'భోళా శంకర్' -
శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్
Mohan Babu Serious On Shiva Balaji Wife Madhumitha : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడు శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు. స్పీచ్ మధ్యలో వెనుక నుంచి మాట్లాడవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: MAA Elections 2021: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్ 'నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్గా చెయ్యాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా చేశాను. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్తోనే ఇక్కడ కొనసాగుతారు. ఇది రాజకీయ వేదిక కాదు. పాలిటిక్స్లో కంటే ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను' అని మోహన్ బాబు పేర్కొన్నారు. అయితే స్పీచ్ మధ్యలో శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు. పెద్దలు స్పీచ్ ఇస్తుంటే వెనుక నుంచి గుసగుసలు, సైగలు చేయడం తనకు నచ్చదని కోప్పడ్డారు. ఇలా చేస్తే మాట్లాడాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయంటూ సున్నితంగా హెచ్చరించారు. చదవండి: ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను: మోహన్బాబు ప్రకాశ్రాజ్ ప్యానెల్ రాజీనామాలపై స్పందించిన మంచు విష్ణు -
‘మా’ ఎన్నికల వివాదం: ఆ ఒక్కటీ అడక్కు..!
ద్వారకాతిరుమల: ‘ఆ ఒక్కటీ అడక్కు..’ ఇటీవల జరిగిన మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల తీరుపై అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ సినీఫక్కీలో స్పందించిన తీరిది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం కుటుంబసమేతంగా విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. తాను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎంత హుందాగా ఉందో.. అలా ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ చెప్పానన్నారు. మంచి అజెండాతో గెలిచినవారు మంచే చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఈవో సుబ్బారెడ్డి స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. కాగా, విజయదశమి పండుగను పురస్కరించుకుని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనంత ప్రభు శుక్రవారం చిన వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. -
ప్రకాశ్రాజ్ ప్యానెల్ రాజీనామాలపై స్పందించిన మంచు విష్ణు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అభివృద్ధికి తాను అన్నివిధాలా కష్టపడతానని తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్రాజ్ ప్యానెల్పై ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఈ రోజు(శనివారం) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు ప్రకటించిన మా మేనిఫెస్టోలో ప్రస్తావించిన ప్రతీ అంశం అమలు జరిగేలా చూస్తానని హామి ఇచ్చారు. చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం! అలాగే ‘మా’ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దామని ‘మా’ కార్యవర్గానికి ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తరువాత రోజు ప్రకాశ్ రాజ్తో పాటు ఆయన ప్యానల్ నుంచి గెలిచిన, ఓడిన సభ్యులు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విదితమే. దీనిపై మంచు విష్ణు స్పందించారు. చదవండి: ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం ‘‘మా’ ఎన్నికల్లో మేము గెలిచాం. పత్యర్థి ప్యానల్ వాళ్లు దీన్ని గౌరవించాలి. ఎన్నిక ఫలితాల అనంతరం పత్యర్థి ప్యానల్ వాళ్లు రాజీనామాలు చేశారు. వారి కారణాలు వారికి ఉండొచ్చు. అది చాలా దురదృష్టకరం. అయితే ‘మా’ అభివృద్ధి కోసం వారిని కలుపుకోనిపోతాం. ‘మా’ అసోసియేషన్ అభివద్ధికి కోసం ఏ కార్యక్రమాలను చేపట్టిన వారి సలహా తీసుకుంటాను. వారి సపోర్టు నాకు ఉంటుందని ఆశిస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తాను, తన టీం కానీ ‘మా’ ఎన్నికల గురించి మీడియాలో మాట్లాడమని, కేవలం తాము చేయబోయే కార్యక్రమాల గురించే మాట్లాడతామంటూ విష్ణు వ్యాఖ్యానించారు. -
ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను: మోహన్బాబు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రాజకీయ వేదిక కాదని, కళాకారుల వేదికని మోహన్ బాబు అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో శనివారం నిర్వహించిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్బాబు పాల్గొన్నారు. విష్ణు, అతని ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. చదవండి: ఆహా ‘అన్స్టాపబుల్’ టాక్ షోకు బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా! ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ.. ‘మనమంతా ఒకే తల్లి బిడ్డలం. మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్తోనే ఇక్కడ కొనసాగగలరు. నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్గా చెయ్యాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా చేశాను’ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ‘ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. ఇది రాజకీయ వేదిక కాదు, కళకారుల వేదిక. పాలిటిక్స్లో ఉన్నవి కంటే ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయని, ఇలాంటివి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయానన్నారు. చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం! ‘ఇక్కడ నువ్వు గొప్పా.. నేను గొప్పా.. సినిమాలు ఉన్నాయా, లేవా అన్నది కాదు. ఎంత కష్టపడి సినిమా చేసిన ఒక్కోసారి ప్లాప్స్ వస్తుంటాయి. జయాపజయాలు సహజం. సక్సెస్ వచ్చిందని విర్రవీగితే ఆ మరుక్షణమే దేవుడు దిమ్మతిరిగేటట్లు కొడతాడు. ‘మా’ ఎన్నికల సమయంలో మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది వ్యక్తులు బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదు. మా ఓటు మా ఇష్టమని నా బిడ్డను గెలిపించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాకు పగ, రాగద్వేషాలు లేవు. నా తెలివి తేటలతో, క్రమ శిక్షణతో ఇక్కడి వరకు వచ్చాను. చదవండి: ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం పరిశ్రమ పెద్దలను గౌరవించాలని, అందుకే ఇక్కడికి వచ్చే ముందు తాను కృష్ణగారిని కలిపి వచ్చానన్నారు. అలాగే 600 మందికి కూడా ఫోన్ చేసినట్లు చెప్పారు. భారతదేశం గర్వించేలా ‘మా’ ఖ్యాతిని పెంచాలని, ‘మా’ సభ్యులకు ఇళ్ల నిర్మాణం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలో తాను ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి మాట్లాడతానన్నారు. ఇది మన అసోసియేషన్, నూతన కార్యవర్గానికి మీ సహాయసహకారాలు ఎంతో అవసరమన్నారు. ‘మా’ అధ్యక్షుడు అనేది చిన్న ఉద్యోగం కాదని, ఒక పెద్ద బాధ్యత అన్నారు. ఎంతో మంది మహామహులు దీన్ని ఏర్పాటు చేశారు. కార్యవర్గంలోని సభ్యులందరికీ తాను చెప్పేది ఒక్కటేనని, మీలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రెసిడెంట్తో చెప్పి సమస్యలను పరిష్కరించుకోండి. అంతేకానీ, టీవీలకు ఎక్కొద్దంటూ’ మోహన్బాబు సూచించారు. -
‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది. చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం! కాగా ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నటుడు మోహన్ బాబు, నరేష్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని.. కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ‘మా’ కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే విష్ణు సతిమణి విరానిక వారి పిల్లులు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా బాలకృష్ణ రావాల్సి ఉండగా ఆయన హాజరు కాలేకపోయారు. శుక్రవారం బాలయ్య ఇంటికి వెళ్లి ఆయనను మోహన్ బాబు, విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Unstapable Talk Show: ‘అన్స్టాపబుల్’ టాక్ షోకు బాలయ్య షాకింగ్ రెమ్యునరేషన్ కాగా ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడిపోగా, ఆయన ప్యానల్ నుంచి 11 మంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాల విడుదలైన తర్వాత రోజు ప్రకాశ్ రాజ్తో పాటు ఆయన ప్యానల్లో గెలిచిన సభ్యులు అనూహ్యంగా విష్ణు ప్యానల్తో కలిసి తాము పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ప్రకాశ్రాజ్, అతని ప్యానల్ సభ్యులెవరూ హాజరు కాలేదు. మరోవైపు, ఇటీవల బాలకృష్ణను కలిసిన మంచు విష్ణు చిరంజీవిని సైతం కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమంలో చిరంజీవి కానీ.. మెగా హీరోలెవరు కనిపించకపోవడం గమనార్హం. -
విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!
Manchu Vishnu MAA President: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు, గెలిచిన కార్యవర్గ సభ్యులు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో పదవి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా రానున్నారు.. అలాగే నందమూరు బాలకృష్ణను సైతం విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానించారు. చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు కాగా శుక్రవారం నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో అరగంట పాటు మోహన్ బాబు, విష్ణులు చర్చించిన సంగతి తెలిసిందే. అలాగే.. సినీ పెద్దలు పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంను కలిసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి రావాలని విష్ణు కోరారు. అయితే సినిమా పెద్దలను ఆహ్వానించిన విష్ణు.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కౌంటింగ్ రోజున.. త్వరలో చిరంజీవిని వ్యక్తిగతంగా కలుస్తానని మంచు విష్ణు చెప్పిన సంగతి విదితమే. చదవండి: ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చమని సూచించారు: మంచు విష్ణు కానీ ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరిని విష్ణు ఆహ్వానించనట్లుగా సమాచారం. ఇక గురువారం విష్ణు సోదరుడు మంచు మనోజ్, పవన్ కల్యాణ్ను ఓ సినిమా సెట్లో కలిశారు. అక్కడ పవన్ అరగంట పాటు చర్చిన మనోజ్ విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్ను కోరినట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై విష్ణు టీం కానీ, పవన్ టీం కాని స్పష్టత ఇవ్వలేదు. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానన్నా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్, అతని ప్యానెల్లో గెలిచిన సభ్యులకు ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్లో ఆహ్వాన సందేశం పంపారు. అలాగే ప్రతి మా సభ్యుడికి మా కార్యాలయం మెసెజ్ ద్వారా ఆహ్వానం పంపింది. -
‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చమని సూచించారు: మంచు విష్ణు
సినీ పెద్దలందరితో కలిసి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అభివృద్ధికి పాటుపడతానని ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్రాజ్పై గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా నటుడు బాలకృష్ణను కలిసిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి బాధ్యతలు చేపట్టిన తర్వాత విష్ణు.. రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారా? అని ఆసక్తిగా చూస్తున్న క్రమంలో బాలకృష్ణను కలిసి అందరికి ట్విస్ట్ ఇచ్చారు. చదవండి: ‘రాత్రి గెలిచి ఉదయమే ఎలా ఓడిపోయామో’ ఈ భేటీలో ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం, సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న అంశాలపై బాలయ్యతో విష్ణు చర్చినట్లు తెలుస్తోంది. అయితే ‘మా’ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు భేటీ ఆనంతరం మీడియాతో విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు మద్దతుగా నిలిచిన బాలకృష్ణను కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. ఈ ఎన్నికల్లో ఆయన నాకు మొదటి నుంచి సపోర్ట్ చేశారు. త్వరలోనే చిరంజీవిని కలుస్తా’ అని తెలిపారు. చదవండి: ‘మహా సముద్రం’ మూవీ రివ్యూ ఇక ‘ఈ నెల 16న మా అధ్యక్ష పదవి నేను, నా ప్యానల్ ఎన్నికల అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నాం. ఆ తర్వాత ఈసీతో చర్చించి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటా. సినీ పెద్దలందరిని కలుపుకుని ముందుకు వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘నాకు మద్దతుగా నిలిచిన బాలయ్య అన్నకు ధన్యవాదాలు. ఈ రోజు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపాను. ఆయన ‘మా’ కోసం ఎప్పుడు ముందుంటానని హామీ ఇచ్చారు. అలాగే ‘మా’ కుటుంబాన్ని ఒకచోట చేర్చమని ఆయన నాకు సూచించారు’ అంటూ మంచు విష్ణు తన ట్వీట్లో రాసుకొచ్చారు. Thank you to Bala anna for his support. Met and expressed my gratitude. He also assured that he will always be there for MAA and advised me to concentrate on bringing the MAA family together; which is my agenda right now. 💪🏽❤️🙏 pic.twitter.com/eFpGr8Nqvx — Vishnu Manchu (@iVishnuManchu) October 14, 2021 -
రాత్రి గెలిచి.. ఉదయమే ఎలా ఓడిపోయామో దుర్గమ్మకే తెలియాలి: హేమ
సాక్షి, విజయవాడ: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై నటి హేమ తాజాగా స్పందించారు. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానల్ ఎలా ఓడిపోయిందో దుర్గమ్మకే తెలియాలంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు(గురువారం) ఉదయం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా సందర్భంగా తాను ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని, ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు ఈ మేరకు ఆమె ‘మా’ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రాత్రి గెలిచామని చెప్పి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదని, దానికి కారణం దుర్గమ్మకైనా తెలుసో లేదో అంటూ హేమ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇదే ప్యానల్ నుంచి పోటీ చేసిన అనసూయ ఫలితాలపై చేసిన వరుస ట్వీట్లు హాట్టాపిక్గా మారాయి. ఎన్నికలు జరిగిన రోజు అక్టోబర్ 10న రాత్రి వీరిద్దరూ గెలిచినట్లు ప్రకటించి.. మరుసటి రోజు వారు ఓడిపోయినట్లు తెలిపారు. దీంతో ‘మా’ ఫలితాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు -
అనసూయ ఆరోపణలపై స్పందించిన కృష్ణమోహన్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. వివాదాలు, విమర్శలకు మాత్రం పుల్స్టాప్ పడడం లేదు. ముఖ్యంగా ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు.. తన ప్యానల్ తరపున గెలిచిన 11 మందితో రాజీనామాలు చేయించాడు. ఇదే సమయంలో కౌంటింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయని ప్రకాశ్ రాజ్ ప్రెస్మీట్లో ఆరోపించారు. ఆయన ప్యానల్ నుంచి ఈసీ మెంబర్గా పోటీ చేసి ఓడిపోయిన యాంకర్ అనసూయ సైతం పోలింగ్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆమె విజయం సాధించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో అనసూయతో పాటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ షాక్కు గురైంది. దీనిపై ‘‘రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా’ అంటూ ఆమె సెటైరికల్గా ట్వీట్ చేశారు. ఇక మంగళవారం ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి బ్యాలట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. తాజాగా ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కృష్ణమోహన్.. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారికంగా అనౌన్స్ చేయడానికి ముందే ఆమె గెలిచినట్టు మీడియాలో ప్రచారం జరిగిందని కృష్ణమోహన్ చెప్పారు. తాను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లానని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్స్ల తాళాలను మాత్రమే తాను ఇంటికి తీసుకెళ్లానని కృష్ణమోహన్ స్పష్టం చేశారు. -
చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిశాయి. ప్రకాశ్ రాజ్పై మంచు విష్ణు విజయం సాధించారు. అయిన ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. రాజీనామాలు, ఆరోపణలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ నటుడు నరేశ్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాజీనామా అనంతరం తొలిసారి మీడియాతో ముచ్చటించిన మెగా బ్రదర్ నాగబాబు, నరేశ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని తన అన్నయ్య(చిరంజీవి) ఎప్పుడు అనుకోలేదన్నాడు. పరిశ్రమకు చెందిన నటీనటులు, అభిమానులు ఎవరైనా కష్టమంటు ఇంటికి వస్తే ఆయన వారికి చేతనైనంత సాయం చేశారని పేర్కొన్నాడు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడు ఆయన అనలేదని, అన్నయ్యకు అంత అహంకారం లేదని నాగబాబు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం తన రాజీనామాపై మాట్లాడుతూ.. ‘‘మా’ అసోసియేషన్లో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్వపడ్డాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని, విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్న. కానీ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్లో ఉండాలనిపించలేదు. మనస్థాపంతో బయటకు వచ్చేశాను. సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇకపై ఈ అసోసియేషన్తో నాకు సంబంధం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
ప్రకాశ్రాజ్ ప్యానల్పై ఫైర్ అయిన నరేష్
MAA Elections 2021 Resignation: కలిసి పని చేస్తాం అన్నవాళ్లు ఎందుకు రాజీనామా చేశారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షుడు నరేష్ ప్రశ్నించారు. ప్రకాశ్రాజ్ ప్యానల్ మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన అనంతరం నేడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: Maa Elections 2021: పెన్షన్ ఫైల్పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు 'కలిసి పనిచేస్తాం అన్నవాళ్లు..రాజీనామా ఎందుకు చేశారు? ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి? నరేంద్ర మోదీ గెలిచాడని కాంగ్రెస్ వాళ్లు దేశం వదిలి వెళ్లలేదు కదా. 'మా' అనేది కుటుంబం. గెస్ట్గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారు. ఫ్యాక్షనిజం మానేద్దాం. కలసి పనిచేద్దాం. రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ గురించి కొత్త ప్యానల్ చూసుకుంటుంది. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఎమోషన్స్.. ప్రస్టేషన్ వద్దు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి' అంటూ ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యులపై నరేష్ అసహనం వ్యక్తం చేశారు. చదవండి: రోజుకో ట్విస్ట్.. మంచు విష్ణు యాక్షన్ ప్లాన్ ఏంటి? -
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం
Manchu Vishnu Takes Charge As MAA President : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పెన్షన్ ఫైల్పై తొలి సంతకం చేశారు. నరేష్ నుంచి నూతన బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి మా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.అయితే ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే 'మా' అధ్యక్షుడిగా తాను బాధ్యతలు తీసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 'మీ సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్ధతు నాకు కావాలి' అంటూ మంచు విష్ణు ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: MAA Resignations: రాజీనామాలపై మంచు విష్ణు ఏం చేయబోతున్నారు? కాగా 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విష్ణు..ప్రకాశ్రాజ్ ప్యానల్ మూకుమ్మడి రాజీనామాలపై ఎలా స్పందింస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది కూడా హాట్ టాపిక్గా మారింది. చదవండి: ప్రకాశ్రాజ్ ప్యానల్ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల అధికారి I have today assumed the office of the President of MAA! Need all your wishes and send me positivity as much as you can. #MAA pic.twitter.com/cYUiuxmwQ9 — Vishnu Manchu (@iVishnuManchu) October 13, 2021 -
రోజుకో ట్విస్ట్.. మంచు విష్ణు యాక్షన్ ప్లాన్ ఏంటి?
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసినా రోజుకో ట్విస్ట్ తెరమీదకి వస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు చాలా ఉత్కంఠను రేపాయి. అదే స్థాయిలో ఎన్నికల తర్వాత కూడా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రకాశ్రాజ్, నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం, అనంతరం ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలను ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. చదవండి: ఆ విషయం గురించి నేను చెప్పకూడదు: 'మా' ఎన్నికల అధికారి మా ప్రెసిడెంట్గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన ముందు అనేక సవాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు ఈ మూకుమ్మడి రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మా అసోసియేషన్లో ఏదైనా ఒక పదవి ఖాళీ ఏర్పడితే, దాన్ని భర్తీ చేసే అధికారి మా అధ్యక్షుడికే ఉంటుంది. ‘మా’ బైలాస్ నిబంధన ప్రకారం.. మా సభ్యుడి పోస్ట్కు ఖాళీ ఏర్పడితే.. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు. దీనికి జనరల్ బాడీ సభ్యులందరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి మూకుమ్మడి రాజీనామాలను సైతం ఆమోదించి ఆ స్థానంలో కొత్తవారిని నామినేట్ చేస్తారా? లేక బుజ్జగింపులు చేసి రాజీనామాలను వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి: కొత్త కుంపటిపై ప్రకాశ్రాజ్ క్లారిటీ -
ప్రకాశ్రాజ్ ప్యానల్ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల అధికారి
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. ఎన్నికలు ముగిసినా కాంట్రవర్సరీలు, ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రకాశ్రాజ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అనే ప్రశ్నను లేవనెత్తారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: ప్రకాశ్రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!... బ్యాలెట్ పేపర్స్ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయంపై మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్ స్పందించారు. యాంకర్ అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందన్న వ్యాఖ్యల్లో నిజం లేదని, అధికారికంగా ప్రకటించక ముందే వార్తలు ఎలా బయటకు వెళ్లాయో తెలియడం లేదన్నారు. ఇక తాను బ్యాలెట్ పేపర్లను తీసుకెళ్లినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. తాను బ్యాలెట్ పేపర్ల తాళాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లానని, బ్యాలెట్ పేపర్లు కాదని స్పష్టం చేశారు.ఇక ప్రకాశ్రాజ్ రాజీనామాపై స్పందిస్తూ..అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం అని, ఇది కరెక్టా కాదా అన్నది ఎలక్షన్ కమిషనర్గా తాను చెప్పకూడదు, చెప్పలేనని పేర్కొన్నారు. దీనిపై మా ప్రెసిడెంట్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.చదవండి: మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ -
అనసూయ సీరియస్.. కోర్టుకు వెళ్తానంటూ వార్నింగ్
Maa Elections 2021: నిజాలు తెలుసుకోకుండా తన పేరు వాడితే కోర్టుకు వెళ్తానంటూ యాంకర్ అనసూయ సీరియస్ అయ్యింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రకాశ్రాజ్ ప్యానల్కు చెందిన 11మంది రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో యాంకర్ అనసూయ సైతం పాల్గొన్నారు.చదవండి: అనసూయకు బిగ్ షాకిచ్చిన 'మా' కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో మా ఎన్నికలపై స్పందించిన అనసూయ తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలకు తన పేరును ఆపాదిస్తే కోర్టుకు వెళ్తానని హెచ్చరించింది. చదవండి: మోహన్ బాబు తిడుతుంటే విష్ణు ఆపాడు: తనీష్ -
నా భార్య చనిపోతే నరేష్ ఒక్క ఫోన్ కూడా చేయలేదు: ఉత్తేజ్
MAA Elections 2021: Actor Uttej About Naresh: భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా తాము తప్పుకుంటున్నామని నటుడు ఉత్తేజ్ అన్నారు. పోలింగ్ రోజున నరేష్ యుద్ధవాతావరణం సృష్టించారని, తనని తన కుటుంబ సభ్యులను బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. 'నా భార్య పద్మ చనిపోతే చిరంజీవి, జీవితా రాజశేఖర్, ప్రకాశ్రాజ్ సహా పలువురు హస్పిటల్ వద్దనే ఉండి తన ఓదార్చారు. కానీ నరేష్ నుంచి మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. నా 25 ఏళ్ల కెరీర్లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. నరేష్ వల్లే "మా" శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది. విష్ణు బాగా పనిచేయాలని ఆశిస్తున్నాం' అని ఉత్తేజ్ పేర్కొన్నారు. చదవండి: మోహన్ బాబు కించపరిచే బూతులు తిట్టారు: తనీష్ -
మోహన్ బాబు తిడుతుంటే విష్ణు ఆపాడు: తనీష్
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11మంది రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో తనీష్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలింగ్ రోజు తనను మోహన్ బాబు బూతులు తిట్టారని ఎమోషనల్ అయ్యాడు. 'నేను ఏరోజూ మీడియా ముందుకు రాలేదు. వివాదాలకు మొదట్నుంచి నేను దూరంగా ఉన్నాను. నాకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. పోలింగ్ రోజు మోహన్ బాబు నన్ను బూతులు తిట్టారు. ఆపేందుకు ప్రయత్నించిన బెనర్జీని సైతం మోహన్ బాబు తిట్టిపోశారు. మంచు విష్ణు మధ్యలో జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపారు. మా అమ్మను కించపరిచే బూతులు మోహన్బాబు తిట్టారు. నాకు నా తల్లే సర్వస్వం. అలాంటిది ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. గతంలో వివిధ సందర్భాల్లో నరేష్ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది' అంటూ తనీష్ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ -
కొత్త కుంపటిపై ప్రకాశ్రాజ్ క్లారిటీ
Prakash Raj Clarity On New Association : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన ప్యానల్ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్కు పోటీగా మరో అసోసియేషన్ పెడుతున్నారంటూ ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. చదవండి: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్రాజ్ ప్యానల్ 'ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(ATMAA)'పేరుతో కొత్త అసోసియేషన్ ప్రకటించనున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ రూమర్స్పై ప్రకాశ్ రాజ్ స్పందించారు. కొత్త కుంపటి పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన స్పష్టం చేశారు. చదవండి: ప్రకాశ్రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!... -
మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ
Maa elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల రోజు తనను మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారని నటుడు బెనర్జీ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అలాంటిది అందరి ముందు మోహన్ బాబు బూతులు తిడుతూ అవమానించారని చెబుతూ బెనర్జీ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'ఎలక్షన్స్లో గెలిచానని అందరూ కంగ్రాట్స్ చెప్పినా అది నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే పోలింగ్ రోజు ఉదయమే వందల మందిలో మోహన్ బాబు నన్ను పచ్చి బూతులు తిట్టారు.తనీష్ను తిడుతుంటే ఆపినందుకు నన్ను మోహన్బాబు కొట్టబోయారు. చదవండి: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్రాజ్ ప్యానల్ విష్ణు నన్ను బలవంతంగా ఆపారు: బెనర్జీ పోలింగ్ జరిగే చోట మోహన్బాబు అలా ప్రవర్తిస్తున్నా ఎవరూ ఆపలేదు. తనీష్, నాకు చాలా బాధకలిగి కంటతడి పెట్టుకున్నామ. మూడు రోజుల నుంచి చాలా బాధపడుతున్నా. మోహన్బాబు తిడుతుంటే విష్ణు నన్ను బలవంతంగా ఆపారు. మోహన్బాబు సతీమణి కూడా ఫోన్ చేసి నన్ను ఓదార్చారు. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలను నుంచి ఇంకా తేరుకోలేదు చాలా చాలా బాధ కలిగింది. ఇలా ఎందుకు బతకాలి మనం?ఇలాంటి అసోసియేషన్లో ఎందుకు ఉండాలి' అంటూ బెనర్జీ కంటతడి పెట్టారు. చదవండి: నేను అసమర్థుడిని కాను.. మౌనంగా ఉన్నా అంతే : మోహన్ బాబు -
MAA Elections 2021: అందుకే రాజీనామా చేశాం : శ్రీకాంత్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు తెచ్చిన సంక్షోభంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరుపున గెలిచిన11 మంది రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందిన శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతాన్ని దృష్టిలో పెట్టుకొనే రాజీనామా చేస్తున్నామని తెలిపారు. రెండు ప్యానళ్లకు చెందిన సభ్యులు ఉంటే.. ‘మా’అభివృద్ది ఆటంకం ఏర్పడుతుందని, సమస్యలు ఎత్తి చూపితే తమ వళ్లే జరగలేదని చెప్పే అవకాశాలు ఉన్నాయని.. అందుకే ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలిచిన వారంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో ‘మా’అధ్యక్షుడిగా చేసిన నరేశ్ ఆధ్వర్యంలోనే మంచు విష్ణు పనిచేస్తాడని శ్రీకాంత్ ఆరోపించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని విష్ణు నెరవేర్చాలని, లేదంటే కచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పారు. ‘మా’సంక్షేమం కోసమే తాము రాజీనామా చేశామని, తమకు ఓట్లేసిన వారు ఈ ఒక్కసారి క్షమించాలని శ్రీకాంత్ కోరారు. -
మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్రాజ్ ప్యానల్
Maa elections 2021: ప్రకాశ్రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: నేను అసమర్థుడిని కాను.. మౌనంగా ఉన్నా అంతే : మోహన్ బాబు బెనర్జీపై చేయి చేసుకున్నారు 'రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. మోహన్ బాబు ఎన్నికల ప్రక్రియలోనే కూర్చున్నారు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్ నటుడిపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు. అందుకే మా ప్యానల్ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్రాజ్ ప్రకటించారు. రాజీనామా చేసినా ప్రశ్నిస్తాం.. ఇక తన రాజీనామా గురించి మాట్లాడుతూ..మాలోనే కొనసాగుతానని, రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని, అయితే దానికి ఓ కండీషన్ ఉందని ప్రకాశ్రాజ్ అన్నారు. బైలాస్లో బయటవాళ్లు పోటీ చేయకుండా మార్పు చేయవద్దు. ఎవరైనా పోటీ చేయవచ్చు అన్నదానికి విష్ణు ఒప్పుకుంటే రాజీనామాను వెనక్కి తీసుకుంటా అని పేర్కొన్నారు. ఇక రాజీనామా చేసినా మా సభ్యల సంక్షేమం కోసం ప్రశ్నిస్తామని, ఓడిపోయాం అని మేం వదిలేయబోమని స్పష్టం చేశారు. చదవండి: అనసూయకు బిగ్ షాకిచ్చిన 'మా' -
కొత్త కుంపటి పెట్టేందుకు సిద్ధమైన ప్రకాశ్రాజ్!
Maa elections 2021: మోహన్ బాబు సమక్షంలో మా ఎన్నికలు జరిగాయని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరూ కలిసి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇక కథ ముగిసింది అనుకుంటే మరో కొత్త కథ తెరమీదకు వచ్చింది. మా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్రాజ్ కొత్త కుంపటి పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరికాసేపట్లో ప్రకాశ్రాజ్ ప్రెస్మీట్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే మా సభ్యత్వానికి ప్రకాశ్రాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్రాజ్ ఆలోచనలపై రకరకాల ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ప్రకాశ్రాజ్ ప్రెస్మీట్పై టాలీవుడ్లో ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏం చెప్పబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మరోవైపు ఓటమికి జీర్ణించుకోలేక ఇలా కొత్త అసోసియేషన్ వైపు అడుగులు వేయడం ఎంత వరకు సమంజసం అంటూ ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఒకవేళ ప్రకాశ్రాజ్ కొత్త అసోసియేషన్ ప్రకటిస్తే టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోనుందనే టాక్ కూడా ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: MAA Elections 2021: ఈ కారణాల వల్లే ప్రకాశ్రాజ్ ఓడిపోయాడా? -
ప్రకాశ్రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!...
గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఉత్కంఠను రేపిన మా ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్రాజ్పై 107ఓట్ల తేడాతో విష్ణు మా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. మా ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ప్రకాశ్రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. అందరి కంటే ముందుగా చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రత్యక్షంగా మెగా బ్రదర్ నాగబాబే ప్రకాశ్రాజ్కు క్యాంపెయిన్ చేశారు. అయినప్పటికీ ప్రకాశ్రాజ్ ఓడిపోవడానికి గత కారణాలు ఏంటి అని ఓసారి పరిశీలిస్తే.. ► ప్రకాశ్రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష బరిలో ఉన్నానని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. మొదట్లో ఈ విషయంపై ఆర్జీవీ వంటి సినీ ప్రముఖులు ప్రకాశ్రాజ్కు సపోర్ట్గా నిలబడినా.. ఆ తర్వాత మా అసోసియేషన్కు తెలుగు వాళ్లు కాకుండా, వేరే పరిశ్రమకు చెందిన వాళ్లు ఎలా పాలిస్తారు అంటూ వచ్చిన విమర్శలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టకపోవడం ప్రకాశ్రాజ్కు మైనస్కు మారింది. ►. కెరీర్ పరంగా ప్రకాశ్రాజ్ చాలా బిజీ ఆర్టిస్ట్. సంవత్సరానికి ఇతర భాషలతో కలిపి సుమారు 7-8 సినిమాల్లో నటిస్తారు. అలాంటి బిజీ ఆర్టిస్ట్ మా అసోసియేషన్కు ఎలా సేవ చేస్తారనే వాదన తెరపైకి వచ్చింది. ఎక్కడో తమిళనాడులో ఉండి ఇక్కడి ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించేంత సమయం ఎలా కేటాయిస్తారనే కామెంట్స్ కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించాయి. ► మంచు విష్ణుకు మోహన్ బాబు చేసిన క్యాంపెయిన్ ప్రకాశ్రాజ్కు మైనస్ అయిందని చెప్పొచ్చు. సినీ పరిశ్రమలో ఆయనతో చాలామందికి ప్రత్యేక అనుబంధం ఉంది. మోహన్ బాబు చెబితే కాదనలేం అనే సినీ ప్రముఖులు కూడా ఉండటంతో ప్రకాశ్రాజ్కు ఓట్లు తగ్గాయన్నది మరో కారణంగా చెప్పుకుంటున్నారు. ►చాన్నాళ్లుగా ఉన్న మా బిల్డింగ్ సమస్యపై దృష్టి పెట్టకపోవడం. అటు మంచు విష్ణు మా బిల్డింగ్ కోసం తన సొంత డబ్బులు ఖర్చుపెడతానని నమ్మకం కలిగించడం కూడా ప్రకాశ్రాజ్కు మైనస్గా మారింది. ► మా అధ్యక్షుడిగా ఎన్నికైతే చేసే కార్యక్రమాలు, సంక్షేమం వంటి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడం.. మంచు విష్ణు తర్వాత కూడా ఎలాంటి మ్యానిఫెస్టో ప్రకటించకపోవడం అతి పెద్ద మైనస్ అని టాక్ వినిపిస్తుంది. ► నాగబాబు మినహా మెగా ఫ్యామిలీ నుంచి ప్రత్యక్షంగా ఎవరూ మద్ధుతు ప్రకటించకపోవడం ► ఎన్నికలకు రెండు రోజులు ముందు నాకు పెద్దల మద్దతు అవసరం లేదు అంటూ ప్రకాశ్రాజ్ చేసిన కామెంట్స్ నెగిటివిటిని పెంచేశాయి. ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదంటూ ప్రకాశ్రాజ్ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఆయనకే బెడిసి కొట్టిందనే చెప్పాలి. ►ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను మా ఎన్నికల్లో ఓటేసేందుకు సిద్ధం చేయకపోవడం. ఎలక్షన్స్ రోజు ముంబై, బెంగుళూరు, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరీ కొందరు వేసిన ఓట్లు మంచు విష్ణుకు అనుకూలంగా మారాయి. చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. నాగబాబు, ప్రకాశ్రాజ్ రాజీనామాలను ఆమోదించను: మంచు విష్ణు -
‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం అయితే బాగుండేది: రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలపై స్పందించారు. ఈ సారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపిస్తూ రాజకీయ రణరంగాన్ని తలపించాయన్నారు. ఆయన దర్శక పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD మూవీ షూటింగ్ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా సోమవారం(అక్టోబర్ 11) విశాఖపట్నం వెళ్లారు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సింది అన్నారు. ‘ఎన్నికల్లో ఇంత అలజడి సృష్టించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సినీ పెద్దలు అంతా కలిసి మా అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని ఎన్నుకుని.. ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేది. నిజానికి అదే మంచి పద్దతి. ఇక అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని ఆయన అన్నారు. చదవండి: నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్కి రావట్లేదు: రవళి -
తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Nagababu Resignation: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్పై విజయం సాధించారు. మా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రకాశ్ రాజ్కు మద్దుతు ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ‘‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: MAA Elections 2021 Results: మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా అలాగే 48 గంటల్లో తన రాజీనామా లేఖను ‘మా’ కార్యాలయానికి పంపిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. అన్నట్లుగానే సోమవారం రాత్రి నాగబాబు తన రాజీనామా లేఖను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘మా’ అసోసియేషన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తను రాజీనామాకు గల కారణాలకు కూడా ఆయన వివరణ ఇచ్చారు. ‘‘నిష్పక్షపాతం, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరును నేను ఎప్పుడు అభిమానించేవాడిని. సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచేది. ఇటీవలి కాలంలో ‘మా’ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయి. ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి’’ అన్నారు. చదవండి: నా రాజీనా‘మా’కు లోతైన అర్థం ఉంది: ప్రకాశ్రాజ్ అలాగే ‘ఈ ఎన్నికలు నాలాంటి వారికి కనువిప్పు కలిగించాయి. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయాయి. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే నేను అసోసియేషన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తి ప్రకాశ్ రాజ్. అలాంటి వ్యక్తి వెంటే నేను ఎల్లప్పుడూ నిలబడి ఉంటాను. ఎప్పటికి నా మద్దతు ప్రకాశ్ రాజ్కే. గత పరిణామాల పట్ల నేను బాధపడటం లేదు. అసోసియేషన్ భవిష్యత్పైనే ఆందోళన చెందుతున్నా’ అంటూ నాగబాబు తన రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. Membership Resignation from MAA Association. pic.twitter.com/l4WlNaZlvx — Naga Babu Konidela (@NagaBabuOffl) October 11, 2021 -
నా రాజీనా‘మా’కు లోతైన అర్థం ఉంది: ప్రకాశ్రాజ్
Maa Elections 2021: ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రాంతీయవాదం, జాతీయవాదం నడుమ జరిగాయి. తెలుగువాడు కానివాడు ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు, కానీ పోటీ చేయకూడదా? నేను తెలుగువాణ్ణి కాకపోవడం నా దురదృష్టం. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు.. అది నా తప్పు కాదు.. వారి తప్పూ కాదు’’ అని నటుడు ప్రకాశ్రాజ్ అన్నారు. సోమవారం విలేకరులతో ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ – ‘‘పరభాషా నటులు ‘మా’ సభ్యులుగా ఉండొచ్చు కానీ పోటీ చేయడానికి అనర్హులుగా బైలాస్లో మార్పులు తీసుకొస్తామని ఇటీవల ‘మా’ ఎన్నికలకు ముందు తెలిపారు. ఇటువంటి ఎజెండాతో, ఐడియాలజీతో ఉన్న అసోసియేషన్లో సభ్యుడిగా ఉండలేను. పైగా ‘మా’ అసోసియేషన్కి తెలుగువాడు కాని నా సేవలు వద్దని తీర్పు ఇచ్చారు.. ‘మా’ లోపలికి రావొద్దని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నేను ఎలా వెళ్లగలను? కళాకారుడిగా నాకూ ఓ ఆత్మ గౌరవం ఉంటుంది.. అందుకే ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ‘మా’తో నాది 21 ఏళ్ల అనుబంధం. ‘నువ్వు అతిథిగా వచ్చావు.. అతిథిగానే ఉండాలి’ అంటూ మోహన్బాబు, కోట శ్రీనివాసరావుగార్లు, రవిబాబు వంటివారు మాట్లాడారు.. అందుకే అతిథిగానే ఉంటా. ‘మా’ సభ్యుడు కాకున్నా నన్ను పిలిచి తన సినిమాలో చేయమని మంచు విష్ణు అడిగినా నటిస్తాను. తెలుగు ఇండస్ట్రీవారితో నా బంధం ఎప్పటిలానే కొనసాగుతుంది. ‘మా’ ఎన్నికల తర్వాత కొందరు ‘ఇండస్ట్రీలో మేమంతా ఒక్కటే’ అని మాట్లాడే అబద్ధాలను నేను నమ్మను’’ అన్నారు. అంతేకాకుండా సోమవారం రాత్రి ఓ ట్వీట్ చేశారాయన. ‘‘మా వెంట నిలిచిన ‘మా’ సభ్యు లందరికీ.. నేను రాజీనామా చేయడానికి ఓ లోతైన అర్థం ఉంది. త్వరలో ఆ కారణాన్ని వివరిస్తాను’’ అని ట్వీట్ చేశారు. చదవండి: నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు: మోహన్ బాబు -
అనసూయకు బిగ్ షాకిచ్చిన 'మా'
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై యాంకర్ అనసూయ స్పందించింది. నిన్న రాత్ర గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎలక్షన్స్ రూల్స్కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది. చదవండి: ప్రెగ్నెన్సీని దాచిపెట్టిన హీరోయిన్ శ్రియ కాగా నిన్న జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ గతరాత్రి వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఎన్నికల అధికారి రిలీజ్ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్కి గురయ్యింది. చదవండి: సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్కుమార్ 😂 Kshaminchali.. okka vishayam gurtochi tega navvochestundi.. meeto panchukuntunna emanukovoddey..! Ninna “athadhika majority” “bhaari majority” to gelupu ani.. eeroju “lost” “otami” antunnaru.. raathriki raathri enjaruguntundabba🧐 🤔 — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021 Ok. Lesson learnt. 😊 pic.twitter.com/2PSFh2AlMW — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021 Ante mari ninna yevaro election rules ki bhinnanga ballot papers ni intiki kuda teeskellarani .. aha ante bayata talku.. 🙊 nenatledu https://t.co/tAM8MVVhxV — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021 చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. -
నేను అసమర్థుడిని కాను.. మౌనంగా ఉన్నా అంతే : మోహన్ బాబు
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితం అనంతరం మోహన్ బాబు పలు కీలక కామెంట్స్ చేశారు. 'నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు. సింహం నాలుగడుగులు వెనక్కి వేసిందంటే విజృంభిస్తుంది. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. కొందరు పలు వేదికలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను అసమర్థుడిని కాను..మౌనంగా ఉన్నా అంతే. నవ్వుతూ స్వీకరించాలి. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రుల సహకారం లేకుండా ఏమీ చేయలేం' అని అన్నారు.