విజయవాడలో సంచలనం కలిగించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆయూబ్ హత్యకేసు మిస్టరీ వీడిండి. ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ను పోలీస్ క్వార్టర్స్ లోనే అతని భార్య, కుమార్తెలు, కుమారులు కలిసి క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.