తమిళనాడులో విషాదం | Blost in crackers factory near sivakasi villupuram district | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 9 2016 6:36 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా శివకాశీలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఆదివారం సాయంత్రం శివకాశీ పట్టణం పులిచపాల్యం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో కాలిన మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement