Rajendra Prasad
-
రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీతో రాబిన్హుడ్ సినిమా (Robinhood Movie)కు కొత్త జోష్ వచ్చినట్లయింది. అతడి స్పెషల్ ఎంట్రీ సినిమాలోనే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఉండటంతో అభిమానులు సంతోషపడ్డారు. కానీ ఇదే ఈవెంట్లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ వార్నర్పై నోరు జారాడు. రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే కుప్పిగంతులు వేస్తున్నావ్.. అంటూ అతడిని వెక్కిరిస్తూ ఓ బూతు మాట కూడా అన్నాడు.క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్అంత పెద్ద క్రికెటర్ను పట్టుకుని ఇలాంటి చవకబారు వ్యాఖ్యలేంటని జనం మండిపడ్డారు. దీంతో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) క్షమాపణలు తెలిపాడు. వార్నర్ అంటే తనకిష్టమని, ఉద్దేశపూర్వకంగా అలాంటి మాట అనలేదన్నాడు. పొరపాటున నోరు జారానని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. తన మాట తీరు వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి అని కోరాడు.వార్నర్ రియాక్షన్ ఇదీ!ఈ విషయంలో వార్నర్ (David Warner) రియాక్షన్ ఎలా ఉందో బయటపెట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula). వెంకీ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మేమందరం కలిశాం. అప్పుడు రాజేంద్రప్రసాద్గారు, వార్నర్ బాగా క్లోజ్ అయ్యారు. రాజేంద్రప్రసాద్గారు చాలా పెద్దాయన, కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏదనిపిస్తే అది మాట్లాడతారు. నువ్వు యాక్టింగ్కు వచ్చావ్ కదా.. చూసుకుందాం అని రాజేంద్రప్రసాద్.. నువ్వు క్రికెట్కు రా.. చూసుకుందాం అని వార్నర్ ఒకరినొకరు టీజ్ చేసుకున్నారు.నోరు జారాడుదాన్ని స్టేజీపై ఫన్ చేసే క్రమంలో రాజేంద్రప్రసాద్ అనుకోకుండా ఓ మాట తూలారు. అందుకు ఆయన కూడా బాధపడ్డారు. ఈ విషయం గురించి వార్నర్తో మాట్లాడా.. కాస్త నోరు జారాడు, ఏమీ అనుకోకు అని చెప్పాను. అందుకు వార్నర్.. క్రికెట్లో పెద్ద పెద్ద స్లెడ్జింగ్లు (కావాలని తిట్టుకోవడం) చూశాను. మా స్లెడ్జింగ్లు చూస్తే మీరు చెవులు మూసుకుంటారు. ఇది యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్.. ఇట్స్ ఓకే.. అని పాజిటివ్గా మాట్లాడారు. ఆయన చాలా మంచి మనిషి అని వెంకీ చెప్పుకొచ్చాడు. నితిన్ హీరోగా శ్రీలీల కథానాయికగా నటించిన రాబిన్హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ఇందులో వార్నర్ ముఖ్య పాత్ర పోషించాడు.చదవండి: 15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అదంతా టైం వేస్ట్ -
నితిన్ ‘రాబిన్ హుడ్’ HD మూవీ స్టిల్స్
-
క్రికెటర్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్
సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. తిరిగి క్షమాపణలు చెబుతుంటారు. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలానే క్రికెటర్ వార్నర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీంతో వార్నర్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్.. బహిరంగంగా సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: స్టేజీపైనే స్టార్ సింగర్ కి అవమానం.. గో బ్యాక్ నినాదాలు)ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్.. నితిన్ హీరోగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీతో నటుడిగా మారాడు. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... వార్నర్ ని దొంగ ముం* కొడుకు అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఈవెంట్ కి తాగొచ్చారా అని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. త్వరలో రిలీజ్ పెట్టుకుని ఇలాంటివి సరికాదని అర్థం చేసుకున్నారేమో రాజేంద్రప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పారు.తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదని, నితిన్- వార్నర్ తనకు పిల్లల్లాంటి వారని.. సరదాగా చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బందిపడుంటే క్షమించమని రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)డేవిడ్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్#DavidWarner #RajendraPrasad #Robinhood pic.twitter.com/TxOFoaVdt3— Milagro Movies (@MilagroMovies) March 25, 2025 -
ఇద్దరు లెజండరీ పర్సన్స్ క్రియేట్ చేసిన సాంగ్.. చూశారా
'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి నటించిన చిత్రం 'షష్టి పూర్తి'.. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నో పాటలకు మ్యూజిక్ అందించడమే కాకుండా రచయితగా కూడా కీరవాణి గుర్తింపు తెచ్చకున్నారు. అయితే, ఈ సినిమాతో తొలిసారి ఇళయరాజా సంగీతంలో ఆయన ఈ సాంగ్ను రచించడం విశేషం. ‘షష్టిపూర్తి’ సినిమాలో రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా.. రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించారు. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ‘లేడీస్ టైలర్’ తర్వాత ఈ చిత్రంలో వారిద్దరూ మరోసారి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తికలిగించేలా ఉంది. తాజాగా విడుదలైన సాంగ్ రూపేష్, ఆకాంక్షా సింగ్ మధ్యే ఉంటుంది. మంచి లవ్ ట్రాక్తో పాటు చక్కటి మెలోడీనిచ్చేలా పాట ఉంది. -
డేవిడ్ వార్నర్ ని బూతులు తిట్టినా రాజేంద్ర ప్రసాద్..
-
రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే డ్యాన్స్ చేస్తావా?: రెచ్చిపోయిన రాజేంద్రప్రసాద్
కథల ఎంపికలో తడబడి ట్రాక్ తప్పాను. కానీ ఈసారి కచ్చితంగా హిట్ కొడతాను అని గట్టి నమ్మకంతో ఉన్నాడు హీరో నితిన్ (Nithiin). భీష్మ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం రాబిన్హుడ్ (Robinhood Movie). శ్రీలీల కథానాయిక. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషించారు. కేతిక శర్మ ఐటం సాంగ్లో మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.ప్రీరిలీజ్ ఈవెంట్కు అతిథిగా వార్నర్ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్గా విచ్చేశాడు. అయితే వార్నర్ను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసినప్పుడు లేడీస్ టైలర్ నుంచి హీరోగా నటించిన రోజులు గుర్తుకొచ్చాయి. ప్రతి ఇంట్లో ఒక రాబిన్హుడ్ ఉండాలనే కథ ఇది. వార్నర్పై సెటైర్లుసినిమాలో అదిదా సర్ప్రైజు అనే పాట ఉన్నట్లే.. మా వెంకీ కుడుముల, నితిన్ ఇద్దరూ డేవిడ్ వార్నర్ను పట్టుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ వార్నర్ను.. క్రికెట్ ఆడవయ్యా అంటే డ్యాన్సులేశాడు అంటూ మూతి అష్టవంకర్లు తిప్పుతూ అతడిపై సెటైర్లు వేశాడు. చివర్లో వీడు మామూలోడు కాదు.. రేయ్ వార్నరూ.. నువ్వొక దొంగ.... అంటూ ఒక బూతుపదం కూడా వాడాడు.రాజేంద్రప్రసాద్పై అభిమానుల ఆగ్రహంఅది అర్థం కాని వార్నర్ నవ్వుతూ కనిపించాడు. ఇది చూసిన అభిమానులు రాజేంద్రప్రసాద్పై మండిపడుతున్నారు. వార్నర్ సినిమా పాటలకు స్టెప్పులేయడం చూసే కదా సినిమాలోకి తీసుకున్నారు.. అలాంటప్పుడు అతడి డ్యాన్స్ గురించి వంకరగా మాట్లాడటం దేనికని విమర్శిస్తున్నారు. వయసులో పెద్దవాడివైన నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదని నటుడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: 'పుష్ప' ఫస్ట్ ఛాయిస్ సమంత కాదు.. సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత -
రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ మూవీలో సుమన్ బాబు కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే శివరాత్రికే విడుదల కావాల్సిన ఈ చిత్రం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ వేసవి సీజన్లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. కుటుంబం అంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా' అని అన్నారు.దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. "ఈ సినిమాలో 45 నిముషాలు పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలెట్గా నిలుస్తాయి. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారు. రిలీజ్ ఆలస్యమైనా కంటెంట్ మాత్రం ఖతర్నాక్గా ఉందని అందరూ అంటున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఎన్వీవీ సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ నిర్మించారు. ఈ మూవీకి ప్రమోద్ పులిగిల్ల సంగీతమందించారు. -
ఏడాదిలో హీరోగా 12 సినిమాలు.. అది నా అదృష్టం: రాజేంద్రప్రసాద్
సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయ్యింది. చాలా వెరైటీ పాత్రలు చేశాను. రాబిన్హుడ్లోనూ నా పాత్ర డిఫరెంట్గా ఉండబోతుంది. ఆ సినిమా చూశాక.. నేను హీరోగా చేసిన ఎంటర్టైనింగ్ సినిమాలు, ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ సినిమా, క్యారెక్టర్ పట్ల చాలా హ్యాపీగా ఉంది’ అన్నారు నట కిరీటీ రాజేంద్రప్రసాద్. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్హుడ్’.వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించాడు. మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ రాబిన్హుడ్( Robinhood Movie) చేశాక యాక్టర్ గా నామీద నాకు కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగింది. క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ పరంగా సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా రాశాడు, తీశాడు. ఇందులో ఇండియాలోనే హయ్యస్ట్ సెక్యురిటీ ఏజెన్సీ నాది. నా ఏజెన్సీలో పని చేయడానికి హీరో వస్తాడు. ఇంతకంటే కథ చెప్పకూడదు(నవ్వుతూ) ఈ కాంబినేషన్ లో చాలా అద్భుతంగా ఉంటుంది.→ ఇందులో నా టైమింగ్ నితిన్(Nithiin) ఫాలో అవ్వాలి, నితిన్ టైమింగ్ నేను ఫాలో అవ్వాలి. క్యారెక్టర్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. మేము ఇద్దరం వెన్నెల కిశోర్ కి దొరక్కూడదు. సినిమా చూసినప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి ఎంటర్ టైనింగ్ సినిమా చేసి చాలా కాలమయింది. రాబిన్హుడ్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్.→ వెంకీ కుడుముల చాలా బిగ్ డైరెక్టర్ అవుతారు. ఈ మధ్య కాలంలో వన్ అఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ రాబిన్హుడ్ లో చేశాను. డైరెక్టర్ వెంకీ స్పెషల్ గా ఈ క్యారెక్టర్ ని నా గురించి రాసుకున్నారు. వర్క్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. వెంకీ, త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. ఆయన లక్షణాలు అన్నీ వచ్చాయి. డైలాగ్ లో మంచి పంచ్ ఉంటుంది. తను కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.→ నటుడిగా ఈ జీవితం దేవుడు, ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. లేడిస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, మిస్టర్ పెళ్ళాం,పెళ్లి పుస్తకం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా ప్రతి సినిమా దేనికదే భిన్నంగా వుంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఒకే ఏడాది హీరోగా 12 సినిమాలు రిలీజ్ చేసిన రోజులున్నాయి. దాదాపు ఆ సినిమాలన్నీ మనం రిలేట్ చేసుకునే పాత్రలే. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని అనుకుంటాను.→ నాటి ప్రధాని పీవీ నరసింహారావు గారు దగ్గర నుంచి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు జీవితంలో ఒత్తిడి, నిరాశలో ఉన్నప్పుడు సరదాగా నవ్వుకోవడానికి, మనసు తేలిక అవడానికి నా సినిమాలు చూస్తుంటామని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటికీ దర్శకులు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం నా అదృష్టం. రాబిన్హుడ్ సినిమా చూసినప్పుడు ఆ స్పెషాలిటీ మీరు ఫీలౌతారు. → శ్రీలీల(Sreeleela) చాలా మంచి సినిమాలు చేస్తోంది. చాలా మెచ్యూర్ యాక్టర్ గా కనిపించింది. ఇందులో ఆమె బిహేవియర్ నాకు చాలా నచ్చింది. ఇందులో ఫారిన్ నుంచి వచ్చిన తనకి సెక్యురిటీ ఇచ్చే బాధ్యత మాది. చాలా సరదాగా ఉంటుంది. → నాకు కొత్త పాత అని ఉండవు, నిజానికి కొత్త దర్శకులు నాతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అందరికంటే ముందు నేనే సెట్స్ లో తెగ అల్లరి చేస్తాను. దీంతో అందరూ చాలా కంఫర్ట్ బుల్ గా ఫీలౌతారు. నాతో వర్క్ చేయడం చాలా ఈజీ.→ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నాను. దాదాపు ఏడు సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. మొదలు పెట్టాల్సిన సినిమాలు ఓ ఐదు వరకు ఉంటాయి. -
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీలు.. మళ్లీ రిపీట్..
చిత్ర పరిశ్రమలో హిట్ జోడీకి ఉన్న క్రేజే వేరు. ఓ హీరో, హీరోయిన్ కాంబినేషన్లో సినిమా విజయం సాధిస్తే మళ్లీ ఆ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందా? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఉంటుంది. హిట్ జోడీ రిపీట్ అవుతోందంటే ట్రేడ్ వర్గాల్లో, బిజినెస్ సర్కిల్స్లో ఫుల్ క్రేజ్తో ΄ాటు అంచనాలు ఉంటాయి. అందుకే అలాంటి హిట్ జోడీని రిపీట్ చేసేందుకు దర్శక–నిర్మాతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇందుకు ఒక్కోసారి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. ప్రస్తుతం తెలుగులో రిపీట్ అవుతున్న జోడీలపై ఓ లుక్కేద్దాం...పద్దెనిమిదేళ్ల తర్వాత..హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జోడీగా నటించారు. 2006 సెప్టెంబరు 20న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి ‘విశ్వంభర’ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ మూవీ తీసిన మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించింది చిత్రయూనిట్. కానీ చిరంజీవి తనయుడు రామ్చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ కోసం ‘విశ్వంభర’ సినిమా విడుదలని వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వేసవిలో సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. షష్ఠిపూర్తి కోసం 38 ఏళ్ల తర్వాత... నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి అర్చనల జోడీ 38 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. వీరిద్దరూ ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రెండో సారి కలిసి నటించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన జోడీగా డైరెక్టర్ వంశీ తీసిన చిత్రం ‘లేడీస్ టైలర్’. 1986 నవంబరు 26న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించలేదు. తాజాగా పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ‘షష్ఠిపూర్తి’ కోసం వీరు 38 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంట. అయితే ఈ కథ మొత్తం రాజేంద్ర ప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ‘షష్ఠిపూర్తి’ అనే టైటిల్ పెట్టారట. రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే విషయంపై స్పష్టత లేదు. మధ్యతరగతి యువకుడి ప్రేమకథ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘బేబి’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 జూలై 14న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ఆనంద్, వైష్ణవి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రత్యేకించి యువతరం ఈ సినిమాకి ఫుల్ ఫిదా అయ్యారు. ‘బేబి’ తర్వాత వీరు మరోసారి జోడీగా నటిస్తున్నారు. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్తో మంచి విజయం అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో 32వ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో ‘మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు.. మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మాస్ జాతర రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. 2022 డిసెంబరు 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. అందులోనూ ప్రత్యేకించి రవితేజ–శ్రీలీల డ్యాన్సులు, భీమ్స్ సంగీతం ఈ సినిమాకి ప్లస్గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి హిట్ జోడీ రెండేళ్ల తర్వాత ‘మాస్ జాతర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతోన్న ‘మాస్ జాతర’పై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. అందులోనూ రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం కూడా ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘మాస్ జాతర’ సినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం మరో విశేషం. వేసవి కానుకగా మే 9న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. నాలుగోసారి...నటుడు శివాజీ, నటి లయది హిట్ జోడీ. ‘మిస్సమ్మ’ (2003), ‘అదిరిందయ్యా చంద్రం’ (2004), ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ (2006) వంటి సినిమాల్లో జంటగా నటించి, హిట్స్ అందుకున్నారు. తాజాగా వీరి జోడీ నాలుగోసారి రిపీట్ అవుతోంది. వివాహం తర్వాత సినిమాలకు కొన్నేళ్లు విరామం ఇచ్చిన లయ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రస్తుతం లయ, శివాజీ జోడీగా కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో సుధీర్ శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ జంట నటిస్తున్న నాలుగో చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. బ్యాక్ టు బ్యాక్హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ బ్యాక్ టు బ్యాక్ రిపీట్ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్’ సినిమాలో నితిన్, శ్రీలీల తొలిసారి జంటగా నటించారు. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. కానీ, నితిన్–శ్రీలీల జోడీ బాగుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘రాబిన్హుడ్’ సినిమాలో జంటగా నటించారు. ‘భీష్మ’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్హుడ్’. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ఇదని, నితిన్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రాబిన్హుడ్’లో తన పాత్ర, నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారంటూ శ్రీలీల కూడా స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా 2024 డిసెంబరు 25న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన తేదీకి విడుదలకాలేదు. మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అప్పుడు వినోదం.. ఇప్పుడు థ్రిల్లర్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన కెరీర్లో విజయవంతమైన చిత్రాల్లో ‘సామజవరగమన’ ఒకటి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ నటించారు. 2023 జూన్ 29న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హిట్గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘మృత్యుంజయ్’ మూవీ కోసం మరోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్.ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. ‘సామజవరగమన’తో వినోదం పంచిన శ్రీవిష్ణు, రెబా జాన్ ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో చూడాలి. మరికొన్ని జోడీలు‘సీతా రామం’ సినిమాతో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రెండోసారి నటించనున్నారట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమాలో సాయిపల్లవి లేదా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ– ప్రగ్యాజైస్వాల్ జోడీ కూడా రిపీట్ కానుందని సమాచారం. ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాల తర్వాత ‘అఖండ 2’లో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. అయితే ‘అఖండ 2’లో హీరోయిన్గా సంయుక్తని ప్రకటించారు మేకర్స్. మరి ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్గా కనిపిస్తారా? లేదంటే ముఖ్యమైన పాత్ర చేయనున్నారా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. మరికొన్ని జోడీలు కూడా రిపీట్ కానున్నాయని సమాచారం. – డేరంగుల జగన్ మోహన్ చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
షష్టిపూర్తి సినిమాని కుటుంబమంతా చూడాలి– రాజేంద్ర ప్రసాద్
‘‘మంచి కథతో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. మన ఇంట్లో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ చిత్రం చెబుతుంది. అందుకే అందరూ కుటుంబంతో సహా థియేటర్కి వెళ్లి ఈ సినిమా చూడాలి’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ కోరారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. బుధవారం జరిగిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ తర్వాత నేను చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనుకోవాలి. ‘షష్టిపూర్తి’ లాంటి అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్. ‘లేడీస్ టైలర్’ తర్వాత అర్చన, నేను మళ్లీ నటించిన ‘షష్టిపూర్తి’లో మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి’’ అని చెప్పారు. అర్చన మాట్లాడుతూ–‘‘చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ‘షష్టిపూర్తి’ ద్వారా నాకు ఇంత గొప్ప స్వాగతం పలికిన అందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘నా మొదటి సినిమా ఇది. అందరూ ఆదరించాలి’’ అన్నారు రూపేష్. పవన్ ప్రభ మాట్లాడుతూ–‘‘నాకు ఇంతమంచి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రూపేష్గారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలి’’ అని ఆకాంక్షా సింగ్ అన్నారు. -
పుష్ప-2 హీరోపై కామెంట్స్.. స్పందించిన రాజేంద్ర ప్రసాద్
పుష్ప-2 సినిమాపై టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. హరికథ వెబ్ సిరీస్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఎర్రచందనం దొంగ కూడా హీరో అయిపోయాడు.. ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయని అన్నారు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.ఆ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..'త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశాం. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వాడెవడో చందనం దొంగ హీరో.. సరే, ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయి.' అని అన్నారు.అయితే తాజాగా తన కామెంట్స్పై రాజేంద్రప్రసాద్ స్పందించారు. పుష్ప -2 చిత్రంలో హీరో పాత్రపై ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తాజాగా షష్టిపూర్తి అనే మూవీ ప్రెస్ మీట్కు హాజరైన ఆయన తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల అల్లు అర్జున్ను కలిసినప్పుడు ఇదే విషయంపై మాట్లాడుకున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చూసి ఇద్దరం నవ్వుకున్నామని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగెటివ్గా చూడకూడదు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై చూపిస్తామని ఆయన అన్నారు.హీరో అనే పదానికి అర్థాలు మారిపోయాయి. సద్గుణాలు, విలువలు కలిగినవారే ఒకప్పుడు హీరోలు. కానీ ఇప్పుడు జులాయిగా, చెడు అలవాట్లు ఉండి.. అడ్డదారులు తొక్కేవారిని కూడా హీరో పాత్రలుగా చిత్రీకరిస్తున్నారు. జనాలు కూడా ఈ నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోలనే ఇష్టపడుతున్నారు. అయితే పుష్ప -2 సినిమాను కూడా ఈ జాబితాలోనే వేసేశాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్.కాగా.. రాజేంద్రప్రసాద్, నటి అర్చన చాలా ఏళ్ల తర్వాత కలిసిన నటిస్తోన్న తాజా చిత్రం షష్టిపూర్తి. ఈ చిత్రానికి పవన్ ప్రభాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రుపేశ్ చౌదరిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈసినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన రాజేంద్ర ప్రసాద్ పుష్ప-2 సినిమాపై చేసిన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు.పుష్ప వసూళ్ల సునామీ.. కాగా.. అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.పుష్ప రీ లోడెడ్..తాజాగా పుష్ప-2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతోన్న పుష్ప-2 మూవీకి అదనంగా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేయనున్నారు. ఈ అప్డేట్ వర్షన్ సంక్రాంతి కానుకగా ఈనెల 11 నుంచి బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 రీ లోడెడ్ పేరుతో మరిన్నీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్ట్రా ఫైరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పొంగల్కు మరోసారి పుష్ప-2 లేటేస్ట్ వర్షన్ చూసి ఎంజాయ్ చేయండి. -
అహ! నా పెళ్ళంట!
అహ! నా పెళ్ళంట! హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శ కత్వంలో సురేష్ ప్రోడక్షన్స్ 1987లో నిర్మించిందీ చిత్రాన్ని. పిసినారితనాన్ని ఆధారంగా చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ సినిమాల విషయంలో టాలీవుడ్లో ఓ చరిత్ర సృష్టించింది. మొదట్నుంచి చివరి వరకూ హాస్యాన్ని పండించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రాజేంద్రప్రసాద్ ఇందులో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఆయన సినీ కెరీర్లో ‘అహ! నా పెళ్ళంట!’ ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్కు వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదంటే అతిశయోక్తి కాదేమే. కోట శ్రీనివాసరావు పిసినారిగా కీలకమైన పాత్ర పోషించారు. హీరోయిన్ గా రజని, ఇంకా నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి వంటి సీనియర్ నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.పిసినారులకే పిసినారిసినిమాలో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హీరో రాజేంద్రప్రసాద్. తాను ప్రేమించిన అమ్మాయి కోసం పరమ పిసినారిగా నటించాల్సి వస్తుంది. హీరోయిన్ రజని తండ్రి కోట శ్రీనివాస రావు పిసినారులకే పిసినారి. అటువంటి వ్యక్తిని మెప్పించి అతని కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు పిసినారిగా మారిన రాజేంద్రప్రసాద్ పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. అందులో భాగంగా హీరో తాను ఇంకా వెయ్యి రెట్లు పిసినారినని నిరూపించుకోడానికి నానా తంటాలు పడుతుంటాడు.అలా కొంత కాలానికి హీరో ఆ పిసినారి మామకు బాగా దగ్గరవుతాడు. ఇదే సమయంలో.. తన కొడుకు పిసినారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హీరో తండ్రి నూతన్ ప్రసాద్ కూడా ఆ ఊరొచ్చి ఆ ఇంట్లోనే దిగి తన కొడుకు ప్లాన్లను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతో ఆరంభం నుంచి ముగింపు వరకూ పగలబడి నవ్విస్తాడు డైరక్టర్. చివరికి పిసినారి భార్య, కూతురు కలసి తిరగబడి కోటకు బుద్ధి చెప్పి ఈ పెళ్ళికి ఒప్పిస్తారు.కళ్ళజోడుని రాయితో కొట్టి మరీ...‘అహ! నా పెళ్ళంట!’ సినిమా కథను ప్రముఖ కథా రచయిత ఆది విష్ణు రాసిన ‘సత్యం గారి ఇల్లు’ నవల ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇక కాస్టింగ్ విషయానికొస్తే... కథలో కీలకమైన పాత్ర పిసినారి, హీరోయిన్ తండ్రి లక్ష్మీపతిది. ఈ పాత్రను తొలుత రావు గోపాలరావు పోషిస్తే బావుంటుందని భావించారు. కానీ పాత్ర స్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరి కాదని ఎవరో సూచిస్తే ఆయన్ను కాదనుకుని కోట శ్రీనివాసరావును అనుకున్నారు. అప్పటికి కేవలం రెండంటే రెండే సినిమాల్లో నటించిన కోటను ఈ పాత్రకు తీసుకున్నారు. అందుకు తగ్గట్టే కోట అద్భుతమైన నటనతో కట్టిపడేశారు.రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావులు పోటీపడి నటించారు. లక్ష్మీపతి పాత్ర కోసం కోట తన జుట్టు చాలా వరకూ తీసేయించుకుని చిన్న తలకట్టుతో క్రాఫ్ చేయించుకోవాలి. అప్పటికే మరికొన్ని సినిమాల్లో నటిస్తుండడంతో ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర సినిమాల దర్శక–నిర్మాతలను ఒప్పించి మరీ ‘అహ! నా పెళ్ళంట!’లో ఆ పాత్ర చేశారు. ముతక పంచె, చిరిగిన బనీను, పగిలిన కళ్ళద్దాలతో కనిపించే ఈ రోల్ ఆహార్యాన్ని జంధ్యాలే స్వయంగా తీర్చిదిద్దారు. పంచె, బట్టలు మాసిపోయి ఉండాలని, పనిగట్టుకుని దుమ్ములో దొర్లించి మరీ ఇచ్చేవారట. కళ్ళజోడు మామూలుదే తెప్పించి తర్వాత జంధ్యాల రాయిపెట్టి పగలగొట్టి మరీ పగిలిన కళ్ళద్దాలతో నటింపజేశారు.అరగుండు బ్రహ్మానందంగా...బ్రహ్మానందంకు ఈ సినిమాతో అరగుండు బ్రహ్మానందంగా బాగా పేరు వచ్చింది. తన జీతాన్ని కోసేసినప్పుడల్లా ఆయన కోట శ్రీనివాస రావును తిట్టే తిట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాను హైదరాబాద్, దేవర, యామి జాల గ్రామాల్లో తీశారు. ఈ గ్రామాల్లో ఉన్న కొన్ని ఇళ్ళలో వేరే సెట్లు వెయ్యకుండానే తియ్యడం ఈ సినిమా మరో ప్రత్యేకత. దాదాపు రూ. 16 లక్షలతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 5 కోట్లు వసూలు సాధించడం విశేషం. సినిమా కథలో ‘పిసినారితనం’ కీలకం... కానీ కలెక్షన్ల విషయంలో ప్రేక్షకులు చాలా ధారాళం చూపించారు. ఈ స్థాయి పిసినారితనం ఉన్న సినిమాలు ‘అహ! నా పెళ్ళంట!’ తర్వాత ఇప్పటివరకూ రాలేదనే చెప్పాలి. భవిష్యత్తులో వస్తాయా? అంటే ప్రశ్నార్థకమే. – దాచేపల్లి సురేష్కుమార్ -
రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా బిజినెస్ షో వేశారు. ఈ సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని అన్నారు.అయితే ఈ మూవీని వచ్చే శివరాత్రికి థియేట్రికల్ రిలీజ్కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో డివోషనల్ టచ్ ఉండడంతో ఇప్పుడు రిలీజ్ చేయడం మంచిది కాదని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా అంటే ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ..'సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు.. కానీ కంటెంట్ మాత్రం కంటెంట్ అద్భుతంగా ఉందని చూసినవారు చెప్పారు' అని అన్నారు. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ప్రమోద్ పులిగార్ల సంగీతమందిస్తున్నారు. -
వాడెవడో చందనం దొంగ హీరో.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
హీరో అనే పదానికి అర్థాలు మారిపోయాయి. సద్గుణాలు, విలువలు కలిగినవారే ఒకప్పుడు హీరోలు. కానీ ఇప్పుడు జులాయిగా, చెడు అలవాట్లు ఉండి, అడ్డదారులు తొక్కేవారిని కూడా హీరో పాత్రలుగా చిత్రీకరిస్తున్నారు. జనాలు కూడా ఈ నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోలనే ఇష్టపడుతున్నారు. అయితే పుష్ప 2 సినిమాను కూడా ఈ జాబితాలోనే వేసేశాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్.చందనం దొంగ హీరోహరికథ వెబ్ సిరీస్ ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశాం. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వాడెవడో చందనం దొంగ హీరో.. సరే, ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయి. నేను 48 ఏళ్లుగా హీరోనా అదృష్టం ఏంటంటే.. 48 సంవత్సరాలుగా నేనొక డిఫరెంట్ హీరోగా వస్తున్నాను. సమాజంలో మన చుట్టూ ఉన్నవాళ్లు పాత్రలనే ఆధారంగా తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్నాను అని చెప్పుకుంటూ పోయాడు. అయితే చందనం దొంగ అనగానే అందరికీ పుష్ప సినిమా గుర్తుకురావడం ఖాయం. రాజేంద్రప్రసాద్ హీరో పోషించిన పాత్ర గురించి అన్నప్పటికీ దీనిపై అల్లు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇకపోతే హరికథ వెబ్ సిరీస్ డిసెంబర్ 13న హాట్స్టార్లో అందుబాటులోకి రానుంది.చదవండి: యానిమల్ రిజెక్ట్ చేసినందుకు బాధగా లేదు: పరిణితి చోప్రా -
'హరి కథ: సంభవామి యుగే యుగే' ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్గా 'హరి కథ'.. స్ట్రీమింగ్కు రెడీ
టాలీవుడ్లో ఇప్పటి వరకు చాలా సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి మొదటిసారి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా రెండో ట్రైలర్ను విడుదల చేశారు.మిస్టరీ థ్రిల్లర్ జానర్గా 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ను దర్శకుడు మగ్గీ తెరకెక్కించారు. 3 రోజెస్ వెబ్ సిరీస్తో ఆయన గుర్తింపు పొందారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ వంటి వారితో పాటు బిగ్బాస్తో గుర్తింపు పొందిన దివి, అంబటి అర్జున్ తదితరులు నటిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి 'హరికథ' వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. -
నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్
రాజేంద్రప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేముంది. అప్పట్లో హీరోగా చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సహాయ పాత్రలు చేస్తూ నటికిరిటీ అనిపించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాల్ని బయటపెట్టారు. తండ్రి మాటల వల్ల ఓ దశలో చనిపోదామనుకున్న సందర్భంగా గురించి చెప్పారు.'మా నాన్న స్కూల్ టీచర్. చాలా కఠినంగా ఉండేవారు. ఇంజినీరింగ్ చేసిన తర్వాత నేను సినిమాల్లోకి వెళ్తానని ఆయనతో చెప్పా. నీ ఇష్టానికి వెళ్తున్నావ్, అక్కడ సక్సెస్ రావొచ్చు, ఫెయిల్యూర్ రావొచ్చు. అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిలైతే మాత్రం ఇంటికి రావొద్దని అన్నారు. ఆయన మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. దీంతో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరా, గోల్డ్ మెడల్ కూడా సాధించా. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో ఇంటికెళ్లా.. ఎందుకొచ్చావ్? రావొద్దనన్నానుగా అని నాన్న కోప్పడ్డారు'(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)'నాన్న తిట్టేసరికి చాలా బాధ అనిపించింది. దీంతో చచ్చిపోదానుకున్నా. చివరిసారిగా నా ఆత్మీయులందరిని చూడాలనిపించింది. వాళ్లని కలిసి మాట్లాడాను. చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఇంటికి వెళ్లాను. అక్కడ 'మేలుకొలుపు' సినిమా విషయంలో ఏదో గొడవ జరుగుతుంది. అంతలో ఆయన రూమ్ నుంచి బయటకొచ్చి నన్ను చూసి.. సరాసరి డబ్బింగ్ రూంకి తీసుకెళ్లిపోయారు. ఓ సీన్కి నాతో డబ్బింగ్ చెప్పించారు. అది నచ్చడంతో.. సమయానికి భలే దొరికావ్ అని అన్నారు''మరో సీన్కి డబ్బింగ్ చెప్పమని అడగ్గానే.. తిని మూడు నెలలైంది. భోజనం పెడితే డబ్బింగ్ చెబుతానన్నా. ఛాన్సులు రాకపోయేసరికి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా విషయాన్ని ఆయనకు చెప్పా. దీంతో చాలా కోప్పడ్డారు. ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారు. అలా మొదలైన నా డబ్బింగ్ ప్రయాణం.. తర్వాత చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. మద్రాసులో ఇల్లు కట్టాను. అక్కడే దర్శకుడు వంశీ పరిచయమయ్యాడు. అతడి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాను' అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఓటీటీలో తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
ఓటీటీలు రావడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ కథలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. అలా సినిమాలుగా తీయలేని కథల్ని కొన్నిసార్లు వెబ్ సిరీసులుగా తీయడం చూస్తూనే ఉన్నాయి. అలా రాజేంద్ర ప్రసాద్, దివి, శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సిరీస్ పేరే 'హరికథ'. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)మర్డర్ మిస్టరీకి మైథలాజికల్ టచ్ ఇచ్చి తీసిన ఈ సిరీస్ డిసెంబరు 13 నుంచి హాట్స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అధర్మం హద్దు మీరినప్పుడు, అన్యాయాన్ని ఎదురించాల్సిన వారు చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు.. ఆ ధర్మాన్ని కాపాడడానికి దేవుడే వస్తాడు అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అదే టైంలో రక్తపాతంతో భయంకరంగా అనిపించింది.పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి... ఇలా శ్రీవిష్ణు దశావాతారాల్లోని కొన్ని రూపాల్లో ఉన్న వ్యక్తి.. వరస హత్యలు చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్నది దేవుడా? మరెవరైనా అని పరిశోధించే పోలీస్ ఆఫీసర్గా శ్రీ రామ్ నటించారు. రంగస్థల నాటక కళాకారునిగా రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!) -
ఓటీటీలో 'తండ్రీకూతురు' సినిమా స్ట్రీమింగ్
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం 'లగ్గం'. తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్ల తంతును చూపిస్తూ.. రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని వేణుగోపాల్ రెడ్డి నిర్మాతగా తక్కువ బడ్జెట్లో ఉన్నతంగా నిర్మించారు. అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.'లగ్గం' సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్తో పాటు రోహిణి, చమ్మక్ చంద్ర వంటి వారు నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల సమయంలో భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మూవీ మెప్పించలేదు.కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్)ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ప్రతి ఆడపిల్ల కథ ఇంతేనేమో..'ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో.. ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా..' అనే పాటను చరణ్ అర్జున్ చాలా అద్భుతంగా రచిస్తే.. సింగర్ చిత్ర అందరి గుండెల్ని పిండేసేలా ఆలపించారు. లగ్గం చిత్రంలోని ఈ పాటకు యూట్యూబ్లో కూడా మంచి వ్యూస్ వచ్చాయి. -
తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్డ్రాప్లో మిస్టరీ థ్రిల్లర్గా ఈ సిరీస్న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్బాస్ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సరికొత్త వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఫ్లాట్ఫామ్లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
రాజ్ పాకాల ఇంట్లో పార్టీపై పోలీసుల దాడి
శంకర్పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఇంట్లో నిర్వహించిన పార్టీ పై ఎక్సైజ్, ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. అను మతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించారని, డ్యూ టీ ఫ్రీ విదేశీ మద్యం వినియోగించారని గుర్తించా రు. పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు కొకైన్ వినియో గించి ఉన్నట్టుగా తేల్చారు. ఈ మేరకు రాజ్ పాకాల, మద్దూరి విజయ్పై మోకిలాా పోలీసులు, రాజ్ పాకాలపై శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మోకిలా ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం.. ‘‘రాజ్ పా కాల నానక్రామ్గూడలో ఈటీజీ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. అందులో సీఈఓగా పనిచేస్తున్న జూబ్లీహిల్స్ వాసి మద్దూరి విజయ్కు ఫ్యూజన్ యాక్స్ పేరుతో మరో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. రాజ్ పాకాల హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో ఉన్న షీర్మాథే ప్రాపర్టీస్లో కొన్నాళ్ల క్రితం ఓ ఇంటిని నిర్మించారు. అందులో తరచుగా వీకెండ్ పార్టీలు ఇస్తూ.. స్నేహితులు, తమ సంస్థల్లోని ఉద్యోగులతో కలిసి పేకాట ఆడుతున్నారు. ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా ఉన్న విజయ్ను శనివారం రాత్రి తన ఇంట్లో నిర్వహిస్తున్న దీపావళి పార్టీకి రావాలంటూ రాజ్ పాకాల ఆహ్వానించారు. ఈ పార్టీలో వీరిద్దరితో సహా 38 మంది పాల్గొన్నారు.’’ అని పోలీసులు పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారంతో దాడి.. ‘‘రాజ్ పాకాల ఇంట్లో పార్టీపై మోకిలా పోలీసులకు శనివారం రాత్రి సమాచారం అందింది. ఠాణాలోని జనరల్ డైరీలో ఎంట్రీ నమోదు చేసిన అధికారులు.. నార్సింగి ఏసీపీ నుంచి సెర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకున్నారు. ఆపై ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్), ఎక్సైజ్ పోలీసులతో కలసి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాజ్ పాకాల ఇంటిపై దాడి చేశారు. ఎలాంటి ఈవెంట్ పరి్మషన్ లేకుండా పార్టీలో స్థానిక లిక్కర్ను, డ్యూటీ ఫ్రీ విదేశీ మద్యాన్ని వినియోగిస్తున్నట్టు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన పురుషులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా మద్దూరి విజయ్ కొకైన్ తీసుకున్నట్టు తేలింది.మహిళా పోలీసుల సాయంతో ఆ ఇంట్లో ఉన్న మహిళలకు డ్రగ్స్ పరీక్షలు చేయడానికి పోలీసులు ప్రయతి్నంచగా.. వారి నుంచి విముఖత ఎదురైంది. ఇక ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు విదేశీ మద్యం, పేకాటకు సంబంధించిన వస్తువులు, పేక ముక్కలను స్వా«దీనం చేసుకున్నారు. 16 మంది మహిళలు సహా 38 మందిని అదుపులోకి తీసుకున్నారు.’’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పేకాట నిర్వహణ, ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంపై మోకిలా పోలీసులు కేసు నమోదు చేసి, అందులో రాజ్ పాకాల, విజయ్లను నిందితులుగా చేర్చారు. ఇక అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహణ, విదేశీ మద్యం వినియోగంపై శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు రాజ్ పాకాలపై కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల, ఆయన సోదరుడి నివాసాల్లో సోదాలుగచ్చిబౌలి, బంజారాహిల్స్ (హైదరాబాద్): జన్వాడలోని రాజ్ పాకాల ఇంట్లో పారీ్టపై శనివారం రాత్రి దాడి చేసిన పోలీసులు.. ఆదివారం రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో ఉన్న రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర నివాసాల్లో సోదాలు చేపట్టారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, తమ సిబ్బందితో, భారీ పోలీసు బందోబస్తుతో ఈ తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శైలేంద్ర నివాసంలో సోదాలు చేశారు. షో కేస్లు తాళాలు వేసి ఉండటం, తాళంచెవులు లేకపోవడంతో వాటిని పగలగొట్టి తనిఖీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి రాజ్ పాకాల విల్లాలో సోదాలు చేశారు. రాత్రి 9 గంటల నుంచి రాజ్ పాకాల బంధువులకు మరో విల్లాలో తనిఖీలు చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల నిరసన సోదాల విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఒరియన్ విల్లాస్ వద్దకు చేరుకున్నారు. అధికారులను అడ్డుకునేందుకు ప్రయతి్నంచారు. ఫామ్హౌస్లో పార్టీ చేసుకుంటే ఇళ్లలో సోదాలు చేయడం ఏమిటని నిలదీశారు. అయితే అక్కడే ఉన్న రాయదుర్గం పోలీ సులు కల్పించుకుని సోదాలకు సహకరించాలని కోరారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీనితో పోలీసులు ఎమ్మెల్యేలు వివేకానంద, మాగంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్కుమార్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్రెడ్డి, వెంకటరమణారెడ్డి, నేతలు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మన్నె క్రిశాంక్, జయసింహ తదితరులను అదుపులోకి తీసుకుని, పోలీస్స్టేషన్లకు తరలించారు. కేటీఆర్ నివాసం వద్ద హడావుడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్లోనూ సోదాలు జరపబోతున్నారన్న ప్రచారం జరగడంతో ఆదివారం.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బంజారాహిల్స్ లోని కేటీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వారి ని కేటీఆర్ ఇంట్లోకి అనుమతించలేదు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. ముమ్మరంగా దర్యాప్తు.. రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్గా తేలిన మద్దూరి విజయ్ను విచారిస్తున్నారు. ఆ డ్రగ్ను తనకు రాజ్ పాకాల ఇచ్చారని విజయ్ చెప్పారని.. ఈ క్రమంలో రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచి్చంది? ఎవరు విక్రయించారు? ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. విజయ్ను పార్టీ జరిగిన ప్రాంతంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాజ్ పాకాలను ఆదివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్.. మధ్యాహ్నం 2 గంటలకు మోకిలాా పోలీస్స్టేషన్కు విచారణ కోసం రావాలని ఆదేశించారు. కానీ రాజ్ పాకాల ఈ విచారణలకు హాజరుకాలేదు. ఆయన మొబైల్ స్విచాఫ్ వస్తోందని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఈ 'పెళ్లి పుస్తకం' మనోరంజకం
సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవన ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని, కుటుంబ విలువల్ని చాటి చెప్పే మనోరంజకమైన సకుటుంబ కథాచిత్రం 'పెళ్లి పుస్తకం'. రాజేంద్రప్రసాద్ హీరోగా దివ్యవాణి హీరోయిన్గా ప్రముఖ దర్శకులు బాపు తీర్చిదిద్దిన ఓ కుటుంబ కావ్యం. బాపు గీత గీసి, ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి, శ్రీకారం చుట్టిన 'పెళ్లి పుస్తకం' 1991 ఏప్రిల్ 1న విడుదలై చరిత్ర సృష్టించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న కృష్ణమూర్తి అంటే రాజేంద్రప్రసాద్ ముంబైలోని ఓ సంస్థలో కళా దర్శకుడుగా పని చేస్తుంటాడు. ఇతని భార్య సత్యభామ అంటే దివ్యవాణి కేరళలో స్టెనోగ్రాఫర్గా పని చేస్తుంటుంది. అయితే... తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీరిద్దరూ కలిసి ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంటారు. అలా ఓ పెద్ద సంస్థలో చేరడం కోసం తాము అవివాహితులమని ఆ సంస్థ యజమాని గుమ్మడికి అబద్ధం చెబుతారు. అక్కడ చేరిన తర్వాత వీరు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రంలోని ప్రధానాంశం.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) కడుపుబ్బా నవ్వించిన రచనకంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నేనూ... అంటూ మాటమాటని కట్ చేసి వెరైటీ స్లాంగ్తో మాట్లాడుతుంటే... గుమ్మడి సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బాబాయిగా పిలిపించుకుంటూ... ఈ సినిమాకు కథను అందించిన రావి కొండలరావు బధిర వార్తలు చదువుతున్నట్లు సైగలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. ఇక గిరి పాత్రలో నటించిన శుభలేఖ సుధాకర్ విషయానికొస్తే... గుమ్మడి బావమరిదిగా.. దివ్యవాణిపై మనసు పడి ఆ తర్వాత అక్కతో తన్నులు తినే సన్నివేశాలు లోలోన నవ్వు పుట్టిస్తాయి.చప్పట్లు కొట్టించిన మాటలుసెకండ్ హీరోయిన్గా వచ్చిన గుమ్మడి కుమార్తె వసుంధర పాత్రలో నటించిన సింధుజా కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడి అతని భార్య దివ్యవాణి అసూయకు కారణమవుతుంది. కానీ సింధుజాది అంతా నటన అని చివరకు తెలుసుకుంటుంది. అలాగే చిత్రంలోని బ్రహ్మచారి గదులకు భామలే అందం, పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు... ఏడుపుచ్చినప్పుడు నవ్వేవాడే హీరో, అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్, నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తుంది... లాంటి డైలాగులు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)ఏ పెళ్లిలోనైనా ఆ పాటేపాటలైతే చెప్పనక్కరలేదు.. ఆరుద్ర చేతి నుంచి జాలు వారిన 'శ్రీరస్తూ శుభమస్తూ' పాట... అప్పటి వరకు తెలుగు లోగిళ్లలో ఎక్కడ పెళ్లి బాజా మోగినా వినిపించే 'సీతారాముల కళ్యాణం చూతమురా రండి' అంటూ సాగే పాటనే పక్కకు నెట్టేసింది. ఇప్పటికీ తెలుగువారి పెళ్లిళ్లలో ఈ పాటే వినిపిస్తుండడం విశేషం. మామ కేవీ మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టిన ‘అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనస్సులాయో...’, ‘కృష్ణం కలయ సఖి సుందరం...’, ‘పప్పు దప్పళం అన్నం నెయ్యి...’, ‘హాయి హాయి శ్రీరంగ సాయి...’, ‘సరికొత్త చీర ఊహించినాను...’ వంటి పాటలు ప్రేక్షక మహాశయులనే కాదు... సంగీత ప్రియులను కూడా ఓలలాడించాయి. పెళ్లికి అర్థాన్నీ, పరమార్థాన్నీ సున్నితంగా, హృద్యంగా అందంగా, రొమాంటిక్గా, అన్నింటినీ మించి హాస్యరసభరితంగా చెప్పిన చిత్రం ఈ ‘పెళ్లి పుస్తకం’.– ఇంటూరు హరికృష్ణ -
రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం మా నాన్నతో యాక్ట్ చేసినట్టే ఉంది...
-
రెండు కుటుంబాలు కాదు రెండు మనస్సులు కలిస్తేనే లగ్గం..
-
‘జనక అయితే గనక’మూవీ రివ్యూ
టైటిల్: జనక అయితే గనకనటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెక కిశోర్, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత్ రెడ్డిదర్శకత్వం: సందీప్రెడ్డి బండ్లసంగీతం: విజయ్ బుల్గానిక్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: అక్టోబర్ 12, 2024ఈ మధ్యే ‘గొర్రె పురాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్.. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే సినిమాతో మరోసారి థియేటర్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(అక్టోబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) కి పిల్లలు కనడం అస్సలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో పిల్లలను పోషించాలంటే లక్షల్లో డబ్బులు అవసరమని, అంత డబ్బు తన వద్ద లేదని పిల్లలే వద్దనుకుంటాడు. భార్య(సంగీత విపిన్) కూడా అతని మనసును అర్థం చేసుకుంటుంది. కుటుంబ నియంత్ర కోసం కండోమ్ వాడుతారు. అయినప్పటికీ ప్రసాద్ భార్య గర్భం దాల్చుతుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తాడు ప్రసాద్. తాను వాడిన కండోమ్ సరిగా పనిచేయలేకపోవడంతో తన భార్య గర్భం దాల్చిందని, నష్టపరిహారంగా రూపాయలు కోటి ఇవ్వాలని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఈ కేసు ప్రసాద్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అసలు ప్రసాద్ భార్య గర్భం ఎలా దాల్చింది? చివరకు ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పని సరి. ఏదైనా ఒక వస్తువు కొని ఆ వస్తువు నకిలీ లేదా నాసిరకం అయితే అమ్మిన వ్యాపారిపై లేదా ఉత్పత్తిదారులపై కేసు వేయొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వినియోగదారుల చట్టం పై జనాలకు అవగాహన లేదు. ఈ పాయింట్ తో తెరకెక్కిన చిత్రమే జనగా అయితే గనక. ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తున్న ఓ సీరియస్ ఇష్యూ ని కామెడీ వేలో చూపిస్తూ చివరకు ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కండోమ్ మీద కేసు పెట్టడమనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కానీ అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు.వినోదాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలను జోడించాడు. ముఖ్యంగా కీలకమైన కోర్టు సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి . వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కోర్టు డ్రామా మొదలవగానే సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.ఇంటర్వెల్ ముందు వరకు అసలు కథను ప్రారంభించకుండా కథనాన్ని నడిపించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించేందుకు ప్రసాద్ పాత్ర చుట్టు అల్లిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. ఈ రోజుల్లో పిల్లలను కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రాక్టికల్గా చూపించే సీన్ నవ్వులు పూయించడంతో పాటు ఆలోచింపచేస్తుంది. ఫస్టాఫ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించి, సెకండ్ హాఫ్ లో వారి ఎమోషన్స్ తో కొందరు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల చూపించారు. వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దందా, నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న మోసాన్ని వినోదాత్మకంగా చూపించారు. అయితే ముందుగా చెప్పినట్లుగా కోర్డు డ్రామాలో బలం లేదు. కొన్ని చోట్ల ప్రసాద్ పాత్ర చేసే ఆర్గ్యుమెంట్స్కి అర్థం ఉండదు. ఇక చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్ అయితే అదిరిపోతుంది.ఎవరెలా చేశారంటే..సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు . మిడిల్ క్లాస్ యువకుడు ప్రకాష్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కోటి సీన్లలో అతను చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. హీరోయిన్ పాత్రనిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా కథంతా చుట్టే తిరుగుతుంది. లాయర్ కిషోర్ గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. జడ్జి ధర్మారావుగా రాజేంద్రప్రసాద్ కొన్నిచోట్ల నవ్విస్తాడు. లాయర్ గా మురళి శర్మ, హీరో తండ్రిగా గోపరాజు, బామ్మ పాత్రను పోషించిన నటితోపాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మీద చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పరవాలేదు. సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే ఒక పాట మినహా మిగిలినవేవి గుర్తుండవు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ధైర్యంగా ఉండు బాబాయ్.. రాజేంద్ర ప్రసాద్ను ఓదార్చిన ప్రభాస్
-
రాజేంద్రప్రసాద్ను పరామర్శించిన రెబల్ స్టార్.. గాయత్రికి నివాళి
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్పల్లిలోని ఇందు విల్లాస్లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో రాజేంద్రప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురిపై ప్రేమతో తానే స్వయంగా రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించి ఇచ్చారాయన. -
ముగిసిన నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి అంత్యక్రియలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. శనివారం అర్ధరాత్రి ఆమె మరణించారు. అయితే, కొంత సమయం క్రితం హైదరాబాద్లో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గాయత్రికి మొదట ఛాతీ వద్ద నొప్పి రావడంతో వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆమె మరణించారు.కేపీహెచ్బీ ఏడో ఫేజ్ వద్ద ఇందూ విల్లాస్లో ఉంటున్న రాజేంద్రప్రసాద్ నివాసంలో గాయత్రి భౌతికకాయాన్ని ఉంచారు. ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలిపిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం గాయత్రి అంత్యక్రియలు జరిగాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్ కైలాస వాసంలో కుటుంబ సభ్యుల మధ్య గాయత్రి అంత్యక్రియలు ముగిశాయి. అక్కడ కూతురు భౌతికకాయాన్ని చూసి రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. -
రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత.. సెలబ్రిటీల సంతాపం (ఫోటోలు)
-
రాజేంద్ర ప్రసాద్ కూతురు కన్నుమూత
-
రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి గుండె వద్ద నొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. అర్దరాత్రి సుమారు 1గంటకు ఆమె మరణించారు. గుండెపోటు వల్లే గాయత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కూతురిలో అమ్మను చూసుకున్న: రాజేంద్రప్రసాద్ రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురు గాయత్రి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన తన కూతురు గురించి చెబుతూ ఇలా ఎమోషనల్ అయ్యారు. అమ్మ లేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడని ఒక సినిమా వేదిక మీద పంచుకున్నారు. 'నా పదేళ్ల వయసులో మా అమ్మ గారు చనిపోయారు. ఆ బాధ ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయితే, నాకు కూతురు (గాయత్రి ) పుట్టిన తర్వాత మా అమ్మను తనలోనే చూసుకుంటున్నా. కానీ, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో తనతో మాటలు లేవు. అయినప్పటికీ.. బేవార్స్ అనే సినిమాలోని 'తల్లీ.. తల్లీ.. నా చిట్టి తల్లి' అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను. ఈ పాటను ఆమెకు నాలుగుసార్లు వినిపించాను.' అని ఆయన అన్నారు. ఆమె ప్రేమ వివాహం చేసుకున్న కొద్దిరోజుల తర్వాత తన కూతురిని రాజేంద్రప్రసాద్ స్వాగతించిన విషయం తెలిసిందే. -
నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ బర్త్డే స్పెషల్.. రేర్ ఫొటోలు
-
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు' అన్నారు పెద్దలు. 'ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి' అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో 'లగ్గం' మూవీని మొదలుపెట్టి శరవేగంగా తాజాగా 'లగ్గం' టాకీ పార్ట్ పూర్తయింది.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు సంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను తీసినట్లు తెలుస్తోంది. చరణ్ అర్జున్ సంగీతమందించారు. 'బేబి' ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ గురించి చెబుతారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
కుటుంబ కథాచిత్రం
రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ‘శుభలేఖ’ సుధాకర్ కీలక పాత్రల్లో రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్ఎన్జీ సినిమాస్పై హెచ్ మహాదేవ గౌడ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఉదయ్ శర్మ మాట్లాడుతూ–‘‘రేషన్ కార్డులాగా ఉన్న ఫస్ట్ లుక్కి చాలా మంచి స్పందన వచ్చింది. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. ఎంతో మంది సీనియర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మగారి మ్యూజిక్ హైలెట్’’ అన్నారు. ‘‘సఃకుటుంబానాం’ మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహాదేవ గౌడ్. ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి. -
తెలంగాణ పెళ్లి బ్యాక్డ్రాప్తో సినిమా.. శరవేగంగా షూటింగ్
సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. 'భీమదేవరపల్లి బ్రాంచి' మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ చిత్రాన్ని తీస్తున్నారు. తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నానని ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారని ఈ దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్గా నటించారు. రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. "ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు వచ్చాయి. అందుకు భిన్నంగా లగ్గం సినిమా ఉండబోతోందని నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. (ఇదీ చదవండి: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్) -
కొత్త పాయింట్తో తీశారనిపిస్తోంది
విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్ జంటగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో..’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కలియుగం పట్టణంలో..’ టైటిల్ కొత్తగా ఉంది. కొత్త పాయింట్తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. నా ‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడు. ఇప్పుడు హీరోగా నటించాడు. ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలి. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ను మిక్స్ చేసి ఈ సినిమా తీశారు. చిత్రా శుక్లా ఓ స్పెషల్ రోల్ చేశారు’’ అన్నారు విశ్వ కార్తీకేయ. ‘‘మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమాకాంత్ రెడ్డి. ‘‘మా టీజర్, ట్రైలర్ను చూసి కథను అంచనా వేయలేరు. సినిమా అంత కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణను కడపలోనే చేశాం’’ అన్నారు కందుల చంద్ర ఓబుల్ రెడ్డి. ‘‘సినిమా అంతా కడపలోనే తీయడం ఇదే తొలిసారి. కడప నుంచి ఓ మంచి నిర్మాత రాబోతున్నాడు’’ అన్నారు దర్శకుడు నీలకంఠ. -
కల్కి ప్రాజెక్ట్లో టాలీవుడ్ సీనియర్ నటుడు.. ప్రభాస్తో తొలి సినిమా
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా టాలీవుడ్కు చెందిన ఓ సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్లో ఇప్పటికే టాప్ నటీనటులు భాగమయ్యారు. కల్కిలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయనే ఓ కార్యక్రమంలో ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి టాప్ యాక్టర్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చుంటారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో పరకాయప్రవేశం చేయగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి నటుడ్ని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటారో తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రభాస్తో కూడా రాజేంద్ర ప్రసాద్ తొలిసారి నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపకా పదుకొణె, దిశా పటానీ, గౌరవ్ చోప్రా వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం
‘ఈ ప్రపంచం మన ప్రేమని తిరస్కరిస్తే.. ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘అందరూ నన్ను ఏడిపించినవాళ్లే.. కానీ, నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు ‘లవ్ @65’ మూవీ ట్రైలర్లో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లవ్ @65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ రాజు, స్పందన పల్లి ముఖ్య పాత్రలు పోషించగా, సునీల్, అజయ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా శుక్రవారం ట్రైలర్ని విడుదల చేశారు. ‘రాత్రి ఇక్కడి నుంచి ఇద్దరు మిస్ అయిపోయారు సార్’, ‘ఎవరు’, ‘మా కావేరి సార్.. మా ఆది సార్’, ‘ఎలా మిస్సయ్యారు’, ‘వాళ్లు లేచిపోయారు సార్’, ‘ఇద్దరూ మేజర్లా’, ‘కాదు సార్.. ఆయనకి డెబ్బై నిండాయి.. ఆవిడకి ఓ అరవైఐదు దాక ఉంటాయి’.. వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ తుమ్మలపల్లి, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఆ సినిమా తరువాత అంత గొప్ప పాత్ర ఇదే: రాజేంద్ర ప్రసాద్
సాయి రోనక్, గనవి లక్ష్మణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'లగ్గం'. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నచెప్పాల రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సుభిశి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ...'లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర చేస్తున్నా. నా కెరీర్లో పెళ్లి పుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం మరో విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరికీ ఈ కథనాలు కనెక్ట్ అవుతాయి. మొత్తంగా లగ్గం విందు భోజనం లాంటి సినిమా' అని అన్నారు. దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ.. "పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు. రెండు మనసులు కలవడం అంటూ గట్టి దావత్ ఇవ్వబోతున్నాం అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ.. "ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాం. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ల లగ్గాన్ని గుర్తు చేస్తుంది. పెళ్లి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది." అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. -
ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి
ఎస్వీ కృష్ణారెడ్ఢి.. పోస్టర్పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదంతో పాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో యమలీల ఓ సంచలనం అయితే మాయలోడు చిత్రం కూడా ఒక సెన్సేషనల్ హిట్.. అలా ఆయన నుంచి ఎన్నో హిట్ చిత్రాలు వెండితెరపై మెరిశాయి. ఒక్కపాటతో 365 రోజులు ఆడిన సినిమా 'మాయలోడు' సినిమాలో 'చినుకు చినుకు సాంగ్' అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ పాటలో బాబూమోహన్- సౌందర్య కలిసి వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. సుమారు 30 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం. ఆ ఒక్క పాట కోసం ఏకంగా 365 రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్ చెప్పారు. ప్రేక్షకులు సినిమాకు రావడం ఆ పాట పూర్తికాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయేవారని ఆయన చెప్పారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ,సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్.. కానీ ఒక కమెడియన్తో సాంగ్ తీయడం ఏంటి..? అనే సందేహం చాలామందిలో ఉండేది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్ఢి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మాయలోడు సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాటను బాబూ మోహన్తో తెరకెక్కించినట్లు ఆయన ఇలా చెప్పారు. 'మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇబ్బంది పెట్టారు. 'నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..' అంటూ నాపట్ల రాజేంద్రప్రసాద్ వెటకారంగా మాట్లాడారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. సినిమా పూర్తి అవుతుందని అనుకున్న సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ తక్కవ కావడంతో అదనపు డేట్స్ కోసం అడిగేతే కనీసం కూడా సహకరించలేదు. ఎలాగైనా పాట చిత్రీకరణ చేయాలని ఆయన్ను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎలా చేస్తావో చూస్తా అన్నారు ఫైనల్గా రాజేంద్ర ప్రసాద్తో మిగిలిన డేట్స్ తో డబ్బింగ్ పూర్తి చేయించాను. అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను తన మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ చెప్పాడు. ఒక రోజులో ఎలాగూ డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారు. సినిమా మొత్తం 1200 అడుగుల రీల్ వస్తే, ఎడిటర్ను రిక్వెస్ట్ చేసి, మొత్తం ఒకే రీల్గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్కు తెలియదు. దీంతో మధ్యాహ్నం 1గంటకే డబ్బింగ్ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు. ‘ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు. ఆ తర్వాత పాట షూటింగ్కు రమ్మని పిలిస్తే, ‘నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చేసుకో పో’ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతటితో రాజేంద్రప్రసాద్ నిష్క్రమించగా.. ఇక ఆయన్ను బతిమాలాల్సిన అవసరం లేదని భావించానని కృష్ణారెడ్ఢి తెలిపారు. ఆపై వెంటనే బాబూమోహన్తో సాంగ్ తీయాలని నిర్ణయించుకుని బాబూమోహన్తో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపాడు. బాబుమోహన్, సౌందర్యతో పాట తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత కొందరి మధ్యవర్తులను తన వద్దకు పంపినట్లు చెప్పాడు. సాంగ్ తీసేందుకు రాజేంద్రప్రసాద్ రెడీగా ఉన్నారని వారు చెప్పారు. అయితే ఇక నాకు ఆ అవసరం లేదని, ఇప్పటికే బాబూమోహన్కు మాట ఇచ్చేశానని చెప్పడంతో వారు వెళ్లి పోయారు. కావాలాంటే రాజేంద్రప్రసాద్ షూటింగ్ స్పాట్ వద్దకు రావొచ్చని, చూసి వెళ్లొచ్చని చెప్పాను. అని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. చిత్రపరిశ్రమలో తాను దర్శకుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్రసాద్ అని ఎస్వీ కృష్ణారెడ్ఢి చెప్పారు. తన సినీ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉందని కూడా ఇదే సందర్భంలో అన్నారు. కానీ మాయలోడు సినిమా విషయంలో మాత్రం తనను రాజేంద్రప్రసాద్ తీవ్రంగా బాధపెట్టారని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. గతేడాది 'ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' అనే చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్ఢి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి సీటు విషయంలో జనసేన, తెలుగుదేశం మధ్య చిచ్చు రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం గుంటూరులో నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, పట్టణ పార్టీ, అన్ని అనుబంధ విభాగాల నేతల నేతలతో రాజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించకపోతే ఈ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది. తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్కు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న రాజా తర్వాత మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్తో కలిసి చర్చలు జరపడం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. నాదెండ్ల మనోహర్ను రాజ్యసభకు పంపించి ఈ సీటు రాజాకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల చెప్పారు. దీంతో రాజా ప్రజా పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. రాజ్యసభకు వెళ్లడానికి మనోహర్ ఇష్టపడలేదు. తెనాలిలోనే ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. తెనాలిలోనే ఉంటూ టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కలుస్తూ సీటు తనదేనని చెబుతున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో తెనాలి సీటు దక్కదన్న అభిప్రాయానికి వచి్చన ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఇష్టపడటంలేదు. దీంతో రాజా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా సీటును జనసేన పార్టీకి ఇస్తే సహించబోమని ఈ సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఖుద్దూస్, మాజీ ఎంపీపీలు కేశన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి చిన్నా, వైకుంఠపురం మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దేసు యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్ తేజ, లాయర్ మద్ది మల్లికార్జునరావు తదితరులతో రాజా ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరులో జరిగే సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. -
'ఆటా' గ్రాండ్ ఫినాలే.. రాజేంద్రప్రసాద్కు ప్రత్యేక ఆహ్వానం
'ఆటా' గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి నటకిరీటి రాజేంద్రప్రసాద్ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 30న రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణారామా మా ఇంట్లో పుట్టిన కథే – దర్శకుడు రాజ్ మదిరాజు
‘‘ప్రస్తుతం చాలా మంది తమ తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నారు. దీంతో ఒంటరి తనంగా భావించిన తల్లిదండ్రులు తమ మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. మా తల్లి దండ్రులు కూడా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఫేస్ బుక్లోకి వచ్చారు. ఒక విధంగా ‘#కృష్ణారామా’ కథ మా ఇంట్లో పుట్టిందే’’ అని దర్శకుడు రాజ్ మదిరాజు అన్నారు. రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో అనన్య శర్మ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘‘#కృష్ణారామా’. అద్వితీయ మూవీస్పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ సినిమా ఆదివారం నుంచి ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ– ‘‘మన తల్లిదండ్రులు రిటైర్ అయిపోతే వాళ్ల జీవితమే అయిపోయిందనే భావనలోకి వెళ్లిపోతున్నాం. కానీ, వారి అనుభవం సమాజానికి ఎంతో అవసరం అని మా సినిమా ద్వారా చెబుతున్నాం. ఒక డైరెక్టర్గా నా పనిని నేను ఇష్టపడతాను. నటుడిగా నా పరిధిలోనే ఉంటాను.. డైరెక్టర్స్కి సలహాలు, సూచనలు ఇవ్వను. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. డైరెక్టర్గా రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. -
ఇళయరాజాతో నా అనుబంధం: రాజేంద్ర ప్రసాద్
-
నా చిన్నప్పుడే మా అమ్మ వదిలేసి వెళ్లిపోయింది..!
-
చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమే నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్
కామెడీ హీరోగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. కామెడితో హీరోయిజం కూడా పండించొచ్చని నిరూపించిన ఏకైక నటుడు ఆయన. ఇప్పుడంటే చాలా మంది కమెడియన్లు హీరోలుగా మారుతున్నారు కానీ.. అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఒక్కరే కామెడీ హీరో. నవ్వుల రారాజుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 ఏళ్లుగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నట కిరీటీ సపోర్టింగ్ యాక్టర్గా పలు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే తెరపై నవ్వులు పూయించిన ఈ సీనియర్ హీరో.. రియల్ లైఫ్లో మాత్రం చాలా కష్టాలు అనుభవించాడట. తాజాగా ఆయన ఓ టీవీ షోలో పాల్గొని..తన చిన్ననాటి కష్టాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘నా చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. నేను అమ్మకోసం ఎదురుచూస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. రోజు అమ్మకోసం ఏడ్చేవాడిని. ఒకనొక దశలో చనిపోయే స్టేజ్కి వచ్చాను. అప్పుడు నా పరిస్థితి చూసి..మా ఇంట్లోవాళ్లు కనక దుర్గమ్మ గుడికి తీసుకెళ్లారు. అమ్మవారిని చూపిస్తే.. ఇకపై ఈమే నీ అమ్మ అని చెప్పారు. అమ్మ బయటకు రాదు..ఇక్కడే ఉంటుంది అని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆ కనకదుర్గమ్మనే అమ్మగా భావించి పెరిగాను’ అని చెబుతూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. రాజేంద్ర ప్రసాద్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘#కృష్ణారామా’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మదిరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమి కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 22న ప్రముఖ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది. -
నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ ఇది
రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రధారులుగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘#కృష్ణారామా’. వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో ఓ రిటైర్డ్ ఓల్డ్ పెయిర్ కోణంలో సాగే చిత్రం ఇది. అన్ని తరాల ప్రేక్షకులకు తగ్గట్లుగా నటించే అవకాశాలు నాకు వస్తుండటం నా అదృష్టం. ఈ తరానికి చెందిన కథ ఇది. నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్’’ అన్నారు. ‘‘మోడ్రన్ సబ్జెక్ట్తో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు గౌతమి. ‘ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు రాజ్ మదిరాజు. -
అన్నపూర్ణ స్టూడియో ఉంది అంటే దానికి కారణం నాగేశ్వరరావు గారు
-
భయపెడుతున్న 'ఎర్రచీర' మోషన్ పోస్టర్
పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన హర్రర్, యాక్షన్, థ్రిల్లర్ చిత్రం ఎర్రచీర. నవంబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది. రాఖీ పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ గమనిస్తే సినిమాలో భారీ తారాగణంతో సమానంగా ఎర్రచీర ఎలాంటి ముఖ్యపాత్ర పోషించిందో ప్రేక్షకులకు తెలియచేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని ఈ చిత్రం చూస్తున్నంతసేపు హర్రర్ సీన్స్ తో థ్రిల్లింగ్ ఉంటుందని, మదర్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్గా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ ఎర్ర చీర వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలి అంటే నవంబర్ 9న సినిమాని థియేటర్స్లో చూడాల్సిందే అని ఆయన అన్నారు. ఈ సినిమాలో Eight Layers వారి VFX తో కళ్లుచెదిరే 36 నిమిషాల గ్రాఫిక్స్ తో, మంచి నిర్మాణ విలువలతో నిర్మించబడినదని నిర్మాతలు NVV సుబ్బారెడ్డి, సుమన్ బాబు తెలిపారు. ఎర్రచీర సినిమాలో ప్రధాన పాత్రగా శ్రీరామ్, కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అయిన మహానటి ఫేమ్ సాయి తేజస్విని, అలీ, రఘుబాబు, గీతాసింగ్, అన్నపూర్ణమ్మ, తదితరులు నటించారు. -
చంద్రయాన్లో మనోళ్లు..
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా)/ఒంటిమిట్ట/విజయనగరం అర్బన్/రాజంపేట టౌన్ : పున్నమి చంద్రుడి సొగసు చూస్తూ మురిసిపోయిన భారతావని.. ఇప్పుడా నెలరాజుపై పరిశోధనలకు ల్యాండర్ విక్రమ్ను దింపి విజయగర్వంతో ఉప్పొంగుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా చేసింది. ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో మన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలూ ఉన్నారు. వీరిలో చిత్తూరుకు చెందిన కె. కల్పన, వైఎస్సార్ కడప జిల్లా యువతి అవ్వారు చందన.. విజయనగరానికి చెందిన డా. కరణం దుర్గాప్రసాద్.. రాజంపేటకు చెందిన ఎర్రబాలు రాజేంద్ర ఉండటం మనందరికీ గర్వకారణం. అలాగే.. చిత్తూరుకు చెందిన కె. కల్పన ప్రముఖ పాత్ర పోషించడం తెలుగు వారికి గర్వకారణం. ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయిన వెంటనే బెంగళూరులోని ఇ్రస్టాక్ కేంద్రంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాజెక్టులో ఆమె అసోసియేట్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ల్యాండర్ను సేఫ్గా దించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి.. మధురమైన జ్ఞాపకమన్నారు. ఈ ప్రయోగం సక్సెస్తో కల్పనకు ప్రత్యేకమైన గౌరవం లభించడమే కాక తెలుగుజాతి మొత్తం ఆమెకు అభినందనలు తెలియజేస్తోంది. మిగిలిన ముగ్గురూ చంద్రయాన్–3లో తమ అనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.. థర్మోఫిజికల్ లీడ్స్లో ఒకడిని.. అహ్మదాబాద్లోని అంతరిక్షం ఇస్రో విభాగమైన ఫిజికల్ రీసెర్చ్ లా»ొరేటర్ (పీఆర్ఎల్)లో ప్లానెటరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. చంద్రయాన్–1 నుంచి ప్రస్తుత చంద్రయాన్–3 వరకు పనిచేసిన అనుభవం ఉంది. చంద్రుని ఉపరితల థర్మోఫిజికల్ ప్రయోగం (సీహెచ్ఏఎస్టీఈ) అనే పరికరం లీడ్స్లో నేను ఒకడిని. ఇదొక థర్మామీటర్లా పనిచేస్తుంది. చంద్రుని మొదటి ఉపరితలం సీటు థర్మల్ ప్రొఫైల్ను అందించేందుకు చంద్రుని ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. చంద్రునిపై నీటి ఉనికి, స్థిరత్వం, చలనశీలతను నిర్దేశించే ప్రయోగం ఇది. భవిష్యత్తులో చంద్రుని అన్వేషణలో ముఖ్యమైన అంశం అయిన నీరు–మంచు, ఇతర వనరుల స్థిరత్వ మండలాల గురించి చెప్పే ముఖ్యమైన ప్రయోగం చంద్రయాన్–3. – డాక్టర్ కరణం దుర్గాప్రసాద్, విజయనగరం మాటల్లో వర్ణించలేని ఆనందమిది.. చంద్రయాన్–3 ప్రయో గం జరుగుతున్న తరుణంలోనే నేనూ సైంటిస్ట్ అయ్యి ఈ ప్రయోగంలో భాగస్వామ్యం కావడం, అలాగే చంద్రయాన్–3 విజయవంతం కావ డం మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని ఇస్తోంది. విక్రమ్ ల్యాండర్ చందమామకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఉత్కంఠభరితమైన క్షణాలను గడిపాం. చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్గా ల్యాండ్ అయిన క్షణం నాకు తెలియకుండానే నా కళ్ల నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ ప్రయోగం నా జీవితంలో మరచిపోలేని ఓ తీపిగుర్తు. నేను ఎంటెక్ పూర్తిచేశాక హైదరాబాద్లోని క్వాల్కం కంపెనీ తమ సంస్థలో ఉద్యోగం ఇ చ్చేందుకు రూ.43 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చింది. అయితే, తన మేధస్సును దేశానికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించా. ఆ తరువాత తన అడుగులు శా స్త్రవేత్తగా ఈ రంగంపై పడ్డాయి. అన్నమ య్య జిల్లా రాజంపేట మండలం దిగువ బసినా యుడుగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే వై.సుబ్రమణ్యంరెడ్డి, చ ంద్రకళ.. రాజేంద్రప్రసాద్రెడ్డి తల్లిదండ్రులు. – ఎర్రబాలు రాజేంద్ర ప్రసాద్రెడ్డి, రాజంపేట ఇది చిన్నప్పటి కల.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం, కొత్తమాధవరం మా స్వగ్రామం. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో హైదరాబాద్ వారు నిర్వహించిన యంగ్ సైంటిస్ట్ కార్యక్రమంలో ప్రతిభ చూపడంతో శాస్త్రవేత్తగా ఎదిగేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఇంటర్లో ఉపకార వేతనం లభించింది. కడపలోని అంబేద్కర్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ డీఏఐడీ పూర్తిచేశాను. విజయవాడలో డీఎస్సీ శిక్షణ తీసుకున్న అనంతరం ఇస్రో పరీక్షలకు సిద్ధమై ఎంపికయ్యాను. మూడో స్థానం దక్కింది. తల్లి ఆదిలక్ష్మి, అమ్మమ్మ సాలమ్మల ప్రోత్సాహం మరువలేనిది. ఇస్రోకు ఎంపికైన తర్వాత బెంగళూరు యుఆర్.రావు శాటిలైట్ సెంటర్లో పనిచేస్తున్నాను. అబ్దుల్ కలాం స్ఫూర్తితో రాకెట్ లాంచ్ అంశంపై అవగాహన పెంచుకున్నా. చంద్రయాన్–3 డిజైనర్గా నేను భాగస్వామి కావడం నాకు ఆనందంగా ఉంది. ఇది నా చిన్నప్పటి కల. మరిన్ని విజయాల్లో నేనూ భాగస్వామి కావాలని ఉంది. – చందన, కొత్త మాధవవరం, ఒంటిమిట్ట మండలం -
రాజేంద్రప్రసాద్ అరుదైన ఫోటోలు.. చూశారా?
-
నా బిడ్డకు ఓ తండ్రిగా ఉపకారం కంటే అపకారం ఎక్కువ చేశా..
-
ఆత్రేయ గారు చేసే పనులకు కడుపు కాలిపోయేది.. పాటలు రాయమంటే ఏసీ రూమ్లో గురక పెట్టి పడుకునేవాడు..
-
ఆ ఘనత ఎన్టీఆర్కే చెల్లింది: రాజేంద్ర ప్రసాద్
రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావు సొంతమని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని... "కలయిక ఫౌండేషన్" అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేసింది. రెండు విభాగాల్లో ప్రథములుగా నిలిచినవారికి లక్ష రూపాయల చొప్పున బహూకరించి, మిగతా విజేతలకు సుమారు అయిదు లక్షల రూపాయల నగదు బహుమతులు అందించారు. మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి - విశ్రాంత హోమ్ సెక్రటరీ కె.పద్మనాభయ్య, ఆదాయపన్ను కమిషనర్ జీవన్ లాల్ లవాడియ, గజల్ శ్రీనివాస్, బృహస్పతి టెక్నాలజీస్ ఎమ్.డి రాజశేఖర్, సిఎస్.బి. ఐ.ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ బాల లత అతిధులుగా పాల్గొని... "కలయిక ఫౌండేషన్" అధినేత చేరాల నారాయణను అభినందించారు. ఈ సందర్భంగా చేరాల నారాయణ అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ విజేతలకు అభినందనలు తెలిపారు. చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి: రాకేశ్ మాస్టర్ వీడియో వైరల్ -
నా పెళ్లి దగ్గరుండి చేసాడు
-
ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లోని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ నటులు నరేశ్, రాజేంద్ర ప్రసాద్, నందమూరి బాలకృష్ణ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, జయసుధ, మురళీ మోహన్, ఏడిద రాజా, శివాజీ రాజా, శివబాలాజీ, పవిత్రా లోకేశ్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. శరత్ బాబు పార్థీవదేహం వద్ద సీనియర్ నటుడు నరేశ్ బోరున విలపించారు. తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. నరేశ్ మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్పనటుడే కాదు.. అందగాడు. శరత్ బాబు నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాం. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి అసూయపడేవాన్ని. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆఖరి రోజుల్లో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను నన్ను దీవించి వెళ్లాడు. ఆఖరి రోజుల్లో తోడు అవసరమని చెప్పాడు. మనస్సు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుణ్ణి కోల్పోయా. మా బ్యానర్లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మళ్లీ పెళ్లి ఫస్ట్ కాపీ చూస్తుండగా ఆయన చనిపోయారని ఫోన్ రావడంతో కన్నీళ్లు ఆగలేదు.' అంటూ ఫుల్ ఎమోషనలయ్యారు. ఆయనతో పాటు పవిత్రా లోకేశ్ కూడా నివాళులర్పించారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు: రాజేంద్రప్రసాద్ శరత్ బాబు మృతి పట్ల నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు శరత్ బాబు. నా ఎదుగుదలలో దగ్గరున్న వ్యక్తి శరత్ బాబు. ఆయన మరణం దైవ నిర్ణయం. శరత్ బాబు అనారోగ్యంతో పోరాడి తనను తాను కోల్పోయాడు. అత్యంత ఆప్తుడైన శరత్ బాబును కోల్పోవడం నాకు నా కుటుంబానికి ఎంతో తీరని లోటు.' అంటూ ఎమోషనలయ్యారు. అంకితభావం గల నటుడు: నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'శరత్ బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించా: జయసుధ సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ..' శరత్ బాబుతో నేను ఎన్నో సినిమాల్లో నటించా. నా బెస్ట్ మూవీస్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. ఇటీవలే ఆయనతో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించాను. సినిమా షూటింగ్ అప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. నెలరోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. మంచి క్రమశిక్షణ కలిగిన నటుడు శరత్ బాబు. చిరునవ్వుతో పలకరించేవాడు. ఏ నటుడితో చులకనగా మాట్లాడేవాడు కాదు. శరత్ బాబు మరణం బాధగా ఉంది. శరత్ బాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాదు తమిళ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు.' అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) శరత్బాబు ఆత్మకు శాంతి చేకూరాలి : ఏడిద రాజా ఏడిద రాజా మాట్లాడుతూ.. 'దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు . మా పూర్ణోదయ సంస్థ తీసిన చిత్రాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తాయారమ్మ బంగారయ్య ,సీతాకోకచిలక సాగర సంగమం ,స్వాతిముత్యం ,సితార , ఆపద్భాంధవుడు చిత్రాల్లో చాలా అధ్బుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మా సంస్థకు శాశ్వత ఆర్టిస్ట్గా పనిచేశారు. మా కుటుంబ సబ్యుడిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.' అంటూ శరత్ బాబును కొనియాడారు. -
30 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న స్టార్స్.. ఇన్నేళ్లు పట్టిందిలా
కొన్ని కాంబినేషన్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. అయితే కొన్ని కాంబినేషన్స్ రిపీట్ కావడానికి దశాబ్దాలు గడిచిపోతాయి. ఇలా మూడు దశాబ్దాల తర్వాత రిపీట్ అవుతున్న కొన్ని కాంబినేషన్స్లో రూపొందుతున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. రజనీకాంత్, జాకీ ష్రాఫ్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి 36 ఏళ్లు పట్టింది. 1987లో ప్రభాత్ ఖన్నా దర్శకత్వంలో వచి్చన హిందీ చిత్రం ‘ఉత్తర్ దక్షిణ్’లో రజనీకాంత్, జాకీ ఫ్రాష్ లీడ్ రోల్స్ చేశారు. మళ్లీ ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు తమిళ చిత్రం ‘జైలర్’లో నటిస్తున్నారు. ‘జైలర్’లో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, జాకీ ష్రాఫ్ కీ రోల్ చేస్తున్నారు. జాకీది నెగటివ్ క్యారెక్టర్ అని సమాచారం. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, శివ రాజ్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. రాజేంద్రప్రసాద్, అర్చన హీరో హీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో 1986లో వచ్చిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మళ్లీ 36 ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన ‘షష్టిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రంలో రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. మా ఆయి ప్రొడక్షన్స్పై రూపేష్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ‘లేడీస్ టైలర్’ సినిమాకు స్వరాలు అందించిన ఇళయరాజాయే ‘షష్టిపూర్తి’ చిత్రానికీ బాణీలు సమకూర్చుతుండటం విశేషం. బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా కలిసి నటించిన హిందీ చిత్రం ‘కరణ్ అర్జున్’. హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1995లో విడుదలై ఘనవిజయం సాధించింది. కాగా ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘ట్యూబ్ లైట్’, ‘టైగర్ 3’ (విడుదల కావాల్సి ఉంది) చిత్రాల్లో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. అలాగే షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’, ‘పఠాన్’ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. కానీ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా కలిసి నటించలేదు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా యశ్ రాజ్ ఫిలింస్ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ అనే సినిమా రూపొందించనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2025లో సెట్స్పైకి వెళ్తుందని బీ టౌన్ టాక్. ఈ లెక్కల ప్రకారం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా మరో సినిమా రావడానికి 30 ఏళ్లు పట్టింది. -
సూపర్ హిట్ కాంబినేషన్.. 37 ఏళ్ల తర్వాత మళ్లీ!
1986లో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్ సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో ఆ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటించారు. ఈ సినిమాలో జంటగా నటించిన రాజేంద్రప్రసాద్, అర్చనల కెమిస్ట్రీని సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అయితే ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే మళ్లీ అదే జోడీ తెరపై సందడి చేయనుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకోబోతోంది ఈ జంట. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్ఠి పూర్తి’. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హీరోగా నటించడంతో పాటు రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాాగ చెన్నైలోని సంగీతదర్శకుడు ఇళయరాజా స్టూడియోస్లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. తొలి సీన్కి ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాత ఆర్బి చౌదరి క్లాప్ ఇచ్చారు. రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..'లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్రప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్లో ‘ఆస్తులు అంతస్తులు, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అలాగే ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ మూవీ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. #LadiesTailor duo #RajendraPrasad & #Archana reunited after 37 years for the film #Shastipoorthi "Shoot starts this month and release in August “ says @ActorRupesh An #Ilaiyaraaja musical#RupeshKumarChaudhary @aakanksha_s30 #PavanPrabha #ThotaTharrani @BrindhaGopal1… pic.twitter.com/nCNwXPp0sz — Phani Kandukuri (@phanikandukuri1) April 1, 2023 -
ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ తీశాం. తెరమీద పాత్రలు మిమ్మల్ని (ప్రేక్షకులు) నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూసే రోజు కోసం(3వ తేదీ) ఎదురు చూస్తున్నాను’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్కి ఇక్కడున్న వారు కొట్టిన చప్పట్లతో సినిమా విజయంపై మరింత విశ్వాసం పెరిగింది. ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తరాలు మారొచ్చు కానీ సినిమా అనేది నిరంతరం సాగే ప్రపంచం. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా సన్నివేశాలు తీశారు కృష్ణారెడ్డిగారు’’ అన్నారు. ‘‘ఇప్పటి ట్రెండ్ను ఫాలో అవుతూ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణారెడ్డిగారు’’ అని కె. అచ్చిరెడ్డి అన్నారు. ‘‘హీరోగా నిరూపించుకోవడానికి నాకు వచ్చిన మంచి అవకాశం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం అని గర్వంగా చెబుతున్నాను’’ అన్నారు సోహైల్. -
మామ.. అల్లుడు వస్తున్నారు
సోహెల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాని మార్చి 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఫ్యామిలీ, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ వచ్చేస్తున్నారు
బిగ్బాస్ ఫేం సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. మార్చి 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషం. సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర లాంటి సీనియర్ నటులంతా ఇందులో ఉన్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. -
క్యారెక్టర్ ఉంటే తిరుగుండదు
‘‘యాక్టర్ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ, సక్సెస్ఫుల్ యాక్టర్ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్ కావాలి.. అది ఉంటే తిరుగుండదని ఈ తరం నటీనటులకు చెబుతున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదం’ సినిమా తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ప్రేక్షకుల నవ్వులు చూసేందుకు ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. మీనా మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్గారితో 30ఏళ్ల తర్వాత ఈ మూవీలో చేశాను. కృష్ణారెడ్డిగారితో సినిమా చేసే అవకాశం ఇన్నేళ్లకు కుదిరింది. తొలిసారి ఒక లేడీ ప్రొడ్యూసర్తో (కల్పన) పని చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు సోహైల్. -
'ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
అది కృష్ణారెడ్డిగారికే చెల్లింది – గోపీచంద్ మలినేని
‘‘దర్శకత్వం అంటేనే చాలా ఒత్తిడితో కూడిన క్రియేటివ్ వర్క్. అంత టెన్షన్ లోనూ తన ప్రతి సినిమాకి స్వయంగా సంగీతం అందించడం కృష్ణారెడ్డిగారికే చెల్లింది. దర్శకుల పేరు చూసి సినిమాకు వెళ్లే ట్రెండ్ను సృష్టించిన అతికొద్ది మందిలో కృష్ణారెడ్డిగారు ఒకరు’’ అన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. డా. రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధానపా త్రల్లో, సోహైల్, మృణాళిని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నమ్ముకోరా.. నమ్ముకోరా..’ అంటూ సాగే పాటని గోపీచంద్ మలినేని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈపా టని రేవంత్ ఆలపించారు. ‘‘ఈ మూవీ సూపర్ హిట్టవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు సి. కల్యాణ్. ‘‘మంచి ఫ్యామిలీ డ్రామాతోపా టు ఈ చిత్రంలో ఒక సందేశం ఉంటుంది. మార్చిలో రానున్న ఈ సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘హిలేరియస్ కామెడీ, ఫ్యామిలీ, యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాకు తొలిసారి డైలాగ్స్ రాశాను’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. -
ఈ విజయం వారిదే: రాజేంద్రప్రసాద్
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి మా ‘శాసనసభ’తో నిరూపించారు. ఈ విజయం వారిదే’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యా రాజ్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసన సభ’. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శాసనసభ’లో నేను చేసిన నారాయణ స్వామి పాత్రకి మంచి పేరొచ్చిందంటే దానికి కారణం రచయిత రాఘవేందర్ రెడ్డి, దర్శకుడు వేణు.. నాది మూడో స్థానం. సినిమా విడుదలైన మూడో రోజే 60 థియేటర్స్ పెరగడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రవిజయం పట్ల యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. -
సూపర్ స్టార్ కృష్ణను తలుచుకొని ఎమోషనల్ అయిన సినీ ప్రముఖులు
-
Anukoni Prayanam: నా మనసుకు నచ్చింది
‘‘అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కథ. నా మనసుకు నచ్చింది. నా చిత్రాల్లో ది బెస్ట్గా నిలుస్తుంది. ఈ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ నాలో మొదలైంది’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో డా.జగన్మోహన్ డీవై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’లో నాది సీరియస్ పాత్ర. అందుకే ఆ సినిమా విడుదలైనప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. కానీ, అందరూ నవ్వి నవ్వి వంద రోజులు చూశారు. ఇప్పుడు ‘అనుకోని ప్రయాణం’ కూడా అంత పెద్ద విజయాన్ని అందుకుంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నరసింహ రాజు. ‘‘కరోనా సమయంలో ఈ కథ రాశాను’’ అన్నారు డా.జగన్ మోహన్ డీవై. ‘‘ఈ చిత్రం అందరి హృదయాలను టచ్ చేస్తుంది’’ అన్నారు వెంకటేష్ పెదిరెడ్ల. ‘‘అనుకోని ప్రయాణం’ సంచలన విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి . ‘‘ఈ చిత్రం కొత్తగా ఉంటుంది’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. దర్శకులు కె.విజయభాస్కర్, నందినీ రెడ్డి, వీరభద్రం, నటుడు సోహైల్ పాల్గొన్నారు. -
సూర్యాపేట ఎస్పీని సస్పెండ్ చేయాలి
యాదగిరిగుట్ట: సూర్యాపేట బహిరంగసభలో ఆ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మంత్రి జగదీశ్రెడ్డిని బాహుబలితో పోల్చడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. ఎస్పీ హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారి...జయహో జగదీశ్రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ...పోలీస్ దుస్తులకు బదులు గులాబీ చొక్కా వేసుకుని ఆ వ్యాఖ్యలు చేసుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మంత్రి జగదీశ్రెడ్డి ఇసుక మాఫియా నడిపిస్తున్నారని, మూడు హత్యానేరం కేసులున్న వ్యక్తిని జయహో అని సంబోధిస్తారా అని మండిపడ్డారు. డీజీపీకి ఏమాత్రం ధైర్యం ఉన్నా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 48 మంది అదనపు డీజీపీ క్యాడర్ కలిగిన ఐజీలు రిపోర్టింగ్ చేసి డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ లేకుండా ఉన్నారని, వారందరికీ వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నానని కోమటిరెడ్డి అన్నారు. సమైక్యతా వజ్రోత్సవాలకు సైతం మహిళలను రూ.300 ఇచ్చి తరలించారని విమర్శించారు. -
అవాక్కయ్యే ఘటన.. ‘జయహో జగదీష్రెడ్డి’.. జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు. వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్.. ‘జయహో జగదీష్రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీష్రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ ఎస్పీ.. ‘‘జయహో జగదీష్రెడ్డి’’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వేదిక ముందున్నవారితో కూడా ఎస్సీ.. ‘జయహో జగదీషన్న’ అంటూ నినాదాలు చేయించారు. జిల్లా పోలీస్ బాస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక - నిర్మాత రాజేంద్ర ప్రసాద్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు(ఆగస్ట్ 19) తుదిశ్వాస విడిచారు. 'ఆ నలుగురు' చిత్ర దర్శకుడు చంద్ర సిద్ధార్థ్కు ఈయన సోదరుడు. తెలుగులో 'నిరంతరం(1995)’ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకోవడమే కాకుండా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఆయన ప్రాధమిక విద్యాభాసం అంతా ఇక్కడే జరిగింది. పుణెలోలో ఓ ప్రముఖ ఫిల్మ్ స్కూల్లో సినిమాగ్రఫీని నేర్చుకున్నాడు. పలు ఇంగ్లీష్, పెర్షియన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు. హాలీవుడ్లో 'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్' 'ఆల్ లైట్స్, నో స్టార్స్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. -
పాన్ ఇండియా చిత్రంగా రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ'
Rajendra Prasad First Look Released From Sasana Sabha: వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే అతికొద్ది నటుల్లో డా. రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'శాసన సభ'. ఇందులో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించగా, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. వేణు మడికంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన తులసీ రామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తిర అప్డేట్ను ఇచ్చింది చిత్రబృందం. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ లుక్ పోస్టర్ను సోమవారం విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ సినిమాలో ఎమ్మెల్యే నారాయణ స్వామిగా రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. ''ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్. యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే నారాయణ స్వామిగా నటిస్తున్నారు. చదవండి: బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన రోల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆయన కెరీర్లో చేయనటువంటి విభిన్నమైన పాత్ర ిది. ఈ సినిమాకు ఆయన పాత్రే హైలెట్గా నిలుస్తుంది. అలాగే మా సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్కు మంచి స్పందన లభించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని నిర్మాతలు తెలిపారు. చదవండి: థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో.. Wishing all a very happy Independence Day #IndiaAt75 - Team #Sasanasabha #IndraSena #RajendraPrasad #VenuMadikanti #ShanmugamSappani #Thulasiramsappani @RaviBasrur #AishwaryaRaj @soniya_agg @sapbrofilms @kaanistudio #HappyIndependenceDay pic.twitter.com/D9FVJxuxTs — Ramesh Bala (@rameshlaus) August 15, 2022 -
ఈ కథ విన్నప్పుడు ఫ్రీజ్ అయ్యాను
‘‘ఇన్నేళ్ల నా కెరీర్లో ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ కథలను విన్నప్పుడు షాకయ్యాను. కానీ దర్శకుడు వెంకటేశ్ ‘అనుకోని ప్రయాణం’ కథ చెప్పినప్పుడు ఫ్రీజ్ అయ్యాను’’ అని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. పెదిరెడ్ల వెంకటేశ్ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రధారులుగా డా. జగన్మోహన్ నిర్మించిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కరోనా సమయంలో వలస కూలీల ప్రయాణం నుంచి పుట్టిన కథ ఇది. ఇద్దరి స్నేహితుల కథ. నరసింహరాజుగారిలాంటి గొప్ప నటుడితో కలిసి యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘రాజేంద్రప్రసాద్గారిలాంటి వారు ఈ కథను ఒప్పుకున్నారంటేనే విజయం కింద లెక్క. డాక్టర్ అయిన జగన్మోహన్ నిర్మాణంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నరసింహరాజు. ‘‘రాజేంద్రప్రసాద్, నరసింహరాజు వంటి నటులు నా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు వెంకటేశ్. -
స్టేజ్పై డ్యాన్స్ చేసిన వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి..
F3 Success Meet Vizag, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మహిళా ప్రేక్షకుల ఆదరణ వల్లే ఎఫ్–3 (F3) సినిమా అఖండ విజయం సాధించిదని ప్రముఖ హీరో వెంకటేశ్ తెలిపారు. ఆర్.కె.బీచ్ దరి గోకుల్పార్కులో శనివారం రాత్రి ఎఫ్–3 ఫన్టాస్టిక్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తనకెప్పుడూ స్పెషల్ అన్నారు. తన తొలి సినిమా కలియుగ పాండవులు షూటింగ్ విశాఖ బీచ్రోడ్డులోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్హిట్ సినిమాలను విశాఖలో చిత్రీకరించామన్నారు. తాను నటించిన దృశ్యం–2, నారప్ప వంటి సినిమాలు ఓటీటీలో మాత్రమే విడుదల కావడంతో తన అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారని పేర్కొన్నారు. ఎఫ్–3 సినిమాకు అభిమానులు విజయం చేకూర్చారని సంతోషం వ్యక్తం చేశారు. మరో హీరో వరుణ్తేజ్ మాట్లాడుతూ 'అభిమానుల ఆదరణే తమకు వందకోట్ల ఆదాయంతో సమానం. విశాఖ నోవాటెల్ హోటల్లోనే దర్శకుడు అనిల్ ఎఫ్–3 సినిమా కథ రాసుకున్నారు. మళ్లీ అవకాశం వస్తే కథ వినకుండానే వెంకటేశ్తో సినిమా చేస్తాను.' అని పేర్కొన్నారు. నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ విశాఖలో ఆర్య, పరుగు సినిమా షూటింగ్ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అమెరికాలో కూడా ఇదే ఆదరణ లభించడం అపూర్వమన్నారు. ఈ రోజుకు సినిమా విడుదలై 9 రోజులవుతుందని.. రూ.100 కోట్ల గ్రాస్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జగదాంబ వంటి 1,100 సీట్లు ఉన్న థియేటర్లో ఎఫ్–3 హౌస్ఫుల్స్తో నడుస్తోందని జగదాంబ థియేటర్ అధినేత జగదీష్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్–4 త్వరలోనే ప్రకటిస్తామన్నారు. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 'విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు ముందు నేను చేసిన చాలెంజ్తో మీడియా కూడా షాక్ అయింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను నేను, హీరో వెంకటేశ్ ఎంతో రుచి చూశాం' అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ కేవలం ప్రేక్షకులను నవ్వించడానికే ఈ సినిమా తీశానన్నారు. ఈ సినిమాలో ఆలీ పాత్ర నచ్చిందా అని ప్రేక్షకులను అడిగారు. తనకు ఎఫ్–2 కంటే ఎఫ్–3 సినిమా అంతకుమించి ఆనందం ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చాలా బాగా పండాయన్నారు. తన సినిమా కథలన్నీ వైజాగ్లోనే రాసుకున్నానని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఎఫ్–3 చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. ఇదే రోడ్డుపై ఎన్నో షూటింగ్లు చేశానని నటుడు అలీ చెప్పారు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో వెంకటేశ్, వరుణ్తేజ్, అనిల్ సినిమాలోని ఓ పాటకు నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. సే నో టు ప్లాస్టిక్ ఎఫ్–3 విజయోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ విశాఖలో ఆదివారం నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామన్నారు. విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నట్లు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాత దిల్రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యపడుతుందన్నారు. -
అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ
Comedian Ali Comments On F3 Movie In Success Meet: ‘‘ఎఫ్ 3’ చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కు వస్తున్నారు’’ అని వెంకటేశ్ తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం (మే 30) ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ‘‘ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా తీశారు అనిల్ రావిపూడి. థియేటర్లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ‘‘45 ఏళ్లుగా నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చేశాను. ప్రపంచంలోని నలుమూలల నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ‘మీ పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయి’ అని అభినందిస్తున్నారు. నాకు నా ‘మాయలోడు’ సినిమా గుర్తొచ్చింది’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది సరి కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్ 3’ సక్సెస్ ఓ నిదర్శనం’’ అని తెలిపారు అలీ. చదవండి: నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ -
ఎన్టీఆర్ గొప్ప మహానీయుడు, తెలుగుజాతి గర్వించదగ్గ నటుడు: రాజేంద్రప్రసాద్
-
ఈ సినిమా హిట్ కాకపోతే ఇకపై మీ ముందుకు రాను
‘‘నా సినిమా థియేటర్స్లో రిలీజై మూడేళ్లవుతోంది. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ ఓటీటీకి వెళ్లిపోయాయి. నా ఫ్యాన్స్ కొందరు నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు ‘ఎఫ్ 3’ సినిమా ఈ నెల 27న థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా నాపై ప్రేమను చూపిస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ‘ఎఫ్ 3’ సినిమా మీ కోసమే... మీరందరూ థియేటర్స్కు వచ్చి ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ‘ఎఫ్ 2’ను హిట్ చేశారు. ‘ఎఫ్ 3’ కూడా హిట్ అవుతుంది. అనిల్ మంచి స్క్రిప్ట్తో సినిమా చేశాడు. వరుణ్ తేజ్ బాగా చేశాడు’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ‘ఫన్టాస్టిక్’ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులయింది. ‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ గ్లామర్గా ఉందంటే కారణం సాయి శ్రీరామ్గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఫిదా, ఎఫ్ 2 ఇప్పుడు ‘ఎఫ్ 3’.. ‘దిల్’ రాజుగారితో ఈ సినిమా నాకు ఓ హ్యాట్రిక్లా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ జనరేషన్లో అనిల్గారి కన్నా కామెడీని ఇంకా ఎవరూ బాగా తీయలేరని నాకు అనిపిస్తోంది. వెంకటేశ్గారు చాలా మల్టీస్టారర్ ఫిలింస్ చేశారు. కానీ ఆయనతో రెండోసారి వర్క్ చేసే అవకాశం నాకు మాత్రమే లభించింది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’ సినిమాయే మాకు శత్రువు. ఎందుకంటే ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అందుకని ‘ఎఫ్ 2’కి మించిన వినోదాన్ని ‘ఎఫ్ 3’లో ఇచ్చేందుకు మేం స్క్రిప్ట్ నుంచే కష్టపడ్డాం. నవ్వడం చాలా ఈజీ. కానీ కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లను నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. అందుకే ‘దిల్’ రాజుగారితో వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో దాదాపు 35మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరు లేకపోతే ‘ఎఫ్ 3’ లేదు. ఈ సినిమాలో గొప్ప కంటెంట్ కూడా ఉందని భావించి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. వరుణ్ తేజ్ నాకు ఓ బ్రదర్లాంటి వాడు. వరుణ్లో ఇంత మంచి కామెడీ టైమింగ్ ఉందా? అని ఆడియన్స్ అంటారు. వెంకటేశ్గారు స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. కానీ కామెడీ చేసేప్పుడు ఆయన ఇమేజ్ను పక్కన పెట్టి పెర్ఫార్మ్ చేస్తారు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. నవ్వలేకపోవడం ఒక రోగం. నవ్వించడం ఒక భోగం. రెండేళ్లు కరోనా పరిస్థితులను ఫేస్ చేశాం. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్లో చూసి హ్యాపీగా నవ్వుకోండి’’ అని అన్నారు. ‘ఎఫ్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’లోలానే వెంకటేశ్, వరుణ్ తేజ్లు ‘ఎఫ్ 3’లోనూ అద్భుతంగా చేశారు. హీరోల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ‘ఎఫ్ 2’లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ‘ఎఫ్ 3’లో నలుగురు హీరోయిన్స్ని పెట్టారు అనిల్. రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ.. ఇలా ఫుల్ఫ్యాక్డ్గా ఉంది సినిమా. దేవిశ్రీకి మా బ్యానర్లో ఇది 13వ సినిమా. ‘ఎఫ్ 2’కు మించి ‘ఎఫ్ 3’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రామానాయుడుగారి తర్వాత ‘దిల్’ రాజుగారినే నేను మూవీ మొఘల్గా పిలుస్తాను. మనిషి జీవితంలో నవ్వుకు ఎంత అవసరం ఉందో చెప్పే సినిమా ‘ఎఫ్ 3’. 45 ఏళ్లుగా నేను నమ్మింది నవ్వునే. ఈ సినిమాలోని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్ను నవ్విస్తాయి. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ అనిల్ రావిపూడి. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సినిమా హిట్ కాకపోతే నేను ఇకపై మీ ముందు (ప్రేక్షకులు) నిలబడను’’ అన్నారు. ‘‘ఎఫ్ 3’ సినిమా చూస్తూ, నవ్వుతారు. అది మన ఇమ్యూనిటీని పెంచుతుంది’’ అన్నారు సునీల్. ‘‘పవన్ కల్యాణ్గారి ‘తమ్ముడు’ సినిమా తీసిన దర్శకుడు అరుణ్ ప్రసాద్ బాబాయ్ కొడుకే అనిల్ రావిపూడి. అనిల్ అనే మొక్కను ‘దిల్’ రాజు పెంచారు. ఈ చెట్టు నీడ కింద ఇప్పుడు చాలా మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీలోని అందరూ బాగుంటారు. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్లోనే చూడాలని కోరుతున్నాను’’ అన్నారు అలీ. వై. విజయ, ప్రగతి, తులసి, 30 ఇయర్స్ పృథ్వీ, ప్రదీప్, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి 👉🏾 బిగ్బాస్ నాన్స్టాప్ ఫైనల్ విన్నర్ బిందు మాధవి.. విజయ్ దేవరకొండతో సమంత లిప్లాక్ సీన్ ? -
కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి: రాజేంద్రప్రసాద్
ధనం సంపాదించటమే ముఖ్యం కాదు, ఆర్జించిన సంపద లో కొంత వితరణ కోసం వెచ్చించాలని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ నిర్వహించిన 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో విజయం సాధించిన వారికి రవీంద్ర భారతీలో అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవ లో భాగ స్వాములు కావాలని కోరారు. పిల్లలు ఆట పాటలతో చదువుని ఇష్టంగా నేర్చుకోవాలన్నారు. విద్యార్థులను జాతి నిర్మాతలుగా దీర్చి దిద్దాల్చిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ జేవీఆర్ సాగర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు , రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య, సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1000 పాఠశాలల నుంచి పదివేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించన 29వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 48 మంది కి నేషనల్ ర్యాంక్స్ & రాష్ట్రా స్థాయి మెడల్స్, 300 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ , 10 మందికి గురుబ్రహ్మ ఛత్రాలయా అవార్డ్స్ పొందరాని నిర్వాహకులు తెలిపారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ( ఫోటోలు)
-
‘సూపర్ మచ్చి’మూవీ రివ్యూ
టైటిల్ : సూపర్ మచ్చి నటీ,నటులు: కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు నిర్మాత : రిజ్వాన్ దర్శకత్వం : పులి వాసు సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్ విడుదల తేది: జనవరి 7, 2022 మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ‘విజేత’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్దేవ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆ ఉత్సాహంతోనే ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యంగ్ హీరో.. లుక్స్, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సూపర్ మచ్చి’సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే మీనాక్షి (రచిత రామ్).. బార్లో పాటలు పాడుతూ.. ఆవారాగా తిరిగే (రాజు)ని అమితంగా ప్రేమిస్తుంది. అతను ఇష్టం లేదని చెప్పినా అతని వెంటే పడుతుంది. దీంతో ఆమెను వదిలించుకోవడానికి ఒక నైట్ తనతో గడిపితే నీ ప్రేమని అంగీకరిస్తానని కండీషన్ పెడతాడు. దానికి కూడా ఆమె ఒప్పుకుంటుంది. నెలకు లక్షన్నర సంపాదించినే మీనాక్షి.. చదువు సంధ్య లేని రాజుని ఎందుకు ప్రేమించింది? ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? మీనాక్షిని చూడకుండా ప్రేమించిదెవరు? మీనాక్షి తండ్రి(రాజేంద్రప్రసాద్) చివరి కోరిక కోసం ఏంటి? చివరకు మినాక్షి , రాజులు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడు రాజు పాత్రలో కల్యాణ్ దేవ్ మంచి నటనను కనబరిచాడు. డ్యాన్స్తో పాటు ఫైట్స్ సీన్స్లో కూడా అద్భుతంగా నటించారు. తెరపై చాలా జోష్గా కనిపిస్తాడు. ఇక మీనాక్షిగా రచిత రామ్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించింది. సెకండాఫ్లో వచ్చే ఎమోషన్స్ సినిమాలో కూడా అద్భుతంగా నటించింది. హీరో తల్లిదండ్రులుగా నరేశ్, ప్రగతి మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. మీనాక్షి తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ ఒదిగిపోయారు. పొసాని కృష్ణమురళి, మహేష్ ఆచంట, భద్రంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ప్రేమ, ఎమోషన్స్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్న చిత్రమే సూపర్ మచ్చి. ఇలాంటి కథలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. కానీ చూడకుండా ప్రేమించుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్లో కథను ముందుకు నడిపాడు దర్శకుడు పులి వాసు. ఆయన ఎంచుకొన్న పాయింట్ బాగున్నప్పటీకీ.. తెరపై చూపించడంలో కాస్త తడపడ్డాడు. ఫస్టాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా నడిపించాడు. బాధ్యతలేని రాజుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీనాక్షి ఎందుకు ప్రేమిస్తుందనే విషయాన్ని ఇంటర్వెల్ వరకు ఆపి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగేలా చేశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్లో మాత్రం కథ కాస్త రోటీన్గా సాగుతుంది. తండ్రి, కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఎలాంటి అశ్లీలత, బూతులు లేకుండా సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. ఇక సాంకెతిక విషయానికొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ సెకండాఫ్లోని కొన్ని సీన్స్ని ఇంకాస్త క్రిస్పీగా కట్ చేస్తే మరింత బాగుండేది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి కథను, దానికి తగిన నటీనటుల ఎంపిక విధానం చూస్తే.. సినిమాపై రిజ్వాన్కు ఉన్న అభిరుచి ఏంటో అర్థమవుతుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్గా తెరకెక్కించారు. -
ప్రముఖ నటుడికి కరోనా.. ఆస్పత్రిలో చేరిక
Senior Actor Rajendra Prasad Tested Positive For Covid 19: దేశంలో కరోనా, మెలిమెల్లిగా తన పంజా విసురుతోంది. ఏ రోజుకీ ఆరోజు పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినీ మహామ్మారి విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్లో అనేకమంది ప్రముఖులు కొవిడ్ బారిన పడ్డారు. బీటౌన్లో ఏక్తా కపూర్, అర్జున్ కపూర్, స్వరా భాస్కర్, సింగర్ విశాల్ డడ్లానీతో పాటు టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కరోనా సోకడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. వీరే కాకుండా త్రిష, వరలక్ష్మీ శరత్ కుమార్, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, సీనియర్ హీరో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. రాజేంద్ర ప్రసాద్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: బుల్లితెర హీరోయిన్కు కొవిడ్.. అవి నమ్మొద్దని సలహా -
అద్భుతం.. సేనాపతి మూవీపై మెగాస్టార్ రివ్యూ
Megastar Chiranjeevi Review On Rajendra Prasad Senapathi Movie: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరేశ్ అగస్త్య, హర్ష వర్థన్, జ్ఞానేశ్వరి, సత్య ప్రకాశ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం సేనాపతి. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాకు నిర్మాతగా వ్వవహరించిన సంగతి తెలిసిందే. యువ దర్శకుడు పవన్ సాదినేని రూపొందించిన ఈ సినిమా రెండు రోజుల క్రితం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ సేనాపతిపై రివ్యూ ఇచ్చాడు. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ ఈ సినిమాపై చిరు ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. సేనాపతి సినిమా చూశాను. యువ దర్శకుడు పవన్ ఎంతో ఆసక్తికరంగా, అద్భుతంగా తీశాడు. అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉండేలా ఈ మూవీని మలిచాడు. మంచి అభిరుచికి అద్దంపెట్టే చిత్రాన్ని నిర్మించి యువ నిర్మాతలు సుస్మిత కొణిదెల, విష్ణులకు నా ప్రేమాభినందనలు. అన్నింటికీ మించి సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో వినూత్న పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన నటనా ప్రతిభకు ఈ చిత్రం ఓ మచ్చు తనక’ అంటూ మూవీ టీంపై చిరు ప్రశంసలు కురిపించాడు. అంతేగాక ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చదవండి: నాకింగా 29 మాత్రమే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి Hearty Congrats Team #SENAPATHI !! A terrific thriller!#SenapathionAha #DrRajendraPrasad @Pavansadineni #LSVishnuPrasad@sushkonidela @ahavideoIN pic.twitter.com/WJcSBeqhK3 — Chiranjeevi Konidela (@KChiruTweets) January 5, 2022 -
విలన్ రోల్ చేస్తోన్నరాజేంద్రప్రసాద్ ?
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజీర్ అహ్మద్, తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ గోపిచంద్లు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలు చూసిందని, చాలా ఎన్నికల్లో విజయం సాధించింది, కొన్నింటిలో అపజయం చూసిందని అన్నారు. నాగార్జున సాగర్, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను మేమే గెలుచుకున్నామని గుర్తు చేశారు. రాజకీయాలన్నాకా గెలుపోటములు వస్తూ ఉంటాయని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎన్నికల్లాగే చూస్తుందన్నారు. త్వరలో హీరో బాలకృష్ణతో సినిమా: దర్శకుడు గోపిచంద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దర్శకుడు గోపిచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ఇంటి కులదైవం తిరుమల స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో హీరో బాలకృష్ణ తో చిత్రం నిర్మిస్తున్నానని గోపిచంద్ స్పష్టం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న శుక్రవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో ఆమెను సత్కరించారు. అదేవిధంగా.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని కూడా న్యాయమూర్తి శుక్రవారం దర్శించుకున్నారు. కాగా, అంతకు ముందు రోజు గురువారం కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామిని జస్టిస్ బీవీ నాగరత్న కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ శ్రీసుధా తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా శుక్రవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం న్యాయమూర్తికి పండితులు వేద ఆశీర్వచనాలు, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
ఆకట్టుకుంటున్న కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ టీజర్
‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్.. చాలా గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సూపర్ మచ్చి , కిన్నెరసాని అనే సినిమాలను చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా కల్యాన్ దేవ్ ‘సూపర్ మచ్చి’ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. పులివాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు బలం కానున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్కు జోడిగా కన్నడ నటి రచితా రామ్ నటిస్తోంది. రాజేంద్రప్రసాద్, నరేశ్, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషిస్తుండగా అజయ్, ‘జబర్దస్త్’ మహేశ్తో పాటు తదితర నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. -
‘మా’ ఎన్నికల వివాదం: ఆ ఒక్కటీ అడక్కు..!
ద్వారకాతిరుమల: ‘ఆ ఒక్కటీ అడక్కు..’ ఇటీవల జరిగిన మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల తీరుపై అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ సినీఫక్కీలో స్పందించిన తీరిది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం కుటుంబసమేతంగా విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. తాను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎంత హుందాగా ఉందో.. అలా ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ చెప్పానన్నారు. మంచి అజెండాతో గెలిచినవారు మంచే చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఈవో సుబ్బారెడ్డి స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. కాగా, విజయదశమి పండుగను పురస్కరించుకుని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనంత ప్రభు శుక్రవారం చిన వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. -
సినీ గోయర్స్ అవార్డుల ప్రదానం
మాదాపూర్: మాదాపూర్లోని శిల్పకళా వేదికలో శుక్రవారం సినీ గోయర్స్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినీ రంగంపై ఆధారపడి ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. సినీ రంగం ద్వారా మంచి విషయాలను సమాజానికి త్వరితగతిన తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఇది మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ను ఇచ్చారు. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, నటులు అల్లరి నరేశ్, నాని, ప్రకాశ్రాజ్, జయప్రద, ఫైట్ మాస్టర్ రామ్లక్ష్మణ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘గల్లీ రౌడీ’ మూవీ రివ్యూ
టైటిల్ : గల్లీ రౌడీ నటీనటులు : సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, వెన్నెల కిషోర్, పొసాని కృష్ణ మురళి, మైమ్ గోపి తదితరులు నిర్మాణ సంస్థ: కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమాస్ నిర్మాతలు : యమ్.వి.వి సత్యనారయణ, కోన వెంకట్ దర్శకత్వం: నాగేశ్వర రెడ్డి సంగీతం : రామ్ మిరియాల, సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్ ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్ విడుదల తేది : సెప్టెంబర్ 17,2021 సినిమా.. సినిమాకి తన నటనతో విలక్షణత చూపిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు యంగ్ హీరో సందీప్ కిషన్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. ప్రయోగాలు చేయడంలో మాత్రం అతను వెనకడుగు వేయడు. అయితే కొద్దికాలంగా ఈ యువ హీరో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయన చేసిన సీనిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. ‘గల్లీ రౌడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? చొక్కా , బుగ్గ మీద గాటు పెట్టుకొని కాకుండా కొంచం స్టైలిష్గా వచ్చిన ఈ ‘గల్లీ రౌడీ’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. గల్లీరౌడీ కథేంటంటే..? విశాక పట్నానికి చెందిన వాసు(సందీప్ కిషన్)ని పెద్ద రౌడీని చేయాలని కలలు కంటాడు తాత మీసాల సింహాచలం(నాగినీడు). దానికి కారణం తన శత్రువు బైరాగి నాయుడు(మైమ్ గోపి)తో ఉన్న పాత కక్షలే. అయితే వాసుకు మాత్రం కొట్లాటలు అంటే అసలు నచ్చదు. కానీ తాత కోరిక మేరకు చదువు మధ్యలోనే ఆపేసి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతాడు. అయినప్పటికీ గొడవలకు దూరంగా ఉంటాడు. అయితే తను ఇష్టపడిన అమ్మాయి సాహిత్య(నేహా శెట్టి) కోసం ఓ వీధి రౌడీని కొట్టడంతో వాసుపై రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఇలా సాహిత్య కోసం రౌడీగా మారిన వాసు.. ఆమె కుటుంబం కోసం బైరాగిని కిడ్నాప్ చేయడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలో అనుకోకుండా బైరాగి హత్యకు గురవుతాడు. ఈ కేసు విచారణ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, సీఐ రవి(బాబీ సింహ) చేతికి వెళ్తుంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న రవి తనదైన శైలీలో విచారణ సాగిస్తాడు. ఇంతకీ హంతకుడిని సీఐ రవి పట్టుకున్నాడా లేదా? అసలు ఆ హత్య చేసిందెవరు? హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావు(రాజేంద్ర ప్రసాద్) ఫ్యామిలీకి , బైరాగి హత్యకు ఏం సంబంధం? సీఐ రవి ఈ కేసును ఎందుకు సీరియస్గా తీసుకున్నాడు? బైరాగికి మీసాల సింహాచలంకు మధ్య ఉన్న పాత కక్షలు ఏంటి? తాత కోరికను వాసు ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే..? గల్లీరౌడీ వాసుగా సందీప్ కిషన్ అదొరకొట్టేశాడు. వంశంపారంపర్యంగా వస్తున్న రౌడీ వృత్తి నచ్చక సాఫ్ట్వేర్ కావాలనుకొని, తాతకోసం మళ్లీ రౌడీగా మారడం, ఇష్టపడిన అమ్మాయి కోసం రిస్క్ చేయడం.. ప్రతి సీన్లో చాలా నేచురల్గా నటించాడు. హీరోగా కాకుండా చాలా సింపుల్గా ఉంటుంది అతని పాత్ర. ఫైట్స్ సీన్స్లో చక్కగా నటించాడు. ఇక సాప్ట్వేర్ సాహిత్య పాత్రలో నేహా శెట్టి అద్భుత నటనను కనబరిచింది. తెరపై చాలా అందంగా కనిపించింది. హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావుగా రాజేంద్ర ప్రసాద్ తనదైన నటనతో నవ్వులు పూయించాడు. రౌడీ సీఐ రవిగా బాబీ సింహా మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. భూకబ్జాలకు పాల్పడే రౌడీ బైరాగి నాయుడిగా మైమ్ గోపి తనదైన నటనతో మెప్పించాడు. హీరో ఫ్రెండ్గా వైవా హర్ష, చిత్ర కళాకారుడిగా వెన్నెల కిషోర్ తమదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. పొసాని, నాగినీడు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. ‘గల్లీ రౌడీ’మూవీ అందరికి తెలిసిన పాత కథే. తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిపై పగ తీర్చుకునే కొడుకు, మరో తండ్రికి పుట్టిన ఇద్దరి కొడుకుల మధ్య భిన్నాభిప్రాయలనేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇలాంటి కథలో తెలుగు చాలానే వచ్చాయి. కథలో బలమైన పాయింట్ ఉన్ననప్పటికీ.. కథనం హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకటరావు ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. కిడ్నాప్ డ్రామా కూడా రోటీన్గా, సినిమాటిక్గా సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది సగటు ప్రేక్షకుడి ఊహకు అందుతుంది. అయినప్పటికీ తనదైన స్క్రీన్ప్లేతో కొంతవరకు మ్యానేజ్ చేశాడు కోన వెంకట్. ఇంటర్వెల్ సీన్ కొంత ఆసక్తిని కలిగిస్తుంది. రౌడీలుగా ముసలి బ్యాచ్ను పెట్టడం కామెడీకి స్కోప్ దొరికింది.సెకండాఫ్ కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ‘పప్పా వెర్రి పప్పా’అంటూ వెన్నెల కిషోర్ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. రామ్ మిరియాల, సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా రీరికార్డింగ్ అదిరిపోయింది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫి పర్వాలేదు. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ సెకండాఫ్లో కొన్ని సీన్స్కి కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఒక్క నవ్వులే కాదు.. నవరసాలు కూడా!
Rajendra Prasad Biography: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి పూర్తిస్థాయి కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్. అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. దాదాపు పాతిక సంవత్సరాల పాటు హీరోగా తెలుగు ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడాయన. రాజేంద్ర ప్రసాద్ అంటే కేవలం నవ్వులు మాత్రమే కాదు. నవరసాలను అద్భుతంగా పండించగల పరిపూర్ణ నటుడు. అందుకే హీరో అవకాశాలు తగ్గాక.. సహాయనటుడిగా రకరకాల పాత్రలు పోషిస్తూ ఆడియొన్స్ను అలరిస్తూ వస్తున్నాడు. ఈ నటకిరీటీ పుట్టినరోజు ఇవాళ. సాక్షి, వెబ్డెస్క్: తెలుగు ప్రేక్షకులకు వీరాభిమానం ఉన్న నటుల్లో ఒకరు రాజేంద్ర ప్రసాద్. కానీ, అవకాశాలు ఆయనకు అంత సులువుగా రాలేదు. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1956 జులై 19న పుట్టాడు. తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ. తండ్రి ఓ టీచర్. నిమ్మకూరు సీనియర్ ఎన్టీఆర్ గారి స్వస్థలం కావడంతో, ఆయన నటనా ప్రభావం రాజేంద్రప్రసాద్ మీద పడింది. మిమిక్రీలు చేస్తూ ఎన్టీఆర్నే మెప్పించేవాడు. సిరామిక్ ఇంజినీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాక నటన అవకాశాల కోసం ఉవ్విళ్లూరాడు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరాడు. గోల్డ్ మెడల్ దక్కినా.. సినిమా అవకాశాలు మాత్రం దక్కలేదు. ఆకలి పస్తులు, ఓపిక నశించడంతో చావు తప్ప మరోమార్గం లేదు. అలాంటి టైంలో ఒక్క అవకాశం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. డబ్బింగ్తో మొదలు.. రాజేంద్ర ప్రసాద్ తన దగ్గర బంధువైన సినీ నిర్మాత, నటుడు, రచయిత అట్లూరి పుండరీకాక్షయ్య కలిశాడు. ఆ టైంలో పుండరీకాక్షయ్య ఎన్టీఆర్తో ‘మేలుకొలుపు’ సినిమా తీస్తున్నాడు. అయితే ఆ చిత్రం లోని ఒక తమిళ నటుడు పాత్రకు రాజేంద్ర ప్రసాద్తో డబ్బింగ్ చెప్పించారాయన. దీంతో కొన్నాళ్లపాటు డబ్బింగ్లు చెబుతూనే.. అవకాశాల కోసం ప్రయత్నించాడు. అలా బాపు ‘స్నేహం’లో ఓ చిన్న రోల్ దక్కింది. రాజేంద్ర ప్రసాద్ తొలి సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత చాయ, నిజం, మూడు ముళ్ల బంధం, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు, పోరాటం, ఈ చదువులు మాకొద్దు, రోజులు మారాయి, వందేమాతరం వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మంచుపల్లకి నటుడిగా రాజేంద్రుడిని మరో మెట్టు పైకి ఎక్కించింది. మలుపు తిప్పిన జమజచ్చ డైరెక్టర్ వంశీ 1985లో రాజేంద్ర ప్రసాద్ను పెట్టి హీరోగా ‘ప్రేమించు-పెళ్లాడు’ అనే సినిమా తీశాడు. కానీ, హీరో డెబ్యూ మూవీ రాజేంద్ర ప్రసాద్కి నిరాశే మిగిల్చింది. అయినా వంశీ రాజేంద్ర ప్రసాద్ను వదల్లేదు. ఈసారి కసితో ‘లేడీస్ టైలర్’(1986) తీశాడు. ఫలితం.. సంచలన విజయం. టైలర్ సుందరంగా, జాతకాల పిచ్చోడి క్యారెక్టర్లో హిలేరియస్ పర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడాయన. ఆపై అహనా పెళ్లంట లాంటి చిత్రం ఆయన కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. అటుపై అప్ అండ్ డౌన్స్తో సాగిన హీరో ప్రయాణం, సెకండ్ హీరో లీడ్స్తో సాగిపోయింది. ఇక ‘ఏప్రిల్ 1 విడుదల’లో దివాకరం పాత్ర రాజేంద్ర ప్రసాద్కు కంప్లీట్ కామెడీ హీరో ట్యాగ్ను తెచ్చిపెట్టింది. ‘జయమ్ము నిశ్చయమ్మురా, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజను దొంగలు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, మేడమ్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, శ్రీరామ చంద్రులు..‘అబ్బో...’ఇలా చెప్పుకుంటూ బోలెడన్ని సినిమాల్లో తన స్టైల్ యాక్టింగ్తో మెప్పించారాయన. ఆల్రౌండర్ నటన వరుసగా కామెడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఫ్యామిలీ హీరోగానూ ఆయనకు ఒక ముద్రపడిపోయింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కెరీర్ తొలినాళ్లలో సీరియస్ పాత్రలు సైతం పోషించారు. ఛాలెంజ్లో విద్యార్థిగా ఓ ముఖ్యపాత్రలో, కాశ్మోరాలో దార్కాగా, ప్రేమ తపస్సులో రత్తయ్యగా అమాయకుడి పాత్రలో, ఎర్రమందారంతో పాటు ముత్యమంత ముద్దులో ప్రేమ సన్యాసిగా అనుదీప్ క్యారెక్టర్లో అలరించాడు. అయితే హీరోగా అవకాశాలు తగ్గిపోతున్న టైంలో ఆయన యాక్టింగ్ కెరీర్లో ఓ మరిచిపోలేని గుర్తింపు ఇచ్చింది ‘ఆ నలుగురు’. రఘురామ్ పాత్రలో నలుగురి మంచి కోరే వ్యక్తిగా ఆయన నటన అందరితో కంటతడి పెట్టించింది. టామీ, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు లాంటి చిత్రాలు కూడా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. ఇక హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, సుప్రీమ్, శమంతకమణి, కౌసల్య కృష్ణమూర్తి, అలా వైకుంఠపురంలో.. ఇలా ఆయన నటనా ప్రస్తానం కొనసాగుతూ వస్తోంది. అంతేకాకుండా హాలీవుడ్ లోనూ “క్విక్ గన్ మురుగన్” చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మించారు, అలాగే 2012లో ‘డ్రీమ్’ ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్స్లో ప్రదర్శితం ద్వారా నటకిరీటికి వరల్డ్ ఫేమ్ తెచ్చిపెట్టింది. సపోర్టింగ్ రోల్స్, కామెడీ వేషాలేసివాళ్లు కూడా హీరోగా సక్సెస్ కావొచ్చని ప్రూవ్ చేసిన తెలుగు నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కానీ, ఆ కష్టం వెనుక ఆయన నిర్మించుకున్న ‘హ్యూమర్’ అనే సెపరేట్ ట్రాక్ ఒకటి ఉంది. తర్వాతి కాలంలో ఎందరో హీరోలు ఆ దారిలో ప్రయాణించాలని ప్రయత్నించారు. అయితే ఆయన అందించిన నవ్వుల మార్క్ను మాత్రం ఎవరూ క్రాస్ చేయలేకపోతున్నారనడం అతిశయోక్తేం కాదు. -
ఆ అభినందనలను ఎప్పటికీ మర్చిపోలేను: రాజేంద్ర ప్రసాద్
‘‘నా కెరీర్లో చేసిన సరికొత్త ప్రయత్నం ‘గాలి సంపత్’. ‘అన్నయ్యా.. ఈ చిత్రంలో ఆస్కార్ అంత పర్ఫార్మెన్స్ చేశావు’ అనే అభినందనలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. నా గుండెల్లో ఉంచుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శ్రీవిష్ణు, లవ్లీ సింగ్ జంటగా అనీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో షైన్ స్క్రీన్స్తో కలిసి ఎస్.కృష్ణ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఫిలిం స్కూల్లో ఉన్నప్పుడు నాకు మైమ్ పర్ఫార్మెన్స్లోనే గోల్డ్ మెడల్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలకు ఆ డ్రెస్ వేసుకుని స్టేజ్ మీదకు రావడానికి మా మైమ్ మధునే కారణం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని గ్యారెంటీగా చెప్పగలను’’ అన్నారు ఎస్.కృష్ణ. ‘‘మీ పిల్లలు, కుటుంబంతో సినిమా చూస్తే మరింత ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘మైమ్ ముఖ అభినయాన్ని సినిమాలో పెట్టాలంటే దమ్ముండాలి. ఎస్.కృష్ణగారి ఆలోచనకి హ్యాట్సాఫ్’’ అన్నారు మైమ్ మధు. ఈ కార్యక్రమంలో కమెడియన్ సత్య, హీరోయిన్ లవ్లీ సింగ్ మాట్లాడారు. చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్న జాతిరత్నం నవీన్ పొలిశెట్టి -
'గాలి సంపత్' మూవీ రివ్యూ
చిత్రం: ‘గాలి సంపత్’; తారాగణం: రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు, లవ్లీ సింగ్, సత్య, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీశ్ కురువిల్లా; కథ: ఎస్. కృష్ణ; సంగీతం: అచ్చు రాజమణి; కెమేరా: సాయి శ్రీరామ్; ఎడిటింగ్: బి. తమ్మిరాజు; నిర్మాతలు: ఎస్. కృష్ణ, హరీశ్ పెద్ది, సాహూ గారపాటి; సమర్పణ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి; దర్శకత్వం: అనీశ్ కృష్ణ; నిడివి: 119 నిమిషాలు; రిలీజ్: మార్చి 11 కొన్ని కాన్సెప్టులు వినడానికి చాలా బాగుంటాయి. ఉద్విగ్నతకు గురిచేస్తాయి. అయితే, ఆ కాన్సెప్టును సరైన రీతిలో కథగా డెవలప్ చేసుకొని, ఆసక్తికర సన్నివేశాలతో అల్లుకున్నప్పుడే పూర్తిస్థాయి సినిమా స్క్రిప్టు అవుతుంది. లేదంటే, మంచి కాన్సెప్టు సైతం మెచ్చుకొనే రీతిలో తయారు కాలేదని పెదవి విరవాల్సి వస్తుంది. ‘గాలి సంపత్’ చూశాక ఇలాంటి ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతాయి. ప్రకృతి దైవం లాంటిది. అప్పుడప్పుడు కొంత హాని చేసినట్టనిపించినా, దాని స్వభావం మనల్ని రక్షించడమే అనే పాయింట్ చెప్పేందుకు ఈ 2 గంటల చిన్న సినిమాలో ప్రయత్నించారు. కథేమిటంటే..: అరకులో ట్రక్కు డ్రైవర్ సూరి (శ్రీవిష్ణు). తల్లి లేని అతనికి తండ్రి సంపత్ (రాజేంద్రప్రసాద్) ఒక్కడే ఉంటాడు. నోట మాట పోవడంతో, ‘‘ఫి... ఫి... ఫీ’’ అంటూ గాలితో మాట్లాడుతుంటాడు కాబట్టి, ఆ తండ్రి పేరు గాలి సంపత్. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని నాటక పోటీలలో పాల్గొంటూ, ఉంటాడు గాలి సంపత్. ఆ ఊరి సర్పంచ్ కూతురు (లవ్లీ సింగ్)ను ప్రేమిస్తాడు సూరి. అప్పులు తీర్చేసి, ఎలాగైనా ఓ ట్రక్కు కొనుక్కొని, ఆమెను పెళ్ళాడాలని మనోడి ప్లాన్. ఓ బ్యాంకు మేనేజర్ను మొహమాటపెట్టి, 5 లక్షలు తెస్తాడు. తీరా నాటక పోటీల కోసం ఆ డబ్బు అతని తండ్రి తీస్తాడు. దాంతో, కంటికి కనిపించకుండా పొమ్మని కొడుకు అంటాడు. ఆ క్రమంలో హోరున కురుస్తున్న వర్షంలో ఇంటి వెనకే లోతైన పెద్ద గోతిలో పడిపోతాడు తండ్రి. పైకి మాట్లాడలేని, అరవలేని ఆ మనిషి ఆ గోతిలో పడ్డ సంగతి ఎవరూ గమనించరు. అతనికై వెతుకులాట సాగుతుంది. తండ్రిని ద్వేషిస్తున్న కొడుకుకు తన కోసం చిన్నప్పుడు తండ్రి చేసిన త్యాగం లాంటివన్నీ సెకండాఫ్లో ఫ్లాష్ బ్యాక్లో వస్తాయి. చివరకు ప్రకృతిని ద్వేషించిన తండ్రికి ఆ ప్రకృతే ఎలా సహకరించింది, అతని అభినయ ప్రతిభ ఎలా బయటపడిందన్నది అక్కడక్కడ మెరుపులతో సాగే మిగతా కథ. ఎలా చేశారంటే..: లేటు వయసులో ఘాటు పాత్ర దక్కడం ఏ నటుడికైనా వరం. నాలుగు దశాబ్దాల పైచిలుకు తరువాత నటుడు రాజేంద్రప్రసాద్ కు ఇప్పుడు అలాంటి వరం మరోసారి దక్కింది. ఈ సినిమా టైటిల్ రోల్ ఆయనదే. ఇంకా చెప్పాలంటే, కథ అంతా ఆయన చుట్టూరానే తిరుగుతుంది.ఆయన తన నట విశ్వరూపం చూపెట్టారు. శ్రీవిష్ణు బాగా చేశారు. మహారాష్ట్ర మోడలింగ్ అమ్మాయి లవ్లీ సింగ్ ఈ సినిమాలో అందానికీ, అభినయానికీ కూడా తక్కువే. మిగిలిన పాత్రల్లో గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా శ్రీకాంత్ అయ్యంగార్, ఆడిటింగ్ ఆఫీసర్ గా అనీశ్ కురువిల్లా లాంటి వారి కామెడీ అక్కడక్కడ ఫరవాలేదనిపించినా, అతిగా సాగదీసే సరికి ఉసూరుమనిపిస్తుంది. ఎలా తీశారంటే..: వరుస హిట్లతో జోరు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ఈసారి ఈ చిన్న కథ, తెలుగు తెరపై కొత్త ప్రయత్నంతో సినీ నిర్మాణంలోకీ వచ్చారు. తానే మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అరకులో చిత్రీకరించిన ఈ సినిమాలో ప్రధానమైనది తండ్రీ కొడుకుల సెంటిమెంట్. అది అక్కడక్కడా పండింది. కానీ, కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడో తండ్రికి తెలియకపోవడం, సాక్షాత్తూ కొడుకు పెళ్ళినే అతను చెడగొట్టడం అంత కన్విన్సింగ్గా లేదు. ఫ్లాష్బ్యాక్ బాగున్నా, తన చిన్నప్పుడు ఏం జరిగిందో కళ్ళారా చూసిన కొడుకుకు ఇంకొకరు చెప్పేవరకు అసలేం జరిగిందో తెలియదనడమూ పెద్దగా అతకలేదు. తీసుకున్న పాయింట్ బాగున్నా, కథారచనలో ఇలాంటి ఇబ్బందులున్నాయి. సహజ పరిణామ క్రమంగా కాక, అనుకున్నట్టల్లా సంఘటనలు జరిగిపోయే సినిమాటిక్ లిబర్టీలూ బోలెడు. ఫస్టాఫ్లో చాలా భాగం అసలు కథకు రంగం సిద్ధం చేయడంతోనే సరిపోతుంది. రాజేంద్రప్రసాద్ మూకాభినయ (మైమ్) ప్రదర్శన దగ్గర నుంచి కాస్తంత ఊపు వస్తుంది. గోతిలో పడడ మనే పాయింట్ చుట్టూరానే కథ నడిస్తే బాగుండేది. కానీ, తీసుకున్న పాయింట్ చిన్నది కావడంతో కామెడీని జొప్పించే ప్రయత్నం చేశారు. అది అసలు కథా గమనానికి అడ్డమై కూర్చుంది. సెంటిమెంట్ పండుతున్న చాలా సందర్భాల్లో అనవసరపు హాస్యం అడ్డం పడినట్టు అనిపిస్తుంది. మరింత బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగులు మనసుకు హత్తుకుంటాయి. డైలాగులు లేని మైమ్ ప్రదర్శన, క్లైమాక్స్ గోతి సీన్ లాంటి చోట్ల అచ్చు రాజమణి నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకించి ప్రస్తావించి తీరాలి. ఇవన్నీ సినిమాలో మంచి జీడిపలుకులు. కానీ, ఓవరాల్ గా వంటకంలోనే తీపి తగ్గింది. కొసమెరుపు: కథ తక్కువ! గాలి ఎక్కువ!! బలాలు: ►రాజేంద్రప్రసాద్ విశ్వరూపం, శ్రీవిష్ణు నటన ►అక్కడక్కడ మెరిసిన డైలాగ్స్, సెంటిమెంట్ ►కీలక సందర్భాల్లో నేపథ్య సంగీతం బలహీనతలు: ∙నిదానంగా సాగే ఫస్టాఫ్ ►కథను పక్కదోవ పట్టించే అనవసరపు ట్రాక్లు ►సాగదీసిన గ్రామీణ బ్యాంక్ కామెడీ ►రచయిత అనుకున్నట్టల్లా నడిచే సినిమాటిక్ సంఘటనలు రివ్యూ: రెంటాల జయదేవ -
ఇది సెంటిమెంట్ గాలి
-
నా సంపాదన అంతా ఊడ్చేశారు: రాజేంద్ర ప్రసాద్
నట కిరీటి, నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్. ఆయన సినిమా వస్తుందంటే అటు వినోదాన్ని పంచుతూనే ఇటు సందేశాన్ని కూడా అందిస్తాడు. అయితే స్క్రీన్ మీద కామెడీని పండించే ఆయన నిజ జీవితంలో కాస్త గంభీరంగా ఉంటాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో వెల్లడించాడు. ఇక ఇంజనీరింగ్ పూర్తవగానే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిన రాజేంద్ర ప్రసాద్ గోల్డ్మెడల్తో బయటకు వచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా గాలి సంపత్ సినిమాలో ఫఫ్ఫఫ్ఫా.. భాషతో అభిమానులను అలరించనున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలోని బాధాకరమైన సంఘటనలను తలుచుకుని చింతించాడు. "నేను నటనారంగంలోకి ప్రవేశించిన సమయంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్బాబు, కృష్ణ తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే ఏదైనా స్పెషాలిటీ ఉండాలనుకున్నాను. దీంతో చార్లీ చాప్లిన్ సినిమాలు చూసి నాకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకున్నాను. అలా సినిమాలు చేసుకుంటూ పోయాను. కానీ ఒకానొక సమయంలో దగ్గరివాళ్లే నన్ను ఆర్థికంగా మోసం చేశారు. నేను సంపాదించిందంతా ఊడ్చుకుపోయారు. నమ్మినవాళ్లే ఇంత దారుణంగా ఎలా మోసం చేస్తారని షాకయ్యాను" అని రాజేంద్రప్రసాద్ తెలిపాడు. కాగా 40 సంవత్సరాల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న రాజేంద్ర ప్రసాద్ తాజాగా క్లైమాక్స్, గాలి సంపత్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. మరోవైపు జయప్రదతో కలిసి ‘లవ్ – 60’ అనే సినిమా చేయనున్నాడు. చదవండి: నెట్ఫ్లిక్స్: జిందగీ ఇన్ షార్ట్ మూవీ రివ్యూ చిరంజీవికి శర్వానంద్ పాధాభివందనం -
ఆ పేరు ఎందుకు పెట్టామో క్లైమాక్స్లో తెలుస్తుంది
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో భవానీ శంకర్ దర్శకత్వంలో రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇది 60 ఏళ్ళ వ్యక్తికి చెందిన కథ. ఓ స్టార్ హోటల్లో ఉన్న ఓ మల్టీ మిలియనీర్ హత్యకు గురవుతాడు. అతని గదిలోని 500 కోట్ల రూపాయల డబ్బు కూడా మాయం అవుతుంది. అసలు డబ్బు ఏమైంది? హత్య చేసింది ఎవరు? అనే అంశాలతో కథనం ఉంటుంది. సినిమాలో రాజేంద్ర ప్రసాద్గారి పాత్ర పేరు విజయ్ మోడీ. ఆయన పాత్రకు ఈ పేరు ఎందుకు పెట్టాం? అనే విషయం క్లైమాక్స్లో తెలుస్తుంది’’ అని అన్నారు. -
గాలి సంపత్ ట్రైలర్: నవ్విస్తూనే ఏడిపించిన నట కిరీటి
ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్తో ఈ సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా.. మూవి ట్రైలర్ని విడుదల చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్తో పాటు కామెడీని కూడా పంచడం విశేషం. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది’ అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. మాటలు రాని రాజేంద్ర ప్రసాద్కు హీరో కావాలని ఉంటుంది. కానీ ఆయన నిర్ణయం కొడుకు (శ్రీ విష్ణు)కు నచ్చదు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాదం జరిగినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘ప్రతి అమ్మాయికీ డబ్బున్నోడే కావాలి.. లేకపోతే ఫారినోడు కావాలి.. డబ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డబ్బే ఇస్తాడు. టైమ్ ఎక్కడి నుంచి ఇస్తాడు' అంటూ హీరోయిన్తో హీరో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి 'గాలి సంపత్' సినిమాలో కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్ని కూడా చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. చదవండి : ‘పుష్ప’ అప్డేట్.. లీక్ చేసిన జానీ మాస్టర్ ఎన్టీఆర్ ధరించిన మాస్క్ ధరెంతో తెలుసా? -
నా నటన చూసి షాక్ అవుతారు
‘‘క్లైమాక్స్’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకూ నేను ఎప్పుడూ చేయని పాత్రలో నటించాను. ఈ సినిమాలో నా నటన చూసి షాక్కు గురవుతారు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ‘డ్రీమ్’ ఫేమ్ భవానీ శంకర్. కె. దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృధ్వీ, శివ శంకర్ మాస్టర్, రమేష్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘క్లైమాక్స్’. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ను తెలంగాణ యఫ్.డి.సి.చైర్మన్ రామ్మోహన్ రావు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశామనే దానికంటే, మన కంటెంట్ ఎంత మందికి రీచ్ అయింది అనేది ముఖ్యం. ‘క్లైమాక్స్’ సినిమా ప్రేక్షకులందరికీ రీచ్ అవ్వాలి.. అప్పుడే భవానీ శంకర్లాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు’’ అన్నారు. భవాని శంకర్ మాట్లాడుతూ– ‘‘ రాజేంద్ర ప్రసాద్గారు గొప్ప నటుడు. 40 సంవత్సరాల నుండి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఎస్.వి.రంగారావు తర్వాత నాకు రాజేంద్ర ప్రసాద్గారే కనిపిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్ సాషా సింగ్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్, నిద్వాన, కెమెరా: రవి కుమార్ నీర్ల. -
‘క్లైమాక్స్’ లో నా నటనను చూసిన షాక్ అవుతారు’
నటకిరీటి రాజేంద్రప్రసాద్తో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని ఎలిమెంట్స్ తో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విధంగా డఫరెంట్ కాన్సెప్ట్ తో ‘క్లైమాక్స్’ సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాం’అని అంటున్నారు చిత్ర దర్శకుడు భవాని శంకర్. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్, సాషా సింగ్,శ్రీ రెడ్డి,పృద్వి,శివ శంకర మాస్టర్,రమేష్ నటీనటులుగా భవాని శంకర్. కె. దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి ,రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు యఫ్.డి.సి.చైర్మన్ రామ్మోహన్ రావు , ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొని "క్లైమాక్స్" చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘భవాని శంకర్ ఒక డిఫరెంట్,టఫ్ సబ్జెక్ట్ తో నా ముందుకు వచ్చాడు. ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయనటువంటి పాత్రలో నటించాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా షాక్ కు గురవుతారు. మనం సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశాము అనే దానికంటే మన కంటెంట్ ఎంత మందికి రీచ్ అయింది అనేది ఇంపార్టెంట్. అందరి సపోర్ట్ తో ఈ మూవీ ప్రేక్షకులందరికీ రీచ్ అవ్వాలి అప్పుడే ఇలాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు. తను తీసిన డ్రీమ్ సినిమా కమర్షియల్ గా ఎంతో హిట్టయింది. ఆ సినిమాకు తను ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ "క్లైమాక్స్" చిత్రం ద్వారా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇలాంటి మంచి మూవీలో అద్భుతమైన పాత్ర ఇచ్చిన భవానీశంకర్ నా కృతజ్ఞతలు.ఇందులో ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. నేను చేసిన గెటప్స్, క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా నేను ఎంతో ఇష్టపడి, ముచ్చటపడి నటించడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందనిఅభినందించడమే కాక మీరే 100 మందికి చూడమని చెప్పేలా ఉంటుంది’అని రాజేంద్రప్రసాద్ అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ దర్శనంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు, భాజపా ఎమ్మెల్సీ మాధవ్, జాతీయ పిల్లల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్.జీ.ఆనంద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, వైయస్ఆర్ టియుసి అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వీరిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరర్వాత హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 2020 మనందరికీ అద్భుతమైన పాఠాలు నేర్పిందన్నారు. కరోనా పరీక్షలు పెట్టి ఎన్నో పాఠాలు నేర్చుకునేలా చేసిందన్నారు. జీవితం అంటే ఏమిటో.. ఎలా బ్రతకాలో ప్రజలందరికీ స్వామి వారు కరోనాతో తెలియజేశారని తెలిపారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడం అందరి అదృష్టంగా అభివర్ణించారు. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించడం సంతోషంగా ఉందన్నారు. తర్వాత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021 సంవత్సరంలో కొత్త సినిమాలతో అందరి ముందుకు రాబోతున్నానని చెప్పుకొచ్చారు. (నేడు తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల ) -
పడ్డారండి ప్రేమలో మరి!
రాజేంద్ర ప్రసాద్ ప్రేమలో పడ్డారు. ఇది లేటు వయసులో క్యూటు ప్రేమ అట. అయినా ప్రేమకు వయసేంటి? ఈ ప్రేమ అంతా సినిమా కోసమే. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ముఖ్య పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘లవ్ – 60’ టైటిల్. ఈ సినిమాకు వీయన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తారు. అరవైలలో ప్రేమలో పడే జంటగా రాజేంద్ర ప్రసాద్, జయప్రద కనిపిస్తారు. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం ఈ సినిమాను రూపొందించనున్నారు. -
రాజేంద్ర ప్రసాద్ను కలిసిన సోము వీర్రాజు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ను కలిశారు. సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సోము వీర్రాజును శాలువాతో సత్కరించారు. సినీ నటి హేమ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా సోము వీర్రాజు గతంలో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా ఆయనతో సమావేశమయ్యారు. (చదవండి: టీడీపీ హయాంలో విచ్చలవిడి అవినీతి) -
శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ వీరంగం
సాక్షి, అమరావతి : శాసన మండలిలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వీరంగం సృష్టించారు. పంచాయతీరాజ్ సవరణ చట్టంపై చర్చ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై అసభ్య పదజాలంతో దూషించారు. చూసుకుందాం రా అంటూ హెడ్ఫోన్ విసిరేసి మంత్రి వెల్లంపల్లి వైపు దూసుకొచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు రాజేంద్రప్రసాద్ని అడ్డుకున్నారు. కాగా, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీరును వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. -
అరకులో గాలి సంపత్
శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, డా. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఎస్. క్రిష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అరకులో జరుగుతోంది. ‘‘తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక వైవిధ్యమైన భావోద్వేగంతో రూపొందుతోన్న చిత్రమిది. అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో అందమైన ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం అరకులో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణుతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: అచ్చు రాజమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్. -
అచ్చ తెలుగు కథ
దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా ‘గాలి సంపత్’ చిత్రం ప్రారంభమైంది. టైటిల్ రోల్ను రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఎస్.కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్కి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. వరుణ్ తేజ్ గౌరవ దర్శకత్వం వహించగా, స్క్రిప్ట్ను అనీష్ కృష్ణకు నిర్మాత ఎస్వీసీ శిరీష్ అందజేశారు. ‘‘నేనీ సినిమాకు స్క్రీన్ప్లే అందిస్తున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘అచ్చ తెలుగు స్క్రిప్ట్ ఇది’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగమోహన్ బాబు ఎమ్. -
‘మిస్’ అయింది!
చిత్రం: ‘మిస్ ఇండియా’; తారాగణం: కీర్తీసురేశ్, జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేశ్, నదియా, కమల్ కామరాజు; కెమేరా: సుజిత్ వాసుదేవ్; ఎడిటింగ్: తమ్మిరాజు; సంగీతం: తమన్; నిర్మాత: మహేశ్ కోనేరు; దర్శకత్వం: నరేంద్రనాథ్; రిలీజ్ తేదీ: నవంబర్ 4; ఓ.టి.టి. వేదిక: నెట్ ఫ్లిక్స్. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎప్పుడూ కత్తి మీద సామే. జనానికి నచ్చితే బ్రహ్మరథం పడతారు. లేదంటే, ఇంతే సంగతులు. ఈ సంగతి తెలిసీ, హీరోయిన్ కీర్తీ సురేశ్, దర్శక, నిర్మాతలు చేసిన సాహసం – ‘మిస్ ఇండియా’. ఆడవాళ్ళు ఆఖరికి వ్యాపార రంగంతో సహా దేనిలోనూ మగవాళ్ళకు తీసిపోరనే విషయాన్ని నిరూపించడానికి, అమెరికా నేపథ్యంలో, ఇండియన్ టీ తయారీ కథతో వండిన వెండితెర వంటకం ఇది. కథేమిటంటే... విశాఖ దగ్గరి లంబసింగి గ్రామంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు తోబుట్టువుల్లో ఒకరిగా పుట్టిన అమ్మాయి మానసా సంయుక్త (కీర్తీ సురేశ్). ‘‘అమ్మాయి బిజినెస్ చేయడమనేది మాటల్లోనే కాదు... మనసులో నుంచి కూడా తీసేయ’’మనే అన్నయ్య (కమల్ కామరాజు), తల్లితండ్రుల (నరేశ్, నదియా) మధ్య పెరుగుతుంది హీరోయిన్. అయితే, సకల రోగ నివారిణిగా రకరకాల మూలికలతో టీ ఇచ్చే ఆయుర్వేద వైద్యుడైన తాతయ్య విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్) నుంచి ఆ విద్య నేర్చుకుంటుంది. ఎం.బి.ఎ చదివాక, వ్యాపారవేత్తగా మారి, తాత పేరు నిలబెట్టాలనుకుంటుంది. అనుకోకుండా ఆ కుటుంబం అమెరికాకు మారాల్సి వస్తుంది. అక్కడ జరిగే రకరకాల సంఘటనల మధ్య హీరోయిన్ కుటుంబం నుంచి బయటకు వస్తుంది. అక్కడికి సినిమా సగం అవుతుంది. ‘మిస్ ఇండియా’ అనే బ్రాండ్ ఇండియన్ టీ తయారీతో వ్యాపారంలో తన జెండా ఎగరేయాలని హీరోయిన్ ఆలోచన. కానీ, అక్కడి బడా బిజినెస్ మ్యాన్, ప్రసిద్ధ కాఫీ తయారీ సంస్థ యజమాని కైలాశ్ శివకుమార్ (జగపతిబాబు)తో ఆమెకు ప్రతిఘటన ఎదురవుతుంది. ‘‘ఆ కాఫీ కన్నా పదిరెట్లు బాగుండే టీ’’ చేసే హీరోయిన్కూ, ‘‘బిజినెస్ ఈజ్ ఎ వార్’’ అని భావించే ఆ విలన్కూ మధ్య పోరాటంలో హీరోయిన్ ఎలా తుది విజయం సాధించిందనేది చాలా ఓపికగా చూడాల్సిన మిగతా సినిమాటిక్ స్టోరీ. ఎలా చేశారంటే... ‘మహానటి’ తరువాత కీర్తీ సురేశ్ ఒప్పుకున్న ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమాకు ప్రధాన బలం కూడా ఆమే. ఈ కథ, ఇందులోని పాత్ర కోసం ఆమె కాస్తంత అతిగానే సన్నబడ్డారు. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు శతవిధాల ప్రయత్నించారు. జగపతిబాబు స్టైలిష్గా విలన్ పాత్రలో బాగున్నారు. కానీ, చిత్ర రూపకర్తలు ఈ కీలక పాత్రల స్వరూపాల మీద పెట్టినంత శ్రద్ధ వాటి స్వభావ చిత్రణ, వివిధ పరిస్థితుల్లో వాటి ప్రవర్తన మీద పెట్టినట్టు లేరు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావడం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కావడం లాంటివి సినిమాటిక్గా జరిగిపోతుంటాయి. ఎలా తీశారంటే... ఈ సినిమాకు మరో ప్రధాన బలం కొన్నిసార్లు సీన్నూ, పాత్రలనూ కూడా కమ్మేసిన డైలాగు మెరుపులు (రచన – నరేంద్రనాథ్, తరుణ్ కుమార్). ‘‘గొప్పతనం అనేది ఒక లక్షణం. అది ఒకరు గుర్తించడం వల్ల రాదు. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు’’, ‘‘జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యం’’, ‘‘డబ్బు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ, నచ్చినపని అనుభూతిని ఇస్తుంది’’, ‘‘ఇఫ్ యు ఓన్ట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్, సమ్వన్ విల్ హైర్ యు టు బిల్డ్ దెయిర్ డ్రీమ్స్’’ లాంటి మరపురాని డైలాగులు చాలానే ఉన్నాయి. తమన్ సంగీతంలో ఈ సినిమాలో పదే పదే వచ్చే థీమ్ మ్యూజిక్, ‘నా చిన్ని లోకమే చేజారిపోయెనే..’ అనే బిట్ సాంగ్ (రచన – నీరజ కోన) కొన్నాళ్ళ పాటు చెవుల్లో రింగుమంటాయి. అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బాగున్నా... కథనంలోని లోపాలు ఈ సినిమాకు శాపాలు. అసలు పోరాటం ఆరంభం కాకపోవడంతో, సినిమా ఫస్టాఫ్ నిదానంగా సాగుతుంది. అసలు కథ మొత్తం సెకండాఫ్లో చెప్పాల్సి వచ్చేసరికి తొలి చిత్ర దర్శకుడు తడబడ్డారు. తాత పేరును అందరికీ తెలిసేలా చేస్తాననే హీరోయిన్, అసలు పోరాటంలో ఆ ఊసే ఎత్తకపోవడం లాంటి లోపాలూ ఉన్నాయి. వెరసి, ఏ రంగమైనా పురుషుల గుత్తసొత్తు కాదు, ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుంటారనే మంచి పాయింట్ను తీసుకున్నా, దాన్ని సరైన స్క్రిప్టుగా తీర్చిదిద్దలేకపోయారు. కథన లోపాలతో, కథ తడబడితే ఎలా ఉంటుందో చూడడానికి ‘మిస్ ఇండియా’ మరో ఉదాహరణ. అతి సినిమాటిక్ లిబర్టీలు, పాత్రల మీద ప్రేక్షకులకు సహానుభూతి కలగనివ్వని ఫేక్ ఎమోషన్లు ఇందులో పుష్కలం. అందుకే, బలమైన పాయింట్, పేరున్న పెర్ఫార్మర్లు ఉన్నా... ‘మిస్ ఇండియా’ వెండితెరపై వెలవెలపోయింది. కొసమెరుపు: టార్గెట్ ‘మిస్’ అయింది! బలాలు: కీర్తీసురేశ్, జగపతిబాబు లాంటి నటులు ∙తళుక్కున మెరిసే మంచి డైలాగులు ∙థీమ్ మ్యూజిక్, ‘నా చిన్నిలోకమే..’ బిట్ సాంగ్ ∙అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బలహీనతలు: ∙కథనంలో, క్యారెక్టరైజేషన్లో లోపాలు ∙స్లోగా సాగే ఫస్టాఫ్. కీలకమైన సెకండాఫ్లో తడబాట్లు ∙అతి సినిమాటిక్ లిబర్టీలు, ఫేక్ ఎమోషన్లు ∙అందాల పోటీ గురించి అని పొరబడేలా చేసే టైటిల్ ∙తేలిపోయిన క్లైమాక్స్ – రెంటాల జయదేవ -
సూపర్ స్టెప్
కల్యాణ్దేవ్, రచితారామ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రిజ్వాన్, ఖుషీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. కల్యాణ్ దేవ్తో పాటు నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఈ పాటలో నటిస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టెప్పులేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. తమన్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటతో పాటు మరో పాట చిత్రీకరిస్తే సినిమా పూర్తయినట్లే. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘లవ్స్టోరీ మిక్స్ చేసిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మా ‘సూపర్మచ్చి’. కల్యాణ్దేవ్ నటన, రచితారామ్ సినిమాకు ప్లస్సవుతుంది. తమన్ సంగీతం మా సినిమాకు హైలెట్ అవుతుంది’’ అన్నారు. -
మల్టీజానర్ క్లైమాక్స్
పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రం ‘క్లైమాక్స్’. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై పి.రాజేశ్వరరెడ్డి, కె. కరుణాకర్ రెడ్డి తెరకెక్కించారు. భవానీ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ను కీలక పాత్రను పోషించిన నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రదర్శకుడు భవానీ శంకర్తో గతంలో నేను ‘డ్రీం’ అనే ౖసైకలాజికల్ థ్రిల్లర్లో నటించాను. ఆ చిత్రం రాయల్రీల్ అనే ప్రతిష్టాత్మక అవార్డుతోపాటు మరో 7 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. కానీ, ఓ జానర్ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే ఆదరించారని మా ఇద్దరి అభిప్రాయం. అందుకే ఈసారి కామెడీ, లవ్, ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్.. ఇలా మల్టీజానర్ కథతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు భవానీ శంకర్. -
వినాయక్ చేతుల మీదుగా చెక్మేట్ ట్రైలర్
నట కిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చెట్మేట్ ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్, సందీప్, విష్ణుప్రియ, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ ఆవిష్కరించిన సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ.. ‘సినిమా ట్రైలర్ చాలా బాగుంది .నేటి యువత అభిరుచులకు అద్దం పడుతూ అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలతో సినిమా వుంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. రాజేంద్రప్రసాద్,బ్రహ్మానందం,రఘుబాబు,కృష్ణ భగవాన్ వంటి సీనియర్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. దర్శకుడు ప్రసాద్ నాకు మంచి మిత్రుడు.అతను చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’అని తెలిపారు. దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో యూత్ ముఖ్యంగా అమ్మాయిలు.. వాళ్లకు ఏదైనా సమస్య వస్తే డైర్యంగా ఆసమస్య ను పరిష్కరించుకోలేక, ఆ సమస్యను ఎవరికి చెప్పుకోలేక అత్మ హత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా సమస్యను దైర్యం గా పరిష్కరించుకోవాలి అనే పాయింట్తో నలుగురు వ్యక్తులు వాళ్లకు వచ్చిన సమస్యలను వాళ్ళు ఎలా దైర్యం గా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాము. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రఘుబాబు మిగతా అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. సినిమా అందరికీ నచ్చే విధంగా భారీ స్టార్ కాస్ట్తో, మలేషియా సింగపూర్లలోని బ్యూటిఫుల్ లోకేషన్స్లో తెరకెక్కించాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ట్రైలర్ రిలీజ్ చేసి మా చిత్రాన్ని తన సినిమాగా మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న వినాయక్ గారికి ధన్యవాదాలు’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి, మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్: మహతి, ఎడిటర్: క్రాంతి, లిరిసిస్ట్: రెహమాన్, కో ప్రొడ్యూసర్: కే.కామేశ్వర్. -
అందరికీ కనెక్ట్ అవుతుంది
‘‘కన్నడలో ఘన విజయం సాధించిన ‘కాలేజ్ కుమార్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాం. తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలు ఈ సినిమాలో మెయిన్ హైలైట్. ప్రస్తుతం విద్యావిధానం ఎలా ఉంది? మన చదువుకు తగ్గట్లు ఉద్యోగం చేస్తున్నామా?.. వంటి విషయాల్ని ఈ సినిమాలో చర్చించాం’’ అన్నారు రాహుల్ విజయ్. కన్నడ ‘కాలేజ్ కుమార్’ చిత్రదర్శకుడు హరి సంతోష్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటించారు. లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ డ్రామా, ఎమోష¯Œ ్స ఉన్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. నేను ప్రతి సినిమా నుండి కొంత నేర్చుకుంటూ వస్తున్నాను. ఒక నటుడిగా నా వంతు పూర్తి కృషి చేస్తాను.. ఫలితం అనేది మన చేతిలో ఉండదు. కన్నడ ప్రేక్షకులు ఆదరించిన ట్టు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇందులో రాజేంద్రప్రసాద్, మధుబాల, నాజర్గార్లతో పని చేయడం సంతోషంగా అనిపించింది.. వారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రసుతం ‘బ్లాక్ అండ్ వైట్‘ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
రాహుల్ పెద్ద హీరో కావాలి : గోపిచంద్
తమని యాక్షన్ హీరోలుగా మలచిన విజయ్ మాస్టర్ కుమారుడు రాహుల్ పెద్ద హీరో కావాలని హరో గోపిచంద్ ఆకాంక్షించారు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాలేజ్ కుమార్’. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రంతో హరి సంతోష్ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో రాహుల్ విజయ్ సరసన ప్రియా వడ్లమాని హీరోయిన్గా నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, మధుబాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 6న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను సోమవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకకు హీరో గోపిచంద్, దర్శకుడు గోపిచంద్ మలినేని, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ‘ఈ కథ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది. రాహుల్, రాజేంద్రప్రసాద్ గారి కెమిస్ట్రీ బాగుంటుందని ట్రైలర్ చూస్తే తెలిసింది. రాజేంద్రప్రసాద్ గారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు వయసు పెరుగుతుందో, తగ్గుతుందో తెలియడం లేదు. ఆయన ఎనర్జీ చూస్తే అలా అనిపిస్తుంది. ఆయన ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయడం సినిమా బాగా వచ్చిందనే నమ్మకాన్ని పెంచింది. దర్శకుడికి ఈ సినిమా తెలుగులో మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఈవెంట్ కి రావడానికి కారణం విజయ్ మాస్టర్. ఆయన మాట నేనెప్పుడూ కాదనను. మాలాంటి హీరోలకు యాక్షన్ ఇమేజ్ వచ్చిందంటే కారణం విజయ్ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ల కృషే కారణం. అలాంటి మాస్టర్ ఇంట్లో నుంచి వస్తున్న అబ్బాయి రాహుల్. మమ్మల్ని హీరోలను చేసిన మాస్టర్ కొడుకు పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం అని ఈ ఈవెంట్ మరోసారి ప్రూవ్ చేసింది. స్టార్టింగ్ డేస్ తమకు విజయ్ మాస్టర్ ఎలా సాయం చేసాడో రామ్ లక్ష్మణ్ లు చెప్పారు. గోపీచంద్ తనకు యాక్షన్ ఇమేజ్ తెచ్చిన విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ హీరో గా నిలబడాలని అతని కోసం ఇక్కడికి వచ్చాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఆర్టిస్ట్ అయినా నటిస్తున్నంత కాలం చాలా సంతోషంగా ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు నేను మీకు వినోదాన్ని అందిస్తున్నానంటే అది నా పూర్వ జన్మ సుకృతం. జనవరిలో నేను నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సెంకండాఫ్లో నవ్వలేక మీ పొట్టలు చక్కలవుతాయి. అలాగే దర్శకుడు హరి చాలా టాలెంటెడ్. అతను తనకున్న వనరులతోనే అద్బుతమైన కంటెంట్ని తీసుకురాగలడు. అతని కోసం ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గోపీచంద్ మనకున్న మంచి హీరోలలో ఒకరు. అతను ఈ ఈవెంట్లో భాగం అవడం సంతోషంగా ఉంది. ఒక తండ్రిని కోడుకు ఎందుకు చదవించాడు.. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గమ్మత్తుగా ఉంటుంది. ఈ పాయింట్నే ఆసక్తిగా తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు. విషయం సీరియస్గా ఉన్న చెప్పే విధానం హాయిగా ఉంటుంది. అదే ఈ సినిమాను ప్రేక్షకులను దగ్గర చేస్తుంది’ అన్నారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘చదవడం గొప్పా.. చదివించడం గొప్పా అనే లైన్తో ఫాదర్ అండ్ సన్ మద్య వచ్చే కాన్ప్లిక్ట్ని దర్శకుడు బాగా హ్యాండిల్ చేసారు. ఈ సినిమా నా కెరియర్లో గుర్తుండిపోతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాను. రాజేంద్ర ప్రాసద్ గారితో కలసి పనిచేయడం నన్ను బెటర్ ఆర్టిస్ట్ని చేసింది. ఈసినిమా మీకునచ్చితే అందులో ఎక్కువ క్రెడిట్ రాంజేంద్ర ప్రసాద్ గారికే చెందుతుంద’ని చెప్పారు. మధుబాల మాట్లాడుతూ.. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందన్నారు. ప్రతి ఇంట్లో ఈ పరిస్థితి ఎదురవుతుందని.. దానిని దర్శకుడు హరి అందంగా తెరమీదకు తెచ్చారని తెలిపారు. ఇలాంటి కథలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. దర్శకుడు మలినేని గోపీచంద్ మాట్లాడుతూ..‘స్క్రీన్ మీద రాజేంద్ర ప్రసాద్ గారి టైమింగ్ ని పట్టుకోవడం తేలికైన విషయం కాదు. రాహుల్ ఈ సినిమాలో బెటర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు అని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో ప్రతి ఇంట్లో తండ్రికొడుకుల మద్య ఉండే కథను పట్టుకోని చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. కొడుక్కి కోపం వచ్చి తండ్రిని చదువుకోవడానికి పంపుతున్నాడు అది నాకు బాగానచ్చింది. ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. దర్శకుడు హరి మాట్లాడుతూ.. ‘మంచి సినిమాను తెలుగు, తమిళ్లో చేయడానికి నన్ను ఎంచుకున్నందుకు నిర్మాతకు థ్యాంక్స్. మంచి కథ ఉంటే ఏ లాంగ్వేజ్ లో అయినా కథ చెప్పవచ్చు అని నమ్ముతాను. ఒక సెట్ అసిస్టెంట్ కొడుకుగా జర్నీ మొదలు పెట్టి ఇక్కడి వరకు వచ్చాను. ఈ ప్రయాణం లో నాకు సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్. ఈ కథకు లాంగ్వేజ్ బారియర్స్ ఉండవు. ఒక యూనివర్సల్ పాయింట్ కనిపిస్తుంది. మీ ఆశీస్సులు కావాలి’ అన్నారు. హీరోయిన్ ప్రియ వడ్లమాని మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ని రియలిస్టిక్గా కనిపిస్తాయి. మా పాటలు.. ట్రైలర్ నచ్చితే సినిమా కి రండి. మా సినిమాలో ట్విస్ట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్టిస్ట్ గా నాకు ఈ సినిమాలో పనిచేయడం ఎప్పటికీ గుర్తిండిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషనల్ సీన్స్ మీకు బాగా నచ్చుతాయి. రాహుల్ బెస్ట్ కో ఆర్టిస్ట్’ అని అన్నారు. ఫైట్ మాస్టర్ రామ్ మాట్లాడతూ.. ‘రాహుల్కి నేను చెప్పేది ఒక్కటే నువ్వు నీ పని ని నమ్ముకో. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అదే నిన్ను నిలబడెతుంది. ఆ నమ్మకమే మమ్మల్ని ఇంత వరకూ తెచ్చింది. ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇందులో రాహుల్ నటన బాగా నచ్చిందన్నారు. రాజేంద్ర ప్రసాద్తో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా అని చెప్పారు. -
‘కాలేజ్ కుమార్.. లైఫే డమార్’
నటకిరీటీ రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి మధుబాల ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కాలేజ్ కుమార్’. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా హరి సంతోష్ టాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. లక్ష్మణ్ గౌడా సమర్పణలో ఎల్ పద్మనాభ నిర్మించారు. కన్నడ చిత్రానికి రీమేక్గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర ట్రైలర్ను నటుడు సాయికుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క తండ్రి కనెక్ట్ అయ్యే సినిమా ‘కాలేజ్ కుమార్’అని పేర్కొన్నాడు. విజయ్ మాస్టర్ అబ్బాయి రాహుల్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడని తెలిసి ఆనందంగా ఫీలయ్యానన్నాడు. మంచి ఎమోషన్, ఫీల్ ఉన్న సినిమా అని.. మార్చి 6న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆశీర్వదించాలని సాయి కుమార్ కోరాడు. ‘ఈ సినిమాలో మర్చిపోలేని పాత్ర చేశాను. రాహుల్ విజయ్ నా కుమారుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఈసినిమాను కూడా తప్పకుండా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. సెంటిమెంట్, ఫన్ ఇలా అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ విజయ్, డైరెక్టర్ హరి సంతోష్, సురేష్ కొండేటి, హీరో హీరోయిన్లు, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ’ ‘కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’ -
వరంగల్ లో ’సరిలేరు నీకెవ్వరు‘ విజయోత్సవ సభ
-
పెళ్లాడు.. ప్రేమించు
‘ప్రేమించు పెళ్లాడు’ రాజేంద్రప్రసాద్ హిట్ సినిమా. ‘పెళ్లాడు ప్రేమించు’.. ఇది సినిమా కాదు... రాజేంద్రప్రసాద్ లైఫ్ మూవీ! అవును.. సినిమాలే లైఫ్ అనుకున్న ఈ నట కిరీటి మొదట పెళ్లాడారు. తర్వాత.. పెళ్లాడినావిణ్ని ప్రేమాడారు. ‘అప్పు.. డే’ తెల్లారిందా అంటారీయన ‘అప్పుల అప్పారావు’ చిత్రంలో. ఎంతసేపు మాట్లాడినా.. మాటలింకా బాకీ ఉన్నట్లే అనిపించింది ఈ దంపతులతో కూర్చున్నంతసేపూ!! ఈ ఇంటర్వ్యూ చదివితే.. మీ లైఫ్ పార్ట్నర్తో మీరు మరింత ‘కేరింగ్’గా ఉండటం ఖాయం. మీ ఆవిడ పేరు విజయ చాముండేశ్వరి అనే విషయం తప్ప మీది లవ్ మ్యారేజా? ఎరేంజ్డా అనే విషయాలు చాలామందికి తెలియదు. అసలు మీ పెళ్లి ఎలా కుదిరింది? ఎప్పుడు? రాజేంద్రప్రసాద్: తనకీ నాకూ ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మా చిన్నప్పుడే మేం అమ్మని కోల్పోవడం. మా ఇద్దరి ప్రేమ వయసు వల్లో లేకపోతే ప్యాషన్ వల్లో ఏర్పడింది కాదు. ‘కేరింగ్’ వల్ల. ఒకరి మీద ఒకరికున్న కేరింగ్ వల్ల మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడింది. చాము (భార్యని రాజేంద్రప్రసాద్ అలానే పిలుస్తారు) రమాప్రభగారి అక్క కూతురు. నేను రమాప్రభగారి ఇంటికి తరచూ వెళ్లేవాణ్ణి. చాము నాకు భోజనం పెట్టేది. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నది ఎందుకు నమ్మాలంటే రమాప్రభగారింటికి వెళ్తే ‘చామూనే నా భార్య’ అనే ఫీలింగ్ ఏర్పడేది. మరి.. నేను అడగడమేంటో.. వాళ్లు బెజవాడ వచ్చి మా నాన్నను అడగడం ఏంటో.. చేస్తే తప్పేంటి? అని ఆయన అనడం ఏంటో.. పెళ్లి అయిపోవడం ఏంటో? అన్నీ చకచకా జరిగిపోయాయి. 1980 సెప్టెంబర్ 5న మా పెళ్లి జరిగింది. చాముండేశ్వరి: మా పెళ్లి చెన్నైలోని కపాలేశ్వర స్వామి గుళ్లో జరిగింది. ఆ తర్వాత వాణీ మహల్లో రిసెప్షన్ జరిగింది. మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? చాముండేశ్వరి: ఆయనే. రాజేంద్రప్రసాద్: వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడల్లా బాగా దబాయించేవాణ్ణి. డామినేట్ చేసేవాణ్ణి. ‘ఏంటయ్యా నువ్వు అలా దబాయిస్తావు. తనేమైనా నీ పెళ్లామా?’ అని వాళ్ల అమ్మమ్మ అనేది. దాంతో ‘నిజమేనేమో... నాకోసమే తనని దేవుడు పంపించాడేమో’ అనుకునేవాడ్ని. అలాగే పిల్ల ఎర్రగా బుర్రగా బావుంది అనుకున్నాను. ఓ రోజు డైరెక్ట్గా వెళ్లి ‘పెద్దావిడ అలా అంటోంది. నీకు ఓకేనా’ అని అడిగాను. ఓకే అంది. దబాయించినప్పుడు లైఫ్ మొత్తం ఇలాంటి దబాయింపులు ఉంటాయేమోననే భయం ఏమైనా? చాముండేశ్వరి: మేం ఇష్టపడ్డాం. పెద్దవాళ్లు అరేంజ్ చేశారు. రమాప్రభగారు బాగా సపోర్ట్ చేశారు. నిజానికి ఆయన ఎక్కువగా రమాప్రభగారినే దబాయించేవారు. ఆవిడేమో ‘నువ్వేంట్రా నీ బాధేంట్రా’ అన్నట్టు›ఈయన్ను చూసేవారు. రాజేంద్రప్రసాద్: రమాప్రభగారు నన్ను తమ్ముడిలా చూసుకునేవారు. ఓసారి ఫంక్షన్ పని మీద విజయవాడ వచ్చి, మీ ఇంటికి తీసుకెళ్లు అన్నారామె. ఇంటికి వెళ్లాక చాము, నా పెళ్లి గురించి డైరెక్ట్గా నాన్నగారిని అడిగేశారు. మా నాన్నగారు షాక్. మా పెద్దబ్బాయిని కూడా అడగాలన్నారు. ఇప్పుడేదో ఇన్నిన్ని మాట్లాడుకుంటున్నారు కానీ మేం ఒక్క రూపాయి కూడా ఇచ్చిపుచ్చుకోలేదు. అయితే పెళ్లిరోజు శరత్బాబుగారు గోల్డ్ వాచ్, గోల్డ్ బ్రాస్లెట్ తీసుకొచ్చి పెళ్లి కదా వేసుకుంటే బావుంటుంది అన్నారు. వేసుకుంటే బావుంటుందా తీసుకుంటే బావుంటుందా అన్నాను. తీసుకొని వేసుకో అన్నారు. అప్పటికి గర్వమో, పొగరో తెలియదు కానీ తీసుకోలేదు. పోనీ.. పంచె, చొక్కా అయినా తీసుకోండి అన్నారు. అది తీసుకున్నాను.. సంప్రదాయం కదా. తాళిబొట్టు మావాళ్లు తీసుకున్నారు. అంతే.. ఏమీ తీసుకోకుండా జీవితాంతం కేరింగ్గా చూసుకోవాలనుకున్నాను. విజయ చాముండేశ్వరి: వాళ్లు మమ్మల్ని ఏమీ అడగలేదు. మేం వాళ్లను ఏమీ అడగలేదు. ప్రేమ చాలా రకాలు. ఆకర్షణలో పడి ప్రేమగా మారడం, స్నేహం ప్రేమగా మారడం, తొలి చూపులోనే ప్రేమ పుట్టడం... ఇలా. అయితే ‘కేరింగ్’తో మొదలయ్యే ప్రేమ వీటిన్నింటికన్నా బలంగా ఉంటుందంటారా? రాజేంద్రప్రసాద్: అవునని నా అభిప్రాయం. జనరల్గా ముందు ప్రేమలో పడి, ఆ తర్వాత కేర్ మొదలవుతుంది. మా ప్రేమ ‘కేరింగ్’తోనే మొదలైంది. మేం ప్రేమ కబుర్లు చెప్పుకున్నది లేదు. ‘ఈ అమ్మాయి మన జీవితంలోకి వస్తే బాగుంటుంది.. వచ్చాక జాగ్రత్తగా చూసుకోవాలి’ అనే ఫీల్తో మొదలైన ప్రేమ. తనకూ అదే ఫీల్. ఇలా ఒకరి ‘కేరింగ్’ గురించి ఇంకొకరు ఆలోచించుకునే ప్రాసె స్లో మొదలైన మా ప్రేమ చాలా బలమైనది. తెరపై నవ్వులు పంచే స్టార్ మీవారు. మరి.. రియల్ లైఫ్లో ఆయనకు కోపం వస్తుందా? రాజేంద్రప్రసాద్: ఎప్పుడైనా కోపం వస్తే ‘మీరు నటుడైతే అవ్వొచ్చు కానీ నన్ను పెళ్లి చేసుకున్నాకే పెద్ద స్టార్ అయ్యారు గుర్తుపెట్టుకోండి’ అంటుంది ఆవిడ. అక్కడ మనం కాస్త తగ్గాల్సి వస్తుంది. చాముండేశ్వరి: ఆయనకు భయంకరమైన కోపం వస్తుంది.. అప్పుడు కోపం తగ్గించుకోండి... మీకు చెడ్డ పేరు వస్తుంది అంటాను. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తగ్గింది. కేరింగ్ నుంచి పుట్టిన ప్రేమ పెళ్లిదాకా వచ్చింది. మరి.. వైవాహిక జీవితం తర్వాత మీ గురించి ఆవిడ తీసుకున్న కేర్ గురించి? రాజేంద్రప్రసాద్: ఒక స్ట్రగుల్లో ఇద్దరం కలిశామేమో? అయినా కష్టం అనేది నాకెప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఆవిడ కష్టం అనే మాటనే కొట్టిపారేస్తుంది. కష్టం అనేది ఎందుకు వస్తుంది? మనల్ని మనం నిరూపించుకోవడానికి వస్తుంది. నిరూపించుకోండని చెబుతూ నాలో స్ఫూర్తి నింపుతుంది. సహాయనటుడిగా ఏడాదికి 24 సినిమాలు, హీరోగా 12 సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంవల్ల 365 రోజుల్లో 360 రోజులు నేనింట్లో ఉండటానికి కుదేరిది కాదు. అప్పుడు ఇంటి బాధ్యత తనే తీసుకుంది. ఒక్కరోజు కూడా ఆ బాధ్యత తాలూకు కష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. సక్సెస్ అయినా నాకు పొగరు రాకుండా చూసింది కూడా ఈవిడే. ఇప్పుడు కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ హిట్ అంటా అని షేక్ హ్యాండ్ ఇస్తే ‘సరే. నెక్ట్స్ సినిమా ఏంటి?’ అని అంది. తను చాలా ప్రాక్టికల్. ఇది చేస్తే ఇది జరుగుతుంది.. అది జరుగుతుందని ఇప్పుడే టెన్షన్ పడటం దేనికి? అంటుంది. అలా టెన్షన్ని తీసిపారేస్తుంది. 365 రోజుల్లో 360 రోజులు షూటింగ్ చేస్తూ బిజీగా ఉండటంవల్ల తండ్రికి, పిల్లలకు ‘కమ్యూనికేషన్ గ్యాప్’ ఏర్పడే అవకాశం ఉందేమో... చాముండేశ్వరి: అవును. పిల్లలకు ఎక్కువ టైమ్ కేటాయించలేదనే చిన్న బాధ ఆయనకు ఉంటుంది. నాకంటే కూడా పిల్లలు ఎక్కువ ఫీల్ అవుతారు. ఆయనతో ఎక్కువగా మాట్లాడరు. ‘వెళ్లి మాట్లాడండిరా’ అంటే అప్పుడు పెద్దగా మాట్లాడేవాళ్లం కాదు కదా. ఇప్పుడేం మాట్లాడాలి అంటారు. రెండుమూడు నెలలు పిల్లల్ని చూడకుండా షూటింగ్ చేసిన రోజులున్నాయి. రాజేంద్రప్రసాద్: నా జీవితంలో బాధపడదగ్గ విషయం అది. అవుట్డోర్ షూటింగ్ల్లో ఉన్నప్పుడు, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు బాధపడి ఉంటానో లెక్కేలేదు. జీవితం చేతివేళ్లలానే. అన్ని వేళ్లూ ఒకేలా ఉండాలంటే కుదరదు. ఒకటి తక్కువ.. ఒకటి ఎక్కువ ఉండాల్సిందే. దేవుడు సృష్టి అది. కెరీర్ ఎక్కువగా ఉంది కాబట్టి.. పిల్లలతో పర్సనల్ లైఫ్ మిస్సయ్యాను. నేను ఇప్పుడు పిల్లలతో ‘ఇలా వచ్చి కూర్చుని సరదాగా మాట్లాడొచ్చు కదా’ అంటుంటాను. ఇన్నేళ్లు ఇలా అలవాటుపడ్డారు. ఇప్పుడు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను, చాము ఒక డెసిషన్కి వచ్చాం. అదేంటయ్యా అంటే ‘ఇక ఈ జన్మకింతే’ అని. ఇప్పుడు ఆ బాధ అంతా మా మనవరాలితో తీర్చుకుంటున్నాను. చాముండేశ్వరి: మా అమ్మాయి ‘నాన్న మాతో ఎప్పుడూ ఇలా సరదాగా లేరు. మనవరాలితో హ్యాపీగా ముచ్చట్లు చెబుతున్నారు’ అంటుంది. అప్పుడు అంత తీరిక లేదు.. ఇప్పడు కాస్త తీరిక దొరుకుతోంది అంటాను. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయింపబడతాయన్నారు. మీ ఫ్యామిలీ లైఫ్ ‘హెవెన్’ అనుకోవచ్చా? రాజేంద్రప్రసాద్: అంతే. 1982లో వైకుంఠ ఏకాదశి రోజున మా పెద్దబ్బాయి బాలాజీ పుట్టాడు. 85లో విజయదశమి రోజున గాయత్రి పుట్టింది. పెళ్లయ్యాక నేను ఆర్టిస్ట్గా పెరిగా. బాలాజీ పుట్టాక బిజీ ఆర్టిస్ట్ అయ్యాను. గాయత్రి పుట్టాక హీరో అయ్యాను. అందుకే నా భార్య, నా ఇద్దరు పిల్లలు నా జీవితంలో సమ్థింగ్ స్పెషల్. నటుడిగా ఐయామ్ హ్యాపీ. ఫ్యామిలీ మేన్గానూ హ్యాపీ. భార్యాపిల్లలు తన లైఫ్లో సమ్థింగ్ స్పెషల్ అన్నారు రాజేంద్రప్రసాద్గారు. మరి మీరు? చాముండేశ్వరి: ఏడాది మొత్తం షూటింగ్స్తో గడిపేసేవారు. అయినా ఏనాడూ ఫ్యామిలీకి ఏ లోటూ చేయలేదాయన. ఎప్పుడైనా మేం మిస్సవుతున్నాం అంటే పిల్లల్ని తీసుకొని లొకేషన్కు రమ్మనేవారు. ఓసారి మా పక్కింటి ఆవిడ మా పనివాళ్లతో నన్ను ఉద్దేశించి, ‘ఆవిడ రాజేంద్రప్రసాద్గారి రెండో భార్యా? అని అడిగింది. ఆ విçషయం నాతో చెబితే ‘అవును అనకపోయావా’ అన్నాను. ఆవిడ అలా అనుకోవడానికి కారణం ఉంది. ఉదయం నుంచి రాత్రివరకూ ఎక్కడో షూటింగ్లో ఉండేవారాయన. రాత్రి ఫ్లయిట్కి వచ్చి మర్నాడు మార్నింగ్ ఫ్లయిట్కి వెళ్లిపోయేవారు. రాజేంద్రప్రసాద్: నేను షూటింగ్లో ఉంటే, ఫోన్ చేసి ‘పక్కింటావిడ ఇలా అడిగింది. కావాలంటే ఇంకో పెళ్లి ట్రై చేసుకోండి’ అంది. నీతోనే చస్తున్నాను అని నవ్వేశాను. చాముండేశ్వరి: మేం హైదరాబాద్ వచ్చాక కూడా మా పిల్లల్ని మీరు మొదటి భార్య పిల్లలా? రెండో భార్య పిల్లలా? అని కొందరు అడిగారు. రాజేంద్రప్రసాద్గారి కామెడీ బాగుంటుంది. ఆయన నటించిన సినిమాల్లో మీకు నచ్చినవి? రాజేంద్రప్రసాద్: అందరూ నన్ను కామెడీ కింగ్ అంటారు. తనకేమో నా కామెడీ నచ్చదు. చాముండేశ్వరి: అవును. అయితే ఆయన చేసిన ‘ఎర్ర మందారం, ఆ నలుగురు’ సినిమాలు ఇష్టం. ఆ సినిమాల్లో ఆయన యాక్టింగ్ అద్భుతం. రాజేంద్రప్రసాద్: నా కామెడీని ఇష్టపడేవాళ్లు మన ఇంటి మీదకు వస్తారు జాగ్రత్త (నవ్వుతూ). తెరపై కామెడీ చేసే మీరు బయట కొంచెం కఠినమేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజమా? రాజేంద్రప్రసాద్: మా నాన్న స్కూల్ టీచర్. దానివల్ల ఇంట్లో వాతావరణం సీరియస్గా ఉండేది. నాక్కూడా అదే వచ్చిందేమో. జీవితంలో దేని మీదా కచ్చితమైన అభిప్రాయంతో ఉండొద్దు. ఉంటే... కుంగిపోయే చాన్స్ ఉందని చామూ చెబుతుంది. పెళ్లయ్యేనాటికి ఆర్థికంగా మీ పరిస్థితి ఏంటి? రాజేంద్రప్రసాద్: పెళ్లయ్యే రోజుకి నా సంపాదన ‘సున్నా’. ఫుడ్ కోసం డబ్బింగ్లు అవీ చెబుతుండేవాణ్ణి. అలా అని ఇంటి దగ్గర ఏం లేకపోవడం కాదు. మా పెద్దన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్. తన దగ్గర డబ్బులు తీసుకుని ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాసయ్యాను. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని కొన్ని డబ్బులు తీసుకున్నాను. ‘సినిమాలు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెద్దాయన (ఎన్టీ రామారావుగారు) వెనక తిరుగుతున్నావు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. అయినా అన్నయ్య దగ్గర నెలకు ఐదువందలు తీసుకుంటున్నావట. తాగి తందనాలు ఆడుతున్నావా?’ అన్నారు మా నాన్నగారు. అలిగి మద్రాస్ వెళ్లిపోయాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకూ ఎవరి దగ్గరా రూపాయి తీసుకోలేదు. నా పర్సనాలిటీకి వెంటనే వేషాలు వచ్చే చాన్స్ లేదు. పుండరీకాక్షయ్యగారి దయవల్ల ‘మేలుకొలుపు’ అనే సినిమాలో హీరోకి డబ్బింగ్ చెప్పాను. అతను తమిళ హీరో. తనకి రకరకాల వాయిస్లు ట్రై చేశారు. ఆఖరికి యస్. జానకిగారితోనూ చెప్పించారు. కుదర్లేదు. అప్పటికి నా ప్రయత్నాలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అందరినీ చివరిసారి కలుద్దామని పుండరీకాక్షయ్యగారి ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే ఆయన ‘ఇంట్లో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతుకు తున్నానే’ అని డబ్బింగ్ థియేటర్కి తీసుకువెళ్లారు. ఫట్మని డైలాగ్ చెప్పేశాను. అప్పటికి సరిగ్గా భోజనం చేసి మూడు నెలలుపైనే అయింది. ఏం కావాలి? అని ఆయన అంటే, ‘భోజనం పెడితే చాలు. డబ్బింగ్ చెబుతా’ అన్నా (చెమర్చిన కళ్లతో). ‘నీకు బుద్ధి ఉందా? భోజనం మానేయడం ఏంటి? నాన్న తిడితే ఏం? అని’ మందలించారు. ఆ రోజు నుంచి ఏ హీరోకి పడితే ఆ హీరోకి డబ్బింగ్ చెప్పేవాణ్ణి. డబ్బింగ్ చెప్పడంతో వచ్చిన డబ్బుతో చైన్నైలో ఇల్లు కూడా కట్టాను. మీ ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా...? చాముండేశ్వరి: ఆయన ప్రతిదీ సమస్యగా చూస్తారు. సమస్య కాదిది.. జీవితం అంటాను నేను. ఈ సమస్య రాకపోతే మీ సామర్థ్యం ఎలా తెలుస్తుంది? అంటాను. మా ఇద్దరి ఆలోచనా విధానాలు రెండు ధోరణులు. రాజేంద్రప్రసాద్: ఆలోచనల గురించి పక్కన పెడితే ఇన్నేళ్లు పని చేసినా, ఇంత రిలాక్డ్స్గా, ఇంత ఎనర్జిటిక్గా ఉన్నానంటే తనే కారణం. నటుడిగా నవ్వించే రాజేంద్రప్రసాద్గారు వృత్తిపరమైన ఆటుపోట్లను సీరియస్గా తీసుకుంటారా? చాముండేశ్వరి: చాలా ఫీల్ అవుతారు. ఓసారి జస్ట్ నాలుగైదు నెలలు సినిమాలకు బ్రేక్ వచ్చింది. అప్పుడు టెన్షన్ పడ్డారు. ‘ఈ గ్యాప్కే కంగారుపడితే ఎలా? ఈజీగా తీసుకోవాలి?’ అన్నాను. రాజేంద్రప్రసాద్: ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ ముందు ఆ గ్యాప్ వచ్చింది. అప్పుడు రాధిక, కుట్టి పద్మిని నా కోసం సీరియల్స్ రెడీ చేసి, మా ఇంటికి వచ్చి, ‘చామూ.. ఇప్పుడు సీరియల్స్ వేవ్ బాగుంది’ అని అడ్వాన్స్ చెక్ ఇచ్చి వెళ్లారు. నేను ఇంటికొచ్చాక ‘మీతో పెద్ద సీరియల్ ప్లాన్ చేశారట. చేస్తే పోతుందన్నారు’ అని చెప్పింది. కానీ నా జీవితాన్ని నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చెప్పేది ఏంటంటే.. నేనొక పాయింట్ మీద సీరియస్గా బాధపడ్డానంటే ఆ తర్వాత ఏదో గొప్పది జరుగుతుంది. అప్పుడు వచ్చినదే ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’. ఆ సినిమా తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశా. అయితే ఇక హీరోగా మనం డ్యూయట్లు పాడటానికి, ఫైట్లు చేయడానికి పనికి రాము, ఇది కరెక్ట్ కాదని అర్థమైంది. అప్పుడు సీరియస్గా ఆలోచిస్తున్న టైమ్లో వచ్చిన సినిమా ‘ఆ నలుగురు’. ఆ సినిమాతో నటుడిగా నా గౌరవం పది రెట్లు పెరిగింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యాను. మీకు నట వారసులు లేరనే ఫీలింగ్? చాముండేశ్వరి: మా అబ్బాయి బాలాజీ హీరో కాలేదనే బాధ ఉంది. అయితే మా మనవరాలు (కూతురు గాయత్రి కుమార్తె సాయి తేజస్విని) ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మా అబ్బాయి పిల్లలు ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ... ‘ఎఫ్ 2’లో భర్త పాత్ర భార్య ఏమన్నా ‘అంతేగా’ అని తలూపుతుంది.. మరి మీవారు? చాముండేశ్వరి: ఆయనేం అలా కాదు. నేను అంతేగా.. అంతేగా టైపు భార్యని. రాజేంద్రప్రసాద్: అంతేగా.. మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఒకరంటే ఒకరికి ‘కేరింగ్’ ఉంది. అంతేగా చామూ.. అంతేగా. – డి.జి. భవాని ‘ఇలా డ్రెస్ చేసుకో బాగుంటుంది’ అని మీవారు చెబుతారా? చాముండేశ్వరి: ఆయనకు కలర్ కాంబినేషన్ బాగా తెలుసు. ఇదిగో ఈ ఇంటర్వ్యూకి ఈ బ్లూ, పింక్ కాంబినేషన్ శారీ కట్టుకోమన్నది ఆయనే. మీకు చీరలు కొని తెస్తుంటారా? తెస్తారు. కేరళ వెళ్లినప్పుడు అక్కడి ఫేమస్ చీరలు తెస్తారు. ఇంకా ఎక్కడికెళితే అక్కడి చీరలు తెస్తుంటారు. మీ ఆవిడ టేస్ట్కి తగ్గట్టు కొంటారా? రాజేంద్రప్రసాద్: నా టేస్ట్కి తగ్గట్టే కొంటా. తనకు నచ్చేవి తెచ్చినప్పుడు కాంప్లిమెంట్స్.. లేకపోతే... ఇక చెప్పేదేముంది? మీకో విషయం తెలుసా.. మా ఆవిడ మంచి టైలర్. మీవారికి షర్టులు కుడుతుంటారా? చాముండేశ్వరి: లేదండీ.. నాకు లేడీస్కి మాత్రమే కుట్టడం వచ్చు. మా ఆయన కూడా లేడీస్ టైలరే.. రాజేంద్రప్రసాద్: అవునవును.. సినిమాలో లైడీస్ టైలర్నే కదా (నవ్వుతూ). బాగా ఇష్టపడి తినే వంటలు ఏంటి? చాముండేశ్వరి: ఆయనకు రోటిపచ్చళ్లు ఉంటే చాలు. ఇంకేమీ అక్కర్లేదు. రాజేంద్రప్రసాద్: మా అమ్మగారు చనిపోయేటప్పుడు ‘వాడికి రోటి పచ్చళ్లు ఇష్టం. అవి చేసి పెట్టండి’ అని మా పెద్దక్కయ్యతో అన్నారట. మా ఆవిడది మదనపల్లి సైడ్. ఆకు కూరలు, పుల్ల కూరలని వీళ్ల స్టైల్ కూరలు వేరే ఉంటాయి. చాముండేశ్వరి: నేను రోటి పచ్చళ్లు నేర్చుకున్నాను కానీ పాలకూరలు నేర్చుకోలేకపోయా. పాలకూరలన్నీ ఆయనే వండుతారు. రాజేంద్రప్రసాద్: మా పెద్దక్కయ్య దగ్గర పాలకూరలు నేర్చుకున్నాను. షూటింగ్ లేకపోతే ‘ఇవాళ పాలకూర’ చేయండి అని అడుగుతారు. ఒక్కోసారి నేనే అడిగి మరీ బీరకాయ పాలకూర, సొరకాయ పాలకూర చేస్తాను. చాముండేశ్వరి: చాలా బాగా చేస్తారు. -
విశాఖ ఉత్సవ్: తరలివచ్చిన సినీ ప్రముఖులు
-
కాలేజ్కి వెళ్లాను – రాజేంద్ర ప్రసాద్
‘కాలేజ్ కుమార్’ చిత్రంలో కాలేజ్కి వెళ్లేది నేనే. ఇప్పటి వరకూ నా మనసుకు నచ్చిన కథల్లో ఈ కథ కూడా ఒకటి. కథా బలం ఉండి దాన్ని ఎంటర్టైన్మెంట్గా చెప్పగలిగితే ప్రేక్షకులకు బాగా చేరవవుతుంది. ఈ కథకు ఆ లక్షణాలు చాలా ఉన్నాయి.. ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘కాలేజ్ కుమార్’. కన్నడలో ఘన విజయం సాధించిన ‘కాలేజ్ కుమార్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో తెరకెక్కించారు డైరెక్టర్ హారి సంతోష్. లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎమ్ఆర్ పిక్చర్స్ పతాకంపై ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ సినిమా టీజర్ని రేఖ విడుదల చేశారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి కొడుక్కి వాళ్ల నాన్నే హీరో. శివకుమార్ అనే కొడుక్కి నేల మీద నిలబడి సమాజాన్ని ఎలా చూడాలో శశికుమార్ అనే తండ్రి నేర్పిస్తాడు.. ఆ క్రమంలో వారద్దరి మధ్య జరిగే కథే ‘కాలేజ్ కుమార్’’ అన్నారు. ‘‘మా అబ్బాయి రాహుల్తో పాటు ఇందులో పనిచేసిన అందరికీ మంచి పేరు రావాలి’’ అన్నారు స్టంట్ మాస్టర్ విజయ్.‘‘ఈ సినిమాని తెలుగులో నిరి్మంచడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఎల్. పద్మనాభ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ నార్ల, ప్రియ వడ్లమాని, నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడారు. -
మండలిలో రాజేంద్రప్రసాద్ అసభ్య వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో గ్రామ సచివాలయాలపై వాడీవేడి చర్చ సాగింది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొమ్ములొచ్చాయని అన్నారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ది టీవీ చర్చల్లో అరే.. ఒరే అని బూతులు తిట్టించుకునే సంస్కృతి అని ఎద్దేవా చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు డిమాండ్ చేశారు. అనంతరం మండలిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా 4లక్షల 50వేల పైగా ఉద్యోగాలు ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమం అని అన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత భారీస్థాయిలో ఉద్యోగాలు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. గ్రామ సచివాలయాలను ఎప్పుడో ఏర్పాటు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. మరి సచివాలయ వ్యవస్థను ఎందుకు అమలు చెయ్యలేదు. గ్రామ సచివాలయాల వ్యవస్థల వల్ల సర్పంచ్ల అధికారాలు దెబ్బతింటాయని టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీల అధికారాలను జన్మభూమి కమిటీలు హరిస్తే ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు. హజ్ భవన్ స్థలం కోసం అన్వేషణ: డిప్యూటీ సీఎం మండలిలో డిపప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఇమాంలు, మౌజన్లకు 2020 మార్చిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ‘ 9వేలమంది ఇమాంలు, 9వేల మంది మౌజన్ లు ఉన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులను తీసుకుంటున్నాం. విజయవాడలో హజ్ భవన్ పేరుతో చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. తర్వాత పట్టించుకోలేదు. చంద్రబాబు శంఖుస్థాపన చేసిన హజ్ భవన్ కు రెండు వైపులా శ్మశానాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హజ్ భవన్ కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం 5వేలమంది ఇమాంలు, మౌజన్ లకే గౌరవ వేతనం అందించారు. మేము అర్హులైన అందరికీ గౌరవ వేతనం ఇస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం’ అని అన్నారు. -
‘తోలుబొమ్మలాట’ మూవీ రివ్యూ
మూవీ: తోలుబొమ్మలాట జానర్: ఫ్యామిలీ డ్రామా నటీనటులు: రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిశోర్, హర్షిత, నారాయణరావు, దేవీప్రసాద్ సంగీతం: సురేష్ బొబ్బిలి దర్శకత్వం: విశ్వనాథ్ మాగంటి మనుషులలోని మంచి చెడులను, వాటి వలన కుటుంబంలో ఏర్పడే సమస్యల ఇతివృత్తంగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘తోలుబొమ్మలాట’. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో విశ్వంత్ హీరోగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పల్లెటూరు నేపథ్యంలో నడిచే ఆహ్లాదకరమైన ఈ చిత్రం ఆడియన్స్కు ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందా? కొత్త దర్శకుడు ఏదైనా మ్యాజిక్ చేశాడా? రాజేంద్రప్రసాద్ మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడా? కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ఎమోషనల్ అనే యూనివర్సల్ పాయింట్ను ప్రధానంగా తీసుకుని వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందా? చూద్దాం. కథ: ‘ఆఖరికి నేరం చేసి ఉరిశిక్ష పడ్డ ఖైదీలను కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు.. దానిని నెరవేరుస్తారు. కానీ వయసు పైబడి ఇంట్లో ఉన్న ముసలివాళ్ల చివరి కోరిక ఏంటని అడగరు, దానిని తీర్చే ప్రయత్నం చేయరు’ నలుగురు వయసుపైబడ్డ వాళ్లు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఇవి. ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభవుతుంది. అనేక ట్విస్టులు, ప్రేమలు, గొడవలు, ఆప్యాయతలు, విలువలు, మంచి మాటలు, కన్నీళ్లు ఇలా అన్నింటి కలబోతే ఈ చిత్రం. సోమరాజు అలియాస్ సోడాలరాజు(రాజేంద్రప్రసాద్) అచ్యుతాపురం అనే గ్రామంలో చాలా గౌరవంగా బతుకుతాడు. ఉద్యోగం, వ్యాపార రీత్యా తన ఇద్దరి పిల్లలు పట్నానికి వెళ్లినా తాను మాత్రం ఒంటరిగా అదే గ్రామంలో ఉంటాడు. రిషి(విశ్వoత్), వర్ష(హర్షిత) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నతనం నుండే ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ప్రేమగా మారుతుంది. తల్లిదండ్రులకు తమ ప్రేమ చెప్పలేక.. తమ పెళ్లి చేయమని తాత సోమరాజు సహాయం కోరతారు. అందరినీ ఒప్పించి ఘనంగా పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. అయితే అనుకోకుండా వచ్చిన ఉపద్రవంతో సోమరాజుతో పాటు అతడి కుటంబం విచ్ఛినమవుతుంది. ఈ సమయంలో సోమరాజుకు కేవలం సంతోష్(వెన్నెల కిశోర్) మాత్రమే సహాయం చేయగలడు. మరి సోమరాజుకు సంతోష్ సహాయం చేస్తాడా? సోమరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? విచ్ఛినమైన తన కుటుంబాన్ని సోమరాజు ఏకం చేశాడా? సోమరాజు కుటుంబానికి వచ్చిన ఆపద ఏంటి? అనేదే మిగతా కథ. నటీనటులు: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, కమెడీయన్గా ఫుల్ జోష్లో ఉన్న వెన్నెల కిశోర్ సినిమా భారాన్ని పూర్తిగా తమ భుజాలపై వేసుకున్నారు. రాజేంద్రప్రసాద్ తన అనుభవంతో కొన్ని సీన్లలో అవలీలగా నటిస్తాడు. కాదు జీవిస్తాడు. అచ్చం మన ఇంట్లో తాతయ్యలా అనిపించేలా నటకిరీటి నటన ఉంది. ఇక వెన్నెల కిశోర్ తన మార్క్ కామెడీతో నవ్వులు పూయించారు. ఇక యంగ్ హీరో విశ్వంత్కు నటన పరంగా అంత స్కోప్ లేప్పటికీ ఉన్నంతలో మెప్పించాడు. అంతేకాకుండా నటుడిగా ఇంప్రూ అయినట్లు కనిపిస్తుంది. అయితే రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ల ముందు అతడు తేలిపోతాడు. ఇక హీరోయిన్ హర్షిత తన నటన, అందాలతో ఆకట్టుకుంది. ఇక పూజారామచంద్రన్ తన అందచందాలతో కుర్రకారును హీటెక్కించింది. ధన్రాజ్ రెండు మూడు చోట్ల కంటతడిపెట్టిస్తాడు. దర్శకుడి నుంచి నటుడిగా మారిన దేవీప్రసాద్ ఈ సినిమాలో ఫర్వాలేదనిపించాడు. చలపతిరావు, నారాయణరావు, తాగుబోతు రమేశ్, రాజు, దొరబాబు తదితరులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు. విశ్లేషణ ఆ నలుగురు, మీ శ్రీయోభిలాషి, ఓ బేబీ వంటి డిఫరెంట్ కథలతో ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించేలా, అందరినీ ఆలోచింప చేసేలా చేసిన రాజేంద్రప్రసాద్ మరోసారి అలాంటి జానర్తోనే ప్రేక్షకుల తలుపు తట్టాడు. ఇలాంటి చిత్రాలు ఆడియన్స్కు కనెక్ట్ కావాలంటే కథా బలం ముఖ్యం. లేదంటే మామూలు కథైనా చాలా బలంగా చెప్పాలి. ఎమోషనల్గా అందరినీ టచ్ చేయాలి. ఈ సినిమాకు కథే హీరో. అయితే దర్శకుడు మంచి స్టోర్ లైన్ ఎంచుకున్నప్పుటికీ.. పూర్తి స్టోరీగా మల్చడంలో తడబడ్డాడు. ఏం చేయాలో తెలియక ‘ఆ నలుగురు’ ఫార్మట్ను ప్రయోగించాడు. దీంతో ఒకసారి చూసిన సినిమాను మరోసారి రిపీట్ చేసి చూసినట్టుంది. కుటుంబ కథా చిత్రాలకు ఎమోషన్స్ ముఖ్యం. ఈ విషయంలో కొత్త దర్శకుడి అనుభవలేమి సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్లు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. కథను ముందుకు తీసుకెళ్లడానికి దర్శకుడు అనేక ఇబ్బందులు పడ్డాడు. పలుమార్లు అనవసర, అసందర్బ సీన్లు తెరపై కనిపించడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. ఇక కుటుంబ కథా చిత్రాలకు మాటలు ముఖ్యం. ఎందుకంటే ‘శతమానంభవతి’ సినిమాలో వచ్చే ప్రతీ డైలాగ్ను ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేశారో తెలిసిందే. కానీ ఈ సినిమాలో అలాంటి పవర్ఫుల్ డైలాగ్లు వేళ్లపై లెక్కపెట్టోచ్చు. పాటలు పర్వాలేదనిపించినా.. సాహిత్య విలువలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ రాజేంద్రప్రసాద్ నటన వెన్నెల కిశోర్ కామెడీ ప్రెష్ లవ్ సీన్స్ సాహిత్యం మైనస్ పాయింట్స్ బోర్ కొట్టించే కథనం సాగదీత సీన్స్ దర్శకుడి అనుభవరాహిత్యం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్డెస్క్ -
హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు: రాజేంద్రప్రసాద్
‘‘ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓ బేబీ’ వంటి మంచి సినిమాల తర్వాత నేను చేసిన మరో మంచి చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఇలాంటి కథలకు హీరో ఎవరు? అనే దానిపై చర్చలు అనవసరం. ఈ సినిమా చూశాక హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు డా. రాజేంద్రప్రసాద్. విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి జంటగా రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, దేవీప్రసాద్, నర్రా శ్రీనివాస్ ప్రధాన తారాగణంగా విశ్వనాథ్ మాగంటి తెరకెక్కించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కథకి ఎవరైతే నాయకుడు అవుతారో వారే హీరో. ఈ సినిమాలో విశ్వంత్ హీరో’’ అన్నారు. ‘‘ప్రస్తుత కాలంలో ఇలాంటి సినిమాలు రావడం అరుదు. ఇది ప్రతి ఒక్కరి కథ’’ అన్నారు విశ్వంత్. ‘‘నా కుటుంబంతో కూర్చుని చూసే సినిమా చేయాలనుకుని ఈ కథ రాసుకున్నా’’ అన్నారు విశ్వనాథ్ మాగంటి. ‘‘మా యూనిట్కి ఈ సినిమా మంచి గుర్తింపు అందించాలి’’ అన్నారు దుర్గా ప్రసాద్. -
టేక్ అనగానే పూనకం వచ్చేస్తుంది
‘‘రెండు హిట్స్ వస్తే రిలాక్స్ అయ్యే రోజులివి. ఇన్నేళ్లు ఫీల్డ్లో ఉన్నామంటే నిరంతరం పరిగెడుతుండటమే కారణం. రేస్లో ఉండాలంటే ప్రతిరోజూ పరిగెత్తాలి. రెస్ట్ తీసుకొని అవసరమైనప్పుడే పరిగెడతాను అంటే కిందపడతాం’’ అన్నారు రాజేంద్రప్రసాద్. విశ్వంత్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా రాజేంద్రప్రసాద్ చెప్పిన విశేషాలు. ► మన పెద్దవాళ్లు చెప్పేవారు ‘జీవితమే ఒక తోలుబొమ్మలాట’ అని. తల్లి, తండ్రి, గురువు, దైవం ఇలా ఎవరో ఒకరు మనల్ని ఆడిస్తూనే ఉంటారు. మనందర్నీ ఆ దేవుడు ఆడిస్తున్నాడని నేను నమ్ముతాను. అనుకున్నట్టు జరగనిదే జీవితం. దాన్ని ఆస్వాదించాలి. ► దర్శకుడు విశ్వనాథ్ నాకు ‘తోలుబొమ్మలాట’ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ‘ఈ కథ మొత్తం మీ చుట్టూనే తిరుగుతుంది’ అన్నాడు. అవునా, సరే అని విన్నాను. కథ పూర్తయ్యేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది. ‘ఈ కథ నువ్వే రాశావా?’ అని అడిగాను. కథ నాకు అంత బాగా నచ్చింది. కుటుంబ బంధాలు, అనుబంధాలు గురించి చెప్పే మంచి కథ. కానీ దర్శకుడి వయసు చూస్తే 30కి తక్కువే. అందుకే కథ నువ్వే రాశావా? అని అతన్ని అడిగాను. ► ఈ సినిమాలో సోడాల రాజు అనే పాత్ర చేశాను. ఇందులో నా పాత్ర కొత్తగా కనపడాలనుకున్నాం. కొత్తగా కనపడాలంటే పాత్ర మాత్రమే కనపడాలి. పెద్ద మనిషిలా కనపడాలి. అందరూ గౌరవించేలా ఉండాలి. మనిషికి ఎన్నో బంధాలు. వాటి వల్ల పొందే కష్టాలు, సుఖాలు ఉంటాయి. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను మా సినిమాలో చూపించాం. ► కామెడీ ఎప్పుడూ రెండు రకాలు. ఒకటి హీరో చేసేది, మరోటి కమెడియన్ చేసేది. ఎవరు కామెడీ చేసినా సరే అది ఎక్కువ కాలం నిలబడాలంటే కామెడీ ఎప్పుడూ హుందాగా ఉండాలి. కొత్తకొత్తవాళ్లతో సినిమాలు చేస్తున్నాను. కొందరు ఎలా చేద్దాం? అని డిస్కస్ చేస్తుంటారు. అలాంటప్పుడు నా అభిప్రాయాలు చెబుతుంటాను. ► నటుడిగా ఇన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నా ఎప్పుడూ కూడా నా వృత్తిని తేలికగా తీసుకోలేదు. ఎప్పుడైనా బయటకు సరదాగా చెబుతాం అవలీలగా పాత్రలు చేసేశాం అని. అయితే ప్రతీ పాత్ర చేయడానికి ఎంతో శ్రమ దాగి ఉంటుంది. నేనేదైనా కథ విన్నాక ఓ 2–3 గంటలు మా ఇంట్లో ఎవ్వరూ నన్ను డిస్ట్రబ్ చేయరు. ఆ సమయాన్నంతా పాత్రలోకి ఎలా వెళ్లాలి? అని ఆలోచిస్తుంటాను. సెట్లో కూడా ఆ పాత్ర గురించి ఆలోచిస్తుంటాను. టేక్ అనగానే నాకు పూనకం వచ్చేస్తుంది. ► ప్రస్తుతం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో..’ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. ‘ఎర్ర చీర’ చేస్తున్నాను. ‘సరిలేరులో..’ మహేశ్, నేను టామ్ అండ్ జెర్రీలా ఉంటాం. ‘వైకుంఠ..’లో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నా. ► నా వారసుణ్ణి కూడా నేనే. నాకు ఆసక్తి ఉండి నేనే సినిమాల్లోకి వచ్చాను. మా పిల్లలు రాలేదు. కానీ నా మనవరాలు ‘మహానటి’ ద్వారా పరిచయం అయింది. తనకి ఆసక్తి ఉండి చేసింది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మంచి పాత్ర చేస్తోంది కూడా. ► మన ఇంట్లో ఉన్న సమస్యను మన ఇంట్లో కూర్చునే పరిష్కరించుకోవాలి. బయటకు వచ్చి గొడవలు పడితే ఎవరికి నష్టం? చూసేవాళ్లకు గొడవలు బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ వాళ్లు వాళ్ల సమస్యను అసోసియేషన్ లోపలే పరిష్కరించుకోవాలి. సమస్యలు వస్తాయి. హుందాగా ఎదుర్కోవాలి. బయటపడిపోకూడదు. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. -
తెల్ల కాగితంలా వెళ్లాలి
‘‘నేను డైరెక్టర్ అయినా ఇతర దర్శకుల చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వారికి సలహాలు ఇవ్వను. మనం డైరెక్టర్ అయినా ఒక నటుడిగా నటిస్తున్నప్పుడు ఆ దర్శకుడి వద్దకు తెల్ల కాగితంలా వెళ్లాలి. అప్పుడే దానిపై తనకు నచ్చింది రాసుకుంటాడు’’ అని దేవీ ప్రసాద్ అన్నారు. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్య పాత్రల్లో విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన దేవీ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ► ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లాదకరమైన కథ. మనుషుల్లోని మంచీ చెడులు, వాటి వల్ల ఏర్పడే సమస్యల ఇతివృత్తంగా తెరకెక్కింది. ► సాధారణంగా కొత్త దర్శకుడు లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ లేదా యాక్షన్ చిత్రాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ విశ్వనాథ్ దానికి భిన్నంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నాడు. ► ఓ గ్రామంలోని పెద్దాయన కొడుకు పాత్ర నాది. కెరీర్ కోసం పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిన వ్యక్తిలా కనిపిస్తాను. మనం, మన సంపాదన, భవిష్యత్తు అనే ఆలోచనా ధోరణి ఉంటుంది. ► రాజేంద్రప్రసాద్గారితో చేయాలనే నా కోరిక ‘తోలుబొమ్మలాట’ తో నెరవేరింది. ఆయనతో పాటు ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటులందరి నుంచి నాకు తెలియని చాలా విషయాలు ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. -
ఐదుపైసల సోడా గుర్తొచ్చింది
‘‘నా 42 ఏళ్ల నటజీవితంలో మొదటి ఐదు సినిమాల వరుసలో నిలిచే చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఇందులో సోడాల రాజు పాత్రలో నటించా. ఐదు పైసలతో సోడాలు తాగిన రోజులను ఈ సినిమా గుర్తు చేసింది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా నవంబర్లో విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏమేం చేశాం? మన మూలాలు ఏంటి? అని తెలియజెప్పడానికైనా ఓ మంచి సినిమా ఉండాలి. ఆ లోటును తీర్చే సినిమా ‘తోలుబొమ్మలాట’. సాధారణంగా ఇలాంటి కథని 50 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు చేయాలి. కానీ, విశ్వనాథ్ వంటి కుర్ర దర్శకుడు ఈ కథ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ‘ఆ నలుగురు’ సినిమా చేశాక ఇంతకంటే ఇంకేముంటుందిలే అనుకున్నా. ఒళ్లు దగ్గర పెట్టుకో అని నన్ను మళ్లీ హెచ్చరించిన కథ ఇది. నా నటజీవితంలో మరుపురాని సినిమా ఈ ‘తోలుబొమ్మలాట’ అన్నారు. ‘‘ఈ కథను రాసుకుని రాజేంద్రప్రసాద్గారి దగ్గరకు వెళ్లినపుడు ఓ గురువులా నన్ను ప్రోత్సహించారు’’ అన్నారు విశ్వనాథ్ మాగంటి. ‘‘కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కింది’’ అన్నారు విశ్వంత్. ‘‘ఈ చిత్రంలో సోడాలరాజు స్నేహితుని పాత్ర చేశా’’ అన్నారు సీనియర్ నటుడు నారాయణరావు. నటుడు దేవీప్రసాద్, పాటల రచయిత చైతన్యప్రసాద్, హీరోయిన్ హర్షితాచౌదరి, నర్రా శ్రీనివాస్, కల్పన, సంగీతదర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామన్ సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ నూకవల్లి, ఆర్ట్డైరెక్టర్ మోహన్ కె.తాళ్లూరి తదితరులు పాల్లొన్నారు. -
మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన 'తోలుబొమ్మలాట' చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. బలమైన, పదునైన డైలాగులతో, మానవ సంబంధాల మర్మాన్ని విప్పుతున్నట్టున్న ఈ మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆ నలుగురు లాంటి మూవీల ద్వారా విలక్షణ పాత్రల్లో నటుడిగా తనకంటూ ఒకప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్ననటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ సోమరాజు అలియాస్ సోడాల్రాజు పాత్ర ద్వారా మరోసారి ప్రశంసలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి విలువలతో విభిన్న కుటుంబ కథాచిత్రంగా వస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదైలన ఈ చిత్రం ఫస్ట్లుక్ ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా విశ్వనాథ్ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పక్కా గ్రామీణ వాతావరణం, గ్రామీణ కళలతోపాటు, కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా మూవీ థియేటర్లను పలకరించే సమయం చాలా సమీపంలోనే ఉంది. Motion poster from Team #Tholubommalata 😀😀😀https://t.co/EbdutRmGdh — vennela kishore (@vennelakishore) October 11, 2019 -
పాత్ర కోసం మార్పు
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ‘డ్రీమ్’ ఫేమ్, ప్రవాసాంధ్రుడు భవానీశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘క్లైమ్యాక్స్’. నాషా సింగ్, రమేష్, చందు కీలక పాత్రధారులు. పి. రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఇందులో రాజేంద్రప్రసాద్గారి పాత్ర పేరు మోడీ. ఆయన పాత్రకు మోడీ అనే పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రాజేంద్రప్రసాద్ కొత్తగా మారారు’’ అన్నారు. ‘పొలిటిక్ సెటైర్ నేపథ్యంలో నడిచే మర్డర్ మిస్టరీ ఇది. మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది’’ అన్నారు పి. రాజేశ్వర్రెడ్డి. ఈ సినిమాకు రాజేష్ సంగీతం అందిస్తున్నారు. -
వెండితెర గురువులు
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. అని శ్లోకం ఉంది నిజమేగానీ సినిమా వాళ్లు దానికి కాస్త ఎక్స్టెన్షన్ కొట్టి లెంగ్త్ పెంచి గురు హీరో గురు హీరోయిన్ గురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నమః అని కూడా అనుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు లేని సమాజం ఎలా లేదో టీచర్ల, లెక్చరర్ల పాత్రలు లేని సినిమాలు కూడా లేవు. ఆ మిస్సమ్మల, పంతులమ్మల, మాస్టారుల రీ విజిట్.. నేడు టీచర్స్ డే సందర్భంగా. ‘మిస్సమ్మ’లో సావిత్రి కేవలం స్కూల్లో పిల్లలకే టీచర్ కాదు. ఆ సినిమాలోని ప్రతి పాత్రకూ టీచరే. కొంచెం నాన్ సీరియస్గా ఉన్న ఎన్.టి.ఆర్కు లక్ష్యం ఏర్పరిచిన ఆమే టీచర్. దొంగ బిచ్చగాడు రేలంగిని ఆ దారి వదిలించిన ఆమే టీచర్. తెలిసీ తెలియని వయసులో ఉన్న జమునకు మంచి చెడు తెలియజేసిన ఆమే టీచర్. కంత్రీ విలన్ రమణా రెడ్డికి బడితె పూజ చేయడం తెలిసిన ఆమే టీచర్. ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి చిన్నపిల్లల్లా ప్రతి ఒక్కరూ భయపడేవారే. ఆఖరుకు ఎస్.వి. రంగారావు, బుష్యేంద్రమణిలతో సహా. సినిమాల్లో టీచర్ పాత్రకు గట్టిగా ఫౌండేషన్ వేసిన పాత్ర అది. కానీ ఆశ్చర్యంగా ‘బడి పంతులు’లో ఎన్.టి.ఆర్ పాత్ర అమిత మెత్తన. నెమ్మది, కరుణ, దయ తప్ప ఆ పాత్రకు ఏమీ తెలియదు. పిల్లలు దేవుళ్లు కాబట్టి ఆ పాత్రలోని దైవత్వాన్ని గ్రహించి ఆదరించారు. కానీ కడుపున పుట్టిన సంతానం అవమానం చేసి వేదన మిగిల్చింది. ఆ పంతులును బడి ఎక్కించి నిలబెట్టింది. అయితే మంచితనమే చివరికి గెలుస్తుంది. శిష్యుడు ఫెయిల్ కావచ్చు గాని విలువలకు నిలబడ్డ గురువు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. అయితే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినని మొండి ఘటాలు కూడా స్కూల్లో ఒక మాస్టారు ముందు మోళీ వేసినట్టుగా తలాడిస్తారనడానికి తార్కాణంగా ‘కోడె నాగు’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో పరమ మొండి ఘటమైన శోభన్ బాబు తన టీచర్ అయిన ఆత్రేయ మాట మాత్రమే వింటాడు. కానీ ఈ శిష్యుడి సంస్కరణలో ఆ గురువు ప్రాణ త్యాగం చేస్తాడు. ఆ గురువుకు నివాళిగా శిష్యుడూ ఆత్మార్పణం చేస్తాడు. గుండెలు పిండే ఈ కథ గురుశిష్యుల అనుబంధాన్ని అజరామరం చేసింది. ‘స్కూలు’, ‘కాన్వెంటు’ అనే మాటలు వాడుకలో పెరుగుతున్న వేళ ఆడవాళ్లు టీచింగ్ ప్రొఫెషన్లోకి ఎక్కువగా వస్తున్న వేళ ‘పంతులమ్మ’ అనే సినిమా రావడం విడ్డూరం కాదు. భార్య చనిపోగా, చిన్న పిల్లాడితో అవస్థలు పడుతున్న రంగనాథ్ దగ్గర పంతులమ్మ ఉద్యోగానికి వచ్చిన లక్ష్మి ఆ పిల్లాడికి తల్లిలా మారి గాడి తప్పిన ఆ ఇంటికి ఇల్లాలిగా కూడా మారే ఆ కథ పెద్ద హిట్ అయ్యింది. అయితే ‘పూజ’లో మేనమామ కూతురైన కన్నడ మంజులను పెళ్లి చేసుకుందామనుకున్న లెక్చరర్ రామకృష్ణ ఇష్టం లేని వాణిశ్రీని చేసుకుని ఆమెను భార్యగా స్వీకరించలేక క్షోభ పడటం, చివరకు ఆ జంట ఏకం కావడం ఆ వృత్తిలో ఉండేవారికి ఎదురయ్యే ‘పరీక్షాకాలం’గా జనం చూశారు. ఇదే సమయంలో వచ్చిన మరో ముఖ్యమైన సినిమా ‘బలిపీఠం’. ఇందులో కులమతాల వివక్ష దూరం కావాలని భావించే స్కూల్ టీచర్ శోభన్బాబు తనకంటే పైకులం స్త్రీ శారదను వివాహం ఆడి సంఘంలో ఎంతటి హెచ్చుతగ్గుల వ్యవస్థ ఉన్నదో తెలుసుకుంటాడు. యూనిఫామ్ వేసి పిల్లలందరినీ సమానం చేసే క్లాస్రూమ్ ఇంట్లో.. బజారులో ఎంత అసమానంగా ఉంటుందో ఈ సినిమాలో తెలుస్తుంది. అటు పిమ్మట వచ్చిన ‘విశ్వరూపం’ విద్యార్థి శక్తి తలుచుకుంటే సంఘ నిర్మాణం, దేశ నిర్మాణంలో ఎంత చురుకైన పాత్ర పోషించగలదో చూపించింది. అయితే అందుకు వారిని ఉత్తేజపరచగల గురువు అవసరం. అలాంటి గురువుగా ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో గొప్పగా కనిపిస్తారు. కానీ అన్ని సినిమాల్లోనూ ఎన్.టి.ఆర్లు ఉండరు. కొన్నింటిలో చంద్రమోహన్లు ఉంటారు. ‘మూడుముళ్లు’ సినిమాలో చంటిబిడ్డతో పల్లెటూళ్లో పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ చంద్రమోహన్ అదే ఊళ్లో ఆకతాయిగా తిరుగుతున్న రాధిక మనసు దోచుకుంటాడు. చంద్రమోహన్ సంస్కారాన్ని చూసిన రాధిక ఎలాగైనా సరే అతణ్ణి పెళ్లి చేసుకొని అతని బిడ్డకు తల్లిలా మారాలనుకుంటుంది. ఆమెను అనేకసార్లు ఫెయిల్ చేసిన చంద్రమోహన్ చివరకు పాస్ చేసి అక్కున చేర్చుకుంటాడు. టి.కృష్ణ వచ్చాక సినిమాల్లో బాధ్యతతో ఉండాల్సిన టీచర్ల పాత్రలు ఎక్కువగా చూపించారు. ‘వందేమాతరం’లో స్కూల్ టీచర్గా రాజశేఖర్, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ సినిమాల్లో టీచర్గా, లెక్చరర్గా విజయశాంతి ప్రేక్షకులను క్లాస్రూమ్లో కూర్చోబెట్టారు. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’... ప్రతి ప్రేక్షకుడు బాధ్యత ఉన్న టీచర్గా సంస్కరణకు దిగకపోతే భవిష్యత్తు అంధకార బంధురం అని చెప్పారు. ‘శుభలేఖ’లో సుమలత లెక్చరర్. సంతలో పశువును అమ్మినట్టు వరుణ్ణి అతడి తల్లిదండ్రులు అమ్మే వరకట్న దురాచారాన్ని నిర్మూలించడానికి ఆమె గళం ఎత్తుతుంది. కైకాల సత్యనారాయణను ఎదిరిస్తుంది. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకుంటుంది. అయితే ఏం... ఆఖరుకు చిరంజీవిలాంటి ఉత్తముణ్ణి భర్తగా పొందుతుంది. ఈ సినిమాలో కె.విశ్వనాథ్ మూడు విషయాలు చెప్పారు. స్త్రీలు బాగా చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. అమ్మకానికి అబ్బాయిని తెచ్చుకోకుండా ఆత్మగౌరవంతో పెళ్లి బంధంలోకి వెళ్లాలి. లెక్చరర్ పాత్రలు మాస్ హీరోలను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే వెంకటేశ్ ‘సుందరకాండ’, చిరంజీవి ‘మాస్టర్’, బాలకృష్ణ ‘సింçహా’ చేశారు. స్టూడెంట్స్ను ‘యాంటీ కరెప్షన్ ఫోర్స్’గా మార్చి, అవినీతి అధికారులకు ఏకంగా మరణశిక్ష విధిస్తూ సంచలనం సృష్టించింది కేవలం ఒక ప్రొఫెసర్ అంటే అది ఆ వృత్తి గొప్పతనం అనుకోవాలి. ‘ఠాగూర్’ సినిమాలో చిరంజీవి ఈ పని చేస్తారు. అయితే ఉపాధ్యాయుడంటే విద్యార్థి బాగు మాత్రమే కోరేవాడు కాదు ఊరు బాగు కూడా కోరేవాడు అని రాజేంద్రప్రసాద్ ‘ఓనమాలు’ చెప్పింది. ఇందులో టీచరైన రాజేంద్రప్రసాద్ సొంత ఊరు వదిలిపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఊరికి రావాలని మాతృభూమికి సేవ చేయాలని పిలుపు ఇస్తారు. మార్గదర్శి లేని ఊరు దివిటీ లేని చీకటి దారి అని సందేశం ఇస్తారు. కొత్తతరం హీరోలు కూడా లెక్చరర్లుగా, ట్యూటర్లుగా కనపడటానికి వెనకాడటం లేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ ఒక మంచి లెక్చరర్గా కనపడతాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి అబ్దుల్ కలామ్ నుంచి స్ఫూర్తి పొందేవారు ఎందరో ఉంటారు. వారు చెప్పిన మంచే ఒక హీరోనో హీరోయినో చెప్తే వెంటనే తాకే యువతరం శాతం ఎక్కువగా ఉంటుంది. స్టూడియోనే క్లాస్రూమ్గా కెమెరానే బ్లాక్బోర్డుగా సాగే ఈ స్ఫూర్తివంతమైన పాఠాలు కొనసాగాలని కోరుకుందాం. – కె. ‘మిస్సమ్మ’లో సావిత్రి ‘బడిపంతులు’లో ఎన్టీఆర్, అంజలి ‘సుందరకాండ’లో వెంకటేశ్, ‘ఓనమాలు’లో రాజేంద్రప్రసాద్, ‘విశ్వరూపం’లో ఎన్టీఆర్ విజయశాంతి శ్రీవిద్య, శోభన్బాబు ‘మూడు ముళ్లు’లో రాధిక, చంద్రమోహన్ ∙చంద్రమోహన్, విజయశాంతి, చరణ్రాజ్ ‘ఠాగూర్’లో చిరంజీవి, ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ -
కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం
‘‘నా కెరీర్ స్టార్టింగ్లో ‘శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం’ లాంటి మంచి సినిమాలు చేశాను. మంచి కథలు దొరకడం కష్టమవుతున్న ఈ మధ్యకాలంలో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఒక గొప్ప సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇది నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్’’ అని భీమనేని శ్రీనివాసరావు అన్నారు. ఐశ్వర్యా రాజేష్, డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో శివ కార్తికేయన్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు చెప్పిన విశేషాలు. ► ‘కౌసల్య కృష్ణమూర్తి’కి వచ్చినన్ని అభినందనలు నా గత సినిమాలకు రాలేదు. మా చిత్రం నచ్చడంతో మీడియా మిత్రులు కూడా సొంత సినిమా అనుకుని సపోర్ట్ చేశారు. ప్రేక్షకులు కూడా సినిమాకు 100 శాతం కనెక్ట్ అయ్యారు. చాలా మంది కాలేజ్ విద్యార్థులు ఫోన్ చేసి, ఈ సినిమా మాకు ఓ స్ఫూర్తిలా ఉందని అంటున్నారు. ► ఈ మధ్య కాలంలో ‘మజిలీ, జెర్సీ’ లాంటి క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలు వచ్చి సక్సెస్ సాధించాయి. అయితే మాది ఫిమేల్ సెంట్రిక్ మూవీ. క్రికెటర్గా ఎదగాలనే ఒక అమ్మాయి తపనను చూపిస్తూనే, తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్ని చూపించాం. దానికి సమాంతరంగా రైతుల సమస్యలను చూపించాం. స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరికీ నచ్చడంతో పాటు భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. ► ‘కళాబంధు’ టి. సుబ్బిరామిరెడ్డిగారు కుటుంబ సభ్యులతో కలిసి మా సినిమా చూశారు. వారికి సినిమా విపరీతంగా నచ్చడంతో నన్ను, కె.ఎస్ రామారావుగారిని అభినందించారు. రాజేంద్రప్రసాద్, ఐశ్వర్య రాజేష్, కార్తీక్ రాజు నటనను కొనియాడి, ఫోన్లో అభినందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ వంటి గొప్ప బేనర్లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు కె.ఎస్ రామారావుగారికి, కె.ఎ వల్లభ గారికి థ్యాంక్స్. ► ప్రేక్షకులకు కథ నచ్చితే అది రీమేక్ సినిమానా? ఒరిజినల్ సినిమానా? అని చూడకుండా ఆదరిస్తున్నారు.. హిట్ చేస్తున్నారు. ఒక మంచి కథ ఎక్కడ ఉన్నా మన తెలుగు ప్రేక్షకులకి చూపించాలనే సంకల్పంతో ఇప్పటి వరకూ ఎక్కువ రీమేక్ సినిమాలే చేశాను. కాలంతో పాటు మనం మారాలి. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు తీసినప్పుడే విజయం సాధించగలం. ► స్కూల్, కాలేజ్ డేస్ నుంచే నేను రైటర్గా, ఆర్టిస్ట్గా చేసేవాణ్ణి. ఆ అనుభవంతో సినిమా మీద ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న టైమ్లో ‘అశ్వద్ధామ’ సినిమాలో ఓ పాత్ర చేశా. ఆర్. నారాయణమూర్తిగారి ‘ఆలోచించండి’ సినిమాలో సెకండ్ హీరోగా చేశా. ‘కుదిరితే కప్పు కాఫీ, కెరటం’ వంటి చిత్రాల తర్వాత ‘కౌసల్య కృష్ణమూర్తి’లో బ్యాంకు మేనేజర్ పాత్ర చేశా. ఈ సినిమాలో నాదొక్కటే నెగటివ్ రోల్ అయినా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇకపైన కూడా మంచి పాత్రలొస్తే నటిస్తా. ► ఏ దర్శకుడికైనా కొన్ని సినిమాలు మైలేజ్నిస్తాయి. నాకు ‘సుడిగాడు’ అలాంటి సినిమా. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా. నేను, ‘అల్లరి’ నరేష్ కూడా ‘సుడిగాడు 2’ మీద చాలా ఆసక్తిగా ఉన్నాం. మంచి అవకాశం వస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. -
శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు
‘‘సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్గా సక్సెస్ సాధించడం కూడా అవసరం. అప్పుడే ఇంకా మంచి సినిమాలు రావడానికి స్కోప్ ఉంది. సినిమా చూసినవారు ‘శంకరాభరణం, మాతృదేవోభవ’ లాంటి గొప్ప సినిమా అని అభినందిస్తున్నారు. ఇకపై కూడా మా బ్యానర్లో మా గత సినిమాల్లానే క్వాలిటీతో పాటు మంచి పర్పస్ ఉన్న సినిమాలే అందిస్తాం’’ అన్నారు కేయస్ రామారావు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్తో పాటు కలెక్షన్లూ సాధిస్తోందని చిత్రబృందం తెలిపింది. శనివారం సక్సెస్ మీట్లో ఐశ్వర్యా రాజేశ్ మాట్లాడుతూ – ‘‘తమిళంలో ఎలా ఆదరించారో తెలుగులోనూ ఈ సినిమాను అలానే ఆదరిస్తున్నారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి ఈ ప్రశంసలను సపోర్ట్గా భావిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాకు పునాది కథ. మంచి కథ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాం. ఈ బ్యానర్లో గతంలో వచ్చిన గొప్ప సినిమాలకు దీటుగానే ఈ సినిమా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘ఒక గొప్ప సినిమాకు పాటలు రాసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాంబాబు గోసాల. ‘‘కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి సినిమాయే ‘కౌసల్య కృష్ణమూర్తి’’ అన్నారు బీఏ రాజు. ‘ఇండియన్ 2’ నుంచి తప్పుకున్నాను కమల్హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్ది ఓ కీలక పాత్ర. డేట్స్ క్లాష్ కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు. ఇలాంటి సినిమా వదులుకోవడం బాధగా ఉందని ఐశ్వర్య తెలిపారు. -
‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ
టైటిల్ : కౌసల్య కృష్ణమూర్తి జానర్ : ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ, శివ కార్తీకేయన్, కార్తీక్ రాజు తదితరులు సంగీతం : దిబు నైనన్ థామస్ నిర్మాత : కేఎ వల్లభ దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు తమిళంలో బిజీ హీరోయిన్గా ఉన్న ఐశ్వర్యా రాజేష్, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సరైన చిత్రంతో ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూశాను.. అందుకే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది. తమిళంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా రూపొందించిన ‘కణా’ ను మళ్లీ తెలుగులో కౌసల్య కృష్ణమూర్తిగా రీమేక్ చేశారు. మరి ఈ చిత్రం ఐశ్వర్యకు తెలుగులో మంచి విజయాన్ని అందించిందా? టాలీవుడ్లోనూ ఐశ్వర్యా సత్తాచాటిందా? అనేది చూద్దాం. కథ : ఇరగవరం అనే గ్రామంలో ఉండే కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్)కి వ్యవసాయం, క్రికెట్ అంటే ఇష్టం. ఒకవైపు తండ్రి చనిపోయి ఉంటే మరోవైపు క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని తన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన కౌసల్య(ఐశ్వర్యా రాజేష్).. తాను పెద్ద క్రికెటర్ అయి, ఇండియా తరుపున ఆడి, టీమ్ను గెలిపించి, తండ్రిని సంతోషపెడుదామనే ఆలోచనతో పెరుగుతుంది. ఓ ఆడపిల్ల ఆటలంటూ బయటకి రావడం.. సమాజం చిన్నచూపు చూడటం.. ఇరుగుపొరుగు హేలన చేయడం.. ఇవన్నీ దాటుకుని కౌసల్య తన కలను ఎలా సాధించిందన్నదే కౌసల్య కృష్ణమూర్తి కథ. నటీనటులు: చిన్నప్పటి నుంచి తండ్రి ఇష్టాన్ని చూస్తూ పెరిగి.. తన తండ్రి కన్న కల కోసం పాటుపడే కౌసల్య పాత్రలో ఐశ్యర్యా రాజేష్ అద్భుతంగా నటించింది. కళ్లతోనే భావాలను పలికించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రొఫెషనల్ క్రికెటర్లా కనిపించేందుకు ఐశ్వర్య పడిని శ్రమ తెరమీద కనిపించింది. భూమినే ప్రాణంగా నమ్ముకునే రైతు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ చక్కగా నటించాడు. రైతు పడే కష్టాలను చూపించే సన్నివేశాల్లో కంటతడి పెట్టించాడు. కృష్ణమూర్తి భార్యగా, కౌసల్య తల్లి సావిత్రి పాత్రలో ఝాన్ని తన అనుభవాన్ని చూపించింది. ఎమోషనల్ సీన్స్లో ముగ్గురూ పోటీపడి మరీ నటించారన్నట్లుగా ఉంది. కౌసల్యను ప్రేమిస్తూ.. ఆమె లక్ష్య సాధనలో సాయపడే సాయికృష్ణ పాత్రలో కార్తీక్ రాజు బాగానే నటించాడు. ప్రత్యేక పాత్రలో నటించిన శివ కార్తికేయన్ ఆకట్టుకున్నాడు. మిగిలిన వారంతా తమ పాత్రపరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ : కౌసల్య కృష్ణమూర్తి.. తమిళ హిట్ కణా మూవీకి రీమేక్. అయితే ఈ మధ్య ఏ భాషలోనైనా సరే ఓ సినిమా బాగుందనే టాక్ వస్తే మన ప్రేక్షకులు చూసేస్తున్నారు. ఇదే ఈ సినిమాకు నెగెటివ్గా మారొచ్చు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. కథలో ఉన్న ఫీల్ను మిస్ చేయకుండా, మన నేటివిటీకి తగ్గట్టు చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. క్రీడా నేపథ్యంలో ఇప్పటికే చాలా చిత్రాలు రాగా.. క్రికెట్ను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలను కూడా గతంలో మనం చూశాం. ఈ చిత్రానికి వచ్చే సరికి కథ కొత్తది కాకపోయినా.. రైతుల కష్టాలను కథలో భాగం చేస్తూ కథనాన్ని రాసుకున్నారు. ఈ మూవీలో క్రికెట్ను ఓ ట్రాక్గా చూపిస్తూనే.. రైతు, వ్యవసాయం గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓ వైపు క్రికెటర్గా ఎదిగేందుకు కౌసల్య పడే కష్టాలను చూపిస్తూ.. మరోవైపు ఈ దేశంలో రైతుగా బతకడం ఎంత కష్టమో, వారు అనుభవించే దుర్భర పరిస్థితులను చూపించాడు. అయితే కథనం ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగడం కాస్త నిరాశపరుస్తుంది. రైతు గురించి చెప్పే డైలాగ్లు, క్లైమాక్స్లో హీరోయిన్ చెప్పే డైలాగ్లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం మేజర్ ప్లస్. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్యం సంగీతంతో మరో లెవల్లో చూపించాడు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్ : ఐశ్వర్యా రాజేష్ సంగీతం మైనస్ పాయింట్స్ : తెలిసిన కథ ఊహకందేలా సాగే కథనం బండ కళ్యాణ్, సాక్షి వెబ్డెస్క్. -
రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా
‘‘నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. 25 తమిళ్, 2 మలయాళం, ఒక హిందీ సినిమా చేశా. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారని చాలామంది అడుగుతుంటారు. మా నాన్న రాజేష్గారు ‘మల్లె మొగ్గలు, రెండు జళ్ల సీత, ‘అలజడి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. మా అత్త శ్రీలక్ష్మిగారు కమెడియన్గా అందరికీ సుపరిచితురాలు. మా తాత అమర్నాథ్గారు కూడా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. మేం తెలుగువాళ్లమే’’ అని ఐశ్వర్యా రాజేష్ అన్నారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’. కె.యస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్ చెప్పిన విశేషాలు. ► తమిళ్లో నా పాత్రలన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. తెలుగులో కూడా మంచి సినిమాతో పరిచయం అవ్వాలని తాపత్రయపడేదాన్ని. ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఓ మంచి సినిమాతో పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో నేను లీడ్ రోల్ చేసిన ‘కణ’కి ఇది రీమేక్. తమిళ ప్రేక్షకుల్లా తెలుగు ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకం ఉంది. ► రాజేంద్రప్రసాద్గారు మా నాన్నగారికి మంచి ఫ్రెండ్. ఆయనతో నటిస్తున్నప్పుడు మా నాన్నగారి గురించి చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. కె.యస్. రామారావుగారు పట్టుబట్టి ఈ సినిమా బాగా రావడానికి తోడ్పాటునందించారు. ఈ సినిమా మా అందరికీ ఒక మంచి తీపిగుర్తుగా నిలుస్తుంది. ► క్రికెట్కి మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ఆ ఫీల్ పోకూడదని ఫీమేల్ కోచ్ని పెట్టుకొని ప్రాక్టీస్ చేశాను. అలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నేర్చుకున్నాను. తమిళ్లో ఎలాగైతే రోజుకి ఎనిమిది గంటలు ఎండలో కష్టపడ్డానో.. తెలుగుకి కూడా రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డాను. ఇంత కష్టపడ్డాను కాబట్టి తెలుగులో మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ప్రస్తుతం ‘కౌసల్య కృష్ణమూర్తి’ కోసం ఎగై్జటింగ్గా ఎదురు చూస్తున్నా. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లోనే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నాను. అలాగే నేను నటించిన మరో చిత్రం ‘మిస్ మ్యాచ్’ త్వరలో విడుదలవుతుంది. -
‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
మా సినిమా కొనని.. కొన్న మిత్రులకు ధన్యవాదాలు
‘‘కేయస్ రామారావుగారిని మేము ‘పప్పా’ (డాడీ) అని పిలుస్తాం. ఆయన ప్రతిరోజూ సెట్లో ఉంటారు. మీరు రిలాక్స్ అవ్వండి.. మేం చూసుకుంటాం అంటే.. నాకు నచ్చింది, వచ్చింది సినిమా.. ఇదే నా లైఫ్. ఇది చేయకపోతే ఇంకేం చేస్తాం అంటారు. ఇన్ని సినిమాలు చేసినా ఆయన ఇప్పటికీ సినిమాలను ప్రేమిస్తారు’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఐశ్వర్యా రాజేష్, డా. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’. నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్ సార్.. మీరు ఈ లైఫ్లో చేసినన్ని సినిమాలు నా లైఫ్టైమ్లో చేయలేనేమో? మీరు చేసిన సినిమాలు, పాత్రలు, అనుభూతులు ఇప్పుడు మా వల్ల కాని పని.. మీలాంటి వారే మాకు స్ఫూర్తి. ఐశ్వర్య నటించిన కొన్ని తమిళ చిత్రాలు చూశాం.. చాలా బాగా చేసింది. మీరు (ఫ్యాన్స్) అన్ని సినిమాలను సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. మన సినిమాలు వస్తున్నాయ్.. త్వరలోనే దింపుతున్నాం. నీటిని వృథా చేయకండి. 2022కి తాగునీటికి ఇబ్బందులు తప్పవని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి లీకేజీలను అరికడదాం. ఓ రోజు నీళ్లు లేకుంటే పరిస్థితి ఏంటో ఆలోచించండి. పెట్రోల్లా నీళ్లు కూడా లిమిటెడ్గా ఉన్నాయి.. పొదుపుగా వాడండి’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘క్రియేటివ్ కమర్షియల్స్లో 40 ఏళ్ల క్రితం ‘ఛాలెంజ్’ అనే సినిమాలో తొలిసారి నటించా. ఆ తర్వాత అనుకోకుండా నేను కామెడీ హీరోగా బాగా సక్సెస్ అయ్యాక కూడా నాతో ‘ముత్యమంత ముద్దు’ అని అద్భుతమైన సినిమా చేయించారాయన. ఈ సంస్థ ఇంతకాలం ఈ సంస్థ అద్భుతమైన స్థానంలో ఎందుకుంది అంటే.. మంచి సినిమాలు, గుర్తుండే సినిమాలు, సామాజిక సృహ ఉన్న సినిమాలు అందించింది కాబట్టి. నాలుగు మంచి సినిమాలు వెనకేసుకున్న బ్యానర్ కాబట్టి ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంది. ఒరిజినల్ కంటే రీమేక్లు బాగా తీశాడు కాబట్టి భీమనేని శ్రీనివాస్కి ఇంత మంచి పేరుంది. ‘కణ’ సినిమా కంటే ‘కౌసల్య కృష్ణమూర్తి’ బాగుంటుంది. నా జీవితంలో ఓ 10 సినిమాలుంటే వాటిలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నేను ఎప్పుడూ రీమేక్ని రీమేక్లా చేయలేదు. ఫ్రెష్ స్టోరీలా భావించి మన నేటివిటీకి తగ్గట్టు చేసుకుంటూ వచ్చా.. అందుకే హిట్స్ సాధించా. ఈ మధ్య క్రికెట్ నేపథ్యంలో వచ్చినవి మేల్ సెంట్రిక్ ఫిల్మ్స్.. కానీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి. కౌసల్య పాత్రలో ఐశ్వర్య అద్భుతంగా నటించింది’’ అన్నారు. కేయస్ రామారావు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం క్రాంతి మాధవ్. విజయ్ దేవరకొండతో మేం చేయనున్న సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ గురించి చెప్పాడు. ఆ సమయంలో ఐశ్వర్య నటించిన ‘కణ’ టీజర్ చూసి బాగుందని రీమేక్ చేశాం. ‘కణ’ కంటే ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాకి తెలుగులోనే తను ఎక్కువ కష్టపడింది. ఎందుకంటే ఇక్కడ మొదటి సినిమా కాబట్టి. నా సినిమాల్లో కథ బాగుందంటే అవి తయారు చేసిన వారి గొప్పదనం అది. వారందరూ గొప్ప రచయితలు, దర్శకులు, నటులు.. ఎంతో గొప్పగా చేయబట్టి, అవి నాకు నచ్చబట్టి.. ఓ నిర్మాతగా నేను కూడా వ్యాపారం చేసుకోవచ్చని భావించా. సినిమా వ్యాపారం చాలా రిస్క్తో కూడుకున్నది. ఏడాదికి 200 సినిమాలు రిలీజ్ అయితే వాటిల్లో మన సినిమా గొప్పగా ఉండాలనుకుంటే తప్ప ఆ సినిమా బతికి బట్టకట్టలేని పరిస్థితి. అలాంటి సినిమాలు చేయడానికి కోదండ రామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కె.విశ్వనాథ్, అజయ్... ఇలా ప్రతివాళ్లూ కష్టపడ్డారు. నా గురించి, నా బ్యానర్ గురించి వారంతా కష్టపడితేనే గొప్ప సినిమాలొచ్చాయి. 2019లో ఓ మంచి సినిమా చూశామని సంతృప్తిగా చెప్పుకునే చిత్రమిది. మా సినిమాని ఆంధ్రప్రదేశ్లో విడుదల చేస్తున్న నా స్నేహితులకు థ్యాంక్స్.. కొనటానికి రాని, పెద్ద సినిమాలే కొనే మిత్రులకు కూడా థ్యాంక్స్.. ఎందుకంటే శాటిలైట్, డిజిటల్ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని నేనే రిలీజ్ చేస్తున్నా. ఈ సినిమాని అమ్మటానికి నేను ప్రయత్నించా.. కానీ, ఐశ్వర్యారాజేష్ ఏమైనా అమితాబ్ బచ్చనా? చిరంజీవినా? అనుకొని ఉండొచ్చు. సినిమా చూస్తే ఆవిడేంటో తెలుస్తుంది’’ అన్నారు. ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ – ‘‘నా తొలి చిత్రం క్రాంతి మాధవ్గారి దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో సైన్ చేశా.. అదే ఫస్ట్ సినిమా అవుతుందనుకున్నా. కానీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ అయింది. తమిళ్లో 25 సినిమాలు చేశా.. ఆ తర్వాత ‘కణ’ నాకు వచ్చింది. ఆ సినిమా నా కల. అది బ్లాక్బస్టర్ అవడంతో వెనుతిరిగి చూసుకోలేదు. ఇలాంటి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం లక్కీ. ఈ సినిమాకి బెస్ట్ నటిగా తమిⶠంలో 10 అవార్డులు తీసుకున్నా. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనుకుంటున్నా’’ అన్నారు. కెమెరామేన్ ఆండ్రూ, ఏషియన్ సినిమాస్, నిర్మాత నారాయణ్దాస్, హీరోయిన్ రాశీ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది
‘తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్’ అసోసియేషన్ ఆధ్వర్యంలో 181వ ‘వరల్డ్ ఫొటోగ్రఫీ డే’ ఉత్సవాలు సోమవారం హైదరాబాద్లో జరిగాయి. తెలుగు సినిమా స్టిల్ ఫొటోగ్రాఫర్ల అధ్యక్షుడు కఠారి శ్రీను, జనరల్ సెక్రటరీ జి. శ్రీను, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు .యస్, ట్రెజరర్ వీరభద్రమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మూడు తరాల స్టిల్ ఫొటోగ్రాఫర్లతో నాకు అనుబంధం ఉంది. వారు నాకు కుటుంబం లాంటివాళ్లు. ఒకప్పుడు ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది. బి.ఎన్. రెడ్డిగారు, ఎన్టీఆర్గారు... ఇలా ఎంతో మంది లెజెండ్స్తో నాకు పరిచయం ఉంది. వారందరితో ఉన్న ఫొటోలు చూసుకుని ఆనాటి విషయాలను గుర్తు చేసుకుని ఆనందిస్తుంటాను’’ అన్నారు. సీనియర్ ఫొటోగ్రాఫర్లు శ్యామల్ రావు, శ్యామ్లను ఈ వేదికపై సత్కరించారు. హీరో ‘అల్లరి’ నరేష్, దర్శకుడు వీవీ వినాయక్, దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి, కెమెరామేన్, డైరెక్టర్ రసూల్ ఎల్లోర్, పలువురు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్
తమిళంలో సూపర్హిట్గా నిలిచిన ‘కణా’ చిత్రాన్ని ‘కౌసల్య కృష్ణమూర్తి’గా తెలుగులో రీమేక్చేస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడ సత్యరాజ్ పోషించిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్ పోషించాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్చేసుకున్న చిత్రబృందం.. విడుదల చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూసి.. ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. తన తండ్రి కన్న కలను నెరవేర్చేందుకు కూతురు పడ్డ కష్టమే ఈ చిత్ర కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే క్రికెట్ నేపథ్యంలో ఇదివరకే ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ.. ఇందులో రైతుల అంశాన్ని కూడా టచ్ చేసినట్లు కనపడుతోంది. ‘నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లని కాదు.. నిన్ను’ , ‘ఈ లోకం.. గెలుస్తానని చెబితే వినదు.. గెలిచిన వాడు చెబితే వింటుంది. ఏం చెప్పినా గెలిచి చెప్పు’లాంటి డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. శివ కార్తీకేయన్ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించారు. క్రియేటివ్ కమర్షియల్స్పై నిర్మించిన ఈ సినిమాకు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. -
తెలుగువారికీ చూపించాలనిపించింది
‘‘తమిళ చిత్రం ‘కణ’ చూసి ఆశ్చర్యపోయా. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలనుకున్నాం. అందుకే ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’గా రీమేక్ చేసి, తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో సిద్ధమైంది. కానీ ఎక్కువమంది ఆడియన్స్కు రీచ్ కావాలని ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. మన తెలుగు అమ్మాయి ఐశ్వర్యా రాజేష్ నటించిన క్రికెట్ బ్యాక్డ్రాప్ చిత్రం ఇది. తమిళంలో ఐదు పెద్ద సినిమాల మధ్య విడుదలై కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇలాంటి ఒక మంచి కథకు భీమనేని శ్రీనివాసరావుగారైతే న్యాయం చేయగలరని దర్శకునిగా తీసుకున్నాం. ఆయన బాగా తీశారు. హనుమాన్ చౌదరి చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఈ నెల 18న ప్రీ–రిలీజ్ వేడుక జరుపబోతున్నాం’’ అన్నారు. ‘‘ఏ సినిమా చేసినా ఒకే కమిట్మెంట్తో చేస్తాను. పెద్దా, చిన్నా అనే తేడాలు ఆలోచించకుండా కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు భీమనేని. ‘‘నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన కేయస్ రామారావుగారికి థ్యాంక్స్. భీమనేనిగారితో ‘సుడిగాడు’ సినిమాకు వర్క్ చేశాను. అలాగే ‘కేజీఎఫ్’ తర్వాత నేను డైలాగ్స్ రాసిన చిత్రం ఇది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు మాటల రచయిత హనుమాన్ చౌదరి. -
దేవదాస్ కనకాలకు నివాళి
-
దేవదాస్ కనకాలకు చిరంజీవి నివాళి
సీనియర్ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తన ఫిలిం ఇన్సిస్టిట్యూట్ ద్వారా ఎంతో మంది స్టార్స్ను అందించిన ఆయనకు తెలుగు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. దేవదాస్ కనకాల దగ్గర నటనలో శిక్షణ పొందిన మెగాస్టార్ చిరంజీవి ఆయన భౌతికకాయనికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాధ్, దర్శకుడు రాజమౌళి, గాయకుడు బాలసుబ్రమణ్యం, బ్రహ్మాజీ, హేమ, అనితా చౌదరిలతో పాటు పలువురు టీవీ నటులు కూడానివాళులర్పించిన వారిలో ఉన్నారు. యువ కథానాయకుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘వేలాదిమంది ఆర్టిస్టులను తయారు చేసిన గురువుగారు మా దేవదాస్ కనకాల గారు. ఆ వేల మందిలో నేనూ ఒకడిని. ఎందరికో మార్గదర్శి అయిన మా గురువు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రాజీవ్ కనకాల గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించమని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ దేవదాస్ కనకాల మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ‘దేవదాస్ కనకాల గారి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు. ఎంతోమందికి నటనలో శిక్షణ ఇచ్చి, వాళ్లు నటులుగా పేరు సంపాదించుకోవడంలో పాలు పంచుకున్న గురువు కూడా. ఇటీవలే ఆయనను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సత్కరించింది. ఇంతలోనే ఆయన ఇలా అందర్నీ వదిలి వెళ్లిపోవడం బాధాకరం. దేవదాస్ కనకాల గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని తెలిపింది. -
ఆటకి డేట్ ఫిక్స్
ఐశ్వర్యా రాజేష్, డా. రాజేంద్రప్రసాద్, కార్తీక్రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్యపాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్’. నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, భీమనేని శ్రీనివాసరావు కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న మరో గొప్ప సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఎటువంటి సినిమానైనా ఎదుర్కోగలుగుతుందని 200 శాతం విశ్వాసంతో, నమ్మకంతో విడుదల చేస్తున్నాం. క్రియేటివ్ కమర్షియల్స్ ద్వారా మరో మంచి సినిమాను సమర్పిస్తున్నాను. తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా పాటలకు, ట్రైలర్స్కి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ‘యు’ సర్టిఫికెట్ పొందింది’’ అన్నారు భీమనేని శ్రీనివాసరావు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.సునీల్కుమార్, లైన్ ప్రొడ్యూసర్: వి.మోహన్రావు. -
‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్ ఎప్పుడంటే!
ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కౌసల్య కృష్ణమూర్తి. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘ఒక ఆడపిల్లకి చక్కని సంబంధం చూసి పెళ్ళి చేయాలంటే మంచిచెడులు చాలా చూడాలి. అలాగే పెళ్లీడుకొచ్చిన మా ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాను కూడా మంచి డేట్ చూసి రిలీజ్ చెయ్యాలని అనుకున్నాం. అలా ఆగస్ట్ 23 చాలా మంచి డేట్ అని భావించి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రెండు వందల శాతం ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఈనెల 23న విడుదల చేస్తున్నాం. ఎటువంటి సినిమానైనా ఎదుర్కోగలుగుతుంది అనే నమ్మకం వచ్చిన తర్వాతే మా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. భీమనేని శ్రీనివాసరావు చేసిన ఓ మంచి సినిమా. ఐశ్వర్యా రాజేష్ అనే మంచి నటిని తీర్చిదిద్దిన సినిమా ఈ కౌసల్య కృష్ణమూర్తి. ఎంతో గొప్పగా నటించిన రాజేంద్రప్రసాద్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అటువంటి రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, భీమనేని శ్రీనివాసరావు.. ఈ ముగ్గురూ తెలుగు ప్రేక్షకులకు అందించే మరో గొప్ప సినిమా కౌసల్య కృష్ణమూర్తి అని నమ్ముతూ.. క్రియేటివ్ కమర్షియల్స్ ద్వారా మరో మంచి సినిమాను ప్రజెంట్ చేస్తున్నాను. తప్పసరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యింది. ముఖ్యంగా ‘ముద్దాబంతి పూవు ఇలా..’ అనే పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్స్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఆగస్ట్ 23న వరల్డ్వైడ్గా మా సినిమా విడుదలవుతుంది’ అన్నారు. -
సోడాల్రాజు
రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. శుక్రవారం రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన లుక్ను విడుదల చేశారు. ‘‘మా కథకు ప్రధానంగా నిలిచే సోమరాజు పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించారు. సినిమాలో సోమరాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబట్టి అందరూ ఆయన్ని సోడాల్రాజు అని పిలుస్తారు. కుటుంబంలోని సమస్యను ఓ తండ్రి స్థానంలో రాజేంద్రప్రసాద్ ఎలా పరిష్కరించానేది కథ’’ అన్నారు విశ్వనాథ్. ‘‘జీవితమంటేనే ఒక తోలుబొమ్మలాట. ఎవరి ఆట వారు ఆడాల్సిందే. కాకపోతే కొన్నిసార్లు ఆ ఆటలో చిక్కుముడులు ఉంటాయి. ఆ చిక్కుముడులను రాజేంద్రప్రసాద్ ఎలా విప్పారనేదే ముఖ్య కథాంశం. ఇదొక విభిన్న కుటుంబ కథా చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అన్నారు దుర్గా ప్రసాద్. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. -
పీవీ కూడా ఆయన అభిమాని అట...
మనసుకి రిలాక్స్ కావాలన్నా.. టెన్సన్ష్నుంచి బయటపడాలన్నా మెడిసిన్ ఏం అక్కర్లేదు. ఆయన సినిమాలు చూస్తే చాలు. సైడ్ ట్రాక్లో ఉన్న హాస్యాన్ని మెయిన్ ట్రాక్లోకి తీసుకొచ్చిన నటుడు ఆయన. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారి... ఎన్నో విజయవంతమైన సినిమాల్లోనటించారు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించడలడని నిరూపించారు రాజేంద్రప్రసాద్. నవ్వుల రారాజు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సాక్షి.కమ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
‘ఓ బేబీ’ మూవీ రివ్యూ
-
‘ఓ బేబీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఓ బేబీ జానర్ : ఫాంటసీ కామెడీ డ్రామా తారాగణం : సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్, తేజ సంగీతం : మిక్కీ జే మేయర్ దర్శకత్వం : నందినీ రెడ్డి నిర్మాత : సురేష్ బాబు, సునితా తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యూన్వూ థామస్ కిమ్ పెళ్లి తరువాత విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న సమంత, తాజాగా చేసిన మరో ప్రయోగం ఓ బేబీ. వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పాయింట్ను ఎంటర్టైనింగ్ చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు నందిని రెడ్డి. కొరియన్ మూవీ మిస్గ్రానీకి రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? బేబీ పాత్రలో సమంత మెప్పించారా? కథ : సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ) 70 ఏళ్ల వృద్ధురాలు. కొడుకు (రావూ రమేష్)తో కలిసి ఉండే సావిత్రి తన అతి ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. దీంతో మనస్తాపం చెందిన సావిత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అంతేకాదు తన యవ్వనం తిరిగి వస్తే బాగుండు అని కోరుకుంటుంది. వెంటనే దేవుడు ఆమెకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అలా తిరిగి పడుచు పిల్లగా మారిన బేబీకి (సమంత)కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆమె ప్రయాణం ఎలా సాగింది? చివరకు బేబీ తన అసలు వయస్సుకు వచ్చిందా.. లేదా..?అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇది పూర్తిగా సమంత సినిమా. తన బాడీ లాంగ్వేజ్కు, ఎనర్జీకి తగ్గ పాత్రలో సమంత జీవించారనే చెప్పాలి. బేబి పాత్రలో మరో నటిని ఊహించుకోలేనంతగా సమంత మెప్పించారు. కామెడీ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్లోనూ సమంత అద్భుతమైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. సినిమా బాధ్యత అంతా తన భుజాల మీదే మోసిన సమంత వందశాతం సక్సెస్ అయ్యారు. కీలక పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ కూడా జీవించారు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్లు తమకు అలవాటైన పాత్రల్లో అలవోకగా నటించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, సమంత కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక క్లైమాక్స్లో సమంత, రావు రమేష్ల మధ్య వచ్చే సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి. నాగశౌర్యకు పెద్దగా నటనకు అవకాశం లేకపోయినా ఉన్నంతలో తనవంతుగా మెప్పించాడు. బాలనటుడుగా సుపరిచితుడైన తేజ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చాడు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అతిథి పాత్రల్లో జగపతి బాబు, అడవి శేష్లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన నందిని రెడ్డి తరువాత సక్సెస్ వేటలో వెనుకపడ్డారు. దీంతో లాంగ్ గ్యాప్ తరువాత సమంత ప్రధాన పాత్రలో కొరియన్ సినిమా మిస్ గ్రానీని తెలుగులో రీమేక్ చేశారు. రెగ్యులర్ లేడీ ఓరియంటెడ్ సినిమాల తరహాలో కాకుండా ఓ ఫన్ రైడ్లా సినిమాను తెరకెక్కించిన నందిని సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కామెడీ సూపర్బ్గా వర్క్ అవుట్ అయ్యింది. తొలి భాగాన్ని ఎంటర్టైనింగ్గా నడిపించిన దర్శకురాలు ద్వితీయార్థం ఎక్కువగా ఎమోషనల్ సీన్స్తో నడిపించారు. ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గటం, కథనం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు సాగడంతో సెకండ్ హాఫ్ కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ను కట్టిపడేస్తాయి. సినిమాకు మరో ప్రధాన బలం లక్ష్మీ భూపాల్ అందించిన సంభాషణలు. డైలాగ్స్ నవ్వులు పూయిస్తూనే, ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తన మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయాడనే చెప్పాలి. గుర్తుండిపోయే స్థాయిలో ఒక్కపాట కూడా లేకపోవటం నిరాశపరిచే అంశమే. నేపథ్య సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం. ప్రతీ ఫ్రేమ్ను కలర్ఫుల్గా చూపించటంలో సినిమాటోగ్రాఫర్ విజయం సాధించారు. ఎడిటింగ్ పరవాలేదు. ద్వితీయార్థంలో కొన్ని సీన్స్కు కత్తెర పడితే బాగుండనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సమంత పర్ఫామెన్స్ ఫస్ట్ హాఫ్ కామెడీ ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాప్ లెంగ్త్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
కటౌట్ పెట్టి అంచనాలు పెంచేశారు
‘‘ఓ బేబీ’ చిత్రం కోసం హైదరాబాద్లో నా కటౌట్ పెట్టడం సంతోషంగా ఉన్నా టెన్షన్గానూ ఉంది. నేను నటించిన ‘యు టర్న్’ సినిమా చాలా బావుందని చెప్పారు. కానీ, కలెక్షన్లు అనుకున్నంత రాలేదు. ఏ సినిమాకు అయినా కలెక్షన్లు ముఖ్యం. ఇందాక ఇంటి నుంచి వస్తున్నప్పుడు చైతూతో (నాగచైతన్య) ఇలా చెప్పా.. ‘కటౌట్లు పెట్టి అంచనాలు పెంచేస్తున్నారు, ఈ సినిమాకి కలెక్షన్లు రాకపోతే నేను పారిపోతా అని చెప్పాను (నవ్వుతూ)’’ అన్నారు సమంత. నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత పంచుకున్న విశేషాలు. ► నా కెరీర్లో ‘ఓ బేబీ’కి చేసినంత ప్రమోషన్ ఇప్పటి వరకూ ఏ సినిమాకీ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఎక్కువ మంది చూడాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోట్ చేస్తున్నా. నా గత సినిమా ‘మజిలీ’ ప్రమోషన్ కూడా నా బాధ్యతగా అనిపించింది. పెళ్లయ్యాక నేను, చైతన్య కలిసి చేసిన తొలి సినిమా కాబట్టి చేశా. ‘ఓ బేబీ’ పూర్తి బాధ్యత నాపై ఉండటం కొంచెం భయంగా ఉంది. అయితే సినిమాపై నమ్మకం ఉంది. ► సాధారణంగా చైతన్య సినిమాలు విడుదలప్పుడు మాత్రమే నేను తిరుమలకి వెళ్లేదాన్ని. కానీ, తొలిసారి నా సినిమా కోసం యూనిట్తో కలిసి తిరుమల వెళ్లొచ్చాను. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఓపెనింగ్ కలెక్షన్లు ఎంతవరకూ ఉంటాయన్నది తెలియదు. మహేశ్బాబు, ఎన్టీఆర్, రామ్చరణ్, అల్లు అర్జున్ సినిమాలకైతే ప్రేక్షకులే థియేటర్కి వచ్చేస్తారు. కానీ, ఎంత స్టార్ హీరోయిన్ అయినా థియేటర్లకు జనాలను రప్పించడం చిన్న విషయం కాదు. థియేటర్కు వచ్చిన వారికి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ► ఎమోషనల్ సీన్స్, రొమాన్స్, డ్రామాలకు ఉన్న రిథమ్ నాకు బాగా తెలుసు. కానీ, కామెడీ రిథమ్ తెలియదు. కామెడీ చూడటం, నవ్వడం తేలికే. కానీ చేయడం చాలా కష్టం. ‘అఆ’ చిత్రంలో కొంచెం ట్రై చేశా. కానీ, ఈ సినిమాలో వినోదం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్గారు నాకు చాలా బాగా నేర్పించారు. నానమ్మ, అమ్మమ్మలతో పెరిగిన జ్ఞాపకాలు నాకు లేవు. ఈ సినిమాలో బామ్మగా కనిపించాల్సిన సన్నివేశాల కోసం వృద్ధాశ్రమాలకు వెళ్లి బామ్మలు ఎలా ఉంటారని పరిశీలించాను. ► నందినీరెడ్డి ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ఉన్నా ఎంతో స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. సామర ్థ్యం ఉన్న వారికే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. మేల్ డైరెక్టరా? ఫిమేల్ డైరెక్టరా? అన్నది ముఖ్యం కాదు. జండర్ తేడాలు భవిష్యత్తులోనైనా రావనే అనుకుంటున్నా. అమ్మాయిలు చేస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదని, ఎలాంటి తేడా రాకూడదని ఇంకా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం. ► ‘ఓ బేబీ’ క్లైమాక్స్ సీన్ని చాలా కష్టపడి చేశా. ఎమోషనల్ సీన్స్ ఈజీగా చేసేదాన్ని. కానీ, రావు రమేశ్గారు నా కొడుకు పాత్ర చేస్తున్నప్పుడు ఏడుపు రాలేదు. నా కెరీర్ మొత్తంలో ఒక ఏడుపు సీన్ కోసం రెండు గంటలు బ్రేక్ తీసుకుని, ఏడుపు తెచ్చుకుని చేసిన సినిమా ఇది. ► ప్రెగ్నెన్సీ విషయం గురించి అడగడంలో తప్పు లేదు? నేను కూడా నా ఫ్రెండ్స్ని పిల్లల గురించి ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారని అడుగుతా. భగవంతుడి దయవల్ల, నా కుటుంబ సభ్యుల సపోర్ట్తో నేను స్వతంత్రంగా ఉండగలుగుతున్నా. నాకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని చెప్పగలుగుతున్నా. ఈ పరిస్థితి మన అమ్మకో, అమ్మమ్మకో ఉండేది కాదేమో? ఇలాంటి ఎన్నో విషయాలను ఆలోచింపజేసే సినిమా ఇది. ► శేఖర్ కమ్ములగారు హీరోయిన్లను చూపించే తీరు బావుంటుంది. ఆయన దర్శకత్వంలో చేయాలని ఉంది. మణిరత్నం సార్ దర్శకత్వంలో చేయాలన్నది నా కల. నాకు దర్శకత్వం ఆలోచనలు మాత్రం లేవుగానీ, మహిళాప్రాధాన్యం ఉన్న కథలతో సినిమాలు నిర్మిస్తా. ప్రస్తుతం ‘96’ సినిమా సెట్స్ మీద ఉంది. ‘మన్మథుడు 2’ లో చిన్న పాత్ర చేశాను. -
‘కౌసల్య కృష్ణమూర్తి’ పాటల విడుదల వేడుక
-
అలా అనుకోకపోతే పేరు మార్చుకుంటా
‘‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చూసి బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా సరే.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ‘రాజేంద్రప్రసాద్ మా నాన్నగారు అయ్యుంటే బాగుండు’ అనుకోకపోతే నా పేరు మార్చుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఐశ్వర్యారాజేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కనా’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఐశ్వర్యారాజేశ్తోనే ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించారు. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించారు. దిబు నినన్ థామస్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ వేడుకలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అభిరుచి ఉన్న నిర్మాత ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. అభిరుచికి, డబ్బుకి సంబంధం లేదు. రామారావుగారు ఇప్పటికీ, ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ గొప్ప కథ. ఈ సినిమాలో కామెడీ, తండ్రీ కూతుళ్ల బంధం ఉంటుంది. భీమనేని శ్రీను నా నుంచి చాలా సున్నితమైన నటన రాబట్టుకున్నాడు’’ అన్నారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం టీజర్ చూశాను.. వాస్తవానికి దగ్గరగా ఉంది. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. తల్లిదండ్రులతో అమ్మాయిల రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? అమ్మాయిల కలలకు తల్లిదండ్రులు ఎలా సపోర్టివ్గా నిలిచారు? అనే అంశాలను సినిమాలో చర్చించారు. ఇలాంటి చిత్రాల వల్ల ఉమెన్ క్రికెట్ను ప్రోత్సహించాలన్న విషయం మరింత మందికి చేరువ అవుతుంది. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనకు ఈ సినిమా దోహదం చేస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘మా రామారావు అన్నయ్య రీమేక్ చేసిన సినిమాలన్నీ హిట్లు, రికార్డులు బద్దలు కొట్టాయి. చిరంజీవిగారివంటి ఎందరో పెద్ద స్టార్స్తో సినిమాలు తీసినా, ఆయన తీసిన చిన్న సినిమాలే సెన్సేషన్ హిట్లు.. మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు తీసుకొచ్చాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆయన కొడుకు వల్లభ సక్సెస్కి నాంది అవుతుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘ఐశ్వర్య నటిస్తోందనిపించదు.. నటన ఆమెకు నల్లేరు మీద నడకలాంటిది. రాజేంద్రప్రసాద్గారు, ఐశ్వర్య పోటీపడి మరీ నటించారు. రామానాయుడుగారిలాంటి టాప్ 10 నిర్మాతల్లో రామారావుగారు ఒకరు’’ అన్నారు. ఐశ్వర్యారాజేష్ మాట్లాడుతూ – ‘‘కనా’ నా జీవితాన్ని మార్చింది. తెలుగులో నా తొలి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’ కావడం అదృష్టం. రామారావుగారి ప్రొడక్షన్లో నా తొలి సినిమా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా హక్కులు నాకు కావాలని ఐశ్వర్యను అడిగితే ఇప్పించింది. సావిత్రిగారు, శారదగారు.. ఇప్పుడు కీర్తీ సురేశ్, సమంత బాగా నటిస్తారు. వారికి ఏ మాత్రం తీసిపోకుండా నటించగలదు ఐశ్వర్య’’ అన్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ పి.రామ్మోహన్రావు, నిర్మాతలు పోకూరి బాబూరావు, కె. అశోక్ కుమార్, జి.విజయ రాజు, కార్తీక్ రాజు, నటుడు మహేశ్, డైరెక్టర్ క్రాంతిమాధవ్, ‘కనా’ చిత్ర దర్శకుడు, కథా రచయిత అరుణ్ రాజా కామరాజు, కెమెరామెన్ ఆండ్రూ, సంగీత దర్శకుడు దిబు నినన్ థామస్, నటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
‘కౌసల్య’కు సపోర్ట్గా మిథాలీ, రాశీఖన్నా
స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కే చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. తెలుగులో క్రీడా నేపథ్యంతో వచ్చే చిత్రాల సంఖ్య తక్కువే కానీ.. ఇక్కడా అలాంటి చిత్రాలు విజయవంతమయ్యాయి. తాజాగా నాని హీరోగా వచ్చిన జెర్సీ చిత్రంలో మంచి విజయాన్ని నమోదుచేసింద. త్వరలో మళ్లీ క్రికెట్ నేపథ్యంలో కౌసల్య కృష్ణమూర్తి అనే చిత్రం రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా టీజర్ను విడుదల చేయించింది చిత్రబృందం. ఈ టీజర్తో మూవీపై అంచనాలు పెరిగాయి. తమిళ సూపర్హిట్ మూవీ కణా చిత్రానికి రీమేక్గా వస్తోన్న ఈ చిత్రంలో శివకార్తీకేయన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్కు భారత మహిళా జట్టు వన్డే కెప్టెన్ మిథాలీరాజ్, రాశీఖన్నా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. జూలై 2న అడియో రిలీజ్ను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్నారు. -
మా ఇద్దరి ఒప్పందం అదే
‘‘సాధారణంగా అందరం మన అమ్మలను టేకిట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. కసురుతాం.. విసుక్కుంటాం. అయినా అమ్మ మనకు చాలా ప్రేమను పంచుతారు. మనమందరం తల్లులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదేమో? ‘ఓ బేబీ’ సినిమాలో ఈ పాయింట్ని చూపించాం. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది’’ అని దర్శకురాలు నందినీ రెడ్డి అన్నారు. సమంత లీడ్ రోల్లో నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సునీత తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 5న విడుదలకానుంది. నందినీ రెడ్డి పలు విశేషాలు పంచుకున్నారు. ► కొరియన్ చిత్రం ‘మిస్. గ్రానీ’ చూస్తున్నంత సేపు నేను చాలా కనెక్ట్ అయ్యాను. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. అందరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. కథలో క్వాలిటీ ఉంది. బెస్ట్ యాక్టర్స్ ఈ సినిమాలో పని చేశారు. లక్ష్మిగారు, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్గారు, సమంత అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. డైరెక్షన్లో నేను చే సిన చిన్నచిన్న తప్పులు కూడా వాళ్ల అద్భుతమైన యాక్టింగ్తో కవర్ చేసేశారు. ► ఆర్టిస్ట్కి కథ ప్లస్ అయ్యే సినిమాలు కొన్ని.. కథకు ఆర్టిస్ట్ ప్లస్ అయ్యే సినిమాలు మరికొన్ని. ‘ఓ బేబీ’ రెండు విభాగాల్లోకి వస్తుంది. ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ విందు భోజనంలా ఉంటారు. సినిమాలో బేబక్క పాత్ర చాలా కీలకం. లక్ష్మీగారు అద్భుతంగా చేశారు. ఆమె ఒప్పుకోకపోయి ఉంటే ఈ సినిమాను చేసేవాళ్లం కాదేమో? ఈ పాత్రకు ఆప్యాయత, వెటకారం అన్నీ ఉండాలి. లక్ష్మీగారే కరెక్ట్ అని భావించాం. ► రీమేక్తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా రాకపోతే పాడు చేశారు అంటారు. హిట్ అయితే అలానే తీశారు.. హిట్ అయిపోయింది అంటారు. రీమేక్స్తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం. నా సినిమాలన్నీ 50 రోజుల్లోనే పూర్తి చేస్తాను. కానీ సినిమా సినిమాకు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది? అని అడుగుతుంటారు. ఒక్కోసారి ఐడియా స్టేజిలో బావుంటుంది. కథ రాశాక నచ్చకపోవచ్చు. అలా లేట్ అవుతూ సినిమా సినిమాకు గ్యాప్ వస్తుంది. ఈసారి నుంచి అలా జరగుకుండా చూసుకుంటాను. ► ఈ సినిమాకు సమంత కేవలం యాక్టర్గానే కాకుండా అన్ని బాధ్యతలూ చూసుకున్నారు. ‘నువ్వేదైనా తప్పు చేస్తుంటే నేను చెబుతా.. నేనేదైనా తప్పు చేస్తే నువ్వు చెప్పు.. మన మధ్య ఈగో అనేది అడ్డురాకూడదు అని సినిమా స్టార్ట్ అవ్వక ముందే సమంత–నేను ఒప్పందం చేసుకున్నాం(నవ్వుతూ). ► దర్శకురాలిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. యాక్షన్ కామెడీ, స్పోర్ట్స్ సినిమాలు చేస్తాను. ప్రస్తుతం వైజయంతీ బ్యానర్లో ఓ సినిమా చేయాలి. రెండు కథలున్నాయి. అందులో మల్టీస్టారర్ సినిమా ఒకటి. వెబ్ సిరీస్ల ట్రెండ్ కూడా బాగా పెరుగుతోంది. ఇంకా స్టార్టింగ్ స్టేజిలోనే ఉంది. వెబ్ థియేటర్కి హాని చేస్తుందా? అంటే చెప్పలేం. ► ‘ఓ బేబీ’ సినిమా పూర్తయ్యాక అమ్మ మీద కసురుకోవడం కొంచెం తగ్గింది. ఒకవేళ బేబీలా నేను మళ్లీ వయసులో వెనక్కి వెళితే సినిమాలు కాకుండా వేరే ప్రొఫెషన్ని కూడా ట్రై చేస్తానేమో? ఇండస్ట్రీలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ మెల్లిగా ఆ సంఖ్య పెరగాలి. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ‘ఓ బేబీ’ సినిమా సెట్లో మహిళా సాంకేతిక నిపుణుల సంఖ్య కొంచెం పెరిగింది. మహిళలు ఉండాలనే ఉద్దేశం కంటే కూడా వాళ్ల ప్రతిభని గుర్తించే తీసుకున్నాం. -
‘నాగశౌర్య.. వాడో వేస్ట్ ఫెలో’
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఓ బేబీ. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను సినీ ప్రముఖులు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర చంటి.. యాక్చ్యువల్గా లక్ష్మీగారికి గానీ, సమంతకి గానీ బాయ్ఫ్రెండ్ని నేనే. ఊరికే నాగశౌర్య కాళ్లు అవి ఇరగొట్టుకొని నేను బాయ్ఫ్రెండ్ అని ఫీల్ అవుతుంటాడు గానీ, వాడు వేస్ట్ ఫెలో. ఆల్ రెడీ కాళు విరగొట్టుకొని వచ్చాడు కూడా’ అంటూ నవ్వులు పంచారు. ఇదే వేదిక నుంచి సినిమా షూటింగ్ సమయంలో తనపై వచ్చిన రూమర్స్కు సమాధానమిచ్చారు రాజేంద్ర ప్రసాద్. ఓ బేబీ షూటింగ్ స్పాట్కు రాజేంద్ర ప్రసాద్ తాగి వచ్చారంటూ గతంలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఆ సీన్కు సంబంధించిన మూడ్ను క్యారీ చేస్తూ సెట్లో అలా ఉన్నానే గానీ 42 సంవత్సరాల సినీ కెరీర్లో తానెప్పుడూ తాగి రావటం లాంటి పనులు చేయలేదని చేయబోనని చెప్పారు. -
విజయనిర్మల మృతి పట్ల ప్రముఖులు సంతాపం
-
అదే అంకిత భావంతో ఉన్నా
‘‘యాభై ఏళ్ల క్రితం నా మూవీ మేకింగ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అలాగే పని జరగనప్పుడు వచ్చే కోపం కూడా అలానే ఉంది. కానీ పని విషయంలో మాత్రం అంకిత భావం తగ్గలేదు. టెక్నికల్గా చాలా అడ్వాన్డ్స్ స్టేజ్కి వచ్చాం. సినిమా క్వాలిటీ పెరగడంతో మంచి సినిమాలు రావడానికి అవకాశాలు ఎక్కువయ్యాయి’’ అని నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. ఐశ్వర్యారాజేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’. తమిళంలో రూపొందిన ‘కనా’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. క్రియేటివ్ కమర్షియల్పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేఎస్. రామారావు చెప్పిన విశేషాలు. ► మా బ్యానర్లో రాబోతున్న మంచి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళంలో విడుదలైన ‘కనా’ సినిమాను చూశాను. ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేశాం. తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మంచి ఎమోషనల్ స్టోరీ. క్రికెట్ బేస్తో పాటు కంటెంట్ ఉన్న స్టోరీ. ఈ చిత్రం క్రికెట్ అభిమానులతోపాటు యూత్కి, ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుంది. ఇప్పటి ట్రెండ్కు తగ్గట్లు భీమనేని తెరకెక్కించారు. ► ఒక సాధారణ రైతుబిడ్డగా పుట్టి ఇండియా క్రికెట్ టీమ్లో ఆడాలని కష్టపడే ఓ యువతి పాత్రలో ఐశ్వర్య నటించింది. ప్యారలల్గా రైతుసమస్యలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి అమర్నాథ్ సీనియర్ హీరో. మన కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు తను. వీరిద్దరి వారసత్వ నటన ఐశ్వర్యకు వచ్చింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్గారు అద్భుతమైన పాత్ర చేశారు. శివ కార్తికేయన్, ‘వెన్నెల’ కిశోర్, కార్తీక్రాజు క్యారెక్టర్స్కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. జూలై 2న ప్రీ–రిలీజ్ ఈవెంట్ను జరపబోతున్నాం. ఈ కార్యక్రమానికి విమెన్ టీమ్ ఇండియా కెప్టెన్గా చేసిన మిథాలీరాజ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. ► పెద్దసినిమాలు చేస్తున్నప్పుడు ఎంత సంతృప్తిగా ఉంటానో ‘పుణ్యస్త్రీ, మాతృదేవోభవ, ముత్యమంత ముద్దు’ తీస్తున్నప్పుడూ అంతే సంతృప్తిగా ఫీలవుతాను. ఇవన్నీ కూడా సినిమాలపై ఇంకోవైపు నాకున్న ఇంట్రెస్ట్ను తెలియజేసే చిత్రాలు..‘కౌసల్య కృష్ణమూర్తి’ కూడా అలాంటిదే. -
టీజర్ చూసి స్వయంగా చిరు ఫోన్ చేశాడట!
క్రికెట్ను అమితంగా ఇష్టపడే తండ్రి, ఆయన ఆశయాన్ని నెరవేర్చే కూతురి కథాంశంతో.. తమిళంలో వచ్చి సూపర్హిట్గా నిలిచిన కణ చిత్రాన్ని తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేస్తున్నారు. అక్కడ సత్యరాజ్చేసిన పాత్రను ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. కేవలం మోషన్ పోస్టర్తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రం.. తాజాగా చిరు చేతుల మీదుగా టీజర్ను రిలీజ్చేయింది మరింత హైప్ను క్రియేట్ చేయనుంది. అయితే నేటి సాయంత్రం ఐదు గంటలకు చిరు ఈ మూవీ టీజర్ను చిరు విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే టీజర్ను వీక్షించిన చిరు.. హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్కు ఫోన్ చేశారట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఫోన్ రావడం ఆశ్చర్యం కలిగించింది. టీజర్ నచ్చిందని చిరు అన్నారు. ఆయన నాతో మాట్లాడిన విధానానికి.. నేను ఇంకా ఆశ్యర్యంలోనే ఉన్నాను. థ్యాంక్యూ సో మచ్ సర్’ అంటూ ట్వీట్ చేశారు. చూస్తుంటే చిరు ఫోన్తో ఐశ్వర్య గంతులేసినట్లు అనిపిస్తోంది. చిరుకు నచ్చిన ఈ టీజర్ను మనం కూడా చూడాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు. It was such a big surprise call from #MegaStarChiranjeevi garu ... he said he loved #KausalyaKrishnamurthy teaser .. am still awestruck d way chiru sir spoke to me .. thank u so much sir ... such a big honour to me @CCMediaEnt — aishwarya rajessh (@aishu_dil) 18 June 2019 -
చిరు చేతుల మీదుగా ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్
తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘కణా’ చిత్రాన్ని తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తిగా తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ఈ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ టీజర్ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ జూన్ 18 సాయంత్రం 5 గంటలకు చిరంజీవి కౌసల్యా కృష్ణమూర్తి టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు. -
మంచి సినిమాలే చేయాలనుకున్నా
‘‘సురేశ్ ప్రొడక్షన్స్ స్థాపించిన 55ఏళ్లలో తొలిసారి ఓ మహిళా డైరెక్టర్తో సినిమా చేశాం. నందినీతో ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చేయలేకపోయాం. ఇప్పుడు కూడా నలుగురు నిర్మాతలు యూనిట్ అయ్యి ‘ఓ బేబీ’ సినిమా తీశాం’’ అని డి.సురేశ్బాబు అన్నారు. సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య తారలుగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా జూలై 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురేశ్బాబు మాట్లాడుతూ– ‘‘ఓ బేబి’ సినిమాకి ఎక్కువగా లేడీ యూనిట్ పనిచేశారు. ఫస్ట్ టైమ్ నా బంధువు, నా ఫ్యామిలీ మెంబర్తో(సమంత) ఈ సినిమా చేశా. ఇంతకుముందు మా ఇంట్లో అబ్బాయిలు మాత్రమే సినిమాలు చేసేవారు ఇప్పుడు అమ్మాయి కూడా చేసేసింది. వెంకటేశ్, చైతన్య, రానా.. ఇప్పుడు సమంత. ఈ సినిమాని కొరియా హక్కులు కొని రీమేశాం. మన సినిమాలు కూడా తొందర్లో కొని ఫారిన్లో రీమేక్ చేస్తారు. ఇది మంచి ట్రెండ్’’ అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్గా నాకు ఫస్ట్ చెక్ ఇచ్చింది సురేశ్సారే.. సురేశ్ ప్రొడక్షన్లో నా తొలి సినిమా రావాల్సింది కానీ జరగలేదు. నా నాలుగో సినిమా ఈ ప్రొడక్షన్లో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది యూనివర్శల్ స్టోరీ. ఇప్పటి వరకూ సమంత చేసిన పాత్రలకంటే ‘ఓ బేబి’ లో ఎక్కువ షేడ్స్ కనిపిస్తాయి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘అదృష్టం అనేది ఉండొచ్చు. అయితే ‘మంచి సినిమాలు చేయాలి.. లేకపోతే ఇంట్లో కూర్చోవాలి’ అని నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. దాని తర్వాత వచ్చిన సినిమాలే ‘రంగస్థలం, మహానటి, సూపర్ డీలక్స్, మజిలీ’. నాకు ఓ చిన్న బాధ ఉండేది. నేను రిటైర్ అయ్యేలోపు ఓ పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయాలని. ‘ఓ బేబీ’ ద్వారా నాకు ఆ ఆశ తీరింది. ఈ సినిమా సురేశ్ ప్రొడక్షన్లో చేయడం సంతోషంగా ఉంది. సురేశ్గారు ఫోన్ చేసి సీన్స్ ఎలా వచ్చాయి అని అడిగేవారు. దీంతో నాకు ఓ బాధ్యత అనిపించి ఎడిటింగ్ రూమ్కి వెళ్లి రషెస్ చూసుకునేవాణ్ణి. ఈ సినిమా నాకు ఓ పాఠం నేర్పింది. ఈ సినిమా నా కెరీర్లో ఓ స్పెషల్ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సునీత, నటుడు తేజ పాల్గొన్నారు.