tamilnadu
-
పోలీసులకు తల్లి ఫిర్యాదు
తిరువళ్లూరు: తన కొడుకు మృతిపై అనుమానం ఉందని ఆరోపిస్తూ తల్లి కడంబత్తూరు పోలీసులకు పిర్యాదు చేసింది. తన కొడుకును భార్య ఆమె బంధువులే చంపేశారని ఆరోపించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాట్టాన్కొలత్తూరు గ్రామానికి చెందిన పాల్రాజ్ కుమారుడు ప్రేమ్రాజ్(38). ఇతనికి చిట్రంబాక్కం గ్రామానికి చెందిన దీప అనే మహిళతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.ఈ క్రమంలో భార్యభర్త మధ్య తరచూ మనస్పర్థలు రావడంతో దీప పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల పంచాయితీతో ఇటీవల కాట్టాన్కొలత్తూరులోని ఇంటిని విక్రయించిన ప్రేమ్రాజ్ తన భార్య వద్దకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడే భార్యభర్త కలిసి నివాసం వుంటున్న క్రమంలో అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి జ్యోతి కడంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు మృతిలో అనుమానం వుందని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరింది. -
జయలలిత ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?
-
జయలలిత ఆభరణాల్లో.. అద్భుతమైనవివే..!
చెన్నై:తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను బెంగళూరు కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేసింది.మొత్తం రూ.4 వేల కోట్ల ఆస్తుల్లో ఇళ్లు,1525ఎకరాల భూమి డాక్యుమెంట్లతో పాటు 1100 కేజీల వెండి,వెయ్యి కిలోలకుపైగా బంగారం,వజ్రాలు ఉన్నాయి.అక్రమాస్తుల కేసులో జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను చివరిగా తమిళనాడు ప్రభుత్వానికి అందించారు.అక్రమాస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికల దోషిగా తేలిన విషయం తెలిసిందే. అయితే శిక్ష పడేలోపే జయలలిత మరణించారు.శశికల మాత్రం ఈ కేసులో శిక్ష అనుభవించారు.తమిళనాడు ప్రభుత్వానికి అందిన వాటిలో జయలలితకు చెందిన బంగారు కిరీటమిది..జయలలిత బంగారు ఒడ్డానం..దీనిలో వజ్రాలను నెమలి ఆకారంలో పొదగడం విశేషం.ఇది జయలలితకు బహుకరించిన బంగారు కత్తి..ఇది జయలలిత రూపంతో ఉన్న బంగారు బొమ్మ.. -
విమానంలో సీటు వివాదం.. డీఎంకే ఎంపీVsఅన్నామలై
చెన్నై:తమిళనాడులో ఎయిర్ఇండియా విమానంలో సీటుపై రాజకీయం వేడెక్కింది. విమాన సీటు విషయంలో డీఎంకే,బీజేపీ మధ్య విమర్శల బాణాలు దూసుకెళ్లాయి. డీఎంకే ఎంపీ తంగపాండియన్ ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానంలో చెన్నై రావాల్సి ఉంది. అయితే ఎయిర్ ఇండియా వారు ఆమె బిజినెస్ క్లాసు సీటును రద్దు చేసి ఎకానమి సీటు కేటాయించారు. ఈ వ్యవహారంపై ఎంపీ తంగపాండియన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ఒక ఎంపీకే విమానంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. తన విమాన టికెట్ తరగతిని ఎలా తగ్గిస్తారని ట్వీట్లో నిలదీశారు. దీనికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై స్పందించారు. ఎంపీ తంగపాండియన్కు అలా జరగాల్సింది కాదని అంటూనే ఆమెపై విమర్శలు గుప్పించారు.Absolutely unacceptable from @airindia! I had booked a Business Class seat on an Air India flight from Delhi to Chennai (A1540- 9.20pm) this evening (13.02.2025). Without any prior notice or explanation, the seat was downgraded. This is not just about me—if a MP can be treated… pic.twitter.com/wAqNkwwBBp— தமிழச்சி (@ThamizhachiTh) February 13, 2025 కేవలం విమానంలో టికెట్ తరగతిని తగ్గిస్తేనే ఇంత బాధపడుతున్నారు..డీఎంకే పాలనలో ప్రజల స్థాయి తగ్గిపోయిందని గుర్తుచేశారు. ఒక ఎంపీని నా పరిస్థితే ఇలా ఉంటే అని మాట్లాడడం మీ అధికార దర్పాన్ని, సంపన్న వర్గాల మనస్తత్వాన్ని సూచిస్తోందని మరో ‘ఎక్స్’ పోస్టులో ఘాటు వ్యాఖ్యలు చేశారు.Though this shouldn’t have happened, it comes at the right time to tell people in power in TN what it means to be downgraded. The entitlement that makes one say “if an MP can be treated this way” shows the loftiness of a person who is a product of dynasty politics. With the… https://t.co/o4Y9UlIyY4— K.Annamalai (@annamalai_k) February 14, 2025 -
కమల్ హాసన్తో డీసీఎం భేటీ!
చెన్నై : మక్కల్ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైనట్లే తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గురువారం కమలహాసన్తో భేటీ అయ్యారు. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే కమల్ హాసన్ను రాజ్యసభకు నామినేట్ చేయనుందంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బుధవారం కమల్ హాసన్ నివాసానికి రాష్ట్రమంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లారు. ఆ భేటీని ఎంఎన్ఎం పార్టీ ఎక్స్ వేదికగా ప్రస్తావించింది. దీంతో రాజ్యసభకు కమల్ హాసన్ ప్రచారం జోరందుకుంది. மக்கள் நீதி மய்யம் கட்சியின் தலைவர் திரு. @ikamalhaasan அவர்களை, இந்து சமய அறநிலையத்துறை அமைச்சர் திரு. @PKSekarbabu அவர்கள் மரியாதை நிமித்தமாகச் சந்தித்து உரையாடினார். தலைவரின் அலுவலகத்தில் நடந்த இந்தச் சந்திப்பின்போது, கட்சியின் பொதுச்செயலாளர் திரு. @Arunachalam_Adv அவர்கள்… pic.twitter.com/ni4Ne3hqFb— Makkal Needhi Maiam | மக்கள் நீதி மய்யம் (@maiamofficial) February 12, 2025 ఈ తరుణంలో కమల్ హాసన్తో ఉదయనిధి స్టాలిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కమల్తో భేటీ అనంతరం, ఉదయనిధి స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మేం ఈరోజు మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల్ హాసన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాం. మమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతించినందుకు, రాజకీయాలు, సినిమాతో పాటు వివిధ రంగాలపై అభిప్రాయాలను పంచుకున్నందుకు నా కృతజ్ఞతలు’అని ట్వీట్లో పేర్కొన్నారు. மக்கள் நீதி மய்யத்தின் தலைவர் - கலைஞானி @ikamalhaasan சாரை இன்று அவருடைய இல்லத்தில் மரியாதை நிமித்தமாக சந்தித்தோம். அன்போடு வரவேற்று அரசியல், கலை என பல்வேறு துறைகள் சார்ந்து கருத்துக்களை பரிமாறிக்கொண்ட கமல் சாருக்கு என் அன்பும், நன்றியும்.@maiamofficial pic.twitter.com/YdLqu4KZs4— Udhay (@Udhaystalin) February 13, 2025 2024లో తమ ఎన్నికల ఒప్పందంలో భాగంగా హాసన్కు రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చినట్లు సమాచారం. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి మద్దతు ఇచ్చింది. గతేడాది మార్చిలో కమల్ హాసన్ డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంను సందర్శించారు. అక్కడ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో ఒప్పందంపై సంతకం చేశారు.డీఎంకే నేతృత్వంలోని కూటమితో పొత్తు పెట్టుకోవాలనే తన నిర్ణయం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే జరిగిందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. కానీ ఈ ఇండియా కూటమికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పదవి కోసం కాదు, దేశం కోసం’అని ఆ సమయంలో వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం, తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే నేతృత్వంలోని కూటమి తరపున లోక్సభ ఎన్నికలకు కమల్ హాసన్ ప్రచారం చేశారు. ప్రతిగా 2025లో డీఎంకే కోటా నుండి రాజ్యసభ నామినేట్ చేయనుంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే సభ్యులతో సహా కనీసం ఆరుగురు రాజ్యసభ ఎంపీల పదవీకాలం జూన్ 2025 నాటికి ముగియనుంది. అందుకే డీఎంకే పార్టీ ఇప్పుడు కమల్ హాసన్ను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు సిద్ధమైంది. -
ఈ రోడ్లో డీఎంకే ముందంజ
ఈ రోడ్: తమిళనాడులోని ఈ రోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ ఓట్లు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలోని ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్ ముందంజలో ఉన్నారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 51 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ స్థానం 20028లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పడింది. అప్పటి నుండి ఈ నియోజకవర్గంలో ఏడుపార్లు ఎన్నికలు జరిగాయి, వాటిలో మూడు లోక్సభ ఎన్నికలు కాగా 2023 ఫిబ్రవరిలో ఉప ఎన్నిక జరిగింది. ఈరోడ్ పార్లమెంటరీ సీటులోని అసెంబ్లీ సెగ్మెంట్ 2014, 2019, 2024లో ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలన్నింటిలోనూ ఏఐడీఎంకే అభ్యర్థులను నిలబెట్టింది. 2016 డిసెంబర్లో పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాతే అన్నాడీఎంకే పరాజయాలను ఎదుర్కొంటూ వస్తోంది. ఇక డీఎంకే విషయానికొస్తే, ఆ పార్టీ 2011, 2016లో రెండుసార్లు ఆ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థి వీసీ చంద్రకుమార్ 2011లో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే ఈరోడ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ ప్రాంతంలో జనవరి 26న సాయంత్రం సమయంలో ఓ యువతి తన స్నేహితులతో కలిసి కారులో తన ఇంటికి వెళుతోంది. సరిగ్గా యువతి కారు ఈస్ట్ కోస్ట్ రోడ్డు ముట్టుకాడు ఫ్లైఓవర్ మీదగా వెళుతోంది. ఆ సమయంలో ఓ ఎస్యూవీలో ప్రయాణిస్తున్న ఆకతాయులు యువతి కారును వెంబడించారు. యువతిని, ఆమె స్నేహితుల్ని వేధించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు తన కారును వెనక్కి తిప్పించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆకతాయిలో మరో కారును అడ్డుగా యువతి కారుకు అడ్డుగా పెట్టారు. ఈ ఘటన జరిగే సమయంలో కారులో ప్రయాణిస్తున్న యువతి స్నేహితురాలు వీడియో తీసింది. ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆకతాయిల నుంచి తప్పించుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోల్ని సైతం అందించింది. ఆకతాయిలు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనంపై అధికార డీఎంకే పార్టీ జెండా ఉండడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఆ వీడియో క్లిప్లో డీఎంకే జెండా ఉన్న ఎస్యూవీ కారుకు మార్గానికి అడ్డుగా ఉండడం, ఓ వ్యక్తి యువతి వాహనం వైపు పరుగెత్తడం వంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. .Safety of women in TN has become a luxury many can’t afford . DMK flag is the icing on the cake . #ShameOnYouStalin pic.twitter.com/SYGC4aCMPp— karthik gopinath (@karthikgnath) January 29, 2025బాధితురాలు తన ఫిర్యాదులో.. తాను, తన స్నేహితులతో కలిసి కానత్తూరులోని తన ఇంటికి వెళుతుండగా రెండు కార్లు వెంబడించాయని, కార్లలో ఉన్న యువకులు తమతో వేధించేందుకు ప్రయత్నించడంతో పాటు గొడవపడ్డారని పేర్కొంది. ఇక ఘటన జరిగే సమయంలో తీసిన వీడియోపై ప్రతిపక్ష నేత పళనిస్వామి ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలు రాత్రిపూట తిరిగే హక్కును కోల్పోయారా? అని ప్రశ్నించారు. మహిళలపై నేరాలకు పాల్పడేందుకు అధికార పార్టీ జెండాకు లైసెన్స్ ఉందా? వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.మోటార్ సైకిళ్లతో సహా పెట్రోలింగ్ వాహనాల సంఖ్యను పెంచాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
పిల్లలూ.. స్కూల్లో బాంబులు పెట్టారంట పారిపోండి
ఢిల్లీ : ముంబైలో (mumbai) బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ముంబైకి చెందిన పలు స్కూళ్లలో బాంబులు (bomb threat) పెట్టామంటూ అగంతకులు బెదిరింపులు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్వ్కాడ్స్ స్కూల్స్లో తనిఖీలు నిర్వహించాయి. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని బాంబు స్వ్కాడ్ నిర్ధారించాయి.గురువారం ముంబైలోని జోగేశ్వరి-ఓషివారా ప్రాంతానికి చెందిన ది ర్యాన్ గ్లోబల్ స్కూల్లో 2001లో భారత పార్లమెంట్పై ఉగ్రదాడికి పాల్పడ్డ అప్జల్ గురు అనుచరులు బాంబు పెట్టినట్లు అగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్లో పేర్కొన్నారు.మరోవైపు, బుధవారంతమిళనాడులో ఏరోడ్ జిల్లాలో సుమారు ఏడు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న రెండు స్కూల్స్కు బాంబు బెదిరింపులొచ్చాయి. ఏరోడ్ జిల్లాకు చెందిన భారతి విద్యాభవన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్స్లో బాంబులు పెట్టామంటూ దుండగులు ఈ-మెయిల్స్ పంపారు.దీంతో అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థుల్ని అలెర్ట్ చేసింది. వెంటనే స్కూల్ వదిలి పారిపోవాలంటూ సూచించారు. అనంతరం, స్కూల్ తనిఖీలు నిర్వహించింది. పోలీసులకు సమాచారం అందించింది.యాజమాన్యం ఫిర్యాదుతో స్కూల్స్కు పోలీసులు,బాంబు స్వ్కాడ్, స్నైపర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. స్కూల్స్లో అణువణువూ తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో బాంబులు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమల కొండపై అపచారం
-
కేరళ,తమిళనాడుకు ‘కల్లక్కడల్’ ముప్పు..!
తిరువనంతపురం: కేరళ,తమిళనాడు(Tamilnadu) తీరాలకు ‘కల్లక్కడల్’ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్కాయిస్’ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం(జనవరి 15)న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన రాకాసి అలలు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.బుధవారం రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో అర మీటరు నుంచి ఒక మీటరు మేర అలల తాకిడి ఉంటుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (Incois) హెచ్చరించింది.ఇన్కాయిస్ హెచ్చరిక నేపథ్యంలో కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అప్రమత్తమైంది.తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పడవలు పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.మత్స్యకారులు ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. పర్యాటకులు బీచ్లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.కల్లక్కడల్ అంటే ఏంటి..?కల్లక్కడల్ అనేది మళయాలం పదం. కల్లక్కడల్ అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని Incois వెల్లడించింది.ఎలాంటి సూచన,హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయని పేర్కొంది.అందుకే దీనిని స్థానికంగా ‘కల్లక్కడల్’ అని పిలుస్తారు. -
విజయ్ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడి విధ్వంసం
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు, మాజీ సీఎస్కే ప్లేయర్ ఎన్ జగదీశన్ (తమిళనాడు) అదరగొట్టాడు. రాజస్థాన్తో ఇవాళ (జనవరి 9) జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో జగదీశన్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. రాజస్థాన్ పేసర్ అమన్ సింగ్ షెకావత్ బౌలింగ్లో జగదీశన్ ఈ ఫీట్ను సాధించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన షెకావత్.. తొలి బంతిని వైడ్గా వేశాడు. ఈ బంతిని వికెట్ కీపర్ పట్టుకోలేకపోవడంతో బౌండరీకి వెళ్లింది. దీంతో రెండో ఓవర్లో బంతి పడకుండానే తమిళనాడు ఖాతాలో ఐదు పరుగులు చేరాయి. అనంతరం షెకావత్ వేసిన ఆరు బంతులను ఆరు బౌండరీలుగా మలిచాడు జగదీశన్. ఫలితంగా రెండో ఓవర్లో తమిళనాడుకు 29 పరుగులు వచ్చాయి. జగదీశన్ షెకావత్కు సినిమా చూపించిన వీడియో (ఆరు బౌండరీలు) సోషల్మీడియాలో వైరలవుతుంది.4⃣wd,4⃣,4⃣,4⃣,4⃣,4⃣,4⃣29-run over! 😮N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls in the second over to provide a blistering start for Tamil Nadu 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/pSVoNE63b2 pic.twitter.com/JzXIAUaoJt— BCCI Domestic (@BCCIdomestic) January 9, 2025తమిళనాడు వికెట్కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన జగదీశన్ 2018 నుంచి 2022 వరకు ధోని అండర్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277) చేసిన రికార్డు జగదీశన్ పేరిటే ఉంది. జగదీశన్ను 2023 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ 90 లక్షలకు సొంతం చేసుకుంది. 2024, 2025 ఎడిషన్లలో జగదీశన్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడిన జగదీశన్ 110.20 స్ట్రయిక్రేట్తో 162 పరుగులు మాత్రమే చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు తీసి రాజస్థాన్ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0), ఎన్ జగదీశన్ (65; 10 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (37) ఔట్ కాగా.. విజయ్ శంకర్ (18), మొహమ్మద్ అలీ (23) క్రీజ్లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీ, అమన్ సింగ్ షెకావత్, అజయ్ సింగ్కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో తమిళనాడు నెగ్గాలంటే మరో 104 పరుగులు చేయాలి. -
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
చెన్నై:తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో శనివారం(జనవరి4) భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని సత్తూర్ సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.బాణసంచా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీ సమీపంలోని ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల జనాలు అక్కడినుంచి పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి -
డీఎంకే ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
చెన్నై:డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్ నివాసంతో పాటు ఆయనకు చెందిన ఇతర ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేస్తోంది. శుక్రవారం(జనవరి3) ఉదయం వెల్లూరు జిల్లాలోని కదిర్ ఆనంద్ ఇంట్లో ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయి. ఎంపీ ఇంటితో పాటు ఆయన సన్నిహితులు,బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది.ఐటీ శాఖకు పన్ను ఎగవేసిన కేసులో గతంలో ఆనంద్ దగ్గరి బంధువుల ఇళ్లలో రూ.11.48 కోట్ల నగదు పట్టుబడింది. ఈ వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు ఓటర్లకు పంచిపెట్టేందుకే దాచారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 2019లో ఆనంద్తో పాటు అతని బంధువులపై క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ కేసు నమోదైంది.ఈ కేసులో అప్పటి రాష్ట్రపతి కోవింద్ కదిర్ ఆనంద్ ఎన్నికను రద్దు చేశారు. తిరిగి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆనంద్ మళ్లీ ఎంపీగా గెలిచారు. గతేడాది జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికల్లో ఆనంద్ ఏకంగా 2లక్షలకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ కుమారుడే కదిర్ ఆనంద్.ఇదీ చదవండి: దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు -
శతక్కొట్టిన షారుఖ్ ఖాన్.. రింకూ సింగ్కు షాక్!
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు. విశాఖ వేదికగాకాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్ను కుదించారు. ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.టాపార్డర్లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.114 పరుగుల భారీ తేడాతో ఘన విజయంఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో తమిళనాడు తొలుత చండీగఢ్తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్కు లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
భార్యపై కోపం.. రెండు బస్తాల నాణేలతో కోర్టుకు భర్త.. తర్వాత ఏమైందంటే..
సాక్షి, చైన్నె: తన భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ. 2 లక్షలు మొత్తాన్ని చిల్లరగా 20 బస్తాలలో కోర్టుకు ఓ భర్త గురువారం తీసుకొచ్చాడు. ఈ చిలర్ల చూసి షాక్కు గురైన న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ చిల్లర మొత్తాన్ని నోట్లుగా మార్చి సమర్పించాలని ఆదేశించారు. వివరాల ప్రకారం.. కోయంబత్తూరుకు చెందిన దంపతులు గతంలో విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. ఈ కేసు పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు రాగా, తనకు భరణం ఇప్పించాలని ఆ భార్య కోర్టుకు విన్నవించారు. దీంతో, న్యాయమూర్తి ఆ భర్తకు ఆదేశాలు ఇచ్చారు. రూ. 2 లక్షలు భరణం అందజేయాలని సూచించారు. దీనిని ముందే గ్రహించిన ఆ భర్త వినూత్న ప్రయోగం చేసి కంగు తిన్నాడు. తన భార్య మీదున్న కోపంతో కోర్టు నుంచి బయటకు వెళ్లి తన కారులో ఉన్న బస్తాలు ఒకొక్కటిగా తీసుకొచ్చి పెట్టారు. అనంతరం, 20 బస్తాలను కోర్టులో ఉంచి, ఇదిగోండి రూ. 2 లక్షలు అంటూ సూచించాడు. న్యాయమూర్తి ప్రశ్నించగా, రూ. 80 వేలకు ఒక్క రూపాయి నాణెలు, మిగిలిన మొత్తం రూ. 5 ,రూ. 10, రూ. 20 నాణేలు అంటూ వివరించాడు. దీనిని విన్న అక్కడున్న వారంతా అవ్వాక్కయారు. ఇతడు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న జడ్జి మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈచిల్లరను నోట్లుగా మార్చి తీసుకొచ్చి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ భర్త చిల్లర బస్తాలను కోర్టు నుంచి మళ్లీ తన కారు వద్దకు మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కోయంబత్తూరుకోర్టు ఆవరణలో సర్వత్రా హాస్యాన్ని పంచినట్లయ్యింది. విచారణ వాయిదా పడడంతో చిల్లర బస్తాలతో ఆ భర్త తాను వచ్చిన కారులోనే వెళ్లియాడు. -
ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!
ఉద్యోగం వద్దు వ్యవసాయమే ముద్దు అని అతను నమ్మాడు. సాగులోకి దిగింది మొదలు నిరంతర కృషితో రుషిలా తపించి ఒక అద్భుత మునగ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం ఖ్యాతి దేశం నలుమూలలకు విస్తరించింది. అధిక దిగుబడులనిస్తూ అళగర్ స్వామికే కాదు అనేక రాష్ట్రాల్లోని వేలాది మంది రైతులకూ కనక వర్షం కురిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో అళగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం మునగ నర్సరీగా మారిపోయింది.ఏరోజు కారోజు విధులు ముగించుకొని బాధ్యతలు తీర్చుకునే ఉద్యోగం కాదు రైతు జీవితం. అలాగని పంటలు పండించటం, అమ్ముకోవటంతోనే దింపుకునే తల భారమూ కాదు. ఎంత చాకిరీ చేసినా వద్దనని పొలం సముద్రాన్ని ఈదటంలా అనిపిస్తుంటే.. అలసిపోని చేపలా మారి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితేనే రాణింపు, సంతృప్తి. అళగర్స్వామి చేసింది అదే. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పల్లపట్టి గ్రామం స్వామి జన్మస్థలం. ఆర్ట్స్లో పీజీ విద్యను పూర్తి చేసిన స్వామి మక్కువతో వ్యవసాయాన్ని చేపట్టారు. మొక్కుబడి వ్యవసాయం చే యకుండా నిరంతరం శాస్త్రవేత్తలతో చర్చిస్తూ ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. దిండిగల్ నుంచి మధురైకి వెళ్లే ప్రధాని రహదారి పక్కనే అళగర్ స్వామికి చెందిన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడాన్ని రూ పొందించేందుకు కృషిని మమ్మురం చేసి 2002లో ఒక నూతన మునగ వంగడాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక రకాలను సంకరం చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. దీనికి ‘పళ్లపట్టి అళగర్ స్వామి వెళ్లిమాలై మురుగన్’(పీఏవీఎం) అని తన పేరే పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఈ వంగడం కరవు పరిస్థితులను, చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. సాగులో ఉన్న రకాలకన్నా అధిక దిగుబడులను ఇస్తుండటంతో ఆనోటా ఈనోటా ప్రచారంలోకి వచ్చిన ఈ వంగడం ఖ్యాతి దేశమంతటా పాకింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లయిన ఉత్తర భారతదేశంలోనూ రైతులు ఈ వంగడం సాగుపై మొగ్గు చూపుతున్నారు. (కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా? )తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు 30 వేల ఎకరాల్లో పీఏవీఎం మునగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. దాదాపు 90 లక్షల పీఏవీఎం మునగ మొక్కలను అళగర్ స్వామి వివిధ రాష్ట్రాల రైతులకు అందించారు. గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయర్ పద్ధతుల్లో అంట్లు కడుతున్నారు.20 అడుగులకో మొక్క...మునగను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులను అళగర్ స్వామి అనుసరిస్తున్నారు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. భూమిని దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. తూర్పు పడమర దిశలో మొక్కలు, సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా లబిస్తుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. మునగ మొక్కలు పెళుసుగా ఉంటాయి కాబట్టి రవాణాలోను.. నాటుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 50 సెం. మీ. లోతు వెడల్పుతో గుంతలు తీసుకోవాలి. 20 రోజుల వయసు మొక్కలను నాటుకొని, గాలులకు పడి పోకుండా కర్రతో ఊతమివ్వాలి. ప్రతి మొక్కకు 5 కిలోల కం΄ోస్టు ఎరువు లేదా 10 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. కొత్త మట్టితో గుంతను నింపితే మొక్క త్వరగా వేళ్లూనుకుంటుంది. నాటిన మరుసటి రోజు నుంచి రెండు నెలల పాటు నీరుపోయాలి. తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగుమాత్రంగా తడులు ఇవ్వాలి. పూత కాత దశలో మాత్రం సమృద్ధిగా నీరందించాలి. మిగతా సమయాల్లో పొలం బెట్టకొచ్చినట్టనిపిస్తే తడి ఇవ్వాలి. వర్షాధార సాగులో నెలకు రెండు తడులు ఇస్తే చాలు. అంతర కృషి చేసి చెట్ల మధ్య కలుపును ఎప్పటికప్పుడు తొలగించాలి. ఒకటిన్నర ఏడాది తర్వాత కొమ్మల కత్తిరింపు చేపట్టాలి. బలంగా ఉన్న నాలుగైదు కొమ్మలను మాత్రమే చెట్టుకు ఉంచాలి. పెద్దగా చీడపీడలు ఆశించవు. పశువుల బారి నుంచి కాపాడుకునేందుకు కంచె వేసుకోవాలి.లక్షల మొక్కల సరఫరా...ఆళ్వార్ స్వామి ప్రస్తుతం మునగ కాయల సాగుపైన కన్నా నర్సరీపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకు పైగా మొక్కలను విక్రయించారు. ఏటా రూ. 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అళగర్ స్వామి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక సృష్టి సమ్మాన్ అవార్డుతోపాటు సీఐఐ అవార్డు, మహీంద్రా టెక్ అవార్డు వంటి దాదాపు వంద అవార్డులు ఆయనను వరించాయి. సిటీ బ్యాంక్ ఉత్తమ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డుతో సత్కరించడం విశేషం. అద్భుతమైన ఆవిష్కరణతో ఖ్యాతి గడించిన అళగర్ స్వామి స్థానిక గ్రామీణ ఆవిష్కర్తల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రైతులకు స్ఫూర్తినిస్తున్నారు. ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. పీఏవీఎం మునగ ఆరు, ఏడు నెలల నుంచే కాస్తుంది. సాళ్లు, మొక్కల మధ్య 20 అడులు దూరంలో ఎకరానికి 150 మొక్కలు నాటుకోవాలని అళగర్ స్వామి సూచిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచి ఎకరానికి 10 – 15 టన్నుల కాయల దిగుబడి వస్తుంది. ఐదేళ్ల వయసు చెట్టు సగటున ఏడాదికి 300 కిలోల దిగుబడినిస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏడాదికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల్లో కాయల దిగుబడి 20 టన్నులే. పైగా అవి ఐదారేళ్ల పాటే నిలకడగా దిగుబడులిస్తాయి. పీఏవీఎం మాత్రం ఏడాదికి 8 –9 నెలల చొప్పున 20–25 ఏళ్లపాటు మంచి దిగుబడి నిస్తుంది. తమిళనాడు రైతులు స్థానిక మార్కెట్లలో కాయ రూ. 5 – 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను ఏటా ఎకరాకు రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కొందరు రైతులు కంచె పంటగాను ఈ వంగడాన్ని సాగు చేస్తున్నారు. -
అల్పపీడన ప్రభావం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు
సాక్షి,విశాఖపట్నం: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తమిళనాడులో వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం నెల్లూరు,తిరుపతి,విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.18వ తేదీన ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
తమిళనాడులోని దిండిగల్ లో ఘోర అగ్ని ప్రమాదం
-
నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు
‘దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ’ అనేది ప్రతీ యుగంలోనూ జరుగుతూవస్తోంది. ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతారపురుషులు, మహనీయులు జన్మిస్తూనే ఉన్నారు. ఇదే కోవలో దుష్ట శిక్షణకు ఉద్భవించినవాడే సుబ్రహ్మణ్యుడు. లోకసంరక్షణార్ధం పరమశివుని మహాతేజస్సు నుంచి షష్టి తిథి రోజున సుబ్రహ్మణ్యస్వామి అవతరించాడు. అందుకే ఆ రోజును సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు.సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి పండుగ తర్వాత వస్తుంది. దీనిని స్కందషష్ఠి అని, సుబ్బారాయషష్ఠి అని కూడా అంటారు. ఈ సారి సుబ్రహ్మణ్య షష్టి 2024, డిసెంబరు 7న అంటే ఈరోజు వచ్చింది. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య షష్టిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యుడిని కార్తికేయుడు అని కూడా అంటారు.తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కుక్కే సుబ్రమణ్య షష్ఠి లేదా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి పేరుతో వివిధ ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున కార్తికేయుడు ఆరు రోజుల సుదీర్ఘ యుద్ధం తర్వాత తారకాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. తమిళనాడులో ఎంతో ప్రాచుర్యం పొందిన సుబ్రమణ్యస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాల్లో సుబ్రహ్మణ్య షష్టి రోజున ఘనంగా పూజలు నిర్వహిస్తారు.1. తిరుపరంకుండ్రం.. ట్రెక్కింగ్ చేస్తూ..తమిళనాడులోని తిరుపరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కొండపై ఉన్న ఈ దేవాలయంలోని శిల్పకళ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అందమైన పరిసర ప్రాంతాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఇక్కడ జరిగే ‘పంగుని ఉతిరమ్’ ఉత్సవానికి లక్షలాదిమంది భక్తులు హాజరవుతుంటారు. ట్రెక్కింగ్ చేసేవారు తమ అభిరుచిని నెరవేర్చుకుంటూ, ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.2. తిరుచెందూర్.. బంగాళాఖాతం ఒడ్డున..తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తమిళనాడులోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలలో ఒకటి. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. స్కంద షష్టినాడు ఇక్కడ జరిగే పూజలను తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయం పక్కనే కనిపించే సుందరమైన బీచ్ భక్తులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ కనిపించే సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంతో అద్భుతంగా ఉంటాయని చెబుతారు. ఈ ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది.3. దండాయుతపాణి ఆలయం.. ప్రత్యేక ప్రవేశ ద్వారం..దండయుతపాణి స్వామి ఆలయం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని పళనిలో ఉంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ దేవాలయానికి అద్భుతమైన ప్రవేశ ద్వారం ఉంది. నాటి శిల్పకళకు తార్కాణంగా ఈ ఆలయం నిలుస్తుంది. ఈ ఆలయానికి భక్తులే కాకుండా సహసయాత్ర చేయాలనుకునేవారు కూడా తరలి వస్తుంటారు.4. స్వామినాథ స్వామి ఆలయం.. 60 మెట్లతోతమిళనాడులోని స్వామిమలైలో ఉన్న స్వామినాథ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొండపై ఉన్న ఈ ఆలయం సందర్శకులకు దివ్యమైన అనుభూతిని అందిస్తుంది. జీవితంలోని ఆరు దశలకు ప్రతీకగా ఇక్కడ 60 మెట్లు కనిపిస్తాయి. వీటి అధిరోహణ యాత్రికులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.5. తిరుత్తణి.. 365 మెట్లను అధిరోహిస్తూ..తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాకుండా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు అవకాశం కల్పిస్తుంది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు 365 మెట్లను అధిరోహించాల్సి ఉంటుంది. ఈ ఆచారాన్ని ఇక్కడకు వచ్చే భక్తులు తప్పనిసరగా పాటిస్తుంటారు. పండుగల సమయంలో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. అద్భుతమైన శిల్ప సంపద ఈ ఆలయంలో అడుగడుగునా కనిపిస్తుంది.6. పజముదిర్చోలై.. కార్తికేయుని ఆరు నివాసాలలో..తమిళనాడులోని పురాతన సుబ్రమణ్య స్వామి ఆలయాలలో పజముదిర్చోలైలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఒకటి. ఇది కార్తికేయుని ఆరు నివాసాలలో ఒకటిగా పేరొందింది. ఈ ఆలయాన్ని అరుపడై వీడు అని పిలుస్తారు. ముఖ్యంగా కార్తిక మాసంలో ఈ ఆలయానికి లెక్కకు మించిన సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.7. కల్యాణ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకల్యాణ సుబ్రమణ్య స్వామి దేవాలయం తమిళనాడులో కల్యాణ పులియంకుళం పట్టణంలో ఉంది. ఈ మురుగన్ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేష పూజలు జరుగుతుంటాయి. అలాగే సుబ్రహ్మణ్యుని కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ, ఆధునిక శైలులకు ప్రతీకగా నిలుస్తుంది.8. అరుపడై వీడు మురుగన్ ఆలయంకొడైకెనాల్ శివారులో ఉన్న అరుపడై వీడు మురుగన్ ఆలయం కొండలు, అందమైన లోయల నడుమ ఉంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. తమిళనాడులో మురుగన్కు ఉన్న ఆరు నివాసాలలో ఇది ఒకటని చెబుతుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించేవారు ఇక్కడ ట్రెక్కింగ్ చేయడాన్ని అమితంగా ఇష్టపడతారు.9. పచ్చైమలై మురుగన్ ఆలయం.. ప్రశాంతతకు నిలయంపచ్చైమలై మురుగన్ ఆలయం తమిళనాడులోని గోబిచెట్టిపాళయంలో ఉంది. కొండలపై నెలకొని ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెతుక్కునే వారికి ఇది మైలురాయిలా నిలుస్తుంది. ఆలయ నిర్మాణం దక్షిణ భారతీయ శైలిలో ఉంటుంది.10. సెంగుంథర్ శివ సుబ్రమణ్య స్వామి ఆలయంతమిళనాడులోని సెంగుంథర్పేట పట్టణంలో ఉంది. ఈ ఆలయం సెంగుంథర్ సంప్రదాయాలకు నిలయంగా ఉంది. ఈ ఆలయ విశిష్టత మురుగన్ పురాణ గాథలలో కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య షష్టి రోజున ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.ఇది కూడా చదవండి: ఏ పెట్రోల్ బంక్లోనైనా ఈ సేవలు ఫ్రీ.. రోజూ వెళ్లేవారికీ తెలియని విషయాలు -
ఢిల్లీలో తగ్గని కాలుష్యం, కేరళలో భారీ వర్షాలు, కశ్మీర్లో కురుస్తున్న మంచు
న్యూఢిల్లీ: దేశంలో చలి వాతావరణం కొనసాగుతోంది. జాతీయ రాజధాని ఢిల్లీలో విషపూరితమైన గాలి అక్కడి జనాలను పీడిస్తోంది. ఆదివారం కూడా గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి అతలాకుతలమయ్యింది. దీంతో సైన్యం వరద సహాయక చర్యలను చేపడుతోంది.పుదుచ్చేరిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వరదలు సంభవించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. డిసెంబర్ 2న పుదుచ్చేరిలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.ఫెంగల్ తుఫాను ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటింది. ఈ నేపధ్యంలో చెన్నై బీచ్లలో అధిక అలలు ఏర్పడ్డాయి. ఫెంగల్ తుఫాను పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర తీర ప్రాంతాలపై క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఐఎండీ కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్లలో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువకు పడిపోయాయి. డిసెంబరు 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఎత్తయిన ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీనగర్లో ఉష్ణోగ్రత మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. గుల్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉష్ణోగ్రత మైనస్ 0.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
ఫెంగల్ టెన్షన్.. చెన్నై ఎయిర్పోర్టులోకి వరద నీరు
Cyclone Fengal Updates..👉 తీరం దాటుతున్న ‘ఫెంగల్’ తుపానుపుదుచ్చేరి సమీపంలో ‘ఫెంగల్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపిన ఐఎండీఈ ప్రక్రియకు దాదాపు నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలుదక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం👉మహాబలిపురం వద్ద ఫెంగల్ తుపాన్ తీరాన్ని తాకింది. 👉తుపాను ఎఫెక్ట్.. విమానాలు రద్దు..వాతావరణం సరిగా లేని కారణంగా విశాఖ నుంచి వెళ్లే పలు విమానాలు రద్దు చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన మూడు విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దువిమానాల రద్దుతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు ఉదయం 4 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత. 👉ఫెంగల్ తుపాను ప్రభావం తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి, ఏపీపై చూపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. #ChennaiAirport During #FengalCyclone#CycloneAlert#Chennaipic.twitter.com/EPLZlM5CYt— Musharraf Mughal. (@marcanthony99) November 30, 2024 👉మరోవైపు.. లోతట్టు పప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చి చేరుకుంది. 📍 சென்ட்ரல் ரயில் நிலையம் எதிரில். ✍️ ஆபத்தான முறையில் கீழே விழ இருந்த அறிவிப்புப் பலகை உடனடியாக அகற்றப்பட்டது. #ChennaiRains #chennaipolice #cyclone #Fengal pic.twitter.com/b3et05ClSi— Greater Chennai Traffic Police (@ChennaiTraffic) November 30, 2024 👉రన్వే పైకి వరద నీరు చేరుకోవడంతో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే, కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. 👉నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుపాను భయపెడుతోంది. గంటకు 12 కిమీ వేగంతో తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం సాయంత్రానికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.👉తుపాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలో గంటకు 70-80 కి.మీ వేగంలో గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. చెన్నైకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు సైతం ఆలస్యమవుతున్నాయి. పలు రైలు సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉంది. Cyclone Fengal 🌀 effect on CHENNAI cityParts of the city have reported inundations due to spells of intense rainfall activityStay safe & indoors for the next crucial 36 hours#ChennaiRains #ChennaiRains2024 #ChennaiRain https://t.co/voiAq7RIiP pic.twitter.com/2GX6SbHD4K— Karnataka Weather (@Bnglrweatherman) November 30, 2024👉తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విలుపురం, కల్లకురుచ్చి, కుద్దలూరు, పుద్చుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అల్టర్ విధించింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.சிக்கி தவிக்கும் தலைநகரம். #Fengal #FengalCyclone #Chennai #ChennaRains #DMKFails pic.twitter.com/OHBlmMmy8D— D.Jackson Jayaraj (@VirugaiJackson) November 30, 2024👉ఫెంగల్ ప్రభావం ఏపీపై కూడా కొనసాగనుంది. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు , కడప జిల్లాల్లో ఫ్లాష్ఫ్లడ్కు అకాశముందని హెచ్చరికలు రావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయ్యింది. పెంగల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ஆட்டோ உள்ளே தண்ணீர்போகும் அளவுக்கு சூளைமேடு பகுதி #ChennaiRains @thatsTamil #Chennaiflood pic.twitter.com/6AohpLlbhb— Veerakumar (@Veeru_Journo) November 30, 2024 -
ఫెంగల్ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం
చెన్నై: తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఫెంగల్ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలలోని కాలేజీలు, స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించింది.వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆరు గంటలపాటు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో త్రికోణమలీకి తూర్పు- ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు నాగపట్టినానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు పేర్కొంది. VIDEO | An old house collapsed in Tamil Nadu's Mayiladuthurai due to heavy rains earlier today.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W— Press Trust of India (@PTI_News) November 27, 2024 -
‘ఫెంగల్’ తుఫాన్.. తమిళనాడు,పుదుచ్చేరిలకు రెడ్ అలర్ట్
చెన్నై:తమిళనాడు,పుదుచ్చరిలకు భారత వాతవావరణశాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం తుఫానుగా మారనుందని వెల్లడించింది.ఫెంగల్ తుఫాను ప్రభావంతో బుధ,గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు పుదుచ్చేరిలోని కారైకల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు,పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏపీలో గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.ప్రస్తుతం తుపాను తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుపాను దగ్గరగా రానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
గోల్స్ సునామీ సృష్టించిన తమిళనాడు.. 60 నిమిషాల్లో 43..
జాతీయ పురుషుల సీనియర్ హాకీ చాంపియన్షిప్లో ఆతిథ్య తమిళనాడు జట్టు ఆటగాళ్లు ఊహించనిరీతిలో అండమాన్ నికోబార్ జట్టుపై గోల్స్ సునామీ సృష్టించారు. చెన్నైలో జరుగుతున్న ఈ టోరీ్నలో నాలుగు క్వార్టర్ల పాటు 60 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 43 గోల్స్ సమోదయ్యాయి. తమిళనాడు 43–0తో అండమాన్ నికోబార్ జట్టుపై జయభేరి మోగించింది. కెప్టెన్ కార్తీ సెల్వం 13, సోమన్న, సుందరపాండి చెరో 9 గోల్స్ తుఫాన్ సృష్టించారు. మారీశ్వరన్ శక్తివేల్ 6, పృథ్వీ 3, సెల్వరాజ్ కనగరాజ్ రెండు గోల్స్ సాధించారు. శ్యామ్ కుమార్ ఒక గోల్ చేశాడు. కనీస ప్రతిఘటన చేయలేకపోయిన అండమాన్ జట్టు కనీసం ఖాతా తెరువక పోవడమే విడ్డూరంగా ఉంది. మరో మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్... మధ్యప్రదేశ్ ధాటికి చేతులెత్తేసింది. ఏపీ జట్టును ఖాతా తెరవనీకుండా మధ్యప్రదేశ్ జట్టు 17–0తో విజయం సాధించింది. -
దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!
కార్తీకమాసం సందర్బంగా సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన మయూర నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా పేరు గాంచింది. మాయవరంలోని మయూర నాథ ఆలయం. శివుడు లింగ రూపంలో వెలసిన ఆలయాలు అనేకంఉన్నాయి, అందులో అతి పెద్ద శివాలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం ఏమింటంటే... పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం ఇది. మరి పార్వతీదేవి ఈ దేవాలయాన్ని ఎందుకు సృష్టించింది? ఇదెక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుందాము...తమిళనాడు లోని, నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై అని పిలిచే మాయవరంలో మయూరనాథ దేవాలయం వుంది.ప్రస్తుతమున్న మైలాడుతురైనే మాయవరం అని పిలిచేవారు. ఇది చాలా పురాతనమైన ఆలయంగా, ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ దేవాలయ రాజగోపురం తొమ్మిది అంతస్థులలో నిర్మితమైంది.దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాలలో ఇది కూడా ఒకటి.స్థలపురాణంఇక్కడ దక్షప్రజాపతి శివపార్వతులను ఆహ్వానించక చేస్తున్న యాగానికి, పరమశివుడు వారిస్తున్నా వినకుండా వచ్చిన పార్వతీదేవిని అవమానిస్తున్న సందర్భంలో... జరుగుతున్న ఈ రసాభాసలో ఆ యజ్ఞగుండ అగ్నికి భయపడి, అక్కడే ఉన్నటువంటి ఓ చిన్న నెమలిపిల్ల పార్వతీదేవి ఒడిలో దాక్కుంది. అదే సమయానికి పార్వతీదేవి తనని తాను యోగాగ్నిలో దహించుకునేసరికి, ఒడిలో ఉన్న నెమలిపిల్ల కూడా ఆహుతైపోతుంది.అలా నెమలితో అగ్నికి ఆహుతి కావడంతో, తర్వాత నెమలి రూపంలో జన్మించి, జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి పార్వతీదేవి ఇక్కడ శివుని మందిరాన్ని సృష్టించి, శివుణ్ణి ప్రార్థించి, ఆయనలో లీనమైనట్లు స్థల పురాణం చెబుతోంది. పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి, ఈ ఆలయానికి మయూర నాథ దేవాలయం అని పేరు స్థిరపడింది. ఈ మయూరనాథుడే శివుడు. పార్వతీదేవిని ఇక్కడ అభయాంబిక, అభయ ప్రధాంబిక అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.ఈ ఆలయాన ఓ మర్రి చెట్టు ఉంది.ఈ మర్రి చెట్టుకిందే పార్వతీదేవి మయూర రూపంలో తపస్సు చేసినట్లు భక్తులు భావిస్తారు.ఇక్కడ కావేరీ నది ప్రవహిస్తోంది. దీనిని వృషభా తీర్థం అని పిలుస్తారు. ఇక్కడి కావేరీ నదిలో, ప్రతీ పౌర్ణిమ రోజున తమ తమ గంగ యమునలతోపాటు ఇక్కడికి వచ్చి తమ అంశలతో కూడిన నదులు ఇక్కడికి వచ్చి, తమ జలాల్ని ఈ కావేరినదిలో జారవిడుస్తాయట. అందువలనే ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమమని భక్తులు తలుస్తుంటారు.మాయవరం పట్టణం చిదంబరం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.పురాతన ఆలయం శాసనాల ప్రకారం క్రీ.శ 9 వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైందని చెబుతారు.చోళరాజుల వాస్తు నైపుణ్యం, అద్భుతమైన చెక్కడాలు, అపురూపమైన శిల్పాలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి. తమిళనాడులోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
అగ్గిపుల్లలాంటి ఆడపిల్లకు ఫైర్తో భయం ఏమిటి..?
కన్నగి రాజేంద్రన్ వెల్డర్గా ఉద్యోగంలో చేరినప్పుడు ‘వెల్డన్’ అని ఎవరూ అనలేదు. ‘వెల్డింగ్ పనిలోకి వెళుతున్నావా! అది మామూలు పని అనుకున్నావా... మంటలతో చెలగాటం’ అని మాత్రమే అన్నారు. ‘ఫైర్’ ఉన్న అమ్మాయికి ఫైర్తో భయం ఏమిటీ! అలాంటి ఒక ఫైర్ కన్నగి. ‘వెల్డింగ్ ఫీల్డ్లో రావడానికి భయం అక్కర్లేదు. కాస్త ధైర్యం చాలు’ అంటుంది...పురుషుల డొమైన్గా భావించే వెల్డింగ్ ప్రపంచంలోకి మహిళలు అడుగు పెట్టడమే కాదు, తమ సత్తా చాటుతున్నారు. దీంతో తమిళనాడులోని కర్మాగారాలు వెల్డింగ్కు సంబంధించి మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.ఈ మార్పుకు కారణం కన్నగి రాజేంద్రన్లాంటి మహిళలు. ఆరియలూరుకు చెందిన కన్నగి రాజేంద్రన్ వెల్డింగ్ ఫీల్డ్లోకి అడుగు పెట్టినప్పుడు....‘ఇది తప్ప నీకు చేయడానికి మరే పని దొరకలేదా’ అన్నట్లుగా మాట్లాడారు.ఆ మాటలకు కన్నగి వెనకడుగు వేసి ఉంటే ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చేది కాదు. నాలుగు సంవత్సరాలుగా ‘ష్వింగ్ సెట్టర్ ఇండియా’లో వెల్డర్గా పనిచేస్తున్న కన్నగి ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెల్డింగ్’ నిర్వ హించిన గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ (జిఎంఎడబ్లు్య) పోటీలో ఉత్తమ పైప్ వెల్డర్గా అవార్డ్ గెలుచుకుంది.ఈ పోటీలో 45 డిగ్రీల కోణంలో ఉంచిన పైపుపై వెల్డర్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. పైప్ చుట్టూ వివిధ స్థానాలలో వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో నెగ్గుకు రావడానికి అధునాతన టెక్నిక్, బహుముఖప్రజ్ఞ అవసరం అవుతాయి. ఆ బహుముఖప్రజ్ఞను సొంతం చేసుకున్న కన్నగి అవలీలగా విజయం సాధించింది. ఈ పోటీ కోసం కంపెనీలో వివిధ వెల్డింగ్ విభాగాలలో విస్తృతమైన శిక్షణ పొందింది.ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్లే కన్నగి వెల్డింగ్ ఫీల్డ్లోకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అన్నయ్య డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చెల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ చేసింది. తిరుచ్చిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేరిన కన్నగి 2021లో ‘ష్వింగ్ సెట్టర్ ఇండియా’లో ట్రైనీగా ఉద్యోగంలో చేరింది. ‘నేను ట్రైనీగా చేరినప్పుడు ఒక్క మహిళ కూడా లేదు. ఎందుకు ఇలా అని అడిగితే అధిక శ్రమతో కూడిన ఈ పనిలోకి మహిళలు ఎందుకు వస్తారు అనే జవాబు వినిపించింది. నేను మాత్రం ఈ పని చేయగలనా అని కాస్త సందేహించాను. అలా భయపడితే ఎలా అని ఆ తరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఎంతైనా కష్టపడాలి అనుకున్నాను. ఆ కష్టమే ఈ పురుషాధిక్య రంగంలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడింది. రెండు నెలలలోనే నా పనికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు రావడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది’ అంటుంది కన్నగి.కంపెనీ ఫ్యాబ్రికేషన్ విభాగంలో వెల్డర్గా చేరినప్పుడు మొదట్లో ఆమె కుటుంబసభ్యులు భయపడ్డారు.వెల్డింగ్ ఫీల్డ్లో జరిగే ప్రమాదాల గురించి ప్రస్తావించారు. వారికి సర్ది చెప్పి ఉద్యోగంలో చేరింది. మొదట్లో చర్మ సమస్యలు, కంటి సమస్యలు వచ్చాయి. సరైన మందులు, భద్రతాచర్యలతో త్వరలోనే వాటి నుంచి బయటపడింది.‘ప్రతి ఉద్యోగంలో కష్టాలు, సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించినప్పుడే మనల్ని మనం నిరూపించుకోగలం’ అంటున్న కన్నగి రాజేంద్రన్ వెల్డింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న యువతులకు ధైర్యాన్ని ఇస్తోంది. ‘చేయగలనా! అనే సందేహం దగ్గర ఉండిపోతే అక్కడే ఆగిపోతాం. యస్... నేను చేయగలను అనుకుంటే ముందుకు వెళతాం. నేను సాధించిన విజయం సంతోషాన్ని ఇవ్వడమే కాదు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాబోయే కాలంలో మరింత మంది మహిళలు ఈ రంగంలోకి రావాలి. అలా వచ్చినప్పుడు పురుషాధిక్య రంగాల్లో మహిళలు కూడా రాణించగలరు. తాము పురుషులతో సమానమని వారు తెలుసుకుంటారు’ అంటుంది కన్నగి రాజేంద్రన్.(చదవండి: జీవితాన్నే మార్చేసిన ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్) -
అమెరికా ఎన్నికలు: తులసేంద్రపురంలో పూజలు
చెన్నై:అమెరికా ఎన్నికల పోలింగ్ వేళ తమిళనాడు తులసేంద్రపురం గ్రామంలో సందడి నెలకొంది. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలాహారిస్ పూర్వీకులది ఇదే గ్రామం. తమ ఊరి బిడ్డ ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని తులసేంద్రపురం వాసులు గ్రామంలోని ఆలయంలో మంగళవారం(నవంబర్ 5) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ తులసేంద్రపురంలో పెద్ద బ్యానర్నే ఏర్పాటు చేశారు. గతంలో కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించినపుడు కూడా తులసేంద్రపురం వాసులు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.ప్రస్తుతం కమల ఏకంగా అధ్యక్ష పోరులోనే బరిలో ఉండడంతో ఆమె గెలుపుపై గ్రామ వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. కమల ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టక ముందు కాలిఫోర్నియా అటార్నీగా పనిచేస్తున్నపుడు తులసేంద్రపురంలోని గ్రామ ఆలయానికి 60 డాలర్లు విరాళమివ్వడం గమనార్హం.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలపై హిప్పో జోస్యం వీడియో వైరల్ -
దేవుడిచ్చిన కూతురు తల్లై ఎదురొచ్చింది!
డాక్టర్ జె. రాధాకృష్ణన్కు అవి ఉద్విగ్న భరితమైన క్షణాలు! కిందటి శనివారం ఆయన నాగపట్నంలోని సంరక్షణాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చేతుల్లో బిడ్డతో సౌమ్య ఆయనకు ఎదురొచ్చింది. ఆ బిడ్డను మురిపెంగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఆయన. సౌమ్య తనకు దేవుడిచ్చిన కూతురైతే, ఆ కూతురి కన్నబిడ్డ ఆయన చేతుల్లోని పసికందు. సౌమ్య తల్లయిందని తెలిసి ఆమెను చూడ్డం కోసం ఆ హోమ్కి వచ్చారు రాధాకృష్ణన్, ఆయన భార్య కృతిక. తన బిడ్డకు వారి ఆశీర్వాదం కోసం తను పెరిగిన హోమ్కే తీసుకు వచ్చింది సౌమ్య. సౌమ్యను ఇరవై ఏళ్లు కంటికి రెప్పలా చూసుకున్న హోమ్ అది. ఈ ఇరవై ఏళ్లుగా హోమ్లో సౌమ్య బాగోగులను చూసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ రాధాకృష్ణన్. ఎందుకు ఆయనకు సౌమ్య అంటే అంత మమకారం?! ఈ ప్రశ్నకు సమాధానం వెలాంకిణి మాతకు తెలుసు. ఆ మాతే కదా.. సునామీలో సౌమ్య తల్లిదండ్రులు కొట్టుకుపోవటం చూసింది! ఆ మాతే కదా అనాథగా నాగపట్నం తీరంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న నాలుగేళ్ల సౌమ్యను నన్స్ చేత చేరదీయించి, వారు చేర్పించిన సంరక్షణాలయంలో రాధాకృష్ణన్ కంట పడేలా చేసింది! 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రం విప్పిన సునామీ పడగ ఉప్పెన తమిళనాడు తీరప్రాంతం నాగపట్నాన్ని కూడా ముంచెత్తింది. వేలాదిగా మరణాలు. కొట్టుకుపోయిన ఇళ్లు... చెల్లాచెదురైన కుటుంబాలు. వారి పునరావాసం కోసం ప్రభుత్వం తంజావూరు జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్ను అక్కడికి పంపింది. ఆ కొద్దిరోజులకే ఆయనకు నాగపట్నం జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది.వెలాంకిణి ఆలయ నన్స్ అనాథ పిల్లల్ని చేర్పించిన అన్నై సాథియ గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్ను సందర్శించినప్పుడే రాధాకృష్ణన్ మొదటిసారిగా సౌమ్యను చూశారు. ఆ చిన్నారి కళ్ళలోని విషాదం ఆయన మనసును కలచివేసింది. దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కూతుళ్ళు లేకపోవటం వల్ల కావచ్చు సౌమ్యను చూడగానే దేవుడిచ్చిన కూతురు అనే భావన ఆయనలో కలిగింది. కుదిరినప్పుడల్లా వెళ్లి ఆ కూతుర్ని మనసు నిండుగా చూసుకుని వచ్చేవారు. కాలం గడిచింది. 2018 లో ఒకసారి ఆయన సౌమ్యను చూడానికి వెళ్ళినప్పుడు సౌమ్య, ఆమె స్నేహితురాలు మీనా కనిపించారు. ‘మిగతా పిల్లలంతా దత్తతకు వెళ్లిపోయారని, అప్పటి పిల్లల్లో వీళ్ళిద్దరే మిగిలారని‘ హోమ్ వాళ్ళు చెప్పారు. మళ్లీ వెళ్ళినప్పుడు... మణివణ్నన్ అనే సముద్ర ఉత్పత్తుల వ్యాపారి, ఆయన భార్య మలర్విళి సౌమ్యను దత్తత తీసుకున్నారని తెలిసింది. 2022లో సుబ్బయ్య అనే టెక్నీషియన్తో సౌమ్య పెళ్లి జరిగింది. రాధాకృష్ణన్ దంపతులే వారి పెళ్లి జరిపించారు. ఈ అక్టోబర్ 22న పాపను ప్రసవించింది సౌమ్య. ఆ పాపకు సారా అని పేరు పెట్టుకుంది. పాపను చూడాలని ఉందంటే హోమ్ వాళ్లే ఈ ‘తండ్రీ కూతుళ్లు‘ కలిసే ఏర్పాట్లు చేశారు.ఎకనామిక్స్లో బి.ఏ. చేసిన సౌమ్య ప్రస్తుతం నర్సింగ్ కోర్స్ చేస్తోంది. అందుకు రాధాకృష్ణన్ సహకారం ఉంది. ఆయన ఇప్పుడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ. కో ఆపరేషన్, ఫుడ్, కన్సూ్యమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్కి ఇంఛార్జి. ‘సునామీని తట్టుకుని నాగపట్నం నిలబడినట్లే... సౌమ్య, మీనా, ఇంకా అటువంటి అనాథ పిల్లలు జీవితాన్ని ఎదుర్కొన్న తీరు ఆదర్శనీయం‘ అంటారు రాధాకృష్ణన్. -
స్కూల్లో గ్యాస్ లీక్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో గల ఓ పాఠశాలలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. గ్యాస్ లీకేజీ కారణంగా పిల్లలతో పాటు కొందరు ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొత్తియూర్లోని మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థత బారిన పడ్డారు. బాధితులను స్కూలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, వారికి చికిత్స జరుగుతున్నదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.విద్యార్థులకు సాయం అందించేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఏకే చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. తమ బృందం బాధితులకు సహాయం అందిస్తున్నదన్నారు. బాధిత విద్యార్థి ఒకరు మాట్లాడుతూ గ్యాస్ లీకేజీతో ఇబ్బంది ఎదుర్కొన్న మేము తరగతి గది నుండి బయటికి పరుగుపరుగున వచ్చేశామన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారని, కొంతమంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. వెంటనే బాధిత విద్యార్థులకు ఉపాధ్యాయులు సాయమందించాన్నారు.పాఠశాలలో నుంచే గ్యాస్ లీకేజీ జరిగిందా లేదా రసాయన కర్మాగారం నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూలుకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల సిబ్బంది స్పష్టమైన సమాచారం అందించడం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా! -
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. మిగిలిన రాష్ట్రాల్లో..
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.తమిళనాడుతో అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5-6 రోజులలో దక్షిణ కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 14 నుంచి 16వ తేదీ మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లోని కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.గడచిన 24 గంటల్లో రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. తూర్పు రాజస్థాన్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. సంచోర్ (జలోర్)లో గరిష్టంగా 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఢిల్లీలో మేఘావృతమై గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: దేవర గట్టు కర్రల సమరంలో పారిన నెత్తురు.. 100మందికి పైగా భక్తులకి గాయాలు -
తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు
చెన్నై:తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తమిళనాడు డెల్టాప్రాంతంలో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై,పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.పుదుచ్చేరిలో ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పేషెంట్లను మరో ఆస్పత్రికి అధికారులు తరలించారు. వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి చెన్నై,పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడు సేలం జిల్లాలో సబ్వేలో వరద నీరు నిలిచింది.ఇదీ చదవండి: మురసోలి సెల్వమ్ కన్నుమూత -
TN: ఎయిర్ షో మరణాలకు కారణం అదే: మంత్రి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం(అక్టోబర్6) జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందడంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం స్పందించారు.ఎయిర్షోలో మరణాలు ప్రభుత్వ నిర్వహణ లోపం,తొక్కిసలాట వల్ల కాదని డీ హైడ్రేషన్ వల్లే సంభవించాయని చెప్పారు.అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన వందల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. షో కోసం ఇండియన్ ఎయిర్ఫోర్స్ అడిగనదాని కంటే ఎక్కువ ఏర్పాట్లే చేశామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వారు 100 బెడ్లు సిద్ధంగా ఉంచాలని కోరారని, తాము 4 వేల బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. బీచ్లో జరిగిన ఐఏఎఫ్ ఎయిర్షోకు భారీగా జనం హాజరవడంతో తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందడంతో పాటు చాలా మందికి గాయాలయ్యాయి.ఇదీ చదవండి: చుక్కలు చూపించిన ఎయిర్షో -
ఉదయనిధికి ప్రమోషన్ అందుకే: స్టాలిన్ వివరణ
చెన్నై: తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. డీఎంకే ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరిచేందుకే ఉదయనిధికి డిప్యూటీసీఎం పదవి ఇచ్చినట్లు తెలిపారు. సీఎంగా ఉన్న తనకు సహాయంగా ఉండేందుకు డిప్యూటీ సీఎంను చేయలేదని క్లారిటీ ఇచ్చారు. క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిధి దేశమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని కొనియాడారు. తమిళనాడు అథ్లెట్లు ఒలింపిక్స్లో పతకాలు తీసుకువచ్చే దిశగా క్రీడాశాఖలో ఉదయనిధి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని ప్రశంసలు కురిపించారు. డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయనిధి పనిచేయాలని స్టాలిన్ సూచించారు. ఆదివారం(సెప్టెంబర్29) డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన ఉదయనిధి క్రీడాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. అదనంగా ప్లానింగ్, డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: సిద్ధూపై ఈడీ కేసు -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి
చెన్నై: తమిళనాట వారసుడికి పట్టాభిషేకం జరిగింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 46 ఏళ్ల ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డీఎంకే శ్రేణులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. శనివారం స్టాలిన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయనిధి డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. పలు చిత్రాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మించారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కూడా స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో 471 రోజుల తర్వాత రెండ్రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బాలాజీతో పాటు గోవి చెజియన్, రాజేంద్రన్, నాజర్లను స్టాలిన్ కేబినెట్లోకి తీసుకున్నారు. టి.మనో తంగరాజ్, జింజీ ఎస్.మస్తాన్, కె.రామచంద్రన్లను మంత్రివర్గం నుంచి తొలగించారు. -
పాపం ఏ కష్టమొచ్చిందో.. వ్యాపారి కుటుంబమంతా ఒకేసారి!
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చి-కరైకుడి జాతీయ రహదారిపై పాడుబడిన కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని స్థానిక వ్యాపారవేత్త కుటుంబంగా పోలీసులు గుర్తించారు.నామనసముద్రం గ్రామ సమీపంలో పార్క్ చేసిన వాహనం మంగళవారం సాయంత్రం నుంచి అదే స్థలంలో ఉండడం స్థానికుల పోలీసులకు సమాచారం వచ్చారు. దీంతోప రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అయితే బాధితులు విషం సేవించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.మృతులను మణికందన్ (50) కుటుంబ సభ్యులగా గుర్తించారు. చనిపోయిన వారిలో అతని భార్య నిత్య, తల్లి సరోజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు నివాసముండే సేలానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో వీరి మృతదేహాలు కనిపించాయి. మెటల్ వ్యాపారంలో నష్టాలు రావడంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. కారులోంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లే ఈ నిర్ణయానికి దారితీసాయా అనే కోణంలో చర్యకు నెట్టివేసి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్ యూనిట్!
స్మార్ట్ఫోన్ డిస్ప్లే మాడ్యుళ్ల అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఫాక్స్కాన్ సంస్థ యోచిస్తోంది. తమిళనాడులో ప్రారంభించాలనుకుంటున్న ఈ యూనిట్ ఏర్పాటు కోసం సుమారు ఒక బిలియన్ డాలర్లు(రూ.8,357 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.ఫాక్స్కాన్ ఇప్పటికే తమిళనాడులో యాపిల్ ఐఫోన్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిని దేశీయంగా వాడడంతోపాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా ప్రతిపాదించిన యూనిట్ అందుబాటులోకి వస్తే చైనా వంటి దేశాల నుంచి అసెంబ్లింగ్ చేసిన డిస్ప్లే మాడ్యూల్స్ను దిగుమతి చేసుకునే బదులుగా స్థానికంగానే వీటిని ఉత్పత్తి చేయవచ్చు. దాంతో ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, తయారీలో ఫాక్స్కాన్కు విలువ జోడిస్తుందని తెలిపారు. స్మార్ట్ఫోన్ అసెంబ్లింగ్లో దాదాపు 5 శాతం రెవెన్యూ ఉత్పత్తి అయితే, డిస్ప్లే అసెంబ్లింగ్లో అదనంగా మరో 2-3 శాతం రెవెన్యూ ఉత్పత్తి అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?ఫాక్స్కాన్ భారత్లో గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా అసెంబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు ఇరు కంపెనీల మధ్య కొంతకాలంగా చర్యలు సాగుతున్నాయి. డిస్ప్లే మాడ్యూళ్లలో ప్రధానంగా 60-65% విడిభాగాలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణ కొరియా 20-25% సరఫరా చేస్తోంది. స్థానికంగా డిస్ప్లే అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభమైతే దిగుమతులు తగ్గి స్థానిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
సెక్యులరిజంపై గవర్నర్ రవి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.సెక్యులరిజంఅనే భావన యూరప్లో ఉందని, అది భారత దేశానికి సంబంధంలేనిదన్నారు. సోమవారం(సెప్టెంబర్23) ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్.ఎన్ రవి ఈ మేరకు వ్యాఖ్యానించారు.చర్చికి,రాజుకు మధ్య గొడవ జరిగి వారిద్దరూ దానిని ఆపేయాలనుకోవడం నుంచి యూరప్లో సెక్యులరిజం పుట్టిందన్నారు.ఇక భారత్లోకి సెక్యులరిజాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బుజ్జగింపు రాజకీయాల కోసం తీసుకువచ్చారని ఆరోపించారు.తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి తీవ్రస్థాయిలో విభేదాలున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రజలకు రాముడంటే తెలియదని రవి ఇటీవలే వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. ఇదీ చదవండి: కోల్కతాఘటన సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే -
పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
చెన్నై: ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల ఉద్యోగిని పని ఒత్తిడితో మృతిచెందిన ఘటన మరవక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్న 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మ హత్య చేసుకొని ఉంటాడని అతని భార్య అనుమానం వ్యక్తం చేసినట్లు పోలిసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన కార్తికేయన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కార్తికేయ టెక్కీగా పని చేస్తున్నారు. ఇక.. కార్తికేయ తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా ఆయన డిప్రెషన్కు చికిత్స పొందుతున్నాడు.ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం ఆయన భార్య కె జయరాణి.. పిల్లలను తన తల్లి వద్దకు దింపి, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలోని తిరునల్లూరు ఆలయానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. ఇంట్లో నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంట్లోకి ప్రవేశించడానికి స్పేర్ కీని ఉపయోగించి లోపలికి వెళ్లగా.. కార్తికేయ కరెంట్ తీగకు చుట్టుకొని విగతజీవిగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదికూడా చదవండి: పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ సాయివిష్ణు అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. తాజాగా తన రిసెప్షన్కు సంబంధించిన ఫోటోలను ఇన్స్టా ద్వారా పంచుకుంది. ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్ అంటూ భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చెన్నైలో జరిగిన మేఘా ఆకాష్, సాయివిష్ణు వివాహ రిసెప్షన్కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు డీఎంకే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ( ఇది చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు)కాగా.. నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది మేఘా ఆకాశ్. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా కొన్ని మూవీస్ చేసింది. తెలుగులో 'లై'తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది. కోలీవుడ్లో 2019లో పెట్టా మూవీతో ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్.. ఎన్నై నోకి పాయుమ్ తోట, వంద రాజావ తాన్ వరవానే చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా సబానాయగన్, వడకుపట్టి రామసామి సినిమాలతో మెప్పించింది. சென்னையில் நடைபெற்ற தமிழ்நாடு காங்கிரஸ் கமிட்டி முன்னாள் தலைவர் திரு. சு.திருநாவுக்கரசர் அவர்களின் மகன் எஸ்.ஆர்.டி.சாய் விஷ்ணு - மேகா ஆகாஷ் ஆகியோரது திருமண வரவேற்பு நிகழ்ச்சியில் மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் கலந்துகொண்டு மரக்கன்று பசுமைக்கூடை வழங்கி மணமக்களை… pic.twitter.com/OQXqNfAowD— CMOTamilNadu (@CMOTamilnadu) September 14, 2024 View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
తమిళనాడులో రాముడంటే తెలియదు: గవర్నర్ రవి
చెన్నై: రాముడు ఉత్తరభారతానికే దేవుడు అన్న భావనను తమిళనాడు ప్రజల్లో కల్పించారని రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి అన్నారు. దీంతో తమిళనాడు ప్రజలకు రాముడి గురించి పెద్దగా తెలియదన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు యువతకు భారత సంస్కృతి తెలియకుండా చేశారని ఆరోపించారు. ‘నిజానికి రాముడు తమిళనాడులో తిరగని చోటు లేదు. కానీ ఇక్కడి వారికి రాముడంటే తెలియదు. రాముడు ఉత్తర భారతానికి చెందిన దేవుడన్న భావనను ప్రజల మనసుల్లోకి జొప్పించారు. రాష్ట్ర యువతకు భారత సంస్కృతి తెలియకుండా ఉండేందుకు సాంస్కృతిక హననం చేశారు’అని రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపైనా రవి ఈ సందర్భంగా స్పందించారు.‘కొందరు గతంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ,మలేరియా వైరస్లతో పోల్చారు. వారికేమైందో తెలియదు కానీ ఆ అంశంపై ఇప్పుడేం మాట్లాడడం లేదు. ఒక్కసారిగా మూగబోయారు’అని ఉదయనిధిని రవి పరోక్షంగా ఎద్దేవా చేశారు. కాగా, తమిళనాడులో డీంఎకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. ప్రభుత్వంపై గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేస్తుంటారు. తాజాగా తమిళనాడులో ప్రభుత్వ స్కూళ్లలో విద్యా నాణ్యత అసలే లేదని, విద్యార్థులు కనీసం రెండంకెల సంఖ్యను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని గవర్నర్ విమర్శించారు. అయితే కేంద్రంలోని బీజేపీ గవర్నర్ ద్వారా తమ ప్రభుత్వాన్ని నియంత్రించాలని చూస్తోందని డీఎంకే ఆరోపిస్తోంది. ఇదీ చదవండి.. జ్ఞానవాపి విశ్వనాథ గుడిని మసీదు అనడం దురదృష్టకరం: యోగి ఆదిత్యనాథ్ -
ఆయన తప్పకుండా సీఎం అవుతారు: ది గోట్ నటుడు కామెంట్స్
కోలీవుడ్ నటుడు ప్రేమ్గీ అమరేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ మూవీ ది గోట్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ తమిళనాడు సీఎం అవుతారని అమరేన్ జోస్యం చెప్పారు. నా ఓటు కూడా విజయ్కే వేస్తానని.. తప్పకుండా 2026లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హామీ ఇస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా.. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రేమ్గీ స్నేహాకు సోదరుని పాత్రలో నటించినట్లు ఆయన తెలిపారు. తనకు తలైవా, సూపర్స్టార్ రజినీకాంత్ అంటే విపరీతమైన అభిమానం అని వెల్లడించారు. అజిత్, విజయ్లంటే అమితమైన ప్రేమ అని.. కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ స్టార్ మాత్రమేనన్నారు.కాగా.. 'గోట్' చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఎవరీ తులసిమతి మురుగేశన్? పుట్టుకతో వచ్చే వైకల్యం దాటుకుని..
మనం చిన్న సమస్యకే విలవిలలాడిపోతాం. కాస్త బాగోకపోతేనే చేస్తున్న పనిని వదిలేస్తాం. కానీ ఈ అమ్మాయి పుట్టుకతో వచ్చే లోపంతో పోరాడింది. అది ప్రాణాంతకంగా మారి పరిస్థితిని దారుణంగా దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకుని బయటపడిందనుకున్నా..దివ్యాంగురాలిగా చేసి బాధపెట్టింది. అయితేనేం తగ్గేదే లే..! అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించడమేగాక పారాలింపిక్స్లో సత్తా చాటింది. రజత పతకంతో యావత్ దేశం గర్వపడేలా చేసింది. ఇంతకీ ఎవరీమె? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమతి మురుగేశన్ సెప్టెంబర్ 2న జరిగిన పారిస్ పారాలింపిక్స్లో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె SU5 ఫైనల్లో మహిళల సింగిల్స్కు చేరుకుంది. అయితే చైనాకు చెందిన యాంగ్ క్విక్సియా చేతిలో ఓడిపోయింది. కేవలం 30 నిమిషాల్లో 21-17, 21-10తో యాంగ్ క్విక్సియా మ్యాచ్ను గెలుచుకుంది. చివర వరకు ఉత్కంఠను రేపేలా ఆడి రజత పతకంతో భారతదేశం గర్వించేలా చేసింది. పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్ విభాగంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా మురుగేషన్ చరిత్ర సృష్టించారు.ఎవరంటే ఆమె..?తులసిమతి మురుగేశన్ తమిళనాడులోని కాంచీపురానికి చెందింది. ఆమె పుట్టుకతో వచ్చే వైకల్యం తులసిమతి జీవితాన్ని అగాధంలోకి నెట్టిసింది. ఆ వైకల్యం కారణంగా బోటన వేలును కోల్సోవమే గాక ప్రాణాంతకమై ఆమె పరిస్థితిని దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకున్నా.. ఎడమ చేయి చలనం కోల్పోయి దివ్యాంగురాలిగా చేసింది. అయితాన లెక్క చేయక క్రీడలపై దృష్టిసారించి. కక్రీడల పట్ల అమిత ఆసక్తిగల తండ్రి సాయంతో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. సమర్థులైన క్రీడాకారులతో ఆడేలా నైపుణ్యం సంపాదించుకుంది. అంతేగాదు ఆమె వెటర్నరీ సైన్సు విద్యార్థి కూడా. ఆమె సోదరి కిరుత్తిమా కూడా బ్యాడ్బింటన్ క్రీడాకారిణి. ఆమె అనేక జిల్లా స్థాయి ఆటలను గెలుచుకుంది. అంతేగాదు తులసీమత్ ఐదవ ఫజ్జా దుబాయ్ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2023లో మహిళల డబుల్స్ ిభాగంలో మానసి జోషితో కలిసి బంగారు పతకాన్ని సాధించింది. ఆమె అదే ఈవెంట్లో నితేష్ కుమార్తో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించింది. ఆమె అకుంఠితమైన పట్టుదల, శ్రమ ఎన్నో అవార్డులను, గౌరవ సత్కారాలను తెచ్చిపెట్టాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలిచింది. జీవితం ఇచ్చే పెట్టే పరీక్షకు తలొగ్గక నచ్చినట్లుగా నీ తలరాతను రాసుకునేలా దూసుకుపోవడం అంటే ఏంటో చేసి చూపింది.A moment of immense pride as Thulasimathi wins a Silver Medal in the Women's Badminton SU5 event at the #Paralympics2024! Her success will motivate many youngsters. Her dedication to sports is commendable. Congratulations to her. @Thulasimathi11 #Cheer4Bharat pic.twitter.com/Lx2EFuHpRg— Narendra Modi (@narendramodi) September 2, 2024 (చదవండి: కిమ్ కర్దాషియాన్లా కనిపించాలని ఏకంగా రూ. 8 కోట్లు..పాపం ఆమె..!) -
దక్షిణాదిలో మొదటి తయారీ యూనిట్
ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీ డాబర్ తమిళనాడులోని ‘సిప్కాట్ ఫుడ్ పార్క్’లో తయారీ యూనిట్ ప్రారంభించనుంది. ఈ యూనిట్ నిర్మాణానికిగాను డాబర్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో కంపెనీకి ఈ ప్లాంట్ మొదటిది కావడం విశేషం.కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తయారీ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. మొదటిదశ పనుల కోసం రూ.135 కోట్లు వెచ్చించనుంది. విల్లుపురం జిల్లా తిండివనంలోని సిప్కాట్ ఫుడ్ పార్క్లో ఈ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా వివరాల వెల్లడించారు. Welcome to Tamil Nadu, @DaburIndia! In fact, welcome to South India! In the presence of Honourable @CMOTamilNadu Thiru. @MKStalin avargal, @Guidance_TN today signed an MoU with Dabur for the establishment of a world-class manufacturing plant, their FIRST EVER in South India,… pic.twitter.com/1rAazmCVOH— Dr. T R B Rajaa (@TRBRajaa) August 22, 2024‘కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్లాంట్ కంపెనీకి దక్షిణాదిలో మొదటిది కావడం విశేషం. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. మొదటిదశలో రూ.135 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల సుమారు 250 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ ప్లాంట్లో హోమ్కేర్, పర్సనల్ కేర్, జ్యూస్ ఉత్పత్తులను తయారు చేస్తారు. దీంతో స్థానిక రైతులకు మేలు జరుగుతుంది’ అని మంత్రి అన్నారు. -
ఉద్యోగాలున్నా నైపుణ్యాలేవీ..?
ఉపాధి అవకాశాలున్నా సరైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో ఏటా అత్యధిక మంది గ్యాడ్యుయేట్లను అందించే రాష్ట్రం ఇది. కానీ కంపెనీల అవసరాలకు తగిన నైపుణ్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం..జులై 2022 నుంచి జూన్ 2023 ఏడాదికిగాను పని చేస్తున్న, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని పరిగణించి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు(ఎల్ఎఫ్పీఆర్)ను లెక్కించారు. అందులో గరిష్ఠంగా 46 శాతంతో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. దేశంలో సగటున ఈ ఎల్ఎఫ్పీఆర్ 42.4 శాతంగా ఉంది. వర్కర్ పాపులేషన్ రేటు తమిళనాడులో 44 శాతంగా ఉంటే దేశంలో సరాసరి 41.1 శాతంగా నమోదైంది.ఇదీ చదవండి: ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!దేశవ్యాప్తంగా మొత్తం ఫ్యాక్టరీల్లో పనిచేసే జనాభాలో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలోనే 40 శాతం ఉంది. అయితే తమిళనాడులోని కంపెనీల్లో భారీగా ఖాళీలున్నాయని, కానీ ఆయా పోస్టులకు తగిన నైపుణ్యాలు అభ్యర్థుల వద్ద లేవని సంస్థలు చెబుతున్నాయి. రోజూ కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. అందుకు తగినట్లు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. -
ఉదయనిధి ప్రమోషన్పై స్టాలిన్ క్లారిటీ
చెన్నై: తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ను తమిళనాడు డిప్యూటీ సీఎం చేసేందుకు ఇంకా టైమ్ రాలేదని సీఎం స్టాలిన్ అన్నారు. అయితే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని పార్టీలో డిమాండ్ మాత్రం గట్టిగా ఉందని చెప్పారు. ఈ విషయమై సోమవారం(ఆగస్టు5) స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఉదయనిధికి ప్రమోషన్ ఇచ్చేందుకు సరైన సమయం రావాల్సి ఉందన్నారు. కాగా, ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంలో క్రీడా, యువజన సంక్షేమ, ప్రత్యేక కార్యక్రమాల అమలు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
కరెంటు లేదు.. కానీ బోరు నుండి నీళ్ళే నీళ్ళు..
-
వయనాడ్ మృత్యు ఘోష.. 123కు చేరిన మృతుల సంఖ్య.. మరో 600 మంది గల్లంతు
తిరువనంతపురం : వయనాడ్ ఘటన.. 123కు పెరిగిన మృతుల సంఖ్య చేరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వయనాడ్ విషాధంపై మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ ఎస్ శశిధరన్ మాట్లాడుతూ.. శిధిలాల కింద దాదాపు 50 మృతదేహాలు గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్ మార్టం జరుగుతున్నట్లు తెలిపారు. రేపుకూడా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిధిలాల కింద సహాయక చర్యల్ని ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. #WATCH | Kerala: Malappuram district police chief S Sasidharan says, "Today we conducted an in-depth search. We could find some 50 bodies or parts of bodies. The postmortem is going on. Tomorrow also we are going to search with NDRF and other police departments... We are trying… pic.twitter.com/hIH42zutTU— ANI (@ANI) July 30, 2024 భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్లు, డ్యాంలు నిండుకుండలా మారాయి. వరదల ధాటికి వయనాడ్ మృతుల సంఖ్య 94కి చేరింది. పదుల సంఖ్యలో డెడ్బాడీలను 30కిలోమీటర్ల దూరంలో ఉన్న చలయార్ నదిలో గుర్తించారు. ముండకై టీస్టేట్లో పనిచేస్తున్న 600 మంది కార్మికులు గల్లంతయ్యారు.దీంతో కార్మికుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. గాడ్స్ ఓన్ కంట్రీపై ప్రకృతి కన్నెర్ర చేసింది. రికార్డ్స్థాయిలో 24 గంటల్లో 37.7 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వయనాడ్ జిల్లాలో వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయ తాండవం చేసింది. అర్ధరాత్రి గ్రామాలపై కొండచరియలు విరుచుకుపడి అనేక మంది సజీవ జలసమాధి అయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు శిధిలాల కింద చిక్కుకుని సాయం కోసం ఆర్తనాధాలు చేస్తున్నారు. మట్టి, బురద కింద వందల మంది చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. గంటగంటకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.వయనాడ్ జిల్లా మెప్పాడీ సమీపంలోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపూ 400 ఇళ్లను మట్టిచరియలు కమ్మేశాయి. దీంతో ఇప్పటి వరకు 89మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ఆచూకీ లేకుండా పోయింది. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆటంకం కలుగుతోంది.Tamil Nadu CM MK Stalin had a telephone conversation with Kerala CM Pinarayi Vijayan regarding the landslide situation in Wayanad.M K Stalin offered his condolences to the deceased in landslides and assured, on behalf of the Tamil Nadu government, all possible help. CM also…— ANI (@ANI) July 30, 2024 కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి ఆర్మీ బలగాలు. ఎన్డీఆర్ఎఫ్ సహా 250 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు.ఆర్మీ,నేవీ,ఐఏఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వామ్యమయ్యాయి. శిధిలాలు,బురదలో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది వెలికి తీస్తున్నారు.స్థానికంగా ఉన్న ఆలయాలు,మసీదులు,చర్చీల్లో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాడు చేసి బాధితులకు తక్షణ చికిత్సను అందిస్తున్నారు.వయనాడ్ విలయం నేపథ్యంలో కేరళకు బాసటగా నిలిచారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. కేరళ సీఎం సహాయ నిధికి రూ.5కోట్లు విడుదల చేశారు. 10మందితో కూడిన వైద్య బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. #WATCH | Wayanad landslide: A survivor Mustafa Ahmed says "At around 1:40 AM, there was a loud sound and a house around 30 metres away from my room completely collapsed. Since we were not sleeping, we ran out immediately. Several people have been trapped in this incident. People… pic.twitter.com/p9pLO2vb7i— ANI (@ANI) July 30, 2024వయనాడ్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేరళ సీఎం పినరయి విజయన్. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారాయన. -
అడవిలో చెట్టుకు గొలుసులతో కట్టేసి దీన స్థితిలో విదేశీ మహిళ: ఇది భర్త పనేనా?
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అడవిలో దుర్భర పరిస్థితుల్లో 50 ఏళ్ల మహిళను గుర్తించారు. చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టివేసి దీన స్థితిలో ఉండగా పోలీసులు గుర్తించారు. సోనుర్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఒక గొర్రెల కాపరి ఆమె కేకలు విని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.లలితా కయీగా బాధిత మహిళను గుర్తించారు. అమెరికా పాస్పోర్ట్ ఫోటోకాపీతో పాటు తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళను సావంత్వాడి (కొంకణ్)లోని ఆసుపత్రికి, ఆపై సింధుదుర్గ్లోని ఓరోస్లోని ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆమె మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, అధునాతన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుండి బయటపడిందనీ, కానీ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోందన్నారు. దీనికి సంబంధించి ఆమె వద్ద మెడికల్ ప్రిస్క్రిప్షన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.ఆధార్ కార్డు, యూఎస్ పాస్పోర్ట్ ఆధారంగా ఆమె ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసు బృందాలు తమిళనాడు, గోవా తదితర ప్రాంతాల్లోవాకబు చేస్తున్నట్టు అధికారి తెలిపారు. పోలీసులకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆమె వీసా గడువు ముగిసింది. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వారితో సంప్రదిస్తున్నామని వాస్తవానికి అమెరికాకు చెందినదని. గత పదేళ్లుగా దేశంలో ఉంటోందని భావిస్తున్నామని వెల్లడించారు.అంతేకాదుఎంతకాలం నుంచి ఇక్కడ బంధించబడి ఉందో తెలియదనీ, రెండు రోజులుగా ఏమీ తినక పోవడంతో, స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదనీ చెప్పారు. తమిళనాడుకు చెందిన ఆమె భర్త ఆమెను అక్కడ కట్టేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నామన్నారు. -
అనంత్ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్ హెయిర్ స్టైల్లో ఇషా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేష్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సంగీత్ దగ్గర నుంచి హల్దీ వరుకు సాగిన వివాహ సంబరాల్లో అంబానీ కుటుంబసభ్యులు మునిగితేలుతున్నారు. ఆ వేడుకల్లో వాళ్లంతా ఏళ్ల నాటి సంప్రదాయ ఫ్యాషన్ స్టైల్ని గుర్తుచేసేలా.. ఆయా వస్త్రధారణలో కనిపించి ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ వేడుకలో నీతా నుంచి ఇషా, శ్లోకా మెహతా వివిధ రకాల లగ్జరీయస్ ఫ్యాషన్ డిజైనర్వేర్లతో అలరించారు. ఇప్పుడూ తాజాగా ఇషా సరికొత్త హెయిర్ స్టైల్లో కనిపించింది. ఇది తమిళయన్ హెయిర్ స్టైల్లో జడను వేశారు. జడ పైభాగంలో మొగ్ర పువ్వులతో ఓ పెద్ద కొప్పులా ఉండి..కింద నుంచి గోల్డెన్ థ్రెడ్తో అల్లారు. ఇక అందుకు తగ్గట్టుగా గ్రీన్ లెహంగాలో స్టన్నింగ్ లుక్లో కనిపించారు. అలాగే వాటికి మ్యాచింగ్ అయ్యేలా చెవిపోగులు ఇరువైపుల సూర్యుడు, చంద్రుడుని ధరించిందా అన్నంతా గ్రాండ్ లుక్లో కనిపించింది ఇషా. కాగా, అనంత్-రాధికలు జూలై 12న శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఈ వివాహం అనంతరం జూలై 14న గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఇది మంబై నగరంలోని అంబానీ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ , వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగ నీటిని ట్రై చేయండి..!) -
ఐఫోన్ ప్లాంట్లో వివాహితలకు ‘నో జాబ్’.. రంగంలోకి దిగిన కేంద్రం
దేశంలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ఉత్పత్తులు తయారు చేసే ఫాక్స్కాన్ ప్లాంటులో ఉద్యోగాలకు వివాహిత మహిళలను తిరస్కరించిందని రాయిటర్స్ ఓ సంచలన కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.1976 నాటి సమాన వేతన చట్టాన్ని ఉటంకిస్తూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, ఉద్యోగ నియామకాల్లో పురుషులు, మహిళల మధ్య ఎటువంటి వివక్ష చేయరాదని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుందని పేర్కొంది. చైన్నై సమీపంలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఈ వివక్ష కొనసాగుతోందని రాయిటర్స్ బయటపెట్టిన నేపథ్యంలో తమిళనాడు కార్మిక శాఖ నుంచి వివరణాత్మక నివేదికను కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై యాపిల్, ఫాక్స్కాన్ యాజమాన్యాలు వెంటనే స్పందించలేదు.రాయిటర్స్ మంగళవారం ప్రచురించిన పరిశోధనాత్మక కథనంలో ఫాక్స్కాన్ తమిళనాడులోని చెన్నై సమీపంలోని తన ప్రధాన ఐఫోన్ ప్లాంటులో ఉద్యోగాల కోసం వివాహిత మహిళలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని కనుగొంది. పెళ్లైన మహిళలు ఎక్కువ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారనే కారణంతోనే వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నట్లు రాయిటర్స్ గుర్తించింది. రాయిటర్స్ ఇంటర్వ్యూ చేసిన ఫాక్స్కాన్ నియామక ఏజెంట్లు, హెచ్ఆర్ వర్గాలు ఇదే విషయాన్ని చెప్పారు. కుటుంబ బాధ్యతలు, గర్భం, అధిక గైర్హాజరును ఫాక్స్కాన్ ప్లాంట్లో వివాహిత మహిళలను నియమించకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. -
అత్యంత విషాదంగా తమిళనాడు కల్తీ సారా ఘటన.. మరణాలు ఎన్నంటే?
Updates..👉మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ పరిహారం.. Death toll due to Kallakurichi hooch tragedy rises to 34. Tamil Nadu CM MK Stalin announces Rs 10 lakhs each for the family of deceased and Rs 50,000 each for the people under treatment. A one-man commission, comprising former judge Justice B Gokuldas, announced for probing the…— ANI (@ANI) June 20, 2024 👉తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.👉కల్తీ మద్యం ఘటనపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్దాస్తో కూడిన వన్ మ్యాన్ కమిషన్ ఈ అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికలు సమర్పించాలని ప్రకటించింది. 👉 తమిళనాడు కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది. కల్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరుకుంది. #DGNews |The #deathtoll in the Kallakurichi illicit #liquor incident has risen to 37.#tamilnadu #Kallakurichi #Resign_Stalin #DMK #DMKGovt— Saji Agniputhiran (@Sajiagniputhira) June 20, 2024 👉 కాగా, సారా తయారీలో మోతాదుకు మించిన మిథనాల్ను వినియోగించినట్లు తేలింది👉 నేడు తమిళనాడు అసెంబ్లీ సెషన్ ప్రారమైంది. ఈ నేపథ్యంలో కల్తీ సారా విషయంపై అధికార-విపక్షాల వాగ్వాదంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.👉 ఇక, ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించి విచారణ చేపట్టాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ.👉 ఈ కేసులో కల్తీ సారా తయారు చేసిన గోవిందరాజు సహా ఓ మహిళ, యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.👉 కల్తీ సారా ఘటనలో దాదాపు 100 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. 👉ఈ ఘటనలో మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 👉ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్ చేశారు. Tamil Nadu CM tweets, "I was shocked and saddened to hear the news of the deaths of people who had consumed adulterated liquor in Kallakurichi. Those involved in the crime have been arrested in this matter. Action has also been taken against the officials who failed to prevent…— ANI (@ANI) June 19, 2024 👉గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసినట్టు అధికారులు గుర్తించారు. 👉మరోవైపు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్కుమార్ను బదిలీ చేసింది. వీరి స్థానంలో కలెక్టర్గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. 👉ఇదిలా ఉండగా.. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. #WATCH | Tamil Nadu: At least 25 people died and several were hospitalised after reportedly consuming illicit liquor in Tamil Nadu's Kallakurichi district: District Collector MS Prasanth(Visuals from Kallakurichi Government Medical College) pic.twitter.com/WI585Cbxbk— ANI (@ANI) June 19, 2024 👉ఇక, ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 40 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. VIDEO | #TamilNadu: Several people were reported dead, and many others hospitalised after consuming spurious liquor in #Kallakurichi district.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/IFicB26zG0— Press Trust of India (@PTI_News) June 20, 2024 -
‘ఒక్క స్వీట్ బాక్స్తో మోదీ ఇమేజ్కు రాహుల్ చెక్’
చెన్నై: లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చి సాధించుకున్న ఇమేజ్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్క స్వీట్ బాక్స్తో ముక్కలు చేశాని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కోయంబత్తూరులో డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన లోక్సభ ఎన్నికల ‘విజయ ర్యాలీ’ సభలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.‘‘ లోక్సభ ఎన్నికల ప్రచారంలో నేను చివరిసారి కోయంబత్తూరు వచ్చినప్పడు నా పర్యటన దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. మోదీ తమిళనాడకు 8 సార్లు పర్యటించి పొందిన ఇమేజ్ను కోయంబత్తూరులో రాహుల్ గాంధీ నాకు కేవలం ఒక స్వీట్ బ్యాక్స్ ఇచ్చి ముక్కలు చేశారు. నేను కోయంబత్తూరులో ఉన్న సమయంలో తమిళనాడుకు వచ్చిన రాహుల్ నాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ నాపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోను’’ అని స్టాలిన్ అన్నారు.నరేంద్ర మోదీ బీజేపీ సొంతబలంతో ప్రధానమంత్రి కాలేదని, భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మోదీ ఫెయిల్యూర్కు నిదర్శనం అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయం సాధారణమే అయినప్పటికీ.. మోదీని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేకుండా చేయటంలో ‘చారిత్రాత్మక విజయం’ గా మారిందని అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్తం 40 స్థానాల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించిందన్నారు. అయితే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పిందని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 41వ విజయం సాధించిందని తెలిపారు. ఇదే విజయాన్ని 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రిపీట్ చేస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. -
ఆపరేషన్ చిరుత సక్సెస్
-
టెకీలకు గుడ్న్యూస్.. 2 లక్షల మందికి ట్రైనింగ్
క్లౌడ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలలో భారత్లోని 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఒరాకిల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒరాకిల్, తమిళనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి ఆధారిత శిక్షణను అందించడానికి ‘నాన్ ముదల్వన్’ కింద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి.పెరుగుతున్న యువ జనాభా ఉన్న భారత్లోని టాప్ 12 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యువత, యువ ప్రొఫెషనల్స్ తమను తాము మెరుగుపరుచుకోవడానికి, కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఒక వేదికను అందించే బాధ్యతలో భాగంగా నాన్ ముదల్వన్ను ప్రారంభించినట్లు టీఎన్ఎస్డీసీ ఎండీ జె ఇన్నోసెంట్ దివ్య చెప్పారు.ఒరాకిల్ సర్టిఫికేషన్ను ప్రొఫెషనల్స్కు ఇండస్ట్రీ స్టాండర్డ్గా గుర్తిస్తారని, ఇది జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, కంపెనీలు కోరుకునే నైపుణ్యాలను కూడా ధ్రువీకరిస్తుందని ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రాంతీయ ఎండీ శైలేందర్ కుమార్ అన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు, స్థిరత్వం పెరుగుతాయన్నారు. -
తమిళిసై క్లారిటీ: దుమారం రేపుతున్న అమిత్ షా-తమిళిసై సంభాషణ
-
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్కు గుడ్బై చెప్పిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్కు కూడా తాజాగా వీడ్కోలు పలికాడు.తన 39వ పుట్టినరోజున దినేశ్ కార్తిక్ ఈ మేరకు ఇన్స్టా ఉద్వేగపూరిత పోస్ట్తో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘గత కొన్ని రోజులుగా నాకు లభిస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలలో తడిసి ముద్దవుతున్నా. దీనకంతటికి కారణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. బాగా ఆలోచించిన తర్వాత రిప్రెజెంటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా.దీపికకు కూడా చాలా రుణపడి పోయాను!ఈ ప్రయాణంలో నాకు సహకరించిన కోచ్లు, కెప్టెన్లు, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం.నేను ఇక్కడిదాకా చేరుకోవడానికి నా తల్లిదండ్రులే కారణం. వారి ఆశీర్వాదాలు లేకుండా నేను ఇదంతా సాధించేవాడినే కాదు. దీపికకు కూడా చాలా రుణపడి పోయాను.తను స్వతహాగా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ తన కెరీర్ కొనసాగిస్తూనే నాకూ అండగా నిలిచింది. ఇక అందరికంటే పెద్ద థాంక్స్ చెప్పాల్సింది నా అభిమానులకే! క్రికెట్ అయినా.. క్రికెటర్లు అయినా... మీ మద్దతు లేకుండా ఏదీ సాధ్యం కాదు’’ అని దినేశ్ కార్తిక్ సుదీర్ఘ నోట్ రాశాడు.2004లో అరంగేట్రంతమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది.. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.మొత్తంగా 180 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన డీకే 3463 పరుగులు చేశాడు. 172 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే! -
ప్రధాని మోదీ ధ్యానంపై కన్యాకుమారి జనం ఏమంటున్నారు?
లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు చేరుకున్నారు. అక్కడి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో ధ్యానం చేస్తున్నారు. ఈ మెమోరియల్ నిర్మాణంలో అప్పటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ఏక్నాథ్ రనడే పాత్ర ఎంతో ఉంది.వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి, పూజలు చేసిన తరువాత ధ్యానంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి, సన్యాసిలా ఏకాంతవాసాన్ని కొనసాగిస్తున్నారు.2019 ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని కేదార్నాథ్లో ధ్యానం చేశారు. ఈసారి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్కి వచ్చారు. కాగా స్థానికులు ఇప్పుడు స్వామి వివేకానందతో నరేంద్ర మోదీని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని పేరు.. వివేకానందుని చిన్ననాటి పేరు కూడా నరేంద్ర కావడం విశేషం అని ఇక్కడివారు అంటున్నారు. అందుకే నాటి వివేకానందునిలా భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కన్యాకుమారివాసులు చెబుతున్నారు. మోదీ హయాంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్నదని స్థానిక మహిళలు అంటున్నారు.కన్యాకుమారిలోని వివేకానంద ఆశ్రమం మీడియా సెల్ కోఆర్డినేటర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాయింట్ డైరెక్టర్ ఏక్నాథ్ రనడే సమాధి ఉందన్నారు. నాటి రోజుల్లో అనేక నిరసనలను ఎదుర్కొంటూ, దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా ప్రజల నుండి రూపాయి నుండి ఐదు రూపాయల వరకు విరాళాలు తీసుకొని వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించారన్నారు. వివేకానంద ఆశ్రమానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, అయితే భారతదేశ తత్వాన్ని, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే పనిని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
సింగపూర్లో భారత సంతతి వ్యక్తి మృతి
సింగపూర్లోని నేషనల్ వాటర్ ఏజెన్సీలో విషపూరిత వాయువులు పీల్చి 40 ఏళ్ల భారత సంతతి వ్యక్తి మృతి చెందాడు. అతడి అంత్యక్రియలు కోసం మృతదేహాన్ని తమిళనాడులోని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు తెలిపారు. బాధితుడు తమిళనాడుకి చెందిన శ్రీనివాసన్ శివరామన్. అతను సింగపూర్లోని సూపర్సోనిక్ మెయింటెనెన్స్ సర్వీసెస్లో క్లీనింగ్ ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల మే23న నేషనల్ వాటర్ ఏజెన్సీ పబ్కి సంబంధించిన చోవాచు కాంగ్ వాటర్ వర్క్స్లో భాగంగా ట్యాంక్ను క్లీన్ చేస్తుండగా విషపూరిత వాయువులు పీల్చుకుని మరణించినట్లు సింగపూర్ సూపర్సోనిక్ కంపెనీ పేర్కొంది. మే26న బాధితుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, మంగళవారమే(మే28న) భారత్లోని ఆయన స్వగ్రామానికి తరలించినట్లు తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మే23న శ్రీనివాసన్ శివరామన్ మరో ఇద్దరు మలేషియా కార్మికులు విషపూరిత పొగలు పీల్చి పబ్ సౌకర్యం వద్ద అపస్మారక స్థితిలో కనిపించారు. అయితే శివరామన్ అదేరోజు ఆస్పతత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మరో ఇద్దరు కార్మికులు ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నట్లు మలేషియ కార్మికులను నియమించే స్టార్గ్రూప్ ఎస్ట్ కంపెనీ పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తులో కార్మికులు హైడ్రోజన్ సల్పైడ్ వాయువుని పీల్చడం వల్లే అపస్మారక స్థితికి చేరుకున్నట్లు వెల్లడయ్యింది. కాగా, మృతుడి భార్య నర్మదా(35), ఇద్దరు కుమార్తెలు మహాశ్రీ (9), శ్రీనిషా (7)తో కలిసి సింగపూర్ ఆహార పరిశ్రమలో పనిచేస్తున్న సోదరుడు మోహన్ నవీన్కుమార్తో కలిసి ఉంటోంది. నిజానికి శివరామన్ మే27న సెలవుపై వెళ్లాల్సి ఉన్నందున మలేషియా వెళ్లేడానికి ముందు ఒక నెల సింగపూర్లో స్టే చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలో ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుందని బంధువు నవీన్ కుమార్ ఆవేదనగా చెప్పుకొచ్చారు. శివరామన్ మరణ వార్తతో మొత్తం కుటుంబం స్వగ్రామం వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నట్లు నవీన్ కుమార్ తెలిపారు.(చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణం) -
ఆ బామ్మ అమ్మే ఇడ్లీల ధర తెలిస్తే షాకవ్వుతారు! ఈ వయసులో..
ఏ వ్యాపారం అయినా లాభం కోసమే చేస్తుంటారు. మరికొందరూ ఆ క్రమంలో మోసాలతో లాభాలు ఆర్జించే యత్నం చేస్తుంటార. కొందరూ నిస్వార్థంగా వ్యాపారం చేస్తూ..కస్టమర్ల ప్రేమ ఆప్యాయతలను చూరగొంటారు. వారి అండదండలతో ముందుకు సాగిపోతారు. తన వద్దకు వచ్చే కస్టమర్ కడుపు నిండి సంతోషంగా ఫీలైతే చాలు అని భావించే వ్యాపారుల ఉండటం అరుదు. అలాంటి కోవకు చెందిందే ఈ 84 ఏళ్ల బామ్మ.తమిళనాడుకి చెందిన ధనం పాటి బామ్మ ఎనిమిది పదులు వయసులోనూ కాయకష్టం చేసుకుని బతుకుతుంది. ఆమె ఇడ్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుత కాలంలో పప్పులు, ఉప్పులు ధరలు ఆకాశనంటేలా ఉన్నాయి. అయినా సరే ఈ బామ్మ చాలా చీప్ ధరకే ఇడ్లీలను విక్రయిస్తుంది. అలా అని ఆమె వెల్సెటిల్డ్ కుటుంబం కూడా కాద. చాలా నిరుపేద కుటుంబం. చాల కష్టపడి బతుక పోరాటం సాగిస్తోంది. ఆ బామ్మకు ఇద్దరు పిల్లలు. కూతురుని టెలర్కిచ్చి పెళ్లి చేశానని, కొడుకు లారీ లోడ్మ్యాన్గా పనిచేస్తాడని చెప్పింది. కొడుకు తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలిపింది. వాళ్లు తనతో ఉండమని చెప్పారు,కానీ ఎందుకు వాళ్లకు భారంగా ఉండటమని వెళ్లలేదని చెప్పింది. పైగా తన చివరి శ్వాస వరకు ఇలా కష్టపడతానని అంటోంది. అయితే ఆమె ఈ వ్యాపారం తన భర్త అనారోగ్యానికి గురైనప్పటి నుంచి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తన భర్త మొదట్లో టీ వ్యాపారం చేసేవాడని, ఆ డబ్బులు సరిపోక ఇలా టిఫిన్ సెంటర్ పెట్టామని చెప్పింది. అయితే ఆమెకు ఉన్న కొద్దిపాటి చిన్న ఇంటిలోనే ఇడ్లీలను విక్రయించుకుంటోంది. స్కూల్ పిల్లలు, కార్మికులు, రోజువారీ కూలీలు ఆమె కస్టమర్లు. ఆమె గత నాలుగేళ్ల క్రితం వరకు ఒక్క రూపాయికే ఇడ్లీలను విక్రయించేది. ఇటీవలే ఆర్థిక అవరసరాల రీత్య రూ. 3లకు విక్రయిస్తుంది. ఇది కూడా భర్త చనిపోవడంతోనే ఇడ్లీ ధర పెంచింది. ఇంకాస్త ధర పెంచొచ్చు కదా..! అని ఎవ్వరైనా అడిగితే ప్రజలు రూ. 10లకే కడుపు నిండా టిఫిన్ తినాలని అంటుంది. ఈ బామ్మ స్వతం అవసరాలు ఎన్ని ఉన్నా.. కస్టమర్లకు మాత్రం కడుపునిండా తక్కువ ధరకే టిఫిన్ పెడుతుందని, మూడు ఇడ్లీలు అడిగితే ఇంకో రెండు ఇడ్లీలు ఛార్జీ లేకుండానే పెడుతుందని స్థానిక కస్టమర్లు చెబుతున్నారు. ఇంత తక్కువ ధరకే ధనం పాటి బామ్మ అమ్మడానికి మరో కారణం..రేషన్ బియ్యం, పప్పులతోనే ఈ ఇడ్లీలను తయారు చేస్తుంది. పైగా ఆమె వద్దకు వచ్చిన కస్టమర్లే ప్రేమతో ఆ బియ్యం, పప్పులు ఉచితంగా ఇవ్వడంతో ఇలా తక్కువ ధరకే విక్రయిస్తుంది ఈ బామ్మ. పైగా తన వద్దకు వచ్చే వాళ్లు తనపై చూపించే ప్రేమ ఆప్యాయలతో కాలం వెళ్లదీయగలుగుతున్నానని చెబుతుంది. రెస్ట్ తీసుకోవాల్సిన ఈ వయసులో కష్టపడటమే గాకుండా పిల్లలపై ఆధారపడేందుకు ఇష్టపడలేదు. తన శ్రమనే నమ్ముకుని జీవితాన్ని వెళ్లదీస్తోంది. కటిక దారిద్యం అనుభవిస్తున్నా.. కూడా నిజాయితీగా తక్కువ ధరకే రుచికరమైన ఇడ్లీల విక్రయిస్తూ జీవనం సాగించడం అంటే మాములు విషయం కాదుకదా..!. కొద్ది కష్టాలకి భయపడే మనకు.. ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నబామ్మను చూస్తే..హ్యాట్సాఫ్ బామ్మ..! అని అనుకుండా ఉండలేం!.(చదవండి: సూపర్ బామ్మ!.. 71 ఏళ్ల వయసులో అన్ని డ్రైవింగ్ లైసెన్స్ల..!) -
షుగర్ కంట్రోల్ కావడం లేదా? అద్భుతమైన ప్రొటీన్-రిచ్ బ్రేక్ఫాస్ట్
శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి అల్పాహారం. నిద్ర లేచిన తరువాత శరీరానికి చురుకుదనానికి, గ్లూకోజ్ను అందిస్తుంది ఇది. ఆధునిక కాలంలో ప్రొటీన్-రిచ్ఆహారంపై శ్రద్ధపెరిగింది. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఉదయమే ఏం తినాలి అనేది పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో ఐకానిక్ సౌత్ ఇండియన్ టిఫిన్ గురించి తెలుసుకుందామా.ముఖ్యంగా దోసెలంటే ఇష్టముండే వారికి, ప్రొటీన్లు, ఫౌబర్ పుష్కలంగా లభించే అడై దోసె. ఇది కూడా దోసె ఫామిలీకి చెందిందే. సాధారణ దోస కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. దీంతో ఇది షుగర్ పేషంట్లకు కూడా మంచింది. బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం కూడా తీసుకోవచ్చు. అదే అడై దోసె. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే సింపుల్ రెసిపీతమిళనాడులో ఎక్కువగా పాపులర్ అయిన అడై దోసె. ఇది రుచికర మైనది మాత్రమే కాదు, పోషకమైనది కూడా. పైగా పులియబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.పప్పులు, బియ్యం కలయికతో, కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మొక్కల ఆధారిత ప్రోటీన్ను చేర్చుకోవాలని చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.తయారీ విధానంబియ్యం , పప్పు (మినప పప్పు, ఉరద్ పప్పు, శనగ పప్పు) శుభ్రంగా కడిగిన తరువాత, 4-6 గంటలు నీటిలో నానబెట్టాలి.తరువాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసేటపుడు రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి, జీలకర్ర, సోపు గింజలు, ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, తరిగిన కొత్తిమీర , ఉల్లిపాయ ముక్కలను కలుపుకోవాలి. పిండి మరీ జారుగా, మరీ గట్టిగా గాకుండా కలుపుకోవాలి.పెనంపై రెండు చెంచాల నూనె లేదా నెయ్యి వేసి చక్కగాదోసెలాగా వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే అడైదోసె రడీ. దీనికి జతగా కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ లేదా సాంబార్తోగానీ వేడి వేడిగా అడై దోసను ఆస్వాదించడమే. -
ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత ఇలా.. సంతోషంగా ఉంది!
India's 85th chess Grandmaster- దుబాయ్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అనుకున్నది సాధించాడు తమిళనాడు చెస్ ప్లేయర్ శ్యామ్ నిఖిల్. 31 ఏళ్ల శ్యామ్ నిఖిల్భారత చెస్లో 85వ గ్రాండ్మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. జీఎం హోదా దక్కాలంటే చెస్ ప్లేయర్ 2500 ఎలో రేటింగ్ను దాటడంతోపాటు మూడు జీఎం నార్మ్లు సాధించాలి. ఈ రెండూ సాధ్యమైతేనే జీఎం హోదా లభిస్తుంది. 2012లోనే శ్యామ్ 2500 ఎలో రేటింగ్ను అందుకోవడంతోపాటు రెండు జీఎం నార్మ్లు సాధించాడు. అయితే చివరిదైన మూడో జీఎం నార్మ్ కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది.12 ఏళ్లపాటు వేచి చూశాక ఎట్టకేలకు శ్యామ్ నిఖిల్ దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నీలో జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్ను అందుకున్నాడు. ఈ టోర్నీలో శ్యామ్ నిఖిల్ ఐదు పాయింట్లతో 39వ ర్యాంక్లో నిలిచాడు. చాలా సంతోషంగా ఉందిఈ క్రమంలో ఏడుగురు గ్రాండ్మాస్టర్లతో తలపడిన శ్యామ్ ఒకరిపై గెలిచి, ఆరుగురితో ‘డ్రా’ చేసుకొని మూడో జీఎం నార్మ్ను సాధించాడు. ‘ఎనిమిదేళ్ల వయస్సులో చెస్ ఆడటం ప్రారంభించాను. అయితే మూడేళ్లపాటు ఏ టోర్నీలోనూ ఆడలేదు. ఆ తర్వాత అండర్–13 రాష్ట్ర చాంపియన్షిప్లో విజేతగా నిలిచాను. 2012లోనే రెండు జీఎం నార్మ్లు అందుకున్నా మూడో జీఎం నార్మ్ సులభంగా రాలేదు. పలుమార్లు చేరువై దూరమయ్యాను. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మూడో జీఎం నార్మ్ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉంది’ అని 2022లో కామన్వెల్త్ చాంపియన్గా నిలిచిన శ్యామ్ నిఖిల్ వ్యాఖ్యానించాడు. -
డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
దేశంలో వీధికుక్కల దాడులు, దుర్మరణాలు సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన రేపుతోంది. ప్రతి ఏడాదీ మిలియన్ల కొద్దీ దాడుల కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు , సీనియర్ సిటిజన్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దేశంలో 3.5 కోట్లకు పైగా వీధికుక్కలు ఉన్న నేపథ్యంలో ఇదొక సవాలుగా మారుతోంది. అంతేకాదు ఇటీవలి కాలంలోక ఒన్ని పెంపుడుకుక్కలు కూడా మనుషులకు తీరనిహాని చేస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధందేశంలో పెరుగుతున్న కుక్క కాటు కేసుల నేపథ్యంలో పిట్బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్వీలర్ లాంటి పలు కుక్క జాతుల పెంపకాన్ని నిషేధించాలని కేంద్రం ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో పిట్బుల్ టెర్రియర్, తోసా ఇను సహా 23 రకాల క్రూరమైన కుక్క జాతులను నిషేధించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిన్న (గురువారం, ఏప్రిల్ 9)ప్రకటించింది. ఇటీవల చెన్నైలో రోట్వీలర్ డాగ్ బాలుడిని గాయపరిచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.క్రూరమైనవిగా భావించే 23 జాతుల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే వీటి పెంపకం, విక్రయాలను నిలిపివేయాలని రాష్ట్రాలను కోరింది. అదే సమయంలో వాటికి గర్భనిరోధకానికి చర్యలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖలకు లేఖ రాసింది. కొన్ని జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా, ఇతర ప్రయోజనాల కోసం ఉపగించకుండా నిషేధించాలని పౌరులు, సిటిజన్ ఫోరమ్లు, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (AWO) ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.దూకుడు , మానవులకు హాని కలిగించే లక్షనాలున్న ఈ జాతులు ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి కేంద్రంస్పష్టం చేసింది . 2024 నాటికి భారతదేశంలో నిషేధించిన జాబితాను ప్రకటించింది. కేంద్రం నిషేధించిన కుక్కల జాతుల జాబితా పిట్బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్డాగ్, బోర్బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్. ఇంకా సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్న్జాక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బ్యాండాగ్ ఉన్నాయి.దాడులు ఎందుకు పెరుగుతున్నాయిభారతదేశంలో దాదాపు 1 కోటి పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే వీధికుక్కల జనాభా చాలా ఎక్కువ.2019లో దేశంలో 4,146 కుక్కకాటు కేసులు నమోదై మానవ మరణాలకు దారితీశాయి. 2019 నుంచి దేశవ్యాప్తంగా భారతదేశం 1.5 కోట్లకు పైగా కుక్క కాటు కేసులు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు ,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి.వీధికుక్కలు రెచ్చగొట్టినా, బెదిరించినా, లేదా తన బిడ్డలకు (కుక్క పిల్లలకు) హాని జరుగుతుందని భావించిన సూడి కుక్క దాడికి తెగబడుతుంది. వీధి కుక్కల దాడులకు దోహదపడే కారకాలు ప్రభుత్వం, జంతు సంక్షేమ సంస్థల నిర్లక్ష్యం మరియు వ్యక్తిగత ఉదాసీనత.వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి సమర్థవంతమైన చర్యలు లేకపోవడం కూడా ప్రధానకారణంగా నిలుస్తోంది.వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం చట్టవిరుద్ధం కానప్పటికీ, వాటికి ఆహారం ఇచ్చినందుకు వ్యక్తులపై దాడి చేస్తున్న ఘటను చూస్తున్నాం.జంతు ఆరోగ్య సంరక్షణ , నియంత్రణ లేకపోవడంఆకలి లేదా ఇన్ఫెక్షన్ కారణంగా వీధికుక్కలు దూకుడుగా మారతాయి.19604 నాటి జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం వీధి కుక్కలపైక విషప్రయోగం చేయడం చట్టరీత్యా నేరం.వీధి కుక్కల దాడుల సమస్యను పరిష్కరించడానికి మెరుగైన జంతు నియంత్రణ, అవగాహనతోపాటు బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యంతో కూడిన సమగ్ర విధానం అవసరం. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే జంతువుల పట్ల దయ, కరుణ కలిగి ఉండటం చాలా అవసరం. ఇప్పటికే ఈ నిషేధిత జాతులలో ఏదైనా జాతికి చెందిన కుక్క మీ దగ్గర ఉంటే, వాటి సంతానోత్పత్పిని అరికట్టేలా స్టెరిలైజేషన్ చేయించాల్సి ఉంటుంది. -
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నా లాగా కష్టపడకుండా నా బిడ్డలు పెరగాలి.. చదువుకోవాలి. ఉన్నత స్థితిలోకి రావాలని అని తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికోసం కష్టపడతారు.వారి బంగారు భవిష్యత్తుకోసం కలగంటారు. అలాగే పిలలు అమ్మా నాన్నల్ని కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి. మంచి కారు కొనాలి.. ఇల్లు కొనాలి.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు. తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా చదువుతారు. అచ్చం ఇలాగే చెన్నైలోని ఒక అమ్మాయి ఆలోచించింది. తన తల్లిదండ్రులు ఏ వస్తువునైనా ధర ట్యాగ్ చూడకుండా నచ్చింది కొనుక్కోవాలి అని కలగంది ఓ ఆటో డ్రైవర్ కూతురు. దాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వివరాలను తెలుసుకుందాం రండి!I want to be at a place where my parents don’t see the price tag when they go to a shop,says Poongodhai, daughter of an auto-driver, who came first among GCC schools scoring 578 in the class XII board exams. Speaking in fluent English, Poongodhai of Perambur GCC school said she… pic.twitter.com/2T1Mbnz8vB— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024తాజాగా తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్కు చెందిన పూంగోధయ్ 578 స్కోరుతో పాఠశాల టాపర్గా నిలిచింది. తన కుటుంబం, సోదరి కాలేజీ, సిబ్బంది, తన ఇలా ప్రతీ ఒక్కరూ బాగా సహక రించారంటూ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ బికామ్, సీఏ చదవాలని కోరుకుంటోంది.Her sister Shobana breaks down responding to her sister’s success coming first among GCC schools in the 12th board examinations. Both of them are daughters of auto driver pic.twitter.com/qSS6EffAbP— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి డొమెస్టిక్ హెల్పర్గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లి దండ్రులు.అటు ఇది తమ టీచర్ల ఘనత అని పెరంబూర్లోని పాఠశాల హెచ్ఎం కూడా ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్
పారిస్: భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ తన కెరీర్లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టైటిల్ను సాధించాడు. పారిస్లో జరిగిన బ్యాచ్ ఓపెన్ చాలెంజర్ టోర్నీలో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల వెలవన్ విజేతగా నిలిచాడు.ఫైనల్లో ప్రపంచ 58వ ర్యాంకర్ వెలవన్ 11–6, 11–9, 11–6తో మెల్విల్ సియానిమానికో (ఫ్రాన్స్)పై గెలుపొంది ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్ను జమ చేసుకున్నాడు. ఈ సంవత్సరం నాలుగు టోర్నీలలో పాల్గొన్న వెలవన్ రెండింటిలో క్వార్టర్ ఫైనల్ చేరి, మరో రెండింటిలో రెండో రౌండ్లో ఓడిపోయాడు. -
బరువు తగ్గించుకోవాలని ఆసుపత్రికెళితే ప్రాణమే పోయింది!
ఆరోగ్యంగా జీవించాలని ఆరాట పడిన యువకుడు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది. పుదుచ్చేరికి చెందిన హేమచంద్రన్ (26) బరువు తగ్గించుకునేందుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కొన్ని నిమిషాలకే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన వివాదం రేపింది. 150 కిలోల అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న హేమ చంద్రన్. బరువు తగ్గాలనే కోరికతో మెటబాలిక్ బేరియాట్రిక్ సర్జరీ కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆపరేషన్ టేబుల్పై గుండెపోటుకు గురయ్యాడు.వెంటనే మరో ఆస్పత్రికి తరలించి రెండు రోజులు ఐసీయూలో ఉంచారు. చివరికి మంగళవారం మృతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అయితు వైద్యుల నిర్లక్ష్య కారణంగానే తమబిడ్డ ప్రాణాలు కోల్పోయాడని హేమచంద్రన్ తండ్రి ఆరోపించారు. తన కుమారుడు ఐటీ ఉద్యోగి అని, శస్త్రచికిత్స గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకున్నాడని బాధితుడు తండ్రి దురై సెల్వనాథన్ తెలిపారు. తొలుత క్రోమ్పేట్లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో బేరియాట్రిక్ సర్జరీ గురించి ఆరా తీశాడు. ఆ తరువాత దాని గురించి మర్చిపోయాడు. కానీ ఆసుపత్రి నుండి పదే పదే కాల్స్ వస్తూ ఉండటంతో ఫిబ్రవరిలో వారిని మళ్లీ కలిసాడు. మొత్తం ఖర్చు 8 లక్షలు రూపాయలు చెల్లించలేనని చెప్పడంతో ఎస్కే జైన్ ఆస్పత్రిలో రూ.5 లక్షలకే చేస్తామని అసిస్టెంట్ చెప్పాడని సెల్వనాథన్ వెల్లడించారు. అయితే హేమచంద్రన్ బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటంతో సర్జరీ వాయిదా పడింది. తిరిగి ఏప్రిల్ 21న ఎస్కే జైన్ ఆసుపత్రిలో చేర్చామనీ, మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు శస్త్రచికిత్స కోసం తీసుకెళ్లారని సెల్వనాథన్ చెప్పారు. 40 నిమిషాల తర్వాత, కొన్ని సమస్యలొచ్చాయని చెప్పి తన కుమారుడ్ని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని సెల్వ నాథన్ ఆవేదనకు గురయ్యారు.హేమచంద్రన్ను 48 గంటల పాటు ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO)లో ఉంచారు. మరుసటి రోజు ఉదయం ఆయన పరిస్థితిలో స్వల్ప మెరుగుదల ఉందన్నారు. కానీ తానీ ఐసీయూలోకి వెళ్లేటప్పటికే తన కొడుకు నిర్జీవంగా ఉన్నాడని సెల్వనాథన్ పేర్కొన్నాడు. దీంతో ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్కు వెళ్లానని, అపుడు తన కొడుకు చనిపోయాడని ఆసుపత్రి అధికారులు ప్రకటించారన్నాడు. పోస్ట్మార్టం చేయకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లారని సెల్వనాథన్ ఆరోపించాడు. గురువారం హేమచంద్ర అంత్యక్రియలు ముగిసాయంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యాడు.మరోవైపు హేమచంద్రన్ మృతి చెందినట్లు దీనిపై స్పందించిన తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ ఒక కమిటీని నియమించింది. రెండు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది.వైద్యుల నిర్లక్ష్యం రుజువైతే మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది. అతని కుటుంబం ఫిర్యాదు చేయనప్పటికీ, మీడియా నివేదికల ఆధారంగా ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టిందని అధికారి తెలిపారు. -
అమెరికాలో ఐటీ జాబ్ వదిలేసి,రీ యూజబుల్ న్యాప్కిన్స్ తయారీ
‘ఎంత పెద్ద చదువులు చదివినా.. ఆర్థికంగా ఎంత ఎదిగినా మనసుకు తృప్తిగా లేకపోతే అందులో సహజత్వం లోపిస్తుంది. చేసే పనుల్లో నైపుణ్యం రాదు..’ అంటున్నారు హేమ. పర్యావరణహితంగా మహిళలకు ఉపయుక్తంగా ఉండే రీ యూజబుల్ క్లాత్తో ప్యాడ్స్, పిల్లలకు డైపర్లు తయారు చేస్తూ, గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పిస్తూ వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు.తమిళనాడు, చిత్తూరు బార్డర్లో ఉన్న అతిమంజరీ పేట్లో ఉన్న హేమ తన ఉత్పత్తులతో హైదరాబాద్లోని క్రాఫ్ట్ కౌన్సిల్లోని ప్రదర్శనశాలలో తన స్టాల్ ద్వారా పరిచయం అయ్యారు. అత్యంత నిరాడంబరంగా కనిపిస్తున్న ఆమె... అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసి, స్వదేశానికి వచ్చి తనను తాను పర్యావరణ ప్రేమికగా ఎలా మలచుకున్నారో, మరికొందరి మహిళలను ఎలా భాగస్వాములను చేస్తున్నారో వివరించారు. ‘‘మా ఊరిలో పన్నెండేళ్లుగా ఉంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వాడకంలో ఉన్న వస్తువులకు ప్రత్యామ్నాయ, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. చాలా ఆలోచనలు చేశాక మహిళల రుతుక్రమ సమయంలో వాడే ప్యాడ్స్కు సంబంధించిన పరిష్కారం కనుక్కోవాలనుకున్నాను. అందులో భాగంగా 2020లో ‘కొన్నై’ పేరుతో మా ఉత్పత్తులన్నీ గ్రామంలోని మహిళలు, యువతతో కలిసి చిన్న చిన్న సమూహాలుగా ఏర్పాటు చేసి, వారితో తయారుచేస్తున్నాను. మహిళలు, చంటిపిల్లలకు ఉపయోగపడే రీ యూజబుల్ ఉత్పత్తుల తయారీకి కొంతమందిని గ్రూప్గా చేసి వారి ఇళ్ల నుంచే, సౌకర్యవంతమైన సమయంలో తయారుచేసిచ్చేలా ప్రణాళిక చేశాను. చదువుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇది ఒక పార్ట్టైమ్ ఉపాధి లాగా కూడా ఉపయోగపడుతుంది. వాడకం సులువు..మృదువుగా, మన్నికగా ఉండటమే కాకుండా వాడిన తర్వాత రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టి, ఎండలో ఆరవేయవచ్చు. తిరిగి వీటిని వాడుకోవచ్చు. వెదురు కాటన్ను వాటర్ఫ్రూఫ్ ఫ్యాబ్రిక్తో జత చేసి వీటిని తయారుచేస్తుంటాం. ఇవి సురక్షితంగానూ, అనుకూలంగానూ ఉంటాయి. తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్నీ నివారించవచ్చు. డిస్పోజబుల్ ప్యాడ్లలో రసాయనాల కారణంగా చర్మానికి హాని కూడా కలిగిస్తాయి. మహిళలకు రీ యూజబుల్ క్లాత్ ప్యాడ్స్ మాత్రమే కాదు పిల్లలకు డైపర్లు, మ్యాట్లు, వైప్స్.. అన్నీ ఎకో ఫ్రెండ్లీవే తయారుచేస్తున్నాం. ఇవి మృదువుగా ఉంటాయి. కాబట్టి చర్మానికి ఎలాంటి హానీ కలిగించవు. స్మాల్, మీడియమ్.. సైజులను బట్టి డిజైన్ల బట్టి ధరలు ఉన్నాయి.ఆర్డర్లను బట్టి ఒక్కొరికి రూ.5,000 వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో ఇప్పుడు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. నేను ఆదాయం, రాబడి గురించి ఆలోచించడం లేదు. మునుముందు అందరూ పర్యావరణహితంగా మారాల్సిందే. అందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సొంత ఊరికి... మేం పన్నెండేళ్లు అమెరికాలో ఉన్నాం. నేనూ, మా వారు దేవ్ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేశాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒక దశలో మాకు అక్కడ ఉండాలనిపించలేదు. మొత్తం కుటుంబంతో సొంత ఊరికి వచ్చేశాం. ఇక్కడే ఊళ్లో ఏడెకరాల భూమి కొనుగోలు చేశాం. అందులో ఎక్కువ శాతం రాగులు పండిస్తాం. ఆ పని అంతా మా వారు చూసుకుంటారు. ఎవరికి నచ్చిన పని వాళ్లు...అమెరికన్ సంస్కృతిలో పిల్లల మీద చదువుల ఒత్తిడి ఉండదు. పిల్లలకు ఏది ఇష్టమో, ఏ కళలో నైపుణ్యం సాధించాలనుకుంటారో దానిని వారే కనిపెట్టేలా, నైపుణ్యాలు సాధించేలా చూస్తారు. మేం కూడా పిల్లలను స్కూళ్లను, కాలేజీకి పంపించలేదు. హోమ్ స్కూలింగ్ అని మాకు గ్రూప్ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో పిల్లలకు నచ్చినవి చదువుకుంటారు. తప్పనిసరిగా చదవాలనే నిబంధన పెడితే, మనసుకు ఇష్టంలేని దానిమీద వారెప్పటికీ ప్రావీణ్యులు కాలేరు. ఇవన్నీ ఆలోచించాం. పిల్లలకు ఏది ఇష్టమో అదే చేయమన్నాం. ఇద్దరూ సంగీతం నేర్చుకున్నారు. ఇరవై ఏళ్ల మా అబ్బాయికి శాస్త్రీయ సంగీతం అంటే ఎక్కువ ఇష్టం. పద్దె నిమిదేళ్ల మా అమ్మాయి ఉడెన్ ఫర్నీచర్లో తన నైపుణ్యాలను చూపుతుంటుంది. నేను పర్యావరణ హితంగా ఉండే పనులు చేయాలనే ఆలోచనతో రీ యూజబుల్ న్యాపికిన్స్ పై దృష్టి పెట్టాను. మా విధానాలు మా ఇతర కుటుంబాల వారికి నచ్చుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరుగులు పెట్టేవారే. తమకేది నచ్చుతుందో, ఏం చేయగలమో, ఎందులో సంతృప్తి లభిస్తుందో దానిని కనుక్కోలేరు. ప్రకృతి నీడన, నచ్చిన పనుల్లో భాగస్వాములం అవుతూ పర్యావరణహితగా జీవిస్తున్నాం. నా ఈ ఆలోచనను విరివిగా మార్కెట్లోకి తీసుకెళ్లడానికి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్ ద్వారా రకరకాల క్రాఫ్ట్స్ మేళాలో పెడుతూ సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళుతున్నాను’ అని వివరించారు హేమ. – నిర్మలారెడ్డి -
క్రికెట్ లవర్స్ ఆహ్వాన పత్రిక వైరల్: సీఎస్కే ఫ్యాన్స్ ఫిదా!
ఒక పక్క ఐపీఎల్ ఫీవర్ జోరుగా నడుస్తోంది. మరోపక్క రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్కు దూసుకు పోయింది. ముఖ్యంగా ఇటీవలి మ్యాచ్లో ఇలా వచ్చి అలా సిక్సర్ల వర్షం కురిపించిన జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మేనియా ఫ్యాన్స్ను ఆనందో త్సాహాల్లో తేలి యాడించింది. స్టేడియం అంతా రికార్డ్ స్థాయిలో హోరెత్తిపోయింది. ఈ క్రమంలో తాజాగా సీఎస్కే అభిమాని పెళ్లి పత్రిక నెట్టింట వైరల్గా మారింది. సీఎస్కే ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ పెళ్లి పత్రిక క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది.తమిళనాడుకు చెందిన జంట చెన్నై సూపర్ కింగ్స్ థీమ్తో తమ పెళ్లి ఆహ్వాన పత్రిక రూపొందించడం విశేషంగా నిలిచింది. క్రియేటివ్గా సీఎస్కే లోగోను ఉపయోగించి వారి పేర్లను ముద్రించారు. అలాగే మ్యాచ్ నమూనా టికెట్పై పెళ్లి సమయం(ఏప్రిల్ 17), రిసెప్షన్ వంటి వివరాలను కూడా పొందుపర్చారు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) View this post on Instagram A post shared by Whistle Podu Army - CSK Fan Club (@cskfansofficial)అంతేనా మ్యాచ్ ప్రివ్యూ, మ్యాచ్ ప్రిడిక్షన్ లాంటి పదాలను కూడా జోడించారు. అంతేకాదు సీఎస్కే ఐపీఎల్ను ఐదుసార్లు గెల్చుకున్న దానికి సూచికగా 5 స్టార్లను అందించడం మరో విశేషం. దాంతో ప్రస్తుతం ఈ వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నూతన దంపతులు గిఫ్ట్లీన్ పెర్సీ, మార్టిన్ రాబర్ట్ హృదయ పూర్వక శుభాకాంక్షాల వెల్లువ కురుస్తోంది.ఫెంటాస్టిక్ పార్టనర్షిప్ అంటూ కమెంట్స్ చేయడం విశేషం. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!)స్టార్ స్పోర్ట్స్ ఈ పోస్ట్పై స్టార్ స్పోర్ట్స్ ఇండియా కూడా కమెంట్ చేయడం విశేషం. మీ అభిమానంలాగే మీ జోడి కూడా బలంగా ఉండాలంటూవిషెస్ తెలిపింది. కాగా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఆరు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు గెలిచి ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్కు చేరుకున్న సంగతి తెలిసిందే. (ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?) -
TN: ‘అన్నాడీఎంకే’కు ఫ్యూచర్ లేదు: అన్నామలై
చెన్నై:తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఎన్డీఏలోకి స్వాగతిస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ భవిష్యత్తులో ఉనికి కోల్పోతుందన్నారు. ఎన్నికల తర్వాత అన్నా డీఎంకే క్యాడర్ మొత్తం ఆ పార్టీ మాజీ కీలక నేత టీటీవీ దినకరన్ వెనకాల నడుస్తుందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఓ పన్నీర్ సెల్వంతో పాటు టీటీవీ దినకరన్ గ్రూపులు బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ అధికార డీఎంకే, బీజేపీ మధ్యనే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులోని అన్ని ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. పల్లవి పటేల్తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల -
ఎండల ఎఫెక్ట్.. నీటి కోసం వచ్చి గుంటలో పడ్డ ఏనుగు
చెన్నై: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల గొంతులు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎండల దెబ్బకు అడవుల్లో ఉండే సహజ నీటి వనరులన్నీ ఎండిపోయి అక్కడ నివసించే వన్యప్రాణులు దాహంతో అల్లాడిపోతున్నాయి. తమిళనాడులోని సత్యమంగళం అడవులపై కూడా ఎండల ఎఫెక్ట్ పడింది. అడవిలో దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేకపోవడంతో ఓ ఆడ ఏనుగు అక్కడికి సమీపంలో ఉన్న పళనిచామి గుడి వద్దకు వచ్చింది. నీటి కోసం వెతుక్కుంటుండగా ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న గుంటలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించారు. ఏనుగు వద్దకు ఒక వెటర్నరీ డాక్టర్ నేతృత్వంలో మెడికల్ టీమ్ను పంపించారు. ఏనుగును గుంటలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదీ చదవండి.. దోమలు బాబోయ్ దోమలు -
తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..!
తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. తమ పార్టీ (డీఎంకే) 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో అత్యాధునిక హంగులతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడతామని స్టాలిన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. As a sports and cricket enthusiast, I would like to add one more promise to our election manifesto for #Elections2024: 🏏🏟️ We will take efforts to establish a state-of-the-art cricket stadium in Coimbatore, with the active participation of the sports loving people of… https://t.co/B6rpHJKSBI — M.K.Stalin (@mkstalin) April 7, 2024 క్రికెట్ ఔత్సాహికుడినైన నేను #Elections2024 కోసం మా ఎన్నికల మేనిఫెస్టోలో మరో వాగ్దానాన్ని జోడించాలనుకుంటున్నాను. కోయంబత్తూరులోని క్రీడాభిమానుల చురుకైన భాగస్వామ్యంతో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తాను. ఈ స్టేడియాన్ని చెన్నై చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాట రెండో అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్ వేదికగా తీర్చిదిద్దుతాను. క్రీడల మంత్రి ఉదయ్ స్టాలిన్ రాష్ట్రంలో ప్రతిభను పెంపొందించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాడంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. కాగా, తమిళనాట ఇదివరకే ఓ అంతర్జాతీయ స్టేడియం (చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం) ఉందన్న విషయం తెలిసిందే. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇది సొంత మైదానం. 1916లో స్థాపించబడిన చిదంబరం స్టేడియం దేశంలో రెండో పురాతన క్రికెట్ స్టేడియం. -
‘కచ్చతీవు రచ్చ’: జైశంకర్కు చిదంబరం కౌంటర్
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో కచ్చతీవు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, డీఎంకేలు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ అంటుంటే..కచ్చతీవుల అప్పగింతల విషయమే తమకు తెలియదని డీఎంకే నేతలు వాదిస్తున్నారు. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నమలై కచ్చతీవును 1974లో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాలు శ్రీలంకకు ఎలా అప్పగించాయనే అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మనదేశానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సంకోచంగా శ్రీలంకకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా కాంగ్రెస్ పనిచేస్తుందని దుయ్యబట్టారు. ఎవరు ఏం చేశారో కాదు.. ఎవరు ఏం దాచారో తెలుసు ఈ నివేదికపై విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ సైతం.. కాంగ్రెస్, డీఎంకే తీరును తప్పుబట్టారు. తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఉన్న కచ్చతీవుకు ప్రాముఖ్యత లేదనే 1974లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు ఇచ్చారని గుర్తు చేశారు. కచ్చతీవు ద్వీవికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేదే కాకుండా, ఎవరు దాచారనేదీ ఇప్పుడే మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని జయ శంకర్ అన్నారు. దెబ్బకు దెబ్బ వర్సెస్ ట్వీట్ ఫర్ ట్వీట్ కచ్చతీవు ద్వీప వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి .చిదంబరం మండిపడ్డారు. ఎక్స్ వేదికగా జయ్శంకర్ ఊసరవెల్లిల్లా రంగుల్లు మార్చొద్దని అన్నారు. ‘టిట్ ఫర్ టాట్’ అనేది పాతది.. ట్వీట్ ఫర్ ట్వీట్ అనేది ట్వీట్ కొత్త ఆయుధం’ అని పేర్కొన్నారు. చరిత్రలో జై శంకర్ అంతేకాదు, 2015 జనవరి 27 నాటి ఆర్టీఐ సమాధానాన్ని ఒకసారి చూడండి. కచ్చితీవును శ్రీలంకకు చెందినదిగా ఇండియా గుర్తించడాన్ని ఆర్టీఐ సమర్ధించిందని గుర్తు చేశారు. పరోక్షంగా జయ్ శంకర్ను ఉద్దేశిస్తూ.. ఒక ఉదారవాద అధికారి నుంచి ఆర్ఎస్ఎస్- బీజేపీ మౌత్ పీస్ వరకు ఆయన చేసిన విన్యాసాలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రజలు ఎంత వేగంగా రంగులు మారుస్తుంటారో అని చిందబరం ట్వీట్ చేశారు బీజేపీలో హయాంలోనూ జరిగింది మరో ట్వీట్లో గత 50 ఏళ్లలో భారతీయ మత్స్యకారులు శ్రీలంకలో నిర్బంధించబడ్డారని అంగీకరించారు. అయితే బీజేపీ, మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే జరగలేదా అని ప్రశ్నించారు. ‘గత 50 ఏళ్లలో మత్స్యకారులను నిర్బంధించిన మాట వాస్తవమే. అదేవిధంగా భారతదేశం అనేక మంది మత్స్యకారులను నిర్బంధించింది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంక మత్స్యకారులను నిర్బంధించలేదా? మోదీ అధికారంలో ఉన్నప్పటి నుండి మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కచ్చతీవు భారత్ తిరిగి తీసుకోవాల్సిందే ఇలా ఆయా రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే.. జాలర్ల సంఘాలు మాత్రం కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. -
లోక్సభ ఎన్నికలు: నేడే తొలి దశ నామినేషన్లకు చివరి తేదీ
ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల మొదటి దశ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ నేడు(బుధవారం)తో ముగియనుంది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది. అదే విధంగా మార్చి 30న నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. ఇక.. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికలను ఎన్నికలు సంఘం మొత్తం ఏడు విడతల్లో నిర్వహించనుంది. మొదటి దశలో 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడులో ఒకే దశలో మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్లోని 15 అసెంబ్లీ స్థానాలకు కూడా మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలను మొత్తం 21 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఒకే దశలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ నాలుగో తేదీన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
లోక్సభ ఎన్నికల బరిలో ‘కెప్టెన్’ విజయ్ కాంత్ కుమారుడు
చెన్నై, తమిళనాడు : డీఎండీకే అధినేత, దివంగత నటుడు విజయ్కాంత్ తనయుడు వి.విజయ్ ప్రభాకర్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడియన్ లీగ్ (డీఎండీకే) పార్టీ, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేల మధ్య పొత్తు కుదిరింది. అలయన్స్లో భాగంగా విజయ్ ప్రభాకర్ విరుధ్ నగర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ బీజేపీ తరుపున టికెట్ దక్కించుకున్నారు. డీఎంకే - ఇండియా అలయన్స్ మాత్రం అభ్యర్ధిని ప్రకటించలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కెప్టెన్ కుమారుడు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే విడుదల చేసిన 16 మంది లోక్సభ అభ్యర్ధుల జాబితాలో కెప్టెన్ విజయ్ కాంత్ కొడుకు విజయ్ ప్రభాకర్ పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా డీఎండీకే జనరల్ సెక్రటరీ, విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత మాట్లాడుతూ.. తన కుమారు విజయ్కి రాజకీయాల పట్ల నిబద్ధత, ఇష్టం ఉన్నాయని, రానున్న లోక్సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తెలిపారు. ఏఐఏడీఎంకే మేనిఫెస్టో విడుదల ఏఐఏడీఎంకే పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. వాటిల్లో డీఎండీకే, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పుతియా తమిజగం నేతృత్వంలో మొత్తం 39 లోక్సభ స్థానాలకు గాను 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోని సైతం విడుదల చేసింది. -
TN: ‘సుప్రీం’ దెబ్బకు దిగొచ్చిన తమిళనాడు గవర్నర్
చెన్నై: డీఎంకే నేత కె.పొన్ముడి తమిళనాడు మంత్రిగా శుక్రవారం(మార్చ్ 22) మధ్యాహ్నం 3.30గంటలకు మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పొన్ముడి ప్రమాణస్వీకారాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్లో పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లో గవర్నర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజ్భవన్లో పొన్ముడి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా చేయడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి పడిన మూడేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అనంతరం పొన్ముడిని సీఎం స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే పొన్ముడితో ప్రమాణస్వీకారం చేయించడానికి గవర్నర్ రవి నిరాకరించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు కన్నెర్ర జేయడంతో గవర్నర్ దిగిరాక తప్పలేదు. కాగా, తమిళనాడు ప్రభుత్వంలో గతంలో మంత్రిగా ఉన్న పొన్ముడిని అక్రమాస్తుల కేసులో దోషిగా తేలుస్తూ మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. శిక్షపై సుప్రీంస్టే తర్వాత ఆయన తన శాసనసభ్యత్వాన్ని తిరిగి పొందారు. ఆ వెంటనే పొన్ముడిని మంతత్రివర్గంలోకి తిరిగి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ పిటిషన్ విత్ డ్రా -
అన్నాడీఎంకే జాబితాలో కొత్త ముఖాలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి తన పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. తొలి విడతలో ప్రకటించిన 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్తవారు కావడం గమనార్హం. అలాగే మిత్రపక్షం పుదియ తమిళగం(పీటీ)కి తెన్కాశి (రిజర్వుడ్) సీటును, మరో మిత్రపక్షం ఎస్డీపీఐకు దిండుగల్ సీటును కేటాయించారు. అన్నాడీఎంకే నేతృత్వంలో మినీ కూటమి లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. పెద్ద పార్టీలు కలిసి రాకున్నా, చిన్న పార్టీలతో ఎన్నికలలో తన సత్తా చాట్టాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం చైన్నెలో ఎంజీఆర్ మాళిగైలో ప్రకటించారు. 16 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో 14 మంది కొత్త వారు కావడం విశేషం. వీరంతా ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఏ, బీఏ, పీజీ పట్టభద్రలే. ముందుగా మిత్ర పక్షం పుదియ తమిళగం, ఎస్డీపీఐలకు సీట్లను కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై పుదియ తమిళగం నేత కృష్ణస్వామి, ఎస్డీపీఐ నేత నైల్లె ముబారక్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదరిశ పళణి స్వామి సంతకాలు చేశారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం పళణి స్వామి మీడియాతో మాట్లాడుతూ తమ కూటమిలోని పార్టీల వివరాలను తెలియజేశారు. అలాంటి రాజకీయాలు అవసరం లేదు.. ఎన్నికలలో కూటములు అవసరమని, అయితే కూటములను మాత్రమే నమ్ముకుని రాజకీయం చేయాల్సిన అవసరం అన్నాడీఎంకేకు లేదని పళణి స్వామి వ్యాఖ్యానించారు. 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్త వారు అని, వీరంతా ప్రజలు మెచ్చిన అభ్యర్థులు అవుతారని అని ధీమా వ్యక్తం చేశారు. మిత్ర పక్షంలోని పుదియ తమిళగంకు తెన్కాశి(రిజర్వుడ్), ఎస్డీపీఐకు దిండుగల్ సీటును కేటాయించామని ప్రకటించారు. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు 5 స్థానాలు కేటాయించామని, గురువారం ఈమేరకు ఒప్పందం చేసుకునే అవకాశం ఉందన్నారు. పీఎంకేతో తాము చర్చలు జరపలేదని, త్వరలో తమ ఎన్నికల మేనిఫెస్టో సరికొత్త తరహాలో ప్రజల ముందుకు వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్నాడీఎంకే సొంత బలంపైనే నిలబడే పార్టీ అని, ఎవరు వచ్చినా రాకున్నా తమ బలం తనకు ఉందన్నారు. 2.06 కోట్ల మంది సభ్యులను కలిగిన అన్నాడీఎంకేకు ప్రజలే తోడు అని, పార్లమెంట్లో 3వ అతి పెద్ద పార్టీగా అవతరించిన అన్నాడీఎంకే రానున్న ఎన్నికలలో తన బలాన్ని చాటుతుందని, ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో ఎక్కువగా.. భ్యర్థుల తొలి జాబితాలో జయ వర్దన్ (దక్షిణచైన్నె), చంద్రకాసన్(చిదంబరం) గతంలో ఎన్నికలలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. జయవర్దన్ అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ వారసుడు. ఇక రాయపురం మనో(ఉత్తర చైన్నె) పార్టీ పరంగా ఓటర్లకు సుపరిచితుడే. మదురై అభ్యర్థి డాకర్ట్ శరవణన్ గతంలో డీఎంకే తరపున తిరుప్పర గుండ్రం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన అన్నాడీఎంకేలో చేరారు. తొలి జాబితాలోని అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది అన్నాడీఎంకే అనుబంధ సంస్థ జయ పేరవైకు చెందిన వారే ఉండడం గమనార్హం. -
TN: అన్నాడీఎంకే బహిష్కృత నేతలతో బీజేపీ పొత్తు
చెన్నై: లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అధికార డీఎంకే ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే బహిషృత నేలను బీజేపీ దగ్గరకు తీస్తోంది. ఈ క్రమంలోనే ఎఎమ్ఎమ్కే చీఫ్ టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో బీజేపీ అగ్రనేతలు సీట్షేరింగ్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతు మద్దతిస్తున్నట్లు టీటీవీ దినకరన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాము దరఖాస్తు చేసిన ప్రెషర్ కుక్కర్ గుర్తు రాకపోతే కమలం గుర్తుపై పోటీ చేసేందుకు కూడా అభ్యంతరం లేదని దినకరన్ తెలిపారు. గతంలో టీటీవీ దినకరన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈయన గతంలో ఏఐడీఎంకే అగ్ర నేతగా వ్యవహరించిన శశికలకు మేనల్లుడు. ఇక పన్నీర్ సెల్వంతో బీజేపీ సీట్షేరింగ్ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. మరోపక్క అధికార డీఎంకే, కాంగ్రెస్, కమలహాసన్ పార్టీ, వైకో తదతరులు కలిసి ఇండియా కూటమి గొడుగు కింద లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమికి అన్నామలై సారథ్యంలోని బీజేపీ గట్టిపోటీ ఇవ్వనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల పీఎం మోదీ నిర్వహించిన సభలకు కూడా ఇక్కడ మంచి స్పందన రావడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఎన్నికల రేసులో బీజేపీ కంటే ప్రతిపక్ష అన్నాడీఎంకే వెనుకబడిందనే వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి.. అమిత్షా ఎంట్రీతో మహాకూటమి పంచాయతీ కొలిక్కి -
రూ. 2వేల కోట్ల డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అరెస్ట్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్ సాదిక్ అరెస్ట్ అయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది. రూ. 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులో భారీ ఎత్తున డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని శ్రీలంకకు స్మగ్లింగ్ చేసేందుకు యత్నిస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారి నుంచి తీగ లాగితే ఈ అంతర్జాతీయ డ్రగ్స్ దందా బయటపడింది. వీరి వెనుక జాఫర్ సాదిక్ ఉన్నట్లు తేలడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీంతో తాజాగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశాడు. సాదిక్ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన వ్యక్తి. డీఎంకే ఎన్ఆర్ఐ విభాగానికి చెందని ఆఫీస్ బేరర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన్ను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. కోలీవుడ్లో ఆయన ఇప్పటి వరకు నాలుగు సినిమాలు నిర్మించాడు. -
టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) తాజా సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్కూ గుడ్బై? అదే విధంగా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు కూడా డీకే గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా తరఫున 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ తమిళనాడు బ్యాటర్ ఇప్పటి వరకు 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1025, 1752, 686 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గానూ మెరుగ్గా రాణించిన దినేశ్ కార్తిక్ ఖాతాలో ఒకే ఒక సెంచరీ(టెస్టుల్లో) ఉంది. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ చెన్నై ప్లేయర్కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్లో 242 మ్యాచ్లు ఆడిన డీకే.. 4516 పరుగులు సాధించాడు. 133 డిస్మిసల్స్లోనూ భాగమయ్యాడు ఈ వికెట్ కీపర్. 2008 నుంచి ఇప్పటి దాకా ఇక 2008లో ఈ టీ20 లీగ్ మొదలైన నాటి ప్రతి ఎడిషన్లోనూ ఆడిన ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు. ఇప్పటి వరకు ఆరు ఫ్రాంఛైజీలకు దినేశ్ కార్తిక్ ప్రాతినిథ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్(కెప్టెన్గానూ)లకు ఆడిన డీకే.. గత రెండు సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అనూహ్యంగా వరల్డ్కప్ జట్టులో ఐపీఎల్-2022లో ఆర్సీబీ ఫినిషర్గా అదరగొట్టిన దినేశ్ కార్తిక్.. ఆ ఏడాది అనూహ్యంగా టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మెగా టోర్నీలో విఫలమైన అతడు మళ్లీ భారత జట్టులో స్థానం పొందలేకపోయాడు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం! అయితే, దేశవాళీ క్రికెట్లో మాత్రం తమిళనాడు తరఫున బరిలోకి దిగుతూనే ఉన్నాడు 38 ఏళ్ల దినేశ్ కార్తిక్. కామెంటేటర్గానూ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 తర్వాత ఐపీఎల్తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్కూ స్వస్తి పలికి.. కేవలం డొమెస్టిక్ క్రికెట్ మీద దృష్టి సారించాలని డీకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం ప్రచురించింది. చదవండి: సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్! -
మరీ ఇంత స్వార్థమా?.. కోచ్ ఇలా చేయడం తప్పే: డీకే ఫైర్
DK Fumes As Tamil Nadu Coach 'Throws Captain Under The Bus': తమిళనాడు క్రికెట్ కోచ్ సులక్షణ్ కులకర్ణి తీరుపై టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మండిపడ్డాడు. జట్టు ఓటమికి కెప్టెన్ను బాధ్యుడిని చేసేలా స్వార్థపూరితంగా మాట్లాడటం కోచ్ స్థాయికి తగదని చురకలు అంటించాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా ముంబైతో జరిగిన సెమీ ఫైనల్లో తమిళనాడు ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇన్నింగ్స్ 70 పరుగుల భారీ తేడాతో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడు కోచ్ సులక్షణ్ కులకర్ణి స్పందిస్తూ.. కెప్టెన్ ఆర్.సాయి కిషోర్ నిర్ణయాలను తప్పుబట్టాడు. ఓ ముంబైకర్గా నాకన్నీతెలుసు.. కానీ టాస్ గెలిచినప్పుడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశాడని విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరోజు వికెట్ను నేను గమనించాను. కోచ్గా, మంబైకర్(ముంబైకి చెందినవాడు)గా అక్కడి పిచ్ పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. టాస్ గెలిచినపుడు బౌలింగ్ చేయించాలని అనుకుంటే.. మా కెప్టెన్ మాత్రం తనకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా బాస్ అతడే. అతడి నిర్ణయమే ఫైనల్. కేవలం ఇన్పుట్స్, ఫీడ్బ్యాక్ ఇవ్వడం వరకే నేను పరిమితం’’ అని సులక్షణ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. నిజానికి తాము మొదటి రోజు ఆట టాస్ సమయంలోనే ఓడిపోయామంటూ సాయి కిషోర్ను ఓటమికి బాధ్యుడిని చేసేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దినేశ్ కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందించాడు. కోచ్కు ఇంత స్వార్థం పనికిరాదు.. ‘‘ఇలా మాట్లాడటం కచ్చితంగా తప్పే. కోచ్ నుంచి ఇలాంటి మాటలు వినాల్సి రావడం నన్ను నిరాశకు గురిచేసింది. ఏడేళ్ల తర్వాత తొలిసారి జట్టును రంజీ సెమీస్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్ను అభినందించాల్సింది పోయి.. ఇలా కోచే స్వయంగా.. బహిరంగంగా అతడిని విమర్శించడం సరికాదు’’ అని తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ డీకే ఆగ్రహం వ్యక్తం చేశాడు. This is soo WRONG This is so disappointing from the coach ..instead of backing the captain who has brought the team to the semis after 7 yrs and thinking it's a start for good things to happen, the coach has absolutely thrown his captain and team under the bus 👎🏽👎🏽👎🏽👎🏽👎🏽 https://t.co/Ii61X7Ajqs — DK (@DineshKarthik) March 5, 2024 తమిళనాడు ఆట ముగిసిందిలా.. ఫైనల్లో ముంబై రంజీ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు 47వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతమైదానంలో తమిళనాడుతో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 353/9తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 106.5 ఓవర్లలో 378 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయికిశోర్ 6 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 232 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు షమ్స్ ములానీ (4/53), శార్దుల్ ఠాకూర్ (2/16), మోహిత్ (2/26), తనుష్ (2/18) ధాటికి 162 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. శార్దుల్ ఠాకూర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: గోపీచంద్ అకాడమీకి బైబై..!.. అమెరికాకు పయనం! -
TN: తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్, కాంచీపురంలలో సోమవారం( మార్చ్ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్ రాగా సోమవారం ఉదయం మరో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరులోని పీఎస్బీబీ మిలీనియం స్కూల్కు బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులు వచ్చిన రెండు స్కూళ్లలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. స్కూళ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. కాగా, మార్చ్ 1వ తేదీ బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. అశ్లీల వీడియో వైరల్.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు