Popular Cinematographer, Director Rajendra Prasad Passes Away - Sakshi
Sakshi News home page

Rajendra Prasad: విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ , దర్శకుడు కన్నుమూత

Aug 19 2022 6:54 PM | Updated on Aug 19 2022 9:53 PM

Popular Cinematographer, Director Rajendra Prasad Passes Away - Sakshi

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక - నిర్మాత రాజేంద్ర ప్రసాద్  ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు(ఆగస్ట్‌ 19) తుదిశ్వాస విడిచారు. 'ఆ నలుగురు' చిత్ర దర్శకుడు చంద్ర సిద్ధార్థ్‌కు ఈయన సోదరుడు.  తెలుగులో 'నిరంతరం(1995)’ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకోవడమే కాకుండా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది.  

రాజేంద్ర ప్రసాద్‌ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆయన ప్రాధమిక విద్యాభాసం అంతా ఇక్కడే జరిగింది. పుణెలోలో ఓ ప్రముఖ ఫిల్మ్‌ స్కూల్‌లో సినిమాగ్రఫీని నేర్చుకున్నాడు. పలు ఇంగ్లీష్‌, పెర్షియన్‌ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. హాలీవుడ్‌లో 'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్' 'ఆల్ లైట్స్, నో స్టార్స్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement