సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట పట్టణంలోని స్థానిక కస్తూరి బజార్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం గత కొంతకాలం నుంచి ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం స్థానికులు గమనించేసరికి వారు మృతదేహాలుగా కనిపించారు.